ఉద్యోగులపై ఈసీ కన్ను..
పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. రాజకీయ పార్టీలు ప్రచారం ప్రారంభించాయి. ఉమ్మడి ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల్లో అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో వారంతా సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూనే ఓటర్లను కలుస్తున్నారు.
నియమావళి ఉల్లంఘిస్తే కొలువుకు ఎసరే..
పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. రాజకీయ పార్టీలు ప్రచారం ప్రారంభించాయి. ఉమ్మడి ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల్లో అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో వారంతా సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూనే ఓటర్లను కలుస్తున్నారు. ఈ నెల 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ తరుణంలో ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కొలువులకే ఎసరు వస్తుందని గుర్తుంచుకోవాలి.
న్యూస్టుడే, చెన్నూరు
సార్వత్రిక పోరు నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. అధికారాలు ఎన్నికల సంఘానికి బదిలీ అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులకే పరిమితం కావాలి తప్ప ఏ రాజకీయ పక్షానికి కొమ్ముకాయడం తగదని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిరంతర నిఘా సహా ఫేస్బుక్, వాట్సాప్ పోస్టులపై ఓ కన్నేసి ఉంచారు. త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో నాయకులు ఎలా ప్రచారం చేసుకున్నా, ఎలాంటి వ్యాఖ్యలు చేసినా కలిగే ఫలితం కన్నా ప్రభుత్వ ఉద్యోగులు చేసే ప్రచారం, వారి వ్యవహారశైలి మాత్రం పెద్ద చిక్కులు తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. వీరు ఆయా పార్టీలకు అనుకూలంగా లేదా ప్రతికూలంగా వ్యవహరించే సన్నివేశాన్ని దృశ్య రూపకంగా లేదా శ్రవణరూపకం (వీడియో, ఆడియో) ద్వారా ఎవరైనా చిత్రీకరించి ఎన్నికల సంఘానికి, యంత్రాంగానికి పంపినా, ప్రచార మాధ్యమాలు ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపులలో పోస్టు చేసినా అంతే సంగతులని ఇటీవలి ఉదంతాలు తెలుపుతున్నాయి.
హద్దుమీరితే అంతే సంగతులు
ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీలకు ప్రచారం చేయరాదనే నిబంధనలు 1949 సెప్టెంబరు 17వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు వివిధ కార్పొరేషన్, ప్రభుత్వరంగ సంస్థల్లో పని చేసే అన్ని స్థాయిలు, కేటగిరీల ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో పారదర్శకంగా వ్యవహరించాలి. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి అధికారి ఉద్యోగి తనవంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి.
ఇటీవలి ఘటనలు..
- ఈ నెల 7న సిద్దిపేటలో ఉపాధిహామీ, సెర్ప్ విభాగాలకు చెందిన పొరుగు సేవల సిబ్బందితో మెదక్ భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించగా పలువురిపై కేసులు నమోదయ్యాయి. సమావేశంలో పాల్గొన్న 106 మందిపై సస్పెన్షన్ వేటు పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనంగా మారింది. ఉపాధిహామీ విభాగానికి చెందిన 68 మంది, సెర్ఫ్ పరిధిలో 38 మంది విధులకు తాత్కాలికంగా దూరమయ్యారు.
- గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నస్పూరు మున్సిపాలిటీ కృష్ణ కాలనీలోని పల్లె దవాఖానాలో విధులు నిర్వర్తిస్తున్న ఆశా కార్యకర్త ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించి ఓ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నట్లు సామాజిక మాధ్యమాల్లో కనిపించడంతో ఎన్నికల అధికారులు ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు.
సామాజిక మాధ్యమాలపై..
సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, మీడియాలో వచ్చే వార్తలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా మీడియా మానిటరింగ్ బృందాన్ని అన్ని జిల్లాల కలెక్టరేట్లలో ఏర్పాటు చేశారు. ఉద్యోగులు వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్, ఎక్స్ ఖాతాల్లో రాజకీయ పార్టీలకు అనుకూలంగా, ప్రతికూలంగా పోస్టులు పెడితే మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటారు. సామాజిక మధ్యమాల ఖాతాలపై ఈసీ ప్రత్యేకంగా దృష్టిసారించింది.
