Stock Market: లాభాల్లో మార్కెట్‌ సూచీలు.. 22,000 చేరువకు నిఫ్టీ

Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ 257 పాయింట్లు లాభపడి 72,308 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పుంజుకొని 21,994 దగ్గర కొనసాగుతోంది.

Published : 16 Feb 2024 09:35 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ (Stock Market) సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ 257 పాయింట్లు లాభపడి 72,308 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పుంజుకొని 21,994 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.02 వద్ద ప్రారంభమైంది. 

సెన్సెక్స్‌-30 సూచీలో టాటా మోటార్స్‌, ఇన్ఫోసిస్‌, ఎం అండ్‌ ఎం, విప్రో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, మారుతీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. పవర్‌గ్రిడ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, సన్‌ఫార్మా, రిలయన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఐటీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) గురువారం లాభాలతో ముగిశాయి. నేడు ఆసియా పసిఫిక్‌ ప్రధాన సూచీలూ సానుకూలంగా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర గత 24 గంటల్లో స్వల్పంగా తగ్గి 82.78 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ గురువారం నికరంగా రూ.3,064.15 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ రూ.2,276.93 కోట్ల విలువ చేసే షేర్లను కొన్నారు. జనవరిలో మన దేశ ఎగుమతులు 3.12% వృద్ధి చెంది 3 నెలల గరిష్ఠమైన 36.92 బిలియన్‌ డాలర్లకు చేరాయి. వాణిజ్యలోటు 17.03 బిలియన్‌ డాలర్లకు చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని