Aadhaar: ఫింగర్ ప్రింట్స్ లేకున్నా ఐరిస్ ఆధారంగా ఆధార్ జారీ
Aadhaar: ఫింగర్ ప్రింట్స్ లేకపోయినా ఐరిస్ ద్వారా ఆధార్ కార్డు జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
దిల్లీ: ఫింగర్ ప్రింట్స్ అందించలేని వారికి ఐరిస్ (iris scan) ద్వారా ఆధార్ (Aadhaar) కార్డు కోసం నమోదు చేసుకోవచ్చని కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ జారీకి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. కేరళలోని ఓ మహిళ ఆధార్ ఎన్రోల్మెంట్ కోసం ఎదుర్కొన్న ఇబ్బంది వెలుగులోకి వచ్చాక ప్రభుత్వం ఈ విషయంపై స్పందించింది.
కేరళలోని పి జోస్ అనే మహిళకు వేళ్లు లేని కారణంగా ఆధార్ జారీకి అర్హత ఉన్నా కార్డు పొందలేకపోయింది. ఈ విషయంపై ఎలక్ట్రానిక్స్, ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఇలా వైకల్యం ఉన్నా, వేలిముద్రలు సరిగ్గా లేకపోయినా బయోమెట్రిక్కి బదులు ఐరిస్ ఆధారంగా ఆధార్ని జారీ చేయాలని పేర్కొన్నారు. బయోమెట్రిక్ వీలుకాని సమయంలో ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆధార్ జారీ చేయాలని ఆధార్ సేవా కేంద్రాలకు సూచనలు జారీ చేశారు.
సంరక్షకుడికి రూ.97వేల కోట్ల ఆస్తి.. రాసివ్వనున్న బిలియనీర్!
ఐరిస్, వేలిముద్రలు సమర్పించలేకపోయినా అర్హులైన వారికి కూడా ఆధార్ అందజేయాలని ప్రభుత్వం ఇదివరకే నిబంధనల్లో పేర్కొంది. ఈ రెండు ఆధారాలు సమర్పించలేకపోవటానికి గల కారణాల్ని తెలుపుతూ ఫొటో ద్వారా ఆధార్కు నమోదు చేసుకోవచ్చు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) బృందం జోస్ ఇంటికి వెళ్లి ఆధార్ నంబర్ను జనరేట్ చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!