SpiceJet: శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేళ స్పైస్‌జెట్‌ ప్రత్యేక సేల్‌

SpiceJet: అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా స్పైస్‌జెట్‌ ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. జనవరి 22 నుంచి 28 మధ్య బుక్‌ చేసుకునే టికెట్లకు మాత్రమే ఈ ఆఫర్‌ వస్తుంది.

Updated : 22 Jan 2024 13:11 IST

దిల్లీ: అయోధ్య రామమందిరంలో (Ayodhya Ram Mandir) శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ ప్రత్యేక సేల్‌ను (SpiceJet special sale) ప్రారంభించింది. అందులో భాగంగా కనిష్ఠంగా రూ.1,622 నుంచే టికెట్ల ధరలు ప్రారంభమవుతున్నట్లు తెలిపింది. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలన్నింటికీ (వన్‌-వే) ఈ సేల్‌ వర్తిస్తుందని పేర్కొంది. స్పైస్‌మ్యాక్స్‌, యూఫస్ట్‌ వంటి యాడ్‌-ఆన్‌లు సహా సీట్ల ఎంపిక ఛార్జీలపై అదనంగా 30 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ సేల్‌లో భాగంగా టికెట్ బుక్ చేసుకున్నవారు విమానం బయలుదేరడానికి 96 గంటల ముందు వరకు ప్రయాణ తేదీని ఉచితంగా మార్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఎం-సైట్‌, మొబైల్‌, యాప్‌, వెబ్‌సైట్‌, రిజర్వేషన్‌ కౌంటర్లు, ప్రత్యేక ట్రావెల్‌ ఏజెంట్ల వద్ద బుక్‌ చేసుకునే అన్ని టికెట్లపై ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.

జనవరి 22 నుంచి 28 మధ్య బుక్‌ చేసుకునే టికెట్లకు మాత్రమే ఈ ఆఫర్‌ వస్తుంది. జనవరి 22 నుంచి 2024 సెప్టెంబర్‌ 30 మధ్య ప్రయాణించాల్సి ఉంటుంది. ముంబయి-గోవా, దిల్లీ-జైపుర్‌, గువాహటి-బాగ్‌డోగ్రా వంటి ప్రముఖ మార్గాల్లో కనిష్ఠ ధర అయిన రూ.1,622 వర్తించనుంది. అయోధ్యకు రవాణా సదుపాయాలను మెరుగుపర్చడంలో భాగంగా స్పైస్‌జెట్‌ (SpiceJet) ఇప్పటికే వివిధ నగరాల నుంచి ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యేక విమానాలను ప్రారంభించనుంది. ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని వేడుకకు హాజరవుతున్న వారి కోసం ఆదివారం ప్రత్యేక విమానాన్ని నడిపింది.

అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ నిరంతర అప్‌డేట్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని