Semiconductor: వాహన తయారీకి ఇంకా ‘చిప్’ల సమస్య: మారుతీ సుజుకీ
వాహన తయారీకి చిప్ల కొరత ఇంకా ఓ సమస్యగానే ఉందని మారతీ సుజుకీ సీఎఫ్ఓ తెలిపారు. సమస్య తీవ్రత తగ్గినప్పటికీ.. పూర్తిగా సమసిపోలేదని చెప్పారు.
దిల్లీ: వాహన తయారీకి సెమీకండక్టర్ల సరఫరా ఇంకా సవాల్గానే ఉందని మారుతీ సుజుకీ (Maruti Suzuki) సీఎఫ్ఓ అజయ్ సేథ్ అన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఉన్న మార్గాలపై తమ కంపెనీ దృష్టి సారించిందని తెలిపారు. అందుబాటులో ఉన్న సరఫరాదారుల నుంచే అధిక మొత్తంలో సెమీకండక్టర్లను సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు.
రెండో త్రైమాసికంతో పోలిస్తే.. డిసెంబరుతో ముగిసిన మూడు నెలల వ్యవధిలో ఎలక్ట్రానిక్ చిప్ల సరఫరా మెరుగైందని సేథ్ తెలిపారు. అయినా సెమీకండక్టర్ల కొరత వల్ల అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో 46,000 కార్ల తయారీ నిలిచిపోయిందని పేర్కొన్నారు. భవిష్యత్లో వీటి తయారీ ఎలా ఉండనుందనే విషయంపైనా ఎలాంటి స్పష్టత లేదని తెలిపారు.
డిసెంబరు త్రైమాసికం ముగిసే నాటికి మారుతీ సుజుకీ (Maruti Suzuki) పెండింగ్ ఆర్డర్ల సంఖ్య 3.63 లక్షల యూనిట్లకు చేరింది. కంపెనీకి ప్రస్తుతం మానేసర్, గురుగ్రామ్లో ఉన్న తయారీ కేంద్రాలకు 15 లక్షల యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యం ఉంది. అదనంగా గుజరాత్లో ఉన్న సుజుకీ మోటార్ ప్లాంట్ నుంచి కూడా 7.5 లక్షల యూనిట్ల తయారీని చేపట్టేందుకు కంపెనీకి అనుమతి ఉంది.
చమురు దిగుమతిని తగ్గించుకోవడం, 2070 నాటికి తటస్థ కర్బన ఉద్గార స్థాయిని చేరుకోవాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ముందుకు వెళ్తున్నామని సేథ్ తెలిపారు. అందులో భాగంగానే హైబ్రిడ్, సీఎన్జీ, బయో- సీఎన్జీ, ఇథనాల్, ఎలక్ట్రిక్.. ఇలా అన్ని సాంకేతిక హంగులతో కూడిన వాహనాలను తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. స్పోర్ట్స్ యుటిలిటీలో మారుతీ సుజుకీ వాటాను పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఇటీవల ప్రవేశపెట్టిన జిమ్నీ, ఫ్రాంక్స్ ద్వారా దాన్ని సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Summer: కార్లలో వీటిని ఉంచొద్దు.. ప్రమాదకరం..!
వేసవిలో కార్లకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాటిని ఎండలో ఉంచేటప్పుడు అందులో కొన్ని రకాల వస్తువులు ఉంటే ప్రమాదకరం. -
Xiaomi: షావోమీ విద్యుత్తు కార్ల విక్రయాలు మొదలు..!
చైనాలో మరో టెక్ దిగ్గజం విద్యుత్తు కార్ల మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ నెలలోనే డెలివరీలను ప్రారంభిస్తామని ప్రకటించింది. -
హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్
మధ్యశ్రేణి స్పోర్ట్స్ వినియోగ వాహనం (ఎస్యూవీ) క్రెటా ఎన్లైన్ను హ్యుందాయ్ సోమవారం ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ.16.82 లక్షలు(ఎక్స్షోరూం). ఎన్8, ఎన్10 వేరియంట్లలో ఇది లభించనుంది. రూ.25,000తో బుకింగ్లను ప్రారంభించారు. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
Automobile Sales: ఫిబ్రవరి వాహన విక్రయాల్లో 13% వృద్ధి
Automobile Sales: ఫిబ్రవరిలో వాహన విక్రయ గణాంకాలను ఫాడా గురువారం వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన గత నెలలో 13 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. -
బజాజ్ పల్సర్ ఎన్ఎస్ కొత్త మోడళ్లు
బజాజ్ ఆటో పల్సర్ ఎన్ఎస్ శ్రేణిలో 2024 సంవత్సర మోడళ్లను విపణిలోకి విడుదల చేసింది. -
టాటా ఎస్యూవీల్లో డార్క్ సిరీస్లు
టాటా మోటార్స్ తన నెక్సాన్ ఎస్యూవీ బ్రాండ్లో డార్క్ సిరీస్లను విడుదల చేసింది. సంప్రదాయ ఐసీఈ ఇంజిన్, విద్యుత్తు మోడళ్లలోనూ ఇవి అందుబాటులో ఉంటాయి. -
మార్కెట్లోకి BYD సీల్ EV.. 15 నిమిషాల ఛార్జింగ్తో 200km ప్రయాణం
BYD: చైనా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం BYD.. సీల్ ఎలక్ట్రిక్ సెడాన్ను భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ధర, ఇతర వివరాలు ఇవీ.. -
మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్
సరికొత్త డిజైన్, ప్రీమియం ఫీచర్లతో థార్ ఎర్త్ ఎడిషన్ను మహీంద్రా ఆవిష్కరించింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో, కావాల్సిన యాక్సెసరీస్తో ఈ కార్లను కొనుగోలు చేసుకోవచ్చు. -
కొత్త ఫీచర్లతో టీవీఎస్ హెచ్ఎల్ఎక్స్ 150ఎఫ్ బైక్
మోటార్సైకిల్ టీవీఎస్ హెచ్ఎల్ఎక్స్ అమ్మకాలు అంతర్జాతీయంగా 35 లక్షల స్థాయిని అధిగమించిన సందర్భంగా, అదనపు ఫీచర్లతో టీవీఎస్ హెచ్ఎల్ఎక్స్ 150ఎఫ్ను విడుదల చేస్తున్నట్లు టీవీఎస్ మోటార్ కంపెనీ వెల్లడించింది. -
మహీంద్రా స్కార్పియో-ఎన్ జెడ్8 సెలెక్ట్
మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) సంస్థ, ‘స్కార్పియో-ఎన్ జెడ్8 సెలెక్ట్’ వేరియంట్ను గురువారం విడుదల చేసింది. -
భారత్లోకి కొత్త కవాసకి నింజా 500
ఇండియా కవాసకి మోటార్స్, దేశీయ విపణిలోకి 2024 నింజా 500ను తీసుకొచ్చింది. ఈ వాహనాన్ని పూర్తిగా తయారైన స్థితి (సీబీయూ)లో దిగుమతి చేసుకుంటున్నారు. -
kawasaki: కవాసకి నుంచి కొత్త బైక్.. ధర రూ.9.29 లక్షలు
kawasaki z900: ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి జెడ్ 900 పేరుతో కొత్త బైక్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. -
Hero MotoCorp: వచ్చే ఆర్థిక సంవత్సరం టూవీలర్ పరిశ్రమలో రెండంకెల వృద్ధి: హీరో మోటోకార్ప్
Hero MotoCorp: ప్రీమియం బైక్లకు ఆదరణ పుంజుకుంటోందని హీరోమోటోకార్ప్ సీఈఓ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ గిరాకీ మెరుగవుతోందని చెప్పారు. -
Ola Electric: ఓలా ఆఫర్.. ఈ స్కూటర్లపై ₹25 వేల వరకు తగ్గింపు
Ola Electric: విద్యుత్ స్కూటర్లపై ఓలా ఎలక్ట్రిక్ ఆఫర్లు ప్రకటించింది. ఎంపిక చేసిన మోడళ్లపై రూ.25వేల వరకు తగ్గింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. -
ప్రయాణికుల వాహన అమ్మకాల్లో 14% వృద్ధి
ప్రయాణికుల వాహన (పీవీలు) అమ్మకాలు జనవరిలో 14 శాతం పెరిగి 3,93,074 వాహనాలుగా నమోదయ్యాయి. జనవరి నెలకు గాను ఇప్పటివరకు ఇవే అత్యధిక విక్రయాలు కావడం గమనార్హం. -
Vehicle Sales: జనవరిలో రికార్డు స్థాయి గరిష్ఠానికి ప్రయాణికుల వాహన విక్రయాలు
Vehicle Sales: 2023 జనవరిలో 3,47,086 యూనిట్ల పీవీలు అమ్ముడు కాగా.. ఈసారి అవి 13 శాతం పెరిగి 3,93,250కి చేరాయి. -
ఈవీలపై టాటా మోటార్స్ డిస్కౌంట్.. ₹1.2 లక్షల వరకు తగ్గింపు
Tata motors: టాటా మోటార్స్ తన విద్యుత్ కార్లపై డిస్కౌంట్ ప్రకటించింది. నెక్సాన్, టియాగో మోడళ్లపై రూ.1.2 లక్షల వరకు తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపింది. -
Maruti Suzuki: ఎర్రసముద్రం అలజడితో వ్యయాలు పెరగొచ్చు: మారుతీ సుజుకీ
Maruti Suzuki: ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలపై హూతీల దాడుల వల్ల వ్యయాలు పెరిగే అవకాశం ఉందని మారుతీ సుజుకీ పేర్కొంది. -
E-Luna: కైనటిక్ ఇ-లూనా వచ్చేసింది.. సింగిల్ ఛార్జ్తో 110km
E-Luna: కైనటిక్ ఇ-లూనాను కైనటిక్ గ్రీన్ సంస్థ లాంచ్ చేసింది. దీని ధరను రూ.69 వేలుగా నిర్ణయించింది. సింగిల్ ఛార్జ్తో 110 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. -
190km రేంజ్తో ఓలా కొత్త స్కూటర్.. ఇక 8 ఏళ్ల బ్యాటరీ వారెంటీ
Ola electric new scooter: ఓలా మరో కొత్త స్కూటర్ను లాంచ్ చేసింది. ఎస్1 ఎక్స్ శ్రేణిలో 4kWh బ్యాటరీతో ఈ స్కూటర్ను తెచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
AP News: ఈ ఎన్నికల్లో జగన్కు తగిన బుద్ధి చెప్తాం: మందకృష్ణ మాదిగ
-
Harish Rao: ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం ఇవ్వాలి: హరీశ్రావు
-
TCS: టీసీఎస్ ఉద్యోగులకు గుడ్న్యూస్.. త్వరలో వేతన పెంపు!
-
Mallikarjun Kharge: భాజపా హామీలు.. 2004 ఫలితమే వస్తుంది: ఖర్గే
-
Flight Journey: ‘బరువు ఉన్నామని విమానం నుంచి దించేశారు’
-
YSRCP: చిలకలూరిపేట పంచాయితీ.. మల్లెల రాజేశ్కు సీఎంవో నుంచి పిలుపు