Gold ETF: గోల్డ్ ఈటీఎఫ్ల వైపు మదుపరుల చూపు.. ఆగస్టులో 16 నెలల గరిష్ఠానికి
Gold ETF: గోల్డ్ ఈటీఎఫ్లపై మదుపరుల్లో ఆసక్తి నెలకొంటోంది. ఆగస్టులో ఈ పోర్ట్ఫోలియోలోకి వచ్చిన నిధులే ఇందుకు నిదర్శనం.
దిల్లీ: గోల్డ్ ఎక్స్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్స్ (Gold ETFs) పట్ల మదుపరుల ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది ఆగస్టులో ఏకంగా రూ.1028 కోట్లు నిధులు గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి తరలివచ్చాయి. 16 నెలల తర్వాత గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం గమనార్హం. అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడం, వృద్ధి నెమ్మదించడం వంటి కారణాలతో వీటికి ఆదరణ పెరుగుతోందని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా వెల్లడించింది. పెట్టుబుడలతో పాటు ఈటీఎఫ్ల్లో మదుపు చేసే వారి సంఖ్యా పెరగడం గమనార్హం.
గోల్డ్ ఆధారిత ఈటీఎఫ్ల్లోకి (Gold ETF) ఈ ఏడాది జులైలో రూ.456 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.298 కోట్లు మాత్రమే పెట్టుబడుల రూపంలో వచ్చాయి. అంతకు ముందు మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఏకంగా రూ.1243 కోట్లు ఈటీఎఫ్ల నుంచి వెనక్కి మళ్లాయి. గతేడాది రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో 2022 ఏప్రిల్లో అత్యధికంగా రూ.1100 కోట్లు గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి నిధులు వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఆగస్టులోనే నమోదు కావడం గమనార్హం. గోల్డ్ ఈటీఎఫ్ల్లో జులైలో రూ.47.75 లక్షలుగా ఉన్న ఇన్వెస్టర్ల సంఖ్య ఆగస్టులో మరో 20,500 మేర పెరిగింది.
‘‘ద్రవ్యోల్బణం కట్టడి విషయంలో ఇన్నాళ్లూ ఫెడ్ కఠినంగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇకపై వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉండకపోవచ్చు. అమెరికా బాండ్ల రాబడి, డాలరు విలువ పెరిగినప్పటికీ.. ఇప్పటికీ బంగారం ఆకర్షణీయంగా కనిపిస్తోంది. మాంద్యం ముప్పు భయాలు, కేంద్ర బ్యాంకు బంగారం కొనుగోలు చేస్తుండడం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, అమెరికాలో పెరుగుతున్న రుణ భారం వంటివి మదుపరులు బంగారంవైపు మొగ్గుచూసేలా చేస్తున్నాయి’’ అని క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్లో అల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మేనేజర్గా వ్యవహరిస్తున్న గజల్ జైన్ తెలిపారు. దీనికితోడు బంగారం ధరలు ఆల్టైమ్ గరిష్ఠాల నుంచి ఇటీవల కాస్త దిగిరావడమూ మరో కారణం. అనిశ్చిత పరిస్థితుల్లో సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించి బంగారం వైపు మరలుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఒక గ్రాము స్వచ్ఛమైన బంగారాన్ని గోల్డ్ ఈటీఎఫ్ల్లో ఒక యూనిట్గా పరిగణిస్తారు. బంగారంలో మదుపు చేయాలనుకునేవారికి గోల్డ్ ఈటీఎఫ్లు ప్రత్యామ్నయం అనే చెప్పాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధరలు పెరిగినా.. బంగారం గిరాకీ తగ్గలే!
Gold: మార్చిలో బంగారం ధరలు గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. అయినప్పటికీ జనవరి-మార్చి త్రైమాసికంలో గిరాకీ ఎనిమిది శాతం పుంజుకుంది. -
విప్రో కొత్త సీఈఓ వేతనం ఎంతో తెలుసా?