తప్పించుకోలేకుండా నిఘా
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వీడియో సర్వేలెన్స్, స్టాటిస్టికల్ సర్వేలెన్స్ బృందాల నియామక ప్రక్రియ పూర్తవగా సభ్యులు ఇప్పటికే నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సంబంధించిన సభలు, సమావేశాలను అధికారులు చిత్రీకరిస్తున్నారు. వీటిని ప్రత్యేకబృందం వీక్షిస్తోంది. ఉద్యోగులు పాల్గొన్నట్లు దృష్టికి వచ్చినా, ఎవరి నుంచైనా ఫిర్యాదువచ్చినా సంజాయిషీ నోటీసు జారీ చేస్తారు. ఉల్లంఘించినట్లు తేలితే సస్పెన్షన్ వేటు వేస్తారు.
ఇదీ తప్పే..
- ప్రత్యక్షంగాకానీ పరోక్షంగాకానీ ఒక అభ్యర్థికి సహకరిస్తున్నారనే చిన్నపాటి ఆధారాలు దొరికినా వేటు పడుతుంది.
- తనకింది స్థాయి సిబ్బందిని అధికార దర్పంతో ఒక పార్టీకి సహకరించాలని, ఫలానా పార్టీకి ఓటేయాలని చెప్పకూడదు.
- ముఖ్యంగా ప్రచార సభల్లో పాల్గొనడం, తమ కులం నేత అని ప్రచారం చేయడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తారు.
- ప్రభుత్వ ఉద్యోగులు ఫేస్బుక్ లేదా వాట్సప్ గ్రూపులలో రాజకీయ పార్టీలకు అనుకూలంగా లేదా ప్రతికూలంగా పోస్టులు నమోదు చేసినా కఠినమైన చర్యలకు సిద్ధంగా ఉండాల్సిందే..
- వారి సొంత ఊళ్లలోనూ కండువా వేసుకుని ప్రచారం చేయడం లేదా రెచ్చగొట్టే విధంగా మాట్లాడటంలాంటివి చేయొద్దు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్సాహంగా పాఠశాల స్థాయి ఈత పోటీలు
[ 29-04-2024]
జిల్లా కేంద్రంలోని ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్లో సోమవారం సాయంత్రం నిర్వహించిన పాఠశాల స్థాయి ఈత పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తాం
[ 29-04-2024]
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పలరాలో సోమవారం సాయంత్రం మంత్రి సీతక్క ఎంపీ అభ్యర్థి సుగుణ తరఫున ప్రచారం నిర్వహించారు. -
విద్యుత్ స్తంభం పైనుంచి పడి జేఎల్ఎం దుర్మరణం
[ 29-04-2024]
విద్యుత్తు స్తంభం పైనుంచి కింద పడి జూనియర్ లైన్మెన్ దుర్మరణం చెందిన సంఘటన అదిలాబాద్ పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. -
సదస్సుపై దాడికి పాల్పడటం ఉన్మాద చర్య
[ 29-04-2024]
కవులు, రచయితలను, ప్రజాస్వామ్యాదులపై దాడికి పూనుకోవటం ఉన్మాదా చర్యని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా) కార్యదర్శి వర్గ సభ్యులు అన్నారు. -
మే డే గోడ ప్రతులను ఆవిష్కరించిన ఏఐటీయూసీ నేతలు
[ 29-04-2024]
జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో సోమవారం ఏఐటీయూసీ నేతలు ప్రపంచ కార్మిక దినోత్సవానికి సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. -
ఫ్లెక్సీల ఏర్పాటుపై ఫిర్యాదు
[ 29-04-2024]
ఆదిలాబాద్ పట్టణంలో ఆదివారం రాత్రి ఒక పార్టీకి వ్యతిరేకంగా నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులకు భాజపా నాయకులు సోమవారం ఫిర్యాదు చేశారు. -
కార్మికుల హక్కుల సాధనకు మతోన్మాదులను ఓడించాలి
[ 29-04-2024]
కార్మికుల హక్కులను కాలరాసే యత్నాలు చేస్తున్న మతోన్మాద పార్టీలను ఓడించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ పిలుపునిచ్చారు. -
రిమ్స్ లాండ్రీకి నీటి కొరత
[ 29-04-2024]
రిమ్స్లోని లాండ్రీకి నీటి కొరత సమస్య ఏర్పడింది. -
ఘనంగా అంతర్జాతీయ నృత్య దినోత్సవం
[ 29-04-2024]
జిల్లా కేంద్రంలో సోమవారం బాలకేంద్రం, నృత్య శిక్షణ కేంద్రాలు, డ్యాన్స్ అకాడమీల్లో అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. -
గంగపుత్ర శివాలయంలో మహా అన్నదానం
[ 29-04-2024]
