ఆత్మరక్షణ విద్య నేర్చుకుందాం
ప్రస్తుత సమాజంలో ఆడబిడ్డకు రక్షణ లేకుండా పోతోంది. ఒంటరిగా ఎక్కడకు వెళ్లలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. అఘాయిత్యాలు, అత్యాచారాలు, ఆమ్లదాడులు, హత్యాచారాలు, కిడ్నాపులు ఇలా ఏదో ఒకటి నిత్యం వార్తల్లో పతాక శీర్షికల్లో నిలుస్తూనే ఉంటున్నాయి.
దొంగలను తరిమికొట్టిన తల్లీకూతుళ్లే అందరికీ ప్రేరణ\
న్యూస్టుడే, ఆదిలాబాద్ క్రీడావిభాగం : ప్రస్తుత సమాజంలో ఆడబిడ్డకు రక్షణ లేకుండా పోతోంది. ఒంటరిగా ఎక్కడకు వెళ్లలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. అఘాయిత్యాలు, అత్యాచారాలు, ఆమ్లదాడులు, హత్యాచారాలు, కిడ్నాపులు ఇలా ఏదో ఒకటి నిత్యం వార్తల్లో పతాక శీర్షికల్లో నిలుస్తూనే ఉంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో మార్షల్ ఆర్ట్స్ వారికెంతో ఉపయోగపడుతుంది. అన్ని విద్యాలయాల్లోనూ శిక్షణ తరగతులను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఇటీవల ఆత్మరక్షణ విద్యలో ప్రావీణ్యం ఉన్న తల్లీకూతుళ్లు ఇద్దరు దొంగలను ధైర్యంగా ఎదిరించి పోరాడి అందరికీ ప్రేరణగా నిలిచారు. కొంతమంది గృహిణులు సైతం ముందుకొచ్చి ఈ విద్యను నేర్చుకుంటున్నారు, తమ పిల్లలను నేర్పిస్తున్నారు.
‘బాలికలకు ఆత్మరక్షణ విద్య ఎంతో అవసరం. విద్యార్థి దశలోనే వ్యాయామం ఆత్మరక్షణ విద్యలో సాధన చేయాలి.’
- సినీ నటుడు, కరాటే మాస్టర్ సుమన్
పాఠశాలల్లో..
పాఠశాలలో చదువుతున్న బాలికలు ధైర్యంగా ఉండాలని, ఆపత్కాలంలో భయపడకుండా ఆకతాయిలను ఎదిరించాలని ప్రభుత్వం భావించింది. అందుకు రాణిలక్ష్మీబాయి ఆత్మరక్షణ ప్రశిక్షణ్ పేరిట పథకాన్ని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో ప్రవేశపెట్టింది. ఆయా మార్షల్ ఆర్ట్స్ విద్యలో నిష్ణాతులైన మాస్టర్లను ఎంపిక చేసి పాఠశాలలో ఆత్మరక్షణ విద్య తరగతులను నిర్వహిస్తోంది.
స్ఫూర్తిగా తీసుకుందాం
ఇటీవల హైదరాబాద్లోని బేగంపేట పోలీసు స్టేషన్ పరిధిలోని రసూల్పురా జైన్కాలనీలో ఓ ఇంట్లో ఇద్దరు దొంగలు చోరీకి యత్నించారు. వారివద్ద నాటు తుపాకులు, కత్తులు ఉన్నాయి. దోపిడీకి ప్రయత్నిస్తున్న ఇద్దరు దొంగలను తల్లీకూతుళ్లు అమిత(46), వైభవి(19) ధైర్యంగా పోరాడారు. వారిని ప్రతిఘటించారు. పోలీసులకు సమాచారమిచ్చారు. తల్లీకూతుళ్లను పోలీసులు అభినందించడమే కాకుండా ప్రతి ఒక్కరూ వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆత్మరక్షణ విద్య నేర్చుకోవాలని సూచించారు.
ఎంతో అవసరమని..
ఆమెకు ముగ్గురు పిల్లలు. మహిళలకు ఆత్మరక్షణ ఎంతో అవసరమని భర్తతో తన మనసులోని మాటను పంచుకున్నారు. భర్త ప్రోత్సాహంతో మాస్టర్ సాయికృష్ణ వద్ద మూడేళ్లుగా వుషూ క్రీడల్లో సాధన చేశారు. ఆమె పేరు నరంశెట్టి మాధురి. భర్త పేరు శ్రావణ్. బోథ్కు చెందిన ఈ దంపతులు హైదరాబాద్లో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. సెలవుల్లో మాత్రం ఆమె సొంతూరు వచ్చి తప్పనిసరిగా సాధన చేస్తుంటారు. ఇటీవల సౌత్జోన్ పోటీల్లో పాల్గొని కాంస్య పతకాన్ని సాధించారు. క్రీడావిభాగంలో పోలీసు ఉద్యోగం సాధించాలన్నదే తన లక్ష్యమంటున్నారు. ఆత్మరక్షణ విద్యను ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని, అందుకే తన ముగ్గురు పిల్లలకు, భర్తకు నేర్పిస్తున్నానని చెబుతున్నారు.
మూడేళ్లుగా సాధన.
ఆదిలాబాద్కు చెందిన అకోజివార్ శ్రుతికి ఇద్దరు పిల్లలు. భర్త వీరేష్. ఆయన తైక్వాండో మాస్టర్గా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తుంటారు. శ్రుతి మూడేళ్లుగా భర్త వద్ద రణవిద్య తైక్వాండోను నేర్చుకుంటున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదిగారు. వీరి కూతురు సహ కూడా ఈ విద్యలో శిక్షణ పొందుతున్నారు. గతేడాది వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో భాగంగా తల్లీకూతుళ్లు ఇద్దరు ఒకే వేదికపైన తైక్వాండో విన్యాసాన్ని ప్రదర్శించారు. వాటిని వీక్షించిన అప్పటి కలెక్టర్ సిక్తా పట్నాయక్ వారిని అభినందించారు. పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు సైతం ఇలాంటి రణవిద్య నేర్చుకోవాలని సూచించారు. ఆపదలో స్వయంగా తమకు తాము రక్షించుకోవడానికి ఈ విద్యను నేర్చుకుంటున్నామని పేర్కొంటున్నారు.
కుటుంబంతో కలిసి..
ఆమె పేరు కిరణ్ భట్. భర్త పురుషోత్తం భట్. వీరికి ఇద్దరు పిల్లలు. ఆదిలాబాద్కు చెందిన ఈ కుటుంబమంతా మార్షల్ ఆర్ట్స్ తైక్వాండో విద్యను రెండు నెలల నుంచి నేర్చుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రెండేసి గంటలు మహావీర్ పార్కులో సాధన చేస్తున్నారు. మరో పదిమంది మహిళలను ప్రోత్సహించి ఈ శిక్షణ తరగతుల్లో చేర్పించారు. ఒంటరిగా ఎక్కడికెళ్లినా, ఏ ఊరికెళ్లినా విపత్కర పరిస్థితుల్లో ఎవరో వస్తారని, సహాయం చేస్తారని ఎదురు చూడకుండా తమను తాము రక్షించుకునే ఉద్దేశంతోనే ఈ ఆత్మరక్షణ విద్య నేర్చుకుంటున్నానని చెబుతున్నారు. రోజూ సాధనతో ఆత్మవిశ్వాసం రెట్టింపైందని, రోజంతా ఉత్సాహంగా ఉంటున్నానంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్సాహంగా పాఠశాల స్థాయి ఈత పోటీలు
[ 29-04-2024]
జిల్లా కేంద్రంలోని ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్లో సోమవారం సాయంత్రం నిర్వహించిన పాఠశాల స్థాయి ఈత పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తాం
[ 29-04-2024]
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పలరాలో సోమవారం సాయంత్రం మంత్రి సీతక్క ఎంపీ అభ్యర్థి సుగుణ తరఫున ప్రచారం నిర్వహించారు. -
విద్యుత్ స్తంభం పైనుంచి పడి జేఎల్ఎం దుర్మరణం
[ 29-04-2024]
విద్యుత్తు స్తంభం పైనుంచి కింద పడి జూనియర్ లైన్మెన్ దుర్మరణం చెందిన సంఘటన అదిలాబాద్ పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. -
సదస్సుపై దాడికి పాల్పడటం ఉన్మాద చర్య
[ 29-04-2024]
కవులు, రచయితలను, ప్రజాస్వామ్యాదులపై దాడికి పూనుకోవటం ఉన్మాదా చర్యని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా) కార్యదర్శి వర్గ సభ్యులు అన్నారు. -
మే డే గోడ ప్రతులను ఆవిష్కరించిన ఏఐటీయూసీ నేతలు
[ 29-04-2024]
జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో సోమవారం ఏఐటీయూసీ నేతలు ప్రపంచ కార్మిక దినోత్సవానికి సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. -
ఫ్లెక్సీల ఏర్పాటుపై ఫిర్యాదు
[ 29-04-2024]
ఆదిలాబాద్ పట్టణంలో ఆదివారం రాత్రి ఒక పార్టీకి వ్యతిరేకంగా నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులకు భాజపా నాయకులు సోమవారం ఫిర్యాదు చేశారు. -
కార్మికుల హక్కుల సాధనకు మతోన్మాదులను ఓడించాలి
[ 29-04-2024]
కార్మికుల హక్కులను కాలరాసే యత్నాలు చేస్తున్న మతోన్మాద పార్టీలను ఓడించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ పిలుపునిచ్చారు. -
రిమ్స్ లాండ్రీకి నీటి కొరత
[ 29-04-2024]
రిమ్స్లోని లాండ్రీకి నీటి కొరత సమస్య ఏర్పడింది. -
ఘనంగా అంతర్జాతీయ నృత్య దినోత్సవం
[ 29-04-2024]
జిల్లా కేంద్రంలో సోమవారం బాలకేంద్రం, నృత్య శిక్షణ కేంద్రాలు, డ్యాన్స్ అకాడమీల్లో అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. -
గంగపుత్ర శివాలయంలో మహా అన్నదానం
[ 29-04-2024]
జిల్లా కేంద్రంలోని గంగపుత్ర శివాలయంలో సోమవారం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
వంతెనలు లేక.. చింతలు తీరక
[ 29-04-2024]
వర్షంవస్తే ఆదిలాబాద్ జిల్లాలో నేటికీ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండే వందలాది గ్రామాలున్నాయి. అక్కడ పురిటి నొప్పులతో సకాలంలో ఆసుపత్రులకు వెళ్లలేక మృత్యువాత పడుతున్న తల్లుల వేదన పట్టించుకునే వారు కరవయ్యారు. -
గొలుసుకట్టు.. అంతా కనికట్టు
[ 29-04-2024]
మీకు స్మార్ట్ఫోన్ ఉంటే చాలు.. రోజుకు రూ.5 వేలు మొదలుకొని నెలకు రూ.లక్షపైనే ఆదాయం పొందవచ్చని నమ్మబలికింది ఓ విదేశీ ఆన్లైన్ కంపెనీ. సంప్రదింపులు లేకుండా చాటింగ్ ద్వారా లావాదేవీలు నడిపి పెద్ద ఎత్తున యువకులు పెట్టుబడి పెట్టేలా ఎరవేసింది. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 29-04-2024]
ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వాడకం పెరిగిపోవడంతో గృహజ్యోతి కింద జీరో బిల్లులు పొందే వారి సంఖ్య తగ్గిపోయింది. ప్రభుత్వ నిబంధనల మేరకు 200 యూనిట్ల లోపు వినియోగించుకునే వారికి జీరో బిల్లు ఇస్తారు. -
ఎన్నికల వేళ.. గొలుసు దుకాణాల గోల
[ 29-04-2024]
‘లోక్సభ ఎన్నికల కోడ్ అమలులో వచ్చిన సందర్భంగా గంజాయి అక్రమ రవాణా, మద్యం గొలుసుదుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇందుకు సంబంధించిన వ్యక్తులపై కేసులు నమోదు చేస్తాం. -
తాళం వేసుందా.. సొమ్ము గోవిందా
[ 29-04-2024]
జిల్లాలో తాళం వేసిన ఇళ్లు, దుకాణాలే లక్ష్యంగా చోరీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో చాలామంది విహారయాత్రలు, ప్రముఖ దేవాలయాలు, బంధువుల ఇళ్లకు వెళ్తుంటారు. -
పురిటిలోనే బిడ్డ.. వైద్యం అందక తల్లి మృతి
[ 29-04-2024]
కాగజ్నగర్ పట్టణం పెట్రోల్బంకు ఏరియాలోని ఓ ప్రైవేటు ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుందని బాధిత బంధువులు ఆదివారం రాత్రి ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు. -
ఓటు మీది.. అభివృద్ధి మాది
[ 29-04-2024]
పదేళ్లలో కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో భారాస చేసిందేమి లేదని, కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
తాగునీటి కష్టాలు మొదలు..
[ 29-04-2024]
గత నెల రోజులుగా ఎండ తీవ్రత పెరగడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. మంచిర్యాల పట్టణ ప్రజలకు తాగునీరు సరఫరా చేయడానికి గోదావరినదిలో నిర్మించిన ఇన్టేక్వెల్స్ వద్ద నీటిమట్టం ఇప్పటికే తగ్గిపోయింది. -
కళాశాలలు డీలా.. గురుకులాలు భళా
[ 29-04-2024]
ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలలు నిరాశపరిచాయి. ప్రైవేట్కు దీటుగా గురుకులాలు ఉత్తీర్ణత శాతం సాధించాయి. రాష్ట్రస్థాయిలో ఈ ఏడాది 46.29 శాతంతో ప్రథమంలో 32వ స్థానం, 59.53 శాతంతో ద్వితీయంలో 30వ స్థానాల్లో మంచిర్యాల నిలిచింది. -
పోలింగ్ చీటీ.. ఓటరు దిక్సూచీ
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం అన్నీ సిద్ధం చేస్తోంది. ఓటర్లు అందరూ స్వేచ్ఛాయుతంగా ఓటువేసేందుకు సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టిన ఎన్నికల సంఘం ఓటర్లకు పోలింగ్ చీటీలు పంపిణీ చేస్తోంది. -
ఎన్నికలకు సమాయత్తం
[ 29-04-2024]
ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని జిల్లాలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల సమరానికి జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జిల్లా పాలనాధికారి అశిష్ సంగ్వాన్ నేతృత్వంలో ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. -
ఓటు... మరింత చేరువ!
[ 29-04-2024]
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో అనేక గ్రామాల్లో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం కుదిరేది కాదు. ఆయా గ్రామాల ప్రజలు ఓట్లు వేయాలంటే కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. -
పరిమితి మించితే చిక్కులే..
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణలో కీలక ఘట్టమైన నామపత్రాల స్వీకరణపర్వం పూర్తయింది. పెద్దపల్లి, ఆదిలాబాద్ లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇతర అభ్యర్థులు నామపత్రాలను దాఖలు చేశారు. -
16 శాతం రాకుంటే డిపాజిట్ గల్లంతే..
[ 29-04-2024]
ఎన్నికల్లో పోటీచేసిన పలువురు అభ్యర్థులు ఫలితాలు వెలువడిన తర్వాత డిపాజిట్లు కోల్పోయారనే మాటలు తరచూ వింటాం.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎన్నికల సంఘం నిర్ణయించిన రుసుమును సంబంధిత ఆర్వో వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. -
57 మంది అధ్యాపకులకు నోటీసులు
[ 29-04-2024]
ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడంపై ఇంటర్మీడియట్ విద్యాశాఖ దృష్టి సారించింది. జిల్లాలోని 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జనరల్, వొకేషనల్ విభాగంలో ప్రథమ సంవత్సరంలో 29.28 శాతం,
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు