మహా పోరు.. ప్రచార హోరు!
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా తొలివిడతలో మహారాష్ట్రలోని చంద్రపూర్ స్థానానికి ఎన్నికలు జరుగుతుండటంతో సరిహద్దు గ్రామాల్లో రాజకీయం వేడెక్కుతోంది.
సరిహద్దు గ్రామాల్లో జిల్లా నేతల పర్యటన
సుర్దాపూర్లో భాజపా అభ్యర్థి తరఫున ఇంటింటి ప్రచారం చేస్తున్న జడ్పీ మాజీ ఛైర్పర్సన్ సుహాసినిరెడ్డి, జిల్లా నాయకులు
న్యూస్టుడే, ఆదిలాబాద్ పాలనాప్రాంగణం : పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా తొలివిడతలో మహారాష్ట్రలోని చంద్రపూర్ స్థానానికి ఎన్నికలు జరుగుతుండటంతో సరిహద్దు గ్రామాల్లో రాజకీయం వేడెక్కుతోంది. ఈ నెల 19న అక్కడి గ్రామాల్లో పోలింగ్ జరగనుంది. సరిహద్దు గ్రామాల్లో ప్రచార హోరు తారాస్థాయికి చేరింది. ఆయా గ్రామాల్లో తెలుగు మాట్లాడేవారు అత్యధికులు ఉండటంతో ఆ ఓటర్లను ఆకర్షించేందుకు జిల్లా నేతలు ప్రచారంలో పాల్గొనడం మరింత ఆసక్తిని రేకేత్తిస్తోంది.
తెలంగాణ - మహారాష్ట్ర రాష్ట్రాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దున ఉంది. అటు వైపు యావత్మాల్, చంద్రపూర్, ఇటువైపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలను పెన్గంగా నది విడదీస్తోంది. ఆ నదే రెండు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల వారి సత్సంబంధాలకు వారధిలా మారింది. నదికి అవతల మహారాష్ట్ర చంద్రపూర్ లోక్సభ నియోజకర్గ పరిధిలో యావత్మాల్, చంద్రపూర్ జిల్లాల్లోని ఆర్ని, రాజురా, బాల్లార్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. నదికి ఇటు వైపున ఆదిలాబాద్ లోక్సభ పరిధిలోని ఆదిలాబాద్, కుమురం భీం జిల్లాల్లోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిర్పూర్-టి నియోజకవర్గాలు మహారాష్ట్ర సరిహద్దును కలిగి ఉన్నాయి. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజల రాకపోకలు, బంధుత్వాలు కలుపుకొంటుండటంతో ఆయా ప్రాంతాల్లో ఎన్నికలు జరిగినపుడు సరిహద్దు గ్రామాల్లో రాజకీయ చర్చ ఆసక్తికర అంశంగా మారుతోంది. ప్రస్తుతం ఈ నెల 19న చంద్రపూర్ లోకసభకు పోలింగ్ జరగనుండటంతో అందరి దృష్టి అటు వైపు మళ్లింది.
తెలుగు మాట్లాడే వారే లక్ష్యంగా..
చంద్రపూర్ లోకసభ పరిధిలో 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో భాజపా అభ్యర్థిగా సుధీర్ మునగంటివార్, కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రతిభా ధనోర్కర్ నడుమే ప్రధానంగా పోటీ నెలకొందని మహారాష్ట్రవాసులు చెబుతున్నారు. మన రాష్ట్రంలోనూ కాంగ్రెస్, భాజపా అభ్యర్థుల నడుమే ప్రధాన పోటీ జరగనుండటంతో.. సరిహద్దు గ్రామాల్లో ఓటర్లను ఆకర్షించేలా జిల్లా నేతలు అటువైపు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. వారం రోజుల కిందట ఎమ్మెల్యే పాయల్ శంకర్ వెళ్లి ప్రచారం చేయగా.. ఆదివారం ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, జడ్పీ మాజీ ఛైర్పర్సన్ సుహాసినిరెడ్డి తన అనుచరగణంతో తెలుగువారు అత్యధికంగా ఉండే మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామాలైన బోరి, పాటన్ సత్పల్లి, మాండ్వి, కమరెల్లి, సుర్దాపూర్, దిగ్రస్, దుర్బా, లింగ్టి, అర్దావన్ గ్రామాల్లో సుడిగాలి ప్రచారం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇక్కడి మరాఠీ భాష మాట్లాడేవారిని ఆకట్టుకునేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆదిలాబాద్, బేల సభల్లో పాల్గొని ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. కాగా చంద్రపూర్ లోక్సభ ఎన్నిక పోలింగ్ ఈ నెల 19న జరిగినా వచ్చే నెల 13న జరిగే మన పోలింగ్ తర్వాతే జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. అప్పటి వరకు గెలుపు ఎవరిదనే చర్చ మాత్రం సరిహద్దు గ్రామాల్లో కొనసాగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్సాహంగా పాఠశాల స్థాయి ఈత పోటీలు
