UNGA: ‘భారత్ అద్భుతం’.. ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడి ప్రశంసలు
UNGA: డిజిటలైజేషన్, మౌలిక వసతుల్లో పెట్టుబడుల విషయంలో భారత్ పనితీరు అద్భుతంగా ఉందని ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డేనిస్ ఫ్రాన్సిస్ ప్రశంసించారు.
ఐరాస: పేదరిక నిర్మూలన, కోట్లాది మంది ప్రజలను ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం చేయడంలో భారత్ పనితీరు అద్భుతమని ఐరాస జనరల్ అసెంబ్లీ (UNGA) అధ్యక్షుడు డేనిస్ ఫ్రాన్సిస్ కొనియాడారు. అందుకోసం డిజిటలైజేషన్ను (Digitalisation) సమర్థంగా వినియోగించుకుంటోందని తెలిపారు. ఫోన్ లాంటి ఒక డివైజ్, డిజిటలైజేషన్ మోడల్తోనే ఇది సాధ్యమవుతోందని పేర్కొన్నారు. ఉత్పాదకతను పెంచడం, ఖర్చును తగ్గించడం, ఆర్థిక వ్యవస్థను సమర్థంగా మార్చడంలో డిజిటలీకరణ తోడ్పాటునందిస్తుందని వివరించారు.
జనవరి 22-26 మధ్య ఫ్రాన్సిస్ భారత్లో పర్యటించారు. విదేశాంగ మంత్రి జైశంకర్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. జైపుర్, ముంబయిలో పర్యటించారు. పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, మేధోసంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పరిశీలించిన అంశాలను ఆధారం చేసుకొని డిజిటలైజేషన్ వినియోగంతో భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రశంసించారు. మహిళలు, రైతుల నుంచి ప్రతిఒక్కరూ తామున్న చోటు నుంచే చెల్లింపులు చేస్తున్నట్లు గుర్తించామని ఆయన చెప్పారు. దీంతో ప్రపంచ వేదికపై భారత పోటీతత్వం పెరుగుతోందని కొనియాడారు.
దేశవ్యాప్తంగా మౌలిక వసతుల సదుపాయాల్లోనూ భారత్ గణనీయంగా పెట్టుబడులు (Infrastructure investment) పెడుతున్నట్లు గమనించామని ఫ్రాన్సిస్ తెలిపారు. దీంతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. కార్మికులకు నిరంతరం పని లభిస్తుందని చెప్పారు. వివిధ వస్తువులకు గిరాకీ పుంజుకుంటుందన్నారు. తద్వారా ఆర్థిక వ్యవస్థ గణనీయ వృద్ధి నమోదు చేస్తుందని తెలిపారు. అయితే, మౌలిక వసతుల అభివృద్ధిని పర్యావరణ అనుకూల విధానాలతో ముడిపెట్టాలని సూచించారు. లేదంటే భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా పరిణమిస్తుందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిశ్రామిక ప్రముఖులు ఓటేశారు
లోక్సభ ఎన్నికల అయిదో విడత పోలింగ్లో, సోమవారం ముంబయిలో పారిశ్రామిక ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
విద్యుత్తు విధాన మార్గదర్శకాలు త్వరలో
మనదేశంలో విద్యుత్తు వాహనాల (ఈవీ) ఉత్పత్తి, వినియోగాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. ఈవీ నూతన విధాన మార్గదర్శకాలను ఆవిష్కరించడానికి సన్నద్ధమవుతోంది. -
సానుకూలతలున్నా.. అప్రమత్తతే!
ఎన్నికల అనంతరం అధికారం చేపట్టే పార్టీ విషయమై అనిశ్చితి వల్ల అప్రమత్తతతో ఉన్నా, నిఫ్టీ-50 ఈ వారం సానుకూలతలను కనబరచొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
74,360 ఎగువన లాభాలు కొనసాగొచ్చు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం సూచీలు లాభాల్లో ముగిశాయి. డీఐఐల కొనుగోళ్లు, స్థిరమైన చమురు ధరలు ఇందుకు దోహదపడ్డాయి. -
ఇండియా సిమెంట్స్కు తగ్గిన నష్టం
ఇండియా సిమెంట్స్, జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.50.06 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. -
ఆయిల్ ఇండియా 2 షేర్లకు ఒకటి బోనస్
ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఆయిల్ ఇండియా మార్చి త్రైమాసికంలో రూ.2,332.94 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. -
దిల్లీలో ఉబర్ బస్సు సేవలు
‘దిల్లీ ప్రీమియం బస్ స్కీమ్’ కింద దేశ రాజధానిలో బస్సులు తిప్పేందుకు దిల్లీ రవాణా విభాగం నుంచి అగ్రిగేటర్ లైసెన్స్ పొందినట్లు ఉబర్ వెల్లడించింది. -
ఎస్బీఐ ఛైర్మన్ పదవికి నేడు ఇంటర్వ్యూలు
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఛైర్మన్ పదవికి అర్హులైన అభ్యర్థుల ఇంటర్వ్యూలను ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) మంగళవారం నిర్వహించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ఫైనాన్షియల్ టైమ్స్ ర్యాంకింగ్స్లో ఐఎస్బీకి దేశంలో ప్రథమ స్థానం
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్ ర్యాంకింగ్- 2024 లో మనదేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది. -
విస్తరణ దిశగా నెక్స్ట్వేవ్
విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చే హైదరాబాదీ ఎడ్యుటెక్ అంకురం నెక్ట్స్వేవ్ విస్తరణ బాట పట్టింది. -
మార్చిలో 14.41 లక్షల మంది చేరిక: ఈపీఎఫ్ఓ
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ)లో ఈ ఏడాది మార్చిలో నికరంగా 14.41 లక్షల మంది సభ్యులు చేరారు. -
సుగంధ ద్రవ్యాల ఎగుమతులపై కేంద్రం మార్గదర్శకాలు
మనదేశం నుంచి ఎగుమతి అయ్యే సుగంధ ద్రవ్యాలు ఎథిలీన్ ఆక్సైడ్ (ఈటీఓ)తో కలుషితం కాకుండా ఉండేలా చూడడం కోసం కేంద్రం సవివర మార్గదర్శకాలను జారీ చేసింది. -
సంక్షిప్త వార్తలు
పవర్ మెక్ ప్రాజెక్ట్స్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,311.86 కోట్ల ఆదాయంపై రూ.84.41 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
తాజా వార్తలు (Latest News)
-
బోనస్ విషయంలో ప్రభుత్వం బోగస్ విధానాన్ని బయట పెట్టింది: కేటీఆర్
-
అన్నవరం రైల్వే స్టేషన్ లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ప్రయాణికులు
-
దోషులను తప్పించి... అమాయకులను ఇరికించి..!
-
తెదేపా ముసుగులో విద్వేష ప్రసంగాలు చేస్తున్న కృష్ణారెడ్డిని అరెస్టు చేయాలి
-
ఉద్యోగుల భవన్ అమ్మేశారు.. నాలుగో తరగతి వేతనజీవుల ఆందోళన
-
అభ్యర్థుల నోటా.. ఆందోళన మాట