Jio New plans: జియో నుంచి రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్
Jio New Prepaid plans: ఎక్కువ మొబైల్ డేటా కోరుకునే వారి కోసం జియో మరో రెండుకొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. వీటిలో రోజుకు 2.5 జీబీ డేటా లభిస్తుంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Jio) మరో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను (Prepaid plans) తీసుకొచ్చింది. రోజుకు 2.5 జీబీ వ్యాలిడిటీతో నెల, మూడు నెలల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్లను లాంచ్ చేసింది. వాటి ధరలను రూ.349, రూ.899గా నిర్ణయించింది. మొబైల్లో ఎక్కువ డేటా వినియోగించే వారికి ఈ ప్లాన్లు ప్రయోజనకరంగా ఉంయి.
రూ.349 ప్లాన్
రిలయన్స్ జియో తీసుకొచ్చిన రూ.349 ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్లు లభిస్తాయి. జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్, జియో సెక్యూరిటీ సేవలు అందనంగా లభిస్తాయి. 5జీ నెట్వర్క్ కవరేజీ అందుబాటులో ఉండీ 5జీకి సపోర్ట్ చేసే మొబైల్ ఉంటే వెల్కమ్ ఆఫర్ కింద అపరిమిత 5జీ డేటాను ఉచితంగా పొందొచ్చని జియో తెలిపింది.
రూ.899 ప్లాన్
మూడు నెలల (90 రోజులు) వ్యాలిడిటీ కోరుకునే వారికోసం రూ.899 ప్లాన్ను జియో తీసుకొచ్చింది. దీంట్లోనూ రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, 100 ఎస్సెమ్మెస్లు లభిస్తాయి. జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్, జియో సెక్యూరిటీ సేవలు అదనంగా లభిస్తాయి. ఈ ప్లాన్లోనూ 5జీ వెల్కమ్ ఆఫర్ లభిస్తుంది. కొత్త ఏడాది పురస్కరించుకుని తీసుకొచ్చిన రూ.2023 ప్రీపెయిడ్ ప్లాన్లోనూ దాదాపూ ఇవే సదుపాయాలు లభిస్తున్నాయి. ఇది 252 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. 630జబీ డేటా లభిస్తుంది. ఇందులో రోజువారీ పరిమితి లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా రోజువారీ ఖర్చులను అందించేలా...
వైద్య ఖర్చులు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. అదే సమయంలో ఆరోగ్య బీమా రంగంలోనూ ఎన్నో మార్పులు వస్తున్నాయి. -
కేవైసీ అప్డేట్ చేశారా?
బ్యాంకులో ఖాతా ఉందా? మ్యూచువల్ ఫండ్లో మదుపు చేస్తున్నారా? జీవిత, ఆరోగ్య బీమా పాలసీలున్నాయా? మరి, మీ కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) వివరాలు తెలియజేయడం తప్పనిసరి. -
IRCTC refund: ఐఆర్సీటీసీ రిఫండ్స్ ఇక వేగవంతం.. గంటలోనే నగదు వెనక్కి?
IRCTC refund process: రైలు టికెట్ బుక్ చేసినప్పుడు డబ్బులు డెబిట్ అయ్యాయా? ఇకపై ఆ సొమ్ము కోసం రోజులతరబడి ఎదురు చూడాల్సిన పనిలేదు. ఈ ప్రక్రియ వేగవంతం కానుంది. -
Paytm పేమెంట్స్ బ్యాంక్లో ఈ సేవలకు.. మరికొన్ని రోజులే గడువు
Paytm payments bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో కొన్ని సేవలకు గడువు మార్చి 15తో ముగియనుంది. ఆ తర్వాత వాటిని కొనసాగించలేరు. -
Aadhaar Update: ఆధార్ ఉచిత అప్డేట్కు మరోసారి గడువు పొడిగింపు
ఆధార్లో వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు విధించిన గడువు తేదీని మరోసారి పొడిగిస్తున్నట్లు ఉడాయ్ తెలిపింది. -
ఆదాయపు పన్ను ఈ పొరపాట్లు చేయొద్దు
ఆదాయపు పన్ను భారం తగ్గించుకునేందుకు వివిధ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు చట్టం అవకాశం కల్పించింది. కేవలం ఇలా మదుపు చేయడంతోనే పన్ను ప్రణాళిక పూర్తయినట్లు చాలామంది భావిస్తారు. ఆర్థిక ప్రణాళికలో పన్ను ఆదా పథకాలూ ఎంతో కీలకం. -
EPFO: పీఎఫ్ ఖాతాలో వివరాలు మార్చుకోవాలా? ఆన్లైన్లో సులువుగా..