[ 29-04-2024]
జిల్లా కేంద్రంలోని ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్లో సోమవారం సాయంత్రం నిర్వహించిన పాఠశాల స్థాయి ఈత పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తాం
[ 29-04-2024]
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పలరాలో సోమవారం సాయంత్రం మంత్రి సీతక్క ఎంపీ అభ్యర్థి సుగుణ తరఫున ప్రచారం నిర్వహించారు. -
విద్యుత్ స్తంభం పైనుంచి పడి జేఎల్ఎం దుర్మరణం
[ 29-04-2024]
విద్యుత్తు స్తంభం పైనుంచి కింద పడి జూనియర్ లైన్మెన్ దుర్మరణం చెందిన సంఘటన అదిలాబాద్ పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. -
సదస్సుపై దాడికి పాల్పడటం ఉన్మాద చర్య
[ 29-04-2024]
కవులు, రచయితలను, ప్రజాస్వామ్యాదులపై దాడికి పూనుకోవటం ఉన్మాదా చర్యని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా) కార్యదర్శి వర్గ సభ్యులు అన్నారు. -
మే డే గోడ ప్రతులను ఆవిష్కరించిన ఏఐటీయూసీ నేతలు
[ 29-04-2024]
జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో సోమవారం ఏఐటీయూసీ నేతలు ప్రపంచ కార్మిక దినోత్సవానికి సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. -
ఫ్లెక్సీల ఏర్పాటుపై ఫిర్యాదు
[ 29-04-2024]
ఆదిలాబాద్ పట్టణంలో ఆదివారం రాత్రి ఒక పార్టీకి వ్యతిరేకంగా నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులకు భాజపా నాయకులు సోమవారం ఫిర్యాదు చేశారు. -
కార్మికుల హక్కుల సాధనకు మతోన్మాదులను ఓడించాలి
[ 29-04-2024]
కార్మికుల హక్కులను కాలరాసే యత్నాలు చేస్తున్న మతోన్మాద పార్టీలను ఓడించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ పిలుపునిచ్చారు. -
రిమ్స్ లాండ్రీకి నీటి కొరత
[ 29-04-2024]
రిమ్స్లోని లాండ్రీకి నీటి కొరత సమస్య ఏర్పడింది. -
ఘనంగా అంతర్జాతీయ నృత్య దినోత్సవం
[ 29-04-2024]
జిల్లా కేంద్రంలో సోమవారం బాలకేంద్రం, నృత్య శిక్షణ కేంద్రాలు, డ్యాన్స్ అకాడమీల్లో అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. -
గంగపుత్ర శివాలయంలో మహా అన్నదానం
[ 29-04-2024]
జిల్లా కేంద్రంలోని గంగపుత్ర శివాలయంలో సోమవారం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
వంతెనలు లేక.. చింతలు తీరక
[ 29-04-2024]
వర్షంవస్తే ఆదిలాబాద్ జిల్లాలో నేటికీ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండే వందలాది గ్రామాలున్నాయి. అక్కడ పురిటి నొప్పులతో సకాలంలో ఆసుపత్రులకు వెళ్లలేక మృత్యువాత పడుతున్న తల్లుల వేదన పట్టించుకునే వారు కరవయ్యారు. -
గొలుసుకట్టు.. అంతా కనికట్టు
[ 29-04-2024]
మీకు స్మార్ట్ఫోన్ ఉంటే చాలు.. రోజుకు రూ.5 వేలు మొదలుకొని నెలకు రూ.లక్షపైనే ఆదాయం పొందవచ్చని నమ్మబలికింది ఓ విదేశీ ఆన్లైన్ కంపెనీ. సంప్రదింపులు లేకుండా చాటింగ్ ద్వారా లావాదేవీలు నడిపి పెద్ద ఎత్తున యువకులు పెట్టుబడి పెట్టేలా ఎరవేసింది. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 29-04-2024]
ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వాడకం పెరిగిపోవడంతో గృహజ్యోతి కింద జీరో బిల్లులు పొందే వారి సంఖ్య తగ్గిపోయింది. ప్రభుత్వ నిబంధనల మేరకు 200 యూనిట్ల లోపు వినియోగించుకునే వారికి జీరో బిల్లు ఇస్తారు. -
ఎన్నికల వేళ.. గొలుసు దుకాణాల గోల
[ 29-04-2024]
‘లోక్సభ ఎన్నికల కోడ్ అమలులో వచ్చిన సందర్భంగా గంజాయి అక్రమ రవాణా, మద్యం గొలుసుదుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇందుకు సంబంధించిన వ్యక్తులపై కేసులు నమోదు చేస్తాం. -
