Gold ETFs: గోల్డ్ ఈటీఎఫ్లపై మదుపర్ల మక్కువ.. అక్టోబర్లో రూ.841 కోట్లు
Gold ETFs: అస్థిర సమయాల్లో సురక్షితమైన పెట్టుబడి అనే భావనతో పాటు ద్రవ్యోల్బణాన్ని అధిగమించే అవకాశం ఉందనే అంచనాలతోనే గోల్డ్పై మదుపర్లు మక్కువ చూపుతున్నారని నిపుణులు తెలిపారు.
దిల్లీ: గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లలోకి (Gold ETFs) అక్టోబర్లో పెట్టుబడులు వెల్లువెత్తాయి. అస్థిర సమయాల్లో సురక్షిత పెట్టుబడి సాధనంగా వీటికి గుర్తింపు ఉండడమే దీనికి కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గత నెలలో మదుపర్లు గోల్డ్ ఈటీఎఫ్లలో రూ.841 కోట్లు పెట్టుబడిగా పెట్టినట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (Amfi) శుక్రవారం వెల్లడించింది. క్రితం నెలతో పోలిస్తే రూ.175 కోట్లు అధికమని తెలిపింది. మరోవైపు ఇటీవల ధరలు దిగిరావడంతో శుక్రవారం ధనత్రయోదశి సందర్భంగా బంగారం, వెండి అమ్మకాలు హుషారుగా ప్రారంభమయ్యాయి.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వడ్డీరేట్ల పెంపు భయాలు, అధిక ద్రవ్యోల్బణం, వృద్ధి రేటులో మందగమనం వంటి కారణాల వల్ల రాబోయే రోజుల్లోనూ పసిడికి డిమాండ్ కొనసాగుతుందని మార్నింగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇండియా అనలిస్ట్ మెల్విన్ వివరించారు. అస్థిర సమయాల్లో సురక్షితమైన పెట్టుబడి అనే భావనతో పాటు ద్రవ్యోల్బణాన్ని అధిగమించే అవకాశం ఉందనే అంచనాలతోనే గోల్డ్పై మదుపర్లు మక్కువ చూపుతున్నారని వివరించారు. మరోవైపు ఇటీవల పసిడి ధరలు ఆల్టైం గరిష్ఠాల నుంచి దిగొచ్చిన విషయం తెలిసిందే. మార్చి నుంచి క్రమంగా పెరుగుతూ వస్తున్న ధరల్లో ఒక్కసారిగా తగ్గుదల రావడంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు.
యాంఫీ గణాంకాల ప్రకారం.. గోల్డ్ అనుసంధాన ఈటీఎఫ్లలోకి అక్టోబర్ నెలలో రూ.841 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సెప్టెంబరుతో పోలిస్తే ఇది రూ.175 కోట్లు అధికం. అంతకుముందు ఆగస్టులో అత్యధికంగా రూ.1,028 కోట్లు నమోదయ్యాయి. జులైలో రూ.416 కోట్లుగా ఉన్నాయి. గత కొన్నేళ్లుగా మెరుగైన రాబడిని ఇస్తున్న పసిడి పెట్టుబడులు.. ఈటీఎఫ్లలోకి మదుపర్లను ఆకర్షిస్తున్నాయి. అక్టోబర్లో గోల్డ్ ఈటీఎఫ్లలో 27,700 కొత్త ఫోలియోలు జత కావడంతో మొత్తం సంఖ్య 48.34 లక్షలకు చేరాయి. మరోవైపు గోల్డ్ ఈటీఎఫ్ల నిర్వహణలోని ఆస్తుల విలువ గత నెలలో 10 శాతం పెరిగి రూ.26,163 కోట్లకు చేరింది.
గోల్డ్ ఈటీఎఫ్లు మ్యూచువల్ ఫండ్ సంస్థలు నిర్వహించే పథకాలు. బంగారం ధరలను ట్రాక్ చేసే పాసివ్ స్కీమ్లు. ఇక్కడ గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్ ధర.. భౌతిక బంగారం ఒక గ్రాము ధరకు సరిపోయే విధంగా సర్దుబాటు ఉంటుంది. ఎలక్ట్రానిక్ రూపంలో కొనుగోలు, అమ్మకాలు సులభంగా నిర్వహించే సౌలభ్యం ఉంటుంది. గోల్డ్ ఈటీఎఫ్ల యూనిట్లను సులభంగా స్టాక్ ఎక్స్ఛేంజీల పనివేళలో ఎప్పుడైనా కొనుగోలు చేయొచ్చు. విక్రయించవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చివరి అరగంటలో అమ్మేశారు.. సూచీలకు నష్టాలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టపోయాయి. సెన్సెక్స్ 188 పాయింట్లు, నిఫ్టీ 38 పాయింట్ల చొప్పున నష్టపోయాయి. -
ధరలు పెరిగినా.. బంగారం గిరాకీ తగ్గలే!