EPFO: ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారులా? మీ పీఎఫ్ ఖాతాలో వ్యక్తిగత వివరాలను మార్చుకోవాలనుకుంటున్నారా? ఈ ఆన్లైన్ ఫారమ్తో సులువుగా మార్చుకోవచ్చు. -
Indian Railways: ట్రైన్ టికెట్ చిరిగిపోయిందా? అయితే ఇలా చేయండి!
train ticket lost: ట్రైన్ టికెట్ పోయిందా? ప్రయాణం ఎలా అని కంగారు పడుతున్నారా? అయితే రైల్వే అందిస్తున్న ఈ సదుపాయం గురించి తెలుసుకోవాల్సిందే.. -
Solar rooftop: ‘సూర్యఘర్’కు దరఖాస్తు ఎలా? ₹78 వేల రాయితీ ఎలా పొందాలి?
PM Surya Ghar Muft Bijli Yojana: ఇంటిపై సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే సబ్సిడీ ఇచ్చే పథకానికి కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? సబ్సిడీ ఎలా పొందాలి? -
ఆరోగ్య బీమా క్లెయిం తిరస్కరిస్తే
చిన్న అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తేనే వేల రూపాయలు ఖర్చవుతున్నాయి. దీన్ని తట్టుకోవాలంటే.. ఆరోగ్య బీమా ఇప్పుడు ఒక తప్పనిసరి అవసరంగా మారింది. చాలామంది ఈ పాలసీని తీసుకుంటున్నప్పటికీ.. దీన్ని పూర్తిగా అర్థం చేసు కోవడంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. -
FasTag: పేటీఎం ఫాస్టాగ్ వాడుతున్నారా? ప్రత్యామ్నాయాలు ఇవే..!
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్లు త్వరలో చెల్లుబాటుకాకుండా పోనున్నాయి. దీంతో కొత్తవి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయాలు ఇవీ.. -
PM Kisan: రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు ఎప్పుడంటే?
PM Kisan 16th installment: పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్న్యూస్. ఫిబ్రవరి 28వ తేదీన ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. -
పేటీఎం ఫాస్టాగ్లు ఏం చేయాలి? సౌండ్ బాక్స్ల మాటేంటి? RBI సమాధానాలివే..!
RBI releases Paytm FAQs: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు సంబంధించి వినియోగదారుల నుంచి తరచూ ఎదురవుతున్న ప్రశ్నలకు ఆర్బీఐ సమాధానాలు ఇచ్చింది. -
8 ఏళ్లలో రూ.45లక్షలు..
నాకు నెలకు రూ.55వేల వేతనం వస్తోంది. వయసు 38. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలు లేవు. నేను ఎంత మొత్తానికి పాలసీ తీసుకోవాలి? -
IPO: ఐపీఓకి దరఖాస్తు చేస్తుంటే
IPO: స్టాక్ మార్కెట్లో ఇప్పుడు ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్)లు జోరు నడుస్తోంది. అనేక సంస్థలు ప్రజల నుంచి మూలధన నిధులను సమీకరించేందుకు ముందుకు వస్తున్నాయి -
PM Surya Ghar: ఉచిత విద్యుత్ పథకం.. ‘రూఫ్టాప్ సోలార్’ కోసం దరఖాస్తు ఇలా..
PM Surya Ghar- Muft Bijli Yojana: కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్ అందించేందుకు కేంద్రం ‘పీఎం సూర్య ఘర్’ పథకం ప్రారంభించింది. దీని కింద ‘రూఫ్టాప్ సోలార్’ కోసం దరఖాస్తు చేసుకోండిలా..! -
Blue Aadhaar: బ్లూ ఆధార్ కార్డు ఎవరికిస్తారు? దరఖాస్తు ఎలా?
Blue Aadhaar Card: యూఐడీఏఐ పిల్లల కోసం ప్రత్యేకంగా నీలం రంగులో ఆధార్ కార్డుల (Blue Aadhaar card)ను జారీ చేస్తోంది. దీన్ని బాల ఆధార్ (Baal Aadhaar) కార్డుగా వ్యవహరిస్తారు. -
Fastag KYC: ఫాస్టాగ్ కేవైసీ గడువు పొడిగించిన ఎన్హెచ్ఏఐ
ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ గడువును పొడిగిస్తున్నట్లు ఎన్హెచ్ఏఐ ప్రకటించింది. ఫిబ్రవరి 29 వరకు వెసులుబాటు కల్పించింది. -
Cashless: ఇక అన్ని ఆస్పత్రుల్లో క్యాష్లెస్.. నేటి నుంచే అమల్లోకి
Cashless facility at all hospitals: దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో క్యాష్లెస్ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ‘ది జనరల్ ఇన్సూరెన్స్’ కౌన్సిల్ వెల్లడించింది. -
FASTags: ఫాస్టాగ్కు కేవైసీ.. జనవరి 31 డెడ్లైన్!
కేవైసీ (KYC) పూర్తిచేయని ఫాస్టాగ్లు జనవరి 31, 2024 తర్వాత డీయాక్టివేట్ లేదా బ్లాక్ అవుతాయని ఎన్హెచ్ఏఐ ప్రకటించింది. -
ఆ అకౌంట్లపై మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలొద్దు.. బ్యాంకులకు RBI ఆదేశం
RBI on minimum balance charges: రెండేళ్లకు పైగా వాడుకలో లేని ఖాతాలపై మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించలేదన్న కారణంతో ఛార్జీలు విధించొద్దని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది.