వీరి ఆపద.. వారికి సంపద
జిల్లాలో అక్రమ ఫైనాన్స్ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. భూకబ్జాలు, ఆర్థిక నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సింగరేణి ప్రాంతంలో నేరాల సంఖ్య పెరుగుతోంది.
వడ్డీ వ్యాపారుల నివాసాలపై పోలీసుల ఆకస్మిక దాడులు
ఫైనాన్స్ కార్యాలయంలో తనిఖీలు చేస్తున్న సీఐ బన్సీలాల్
జిల్లాలో అక్రమ ఫైనాన్స్ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. భూకబ్జాలు, ఆర్థిక నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సింగరేణి ప్రాంతంలో నేరాల సంఖ్య పెరుగుతోంది. డబ్బులతో వ్యాపారం చేసేవారు ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. సామాన్యుల ఆపదే వారికి అక్రమ సంపాదన ఏకంగా అయిదు నుంచి పదిశాతం వడ్డీ వసూలు చేస్తూ ఫైనాన్స్ వ్యాపారులు ప్రజల నడ్డీ విరుస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా కోల్బెల్ట్ ప్రాంతాల్లోని సింగరేణి కార్మికులు, చిరు వ్యాపారులు, సామాన్య ప్రజలే వనరులుగా మలచుకొని దందాలు నిర్వహిస్తున్నారు. కొందరు ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తుండగా.. మరికొందరు అనుమతులే లేకుండా ఫైనాన్స్ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. జిల్లాలో అక్రమంగా సాగుతున్న ఈ దందాపై ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేసథ్యంలో పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు.
మంచిర్యాల నేరవిభాగం, లక్షెట్టిపేట, న్యూస్టుడే
లక్షెట్టిపేట పట్టణంలో అనుమతులు లేకుండా ఫైనాన్స్లు, వడ్డీ వ్యాపారాలు చేస్తున్న వారి ఇళ్లపై ఆదివారం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. తిమ్మాపూర్కు చెందిన ఓ వ్యక్తి ఇంటిలో 31 ఖాళీ ప్రామిసరీనోట్లు, 38 బాండ్ పేపర్లు, ఒక కాలి చెక్కును స్వాధీనం చేసుకున్నారు. ఇదే క్రమంలో లక్షెట్టిపేటకు చెందిన మరో మహిళ నుంచి రూ.26.65 లక్షల విలువైన 31 ప్రామిసరీ నోట్లు, రెండు చెక్కులు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నరేందర్ తెలిపారు. అనుమతులు లేకుండా అధిక వడ్డీలతో వ్యాపారం చేస్తూ సామాన్యులను ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు అనుమతులు లేకుండా వ్యాపారం చేసే వారి వద్దకు వెళ్లవద్దని సూచించారు. దాడుల్లో ఎస్సైలు చంద్రకుమార్, స్వరూప్రాజ్, సిబ్బంది పాల్గొన్నారు.
ఓ వ్యాపారి ఇంటిలో స్వాధీనం చేసుకున్న బాండ్పేపర్లను పరిశీలిస్తున్న పోలీసులు
వివరాలు ఉండవు.. రసీదులు ఇవ్వరు..
అప్పుల కోసం ఫైనాన్స్ కార్యాలయాలకు వచ్చిన వారి నుంచి ప్రామిసరీ నోట్లు, చెక్కులను తీసుకుంటారు. వీటిపై బాధితుల సంతకాలు తప్ప ఇతర ఏ వివరాలూ ఉండవు. ప్రతి నెలా బాధితులు కట్టిన వడ్డీలకు రసీదులు ఇవ్వరు. రూ. వందకు 5 నుంచి 10 శాతం వడ్డీ వసూలు చేస్తున్న ఫైనాన్స్ నిర్వాహకులు.. బాధితుడు డబ్బులు చెల్లించని పక్షంలో ప్రామిసరీ నోటు, చెక్కులపై ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ సామాన్యులను బెదిరింపులకు గురిచేస్తున్నారు.
బ్యాంకుల్లో రుణాల కోసం ఆస్తులను నమ్మకంగా మార్ట్గేజ్ చేస్తుంటారు. ఇక్కడి ఫైనాన్స్ నిర్వాహకులు ఇళ్లు, భూముల పత్రాలను తమ సంస్థతో మార్ట్గేజ్ చేయించుకుంటున్నారు. అధిక వడ్డీలు చెల్లించని పక్షంలో విలువైన భూములు, ఇళ్లను స్వాధీనం చేసుకుంటున్నారు.
నిబంధనలు పాటించకుండా..
జిల్లాలో ఫైనాన్స్ అండ్ హైర్పర్చేస్ కార్యాలయాలు ప్రభుత్వ రిజిస్ట్రార్ నిబంధనలు పాటించాలి. ఫైనాన్స్ పేరుతో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ గుర్తింపు పొందాలి. ఫైనాన్స్ పేరిట పాన్కార్డు, మనీలెండింగ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంది. బ్యాంకు ఖాతాల ద్వారానే లావాదేవీలు జరుపుతూ.. ఏటా ఆదాయపన్ను రికార్డులను నమోదు చేయాలి. నిర్వాహకులెవరూ అలా చేయడం లేదు. కొంతమంది అనుమతులు లేకుండానే కార్యాలయాలను తెరుస్తూ అక్రమదందాలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై రిజిస్ట్రార్ అధికారులు తనిఖీలు చేయకపోవడంతో అక్రమ వ్యాపారాలకు అడ్డూఅదుపులేకుండా పోతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్సాహంగా పాఠశాల స్థాయి ఈత పోటీలు
[ 29-04-2024]
జిల్లా కేంద్రంలోని ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్లో సోమవారం సాయంత్రం నిర్వహించిన పాఠశాల స్థాయి ఈత పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తాం
[ 29-04-2024]
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పలరాలో సోమవారం సాయంత్రం మంత్రి సీతక్క ఎంపీ అభ్యర్థి సుగుణ తరఫున ప్రచారం నిర్వహించారు. -
విద్యుత్ స్తంభం పైనుంచి పడి జేఎల్ఎం దుర్మరణం
[ 29-04-2024]
విద్యుత్తు స్తంభం పైనుంచి కింద పడి జూనియర్ లైన్మెన్ దుర్మరణం చెందిన సంఘటన అదిలాబాద్ పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. -
సదస్సుపై దాడికి పాల్పడటం ఉన్మాద చర్య
[ 29-04-2024]
కవులు, రచయితలను, ప్రజాస్వామ్యాదులపై దాడికి పూనుకోవటం ఉన్మాదా చర్యని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా) కార్యదర్శి వర్గ సభ్యులు అన్నారు. -
మే డే గోడ ప్రతులను ఆవిష్కరించిన ఏఐటీయూసీ నేతలు
[ 29-04-2024]
జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో సోమవారం ఏఐటీయూసీ నేతలు ప్రపంచ కార్మిక దినోత్సవానికి సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. -
ఫ్లెక్సీల ఏర్పాటుపై ఫిర్యాదు
[ 29-04-2024]
ఆదిలాబాద్ పట్టణంలో ఆదివారం రాత్రి ఒక పార్టీకి వ్యతిరేకంగా నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులకు భాజపా నాయకులు సోమవారం ఫిర్యాదు చేశారు. -
కార్మికుల హక్కుల సాధనకు మతోన్మాదులను ఓడించాలి
[ 29-04-2024]
కార్మికుల హక్కులను కాలరాసే యత్నాలు చేస్తున్న మతోన్మాద పార్టీలను ఓడించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ పిలుపునిచ్చారు. -
రిమ్స్ లాండ్రీకి నీటి కొరత
[ 29-04-2024]
రిమ్స్లోని లాండ్రీకి నీటి కొరత సమస్య ఏర్పడింది. -
ఘనంగా అంతర్జాతీయ నృత్య దినోత్సవం
[ 29-04-2024]
జిల్లా కేంద్రంలో సోమవారం బాలకేంద్రం, నృత్య శిక్షణ కేంద్రాలు, డ్యాన్స్ అకాడమీల్లో అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. -
గంగపుత్ర శివాలయంలో మహా అన్నదానం
[ 29-04-2024]
జిల్లా కేంద్రంలోని గంగపుత్ర శివాలయంలో సోమవారం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
వంతెనలు లేక.. చింతలు తీరక
[ 29-04-2024]
వర్షంవస్తే ఆదిలాబాద్ జిల్లాలో నేటికీ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండే వందలాది గ్రామాలున్నాయి. అక్కడ పురిటి నొప్పులతో సకాలంలో ఆసుపత్రులకు వెళ్లలేక మృత్యువాత పడుతున్న తల్లుల వేదన పట్టించుకునే వారు కరవయ్యారు. -
గొలుసుకట్టు.. అంతా కనికట్టు
[ 29-04-2024]
మీకు స్మార్ట్ఫోన్ ఉంటే చాలు.. రోజుకు రూ.5 వేలు మొదలుకొని నెలకు రూ.లక్షపైనే ఆదాయం పొందవచ్చని నమ్మబలికింది ఓ విదేశీ ఆన్లైన్ కంపెనీ. సంప్రదింపులు లేకుండా చాటింగ్ ద్వారా లావాదేవీలు నడిపి పెద్ద ఎత్తున యువకులు పెట్టుబడి పెట్టేలా ఎరవేసింది. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 29-04-2024]
ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వాడకం పెరిగిపోవడంతో గృహజ్యోతి కింద జీరో బిల్లులు పొందే వారి సంఖ్య తగ్గిపోయింది. ప్రభుత్వ నిబంధనల మేరకు 200 యూనిట్ల లోపు వినియోగించుకునే వారికి జీరో బిల్లు ఇస్తారు. -