Gold: మార్చిలో బంగారం ధరలు గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. అయినప్పటికీ జనవరి-మార్చి త్రైమాసికంలో గిరాకీ ఎనిమిది శాతం పుంజుకుంది. -
విప్రో కొత్త సీఈఓ వేతనం ఎంతో తెలుసా?
విప్రో కొత్త సీఈఓగా ఇటీవల నియమితులైన శ్రీనివాస్ పల్లియా వేతనం వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. -
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
Wearable AC: మెడపై ధరించి ఎక్కడికైనా వెంట తీసుకెళ్లగలిగేలా సోనీ ఓ కొత్త ఏసీ డివైజ్ను తీసుకొచ్చింది. -
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
Section 54F: వారసత్వంగా వచ్చిన ఆభరణాలను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని ఇల్లు కొనుగోలుకు వినియోగిస్తే.. మూలధన లాభాల పన్ను వర్తించదని ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 54ఎఫ్ చెబుతోంది. -
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
Elon Musk: టెస్లా షేర్ల ర్యాలీతో బిలియనీర్ ఎలాన్ మస్క్ సంపద ఇటీవల గణనీయంగా పెరిగింది. సోమవారం ఒక్కరోజే ఆయన షేర్ల విలువ 18.5 బిలియన్ డాలర్లు ఎగసింది. -
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,668
Stock Market Opening bell: ఉదయం 9:18 గంటల సమయంలో సెన్సెక్స్ 114 పాయింట్ల లాభంతో 74,785 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 24 పాయింట్లు పెరిగి 22,668 దగ్గర కొనసాగుతోంది. -
పతంజలి దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్స్ రద్దు
Patanjali: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో పతంజలిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. పది ఉత్పత్తుల తయారీ లైసెన్స్ను రద్దు చేసింది. -
ఐవీఎంఏ అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణ ఎల్ల
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల, ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐవీఎంఏ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
యూపీఐ వినియోగిస్తున్నా.. నగదు ఉపసంహరణలూ పెరిగాయ్
దేశంలో యూపీఐ ఆధారిత చెల్లింపులు పెరిగినా, గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు 5.51% పెరిగాయి. -
వడ్డీ విధింపులో పారదర్శకత పాటించాలి
రుణాలపై వడ్డీ వసూలు విషయంలో అన్యాయమైన పద్ధతులను అనుసరిస్తున్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. -
కనీసం 10,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటాం
జనరేటివ్ ఏఐ(కృత్రిమ మేధ)లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ కంపెనీ సిద్ధమైందని హెచ్సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ విజయ్ కుమార్ తెలిపారు. -
మదుపర్ల సంపద రూ.406.52 లక్షల కోట్లు
బ్యాంకింగ్ షేర్ల జోరుతో సోమవారం దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికాలో బాండ్ రాబడులు తగ్గడం, అక్కడి టెక్ కంపెనీలు త్రైమాసిక ఫలితాల్లో రాణిస్తాయన్న అంచనాలు అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా మారాయి. -
మాపై ఆరోపణలన్నీ అవాస్తవాలే
18 నెలల కంటే తక్కువ వయసున్న చిన్నారుల ఆహార ఫార్ములేషన్ను అంతర్జాతీయ పద్ధతిలో నిర్ణయిస్తామని నెస్లే ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) సురేశ్ నారాయణ్ పేర్కొన్నారు. -
రుసుముల రూపేణా బీఎస్ఈపై రూ.165 కోట్ల భారం
ఆప్షన్ల కాంట్రాక్టులపై, ప్రీమియం విలువ మీద కాకుండా.. నోషనల్ వ్యాల్యూ మీద రుసుము చెల్లించాల్సిందిగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీని (బీఎస్ఈ) సెబీ ఆదేశించింది. -
అల్ట్రాటెక్ సిమెంట్ డివిడెండ్ 700%
ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్, జనవరి- మార్చి త్రైమాసిక నికర లాభం ఏకీకృత పద్ధతిలో 35.24% పెరిగి రూ.2,258.58 కోట్లకు చేరింది. -
హైసియా నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల
హైసియా (హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్) నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల ఎన్నియ్యారు. -
ఓలా మొబిలిటీ సీఈఓ రాజీనామా
ఓలా మొబిలిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) హేమంత్ బక్షి రాజీనామా చేశారని తెలుస్తోంది. -
ఈఎస్జీ రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థకు అనుమతి
పర్యావరణ, సామాజిక, పరిపాలన (ఈఎస్జీ) రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థ ప్రగతి డెవలప్మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్ లిమిటెడ్కు (పీడీసీఎస్ఎల్) సెబీ అనుమతి ఇచ్చింది. -
విపణిలోకి మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ
కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో సరికొత్త ఎక్స్యూవీ 3ఎక్స్ఓను మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేసింది. -
అంకురాల కోసం రూ.50 కోట్లు
అంకురాలకు పెట్టుబడులను అందించేందుకు ది యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ (వైఈఏ) రూ.50 కోట్ల నిధులను అందుబాటులోకి తెచ్చింది.