Mobile phones: పదేళ్లలో 21 రెట్లు పెరిగిన మొబైల్ ఫోన్ల తయారీ విలువ
Mobile phones: 2014-15లో రూ.18,900 కోట్లుగా ఉన్న ఫోన్ల తయారీ విలువ 2023-24 నాటికి రూ.4,10,000 కోట్లకు చేరినట్లు ఐసీఈఏ తెలిపింది.
దిల్లీ: భారత్లో మొబైల్ ఫోన్ల తయారీ విలువ పదేళ్లలో 21 రెట్లు పెరిగి రూ.4.1 లక్షల కోట్లకు చేరినట్లు ‘ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA)’ వెల్లడించింది. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాల పథకం (PLI) వంటి ప్రభుత్వ విధానాలు.. దేశీయంగా తయారీ చేపట్టేందుకు అంతర్జాతీయ సంస్థలకు ఉపకరించాయని తెలిపింది.
దేశీయ గిరాకీలో 97 శాతం మొబైల్ ఫోన్లు స్థానికంగానే తయారవుతున్నాయని ఐసీఈఏ తెలిపింది. 2023-24లో ఇక్కడ ఉత్పత్తి అయిన వాటిలో 30 శాతం ఎగుమతి కోసమేనని వెల్లడించింది. 2014-15లో రూ.18,900 కోట్లుగా ఉన్న ఫోన్ల తయారీ విలువ 2023-24 నాటికి రూ.4,10,000 కోట్లకు చేరినట్లు తెలిపింది. 2015 ఆర్థిక సంవత్సరంలో మొబైల్ ఫోన్ల ఎగుమతుల విలువ రూ.1,556 కోట్లు మాత్రమేనని పేర్కొంది. 2023-24 చివరకు ఆ విలువ రూ.1.20 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. అంటే దశాబ్ద కాలంలో 7,500 శాతం పెరిగినట్లని వివరించింది. స్మార్ట్ఫోన్ల ఎగుమతులు పెరగడంలో యాపిల్, శాంసంగ్ కీలక పాత్ర పోషించాయని తెలిపింది. యూకే, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, ఇటలీ, పశ్చిమాసియా, ఉత్తర, దక్షిణ అమెరికా మార్కెట్లకు అధికంగా ఎగుమతి అవుతున్నట్లు వెల్లడించింది. భారత్ నుంచి అత్యధికంగా ఎగుమతి అవుతున్న వస్తువుల జాబితాలో మొబైల్ ఫోన్లు ఐదో స్థానానికి చేరాయని పేర్కొంది.
2017 మేలో మొబైల్ ఫోన్ల దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ‘దశలవారీ తయారీ కార్యక్రమం (PMP)’ని ప్రకటించింది. దీంతో భారత్లో ఒక బలమైన స్వదేశీ మొబైల్ తయారీ వ్యవస్థ నిర్మితమైంది. 2014లో కేవలం రెండు మొబైల్ ఫోన్ ఫ్యాక్టరీలు మాత్రమే ఉండగా.. ఇప్పుడు ప్రపంచంలో భారత్ రెండో అతిపెద్ద మొబైల్ తయారీ దేశంగా అవతరించింది. మరోవైపు పీఎల్ఐ వల్ల ఎలక్ట్రానిక్స్ తయారీకి భారత్ ప్రధాన కేంద్రంగా మారింది. ఈ పథకం వల్ల అంతర్జాతీయ స్థాయి కంపెనీలైన ఫాక్స్కాన్, పెగాట్రాన్, రైజింగ్ స్టార్, విస్ట్రాన్ వంటి కంపెనీలు భారత్లో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. మరోవైపు శాంసంగ్ నోయిడాలో రెండో అతిపెద్ద తయారీ ప్లాంట్ను నిర్వహిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐవీఎంఏ అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణ ఎల్ల
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల, ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐవీఎంఏ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
యూపీఐ వినియోగిస్తున్నా.. నగదు ఉపసంహరణలూ పెరిగాయ్
దేశంలో యూపీఐ ఆధారిత చెల్లింపులు పెరిగినా, గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు 5.51% పెరిగాయి. -
వడ్డీ విధింపులో పారదర్శకత పాటించాలి
రుణాలపై వడ్డీ వసూలు విషయంలో అన్యాయమైన పద్ధతులను అనుసరిస్తున్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. -
కనీసం 10,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటాం
జనరేటివ్ ఏఐ(కృత్రిమ మేధ)లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ కంపెనీ సిద్ధమైందని హెచ్సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ విజయ్ కుమార్ తెలిపారు. -
మదుపర్ల సంపద రూ.406.52 లక్షల కోట్లు
బ్యాంకింగ్ షేర్ల జోరుతో సోమవారం దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికాలో బాండ్ రాబడులు తగ్గడం, అక్కడి టెక్ కంపెనీలు త్రైమాసిక ఫలితాల్లో రాణిస్తాయన్న అంచనాలు అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా మారాయి. -
మాపై ఆరోపణలన్నీ అవాస్తవాలే
18 నెలల కంటే తక్కువ వయసున్న చిన్నారుల ఆహార ఫార్ములేషన్ను అంతర్జాతీయ పద్ధతిలో నిర్ణయిస్తామని నెస్లే ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) సురేశ్ నారాయణ్ పేర్కొన్నారు. -
రుసుముల రూపేణా బీఎస్ఈపై రూ.165 కోట్ల భారం
ఆప్షన్ల కాంట్రాక్టులపై, ప్రీమియం విలువ మీద కాకుండా.. నోషనల్ వ్యాల్యూ మీద రుసుము చెల్లించాల్సిందిగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీని (బీఎస్ఈ) సెబీ ఆదేశించింది. -
అల్ట్రాటెక్ సిమెంట్ డివిడెండ్ 700%
ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్, జనవరి- మార్చి త్రైమాసిక నికర లాభం ఏకీకృత పద్ధతిలో 35.24% పెరిగి రూ.2,258.58 కోట్లకు చేరింది. -
హైసియా నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల
హైసియా (హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్) నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల ఎన్నియ్యారు. -
ఓలా మొబిలిటీ సీఈఓ రాజీనామా
ఓలా మొబిలిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) హేమంత్ బక్షి రాజీనామా చేశారని తెలుస్తోంది. -
ఈఎస్జీ రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థకు అనుమతి
పర్యావరణ, సామాజిక, పరిపాలన (ఈఎస్జీ) రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థ ప్రగతి డెవలప్మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్ లిమిటెడ్కు (పీడీసీఎస్ఎల్) సెబీ అనుమతి ఇచ్చింది. -
విపణిలోకి మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ
కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో సరికొత్త ఎక్స్యూవీ 3ఎక్స్ఓను మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేసింది. -
అంకురాల కోసం రూ.50 కోట్లు
అంకురాలకు పెట్టుబడులను అందించేందుకు ది యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ (వైఈఏ) రూ.50 కోట్ల నిధులను అందుబాటులోకి తెచ్చింది. -
సంక్షిప్త వార్తలు
అగ్రశ్రేణి ఎరువుల కంపెనీ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, కాకినాడలో ఫాస్పారిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంట్లు నిర్మించనుంది. ఈ ప్లాంట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!