ఎన్నికల వేళ.. గొలుసు దుకాణాల గోల
[ 29-04-2024]
‘లోక్సభ ఎన్నికల కోడ్ అమలులో వచ్చిన సందర్భంగా గంజాయి అక్రమ రవాణా, మద్యం గొలుసుదుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇందుకు సంబంధించిన వ్యక్తులపై కేసులు నమోదు చేస్తాం. -
తాళం వేసుందా.. సొమ్ము గోవిందా
[ 29-04-2024]
జిల్లాలో తాళం వేసిన ఇళ్లు, దుకాణాలే లక్ష్యంగా చోరీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో చాలామంది విహారయాత్రలు, ప్రముఖ దేవాలయాలు, బంధువుల ఇళ్లకు వెళ్తుంటారు. -
పురిటిలోనే బిడ్డ.. వైద్యం అందక తల్లి మృతి
[ 29-04-2024]
కాగజ్నగర్ పట్టణం పెట్రోల్బంకు ఏరియాలోని ఓ ప్రైవేటు ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుందని బాధిత బంధువులు ఆదివారం రాత్రి ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు. -
ఓటు మీది.. అభివృద్ధి మాది
[ 29-04-2024]
పదేళ్లలో కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో భారాస చేసిందేమి లేదని, కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
తాగునీటి కష్టాలు మొదలు..
[ 29-04-2024]
గత నెల రోజులుగా ఎండ తీవ్రత పెరగడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. మంచిర్యాల పట్టణ ప్రజలకు తాగునీరు సరఫరా చేయడానికి గోదావరినదిలో నిర్మించిన ఇన్టేక్వెల్స్ వద్ద నీటిమట్టం ఇప్పటికే తగ్గిపోయింది. -
కళాశాలలు డీలా.. గురుకులాలు భళా
[ 29-04-2024]
ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలలు నిరాశపరిచాయి. ప్రైవేట్కు దీటుగా గురుకులాలు ఉత్తీర్ణత శాతం సాధించాయి. రాష్ట్రస్థాయిలో ఈ ఏడాది 46.29 శాతంతో ప్రథమంలో 32వ స్థానం, 59.53 శాతంతో ద్వితీయంలో 30వ స్థానాల్లో మంచిర్యాల నిలిచింది. -
పోలింగ్ చీటీ.. ఓటరు దిక్సూచీ
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం అన్నీ సిద్ధం చేస్తోంది. ఓటర్లు అందరూ స్వేచ్ఛాయుతంగా ఓటువేసేందుకు సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టిన ఎన్నికల సంఘం ఓటర్లకు పోలింగ్ చీటీలు పంపిణీ చేస్తోంది. -
ఎన్నికలకు సమాయత్తం
[ 29-04-2024]
ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని జిల్లాలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల సమరానికి జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జిల్లా పాలనాధికారి అశిష్ సంగ్వాన్ నేతృత్వంలో ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. -
ఓటు... మరింత చేరువ!
[ 29-04-2024]
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో అనేక గ్రామాల్లో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం కుదిరేది కాదు. ఆయా గ్రామాల ప్రజలు ఓట్లు వేయాలంటే కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. -
పరిమితి మించితే చిక్కులే..
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణలో కీలక ఘట్టమైన నామపత్రాల స్వీకరణపర్వం పూర్తయింది. పెద్దపల్లి, ఆదిలాబాద్ లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇతర అభ్యర్థులు నామపత్రాలను దాఖలు చేశారు. -
16 శాతం రాకుంటే డిపాజిట్ గల్లంతే..
[ 29-04-2024]
ఎన్నికల్లో పోటీచేసిన పలువురు అభ్యర్థులు ఫలితాలు వెలువడిన తర్వాత డిపాజిట్లు కోల్పోయారనే మాటలు తరచూ వింటాం.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎన్నికల సంఘం నిర్ణయించిన రుసుమును సంబంధిత ఆర్వో వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. -
57 మంది అధ్యాపకులకు నోటీసులు
[ 29-04-2024]
ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడంపై ఇంటర్మీడియట్ విద్యాశాఖ దృష్టి సారించింది. జిల్లాలోని 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జనరల్, వొకేషనల్ విభాగంలో ప్రథమ సంవత్సరంలో 29.28 శాతం,
తాజా వార్తలు (Latest News)
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’