విప్రో కొత్త సీఈఓగా ఇటీవల నియమితులైన శ్రీనివాస్ పల్లియా వేతనం వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. -
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
Wearable AC: మెడపై ధరించి ఎక్కడికైనా వెంట తీసుకెళ్లగలిగేలా సోనీ ఓ కొత్త ఏసీ డివైజ్ను తీసుకొచ్చింది. -
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
Section 54F: వారసత్వంగా వచ్చిన ఆభరణాలను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని ఇల్లు కొనుగోలుకు వినియోగిస్తే.. మూలధన లాభాల పన్ను వర్తించదని ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 54ఎఫ్ చెబుతోంది. -
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
Elon Musk: టెస్లా షేర్ల ర్యాలీతో బిలియనీర్ ఎలాన్ మస్క్ సంపద ఇటీవల గణనీయంగా పెరిగింది. సోమవారం ఒక్కరోజే ఆయన షేర్ల విలువ 18.5 బిలియన్ డాలర్లు ఎగసింది. -
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,668
Stock Market Opening bell: ఉదయం 9:18 గంటల సమయంలో సెన్సెక్స్ 114 పాయింట్ల లాభంతో 74,785 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 24 పాయింట్లు పెరిగి 22,668 దగ్గర కొనసాగుతోంది. -
పతంజలి దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్స్ రద్దు
Patanjali: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో పతంజలిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. పది ఉత్పత్తుల తయారీ లైసెన్స్ను రద్దు చేసింది. -
ఐవీఎంఏ అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణ ఎల్ల
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల, ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐవీఎంఏ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
యూపీఐ వినియోగిస్తున్నా.. నగదు ఉపసంహరణలూ పెరిగాయ్
దేశంలో యూపీఐ ఆధారిత చెల్లింపులు పెరిగినా, గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు 5.51% పెరిగాయి. -
వడ్డీ విధింపులో పారదర్శకత పాటించాలి
రుణాలపై వడ్డీ వసూలు విషయంలో అన్యాయమైన పద్ధతులను అనుసరిస్తున్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. -
కనీసం 10,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటాం
జనరేటివ్ ఏఐ(కృత్రిమ మేధ)లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ కంపెనీ సిద్ధమైందని హెచ్సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ విజయ్ కుమార్ తెలిపారు. -
మదుపర్ల సంపద రూ.406.52 లక్షల కోట్లు
బ్యాంకింగ్ షేర్ల జోరుతో సోమవారం దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికాలో బాండ్ రాబడులు తగ్గడం, అక్కడి టెక్ కంపెనీలు త్రైమాసిక ఫలితాల్లో రాణిస్తాయన్న అంచనాలు అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా మారాయి. -
మాపై ఆరోపణలన్నీ అవాస్తవాలే
18 నెలల కంటే తక్కువ వయసున్న చిన్నారుల ఆహార ఫార్ములేషన్ను అంతర్జాతీయ పద్ధతిలో నిర్ణయిస్తామని నెస్లే ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) సురేశ్ నారాయణ్ పేర్కొన్నారు. -
రుసుముల రూపేణా బీఎస్ఈపై రూ.165 కోట్ల భారం
ఆప్షన్ల కాంట్రాక్టులపై, ప్రీమియం విలువ మీద కాకుండా.. నోషనల్ వ్యాల్యూ మీద రుసుము చెల్లించాల్సిందిగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీని (బీఎస్ఈ) సెబీ ఆదేశించింది. -
అల్ట్రాటెక్ సిమెంట్ డివిడెండ్ 700%
ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్, జనవరి- మార్చి త్రైమాసిక నికర లాభం ఏకీకృత పద్ధతిలో 35.24% పెరిగి రూ.2,258.58 కోట్లకు చేరింది. -
హైసియా నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల
హైసియా (హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్) నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల ఎన్నియ్యారు. -
ఓలా మొబిలిటీ సీఈఓ రాజీనామా
ఓలా మొబిలిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) హేమంత్ బక్షి రాజీనామా చేశారని తెలుస్తోంది. -
ఈఎస్జీ రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థకు అనుమతి
పర్యావరణ, సామాజిక, పరిపాలన (ఈఎస్జీ) రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థ ప్రగతి డెవలప్మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్ లిమిటెడ్కు (పీడీసీఎస్ఎల్) సెబీ అనుమతి ఇచ్చింది. -
విపణిలోకి మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ
కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో సరికొత్త ఎక్స్యూవీ 3ఎక్స్ఓను మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేసింది. -
అంకురాల కోసం రూ.50 కోట్లు
అంకురాలకు పెట్టుబడులను అందించేందుకు ది యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ (వైఈఏ) రూ.50 కోట్ల నిధులను అందుబాటులోకి తెచ్చింది. -
సంక్షిప్త వార్తలు
అగ్రశ్రేణి ఎరువుల కంపెనీ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, కాకినాడలో ఫాస్పారిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంట్లు నిర్మించనుంది. ఈ ప్లాంట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ధరలు పెరిగినా.. బంగారం గిరాకీ తగ్గలే!
-
కేజ్రీవాల్ను కలిసిన పంజాబ్ సీఎం.. ఆయన ఏం చెప్పారంటే?
-
విప్రో కొత్త సీఈఓ వేతనం ఎంతో తెలుసా?
-
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
-
‘ఇప్పటికి నిద్ర లేచారు..’: పతంజలి ఉత్పత్తుల లైసెన్సు రద్దుపై సుప్రీం
-
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