తాళం వేసుందా.. సొమ్ము గోవిందా
[ 29-04-2024]
జిల్లాలో తాళం వేసిన ఇళ్లు, దుకాణాలే లక్ష్యంగా చోరీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో చాలామంది విహారయాత్రలు, ప్రముఖ దేవాలయాలు, బంధువుల ఇళ్లకు వెళ్తుంటారు. -
పురిటిలోనే బిడ్డ.. వైద్యం అందక తల్లి మృతి
[ 29-04-2024]
కాగజ్నగర్ పట్టణం పెట్రోల్బంకు ఏరియాలోని ఓ ప్రైవేటు ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుందని బాధిత బంధువులు ఆదివారం రాత్రి ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు. -
ఓటు మీది.. అభివృద్ధి మాది
[ 29-04-2024]
పదేళ్లలో కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో భారాస చేసిందేమి లేదని, కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
తాగునీటి కష్టాలు మొదలు..
[ 29-04-2024]
గత నెల రోజులుగా ఎండ తీవ్రత పెరగడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. మంచిర్యాల పట్టణ ప్రజలకు తాగునీరు సరఫరా చేయడానికి గోదావరినదిలో నిర్మించిన ఇన్టేక్వెల్స్ వద్ద నీటిమట్టం ఇప్పటికే తగ్గిపోయింది. -
కళాశాలలు డీలా.. గురుకులాలు భళా
[ 29-04-2024]
ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలలు నిరాశపరిచాయి. ప్రైవేట్కు దీటుగా గురుకులాలు ఉత్తీర్ణత శాతం సాధించాయి. రాష్ట్రస్థాయిలో ఈ ఏడాది 46.29 శాతంతో ప్రథమంలో 32వ స్థానం, 59.53 శాతంతో ద్వితీయంలో 30వ స్థానాల్లో మంచిర్యాల నిలిచింది. -
పోలింగ్ చీటీ.. ఓటరు దిక్సూచీ
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం అన్నీ సిద్ధం చేస్తోంది. ఓటర్లు అందరూ స్వేచ్ఛాయుతంగా ఓటువేసేందుకు సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టిన ఎన్నికల సంఘం ఓటర్లకు పోలింగ్ చీటీలు పంపిణీ చేస్తోంది. -
ఎన్నికలకు సమాయత్తం
[ 29-04-2024]
ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని జిల్లాలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల సమరానికి జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జిల్లా పాలనాధికారి అశిష్ సంగ్వాన్ నేతృత్వంలో ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. -
ఓటు... మరింత చేరువ!
[ 29-04-2024]
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో అనేక గ్రామాల్లో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం కుదిరేది కాదు. ఆయా గ్రామాల ప్రజలు ఓట్లు వేయాలంటే కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. -
పరిమితి మించితే చిక్కులే..
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణలో కీలక ఘట్టమైన నామపత్రాల స్వీకరణపర్వం పూర్తయింది. పెద్దపల్లి, ఆదిలాబాద్ లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇతర అభ్యర్థులు నామపత్రాలను దాఖలు చేశారు. -
16 శాతం రాకుంటే డిపాజిట్ గల్లంతే..
[ 29-04-2024]
ఎన్నికల్లో పోటీచేసిన పలువురు అభ్యర్థులు ఫలితాలు వెలువడిన తర్వాత డిపాజిట్లు కోల్పోయారనే మాటలు తరచూ వింటాం.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎన్నికల సంఘం నిర్ణయించిన రుసుమును సంబంధిత ఆర్వో వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. -
57 మంది అధ్యాపకులకు నోటీసులు
[ 29-04-2024]
ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడంపై ఇంటర్మీడియట్ విద్యాశాఖ దృష్టి సారించింది. జిల్లాలోని 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జనరల్, వొకేషనల్ విభాగంలో ప్రథమ సంవత్సరంలో 29.28 శాతం,
తాజా వార్తలు (Latest News)
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’