జిల్లా కేంద్రంలోని గంగపుత్ర శివాలయంలో సోమవారం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
వంతెనలు లేక.. చింతలు తీరక
[ 29-04-2024]
వర్షంవస్తే ఆదిలాబాద్ జిల్లాలో నేటికీ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండే వందలాది గ్రామాలున్నాయి. అక్కడ పురిటి నొప్పులతో సకాలంలో ఆసుపత్రులకు వెళ్లలేక మృత్యువాత పడుతున్న తల్లుల వేదన పట్టించుకునే వారు కరవయ్యారు. -
గొలుసుకట్టు.. అంతా కనికట్టు
[ 29-04-2024]
మీకు స్మార్ట్ఫోన్ ఉంటే చాలు.. రోజుకు రూ.5 వేలు మొదలుకొని నెలకు రూ.లక్షపైనే ఆదాయం పొందవచ్చని నమ్మబలికింది ఓ విదేశీ ఆన్లైన్ కంపెనీ. సంప్రదింపులు లేకుండా చాటింగ్ ద్వారా లావాదేవీలు నడిపి పెద్ద ఎత్తున యువకులు పెట్టుబడి పెట్టేలా ఎరవేసింది. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 29-04-2024]
ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వాడకం పెరిగిపోవడంతో గృహజ్యోతి కింద జీరో బిల్లులు పొందే వారి సంఖ్య తగ్గిపోయింది. ప్రభుత్వ నిబంధనల మేరకు 200 యూనిట్ల లోపు వినియోగించుకునే వారికి జీరో బిల్లు ఇస్తారు. -
ఎన్నికల వేళ.. గొలుసు దుకాణాల గోల
[ 29-04-2024]
‘లోక్సభ ఎన్నికల కోడ్ అమలులో వచ్చిన సందర్భంగా గంజాయి అక్రమ రవాణా, మద్యం గొలుసుదుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇందుకు సంబంధించిన వ్యక్తులపై కేసులు నమోదు చేస్తాం. -
తాళం వేసుందా.. సొమ్ము గోవిందా
[ 29-04-2024]
జిల్లాలో తాళం వేసిన ఇళ్లు, దుకాణాలే లక్ష్యంగా చోరీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో చాలామంది విహారయాత్రలు, ప్రముఖ దేవాలయాలు, బంధువుల ఇళ్లకు వెళ్తుంటారు. -
పురిటిలోనే బిడ్డ.. వైద్యం అందక తల్లి మృతి
[ 29-04-2024]
కాగజ్నగర్ పట్టణం పెట్రోల్బంకు ఏరియాలోని ఓ ప్రైవేటు ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుందని బాధిత బంధువులు ఆదివారం రాత్రి ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు. -
ఓటు మీది.. అభివృద్ధి మాది
[ 29-04-2024]
పదేళ్లలో కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో భారాస చేసిందేమి లేదని, కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
తాగునీటి కష్టాలు మొదలు..
[ 29-04-2024]
గత నెల రోజులుగా ఎండ తీవ్రత పెరగడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. మంచిర్యాల పట్టణ ప్రజలకు తాగునీరు సరఫరా చేయడానికి గోదావరినదిలో నిర్మించిన ఇన్టేక్వెల్స్ వద్ద నీటిమట్టం ఇప్పటికే తగ్గిపోయింది. -
కళాశాలలు డీలా.. గురుకులాలు భళా
[ 29-04-2024]
ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలలు నిరాశపరిచాయి. ప్రైవేట్కు దీటుగా గురుకులాలు ఉత్తీర్ణత శాతం సాధించాయి. రాష్ట్రస్థాయిలో ఈ ఏడాది 46.29 శాతంతో ప్రథమంలో 32వ స్థానం, 59.53 శాతంతో ద్వితీయంలో 30వ స్థానాల్లో మంచిర్యాల నిలిచింది. -
పోలింగ్ చీటీ.. ఓటరు దిక్సూచీ
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం అన్నీ సిద్ధం చేస్తోంది. ఓటర్లు అందరూ స్వేచ్ఛాయుతంగా ఓటువేసేందుకు సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టిన ఎన్నికల సంఘం ఓటర్లకు పోలింగ్ చీటీలు పంపిణీ చేస్తోంది. -
ఎన్నికలకు సమాయత్తం
[ 29-04-2024]
ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని జిల్లాలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల సమరానికి జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జిల్లా పాలనాధికారి అశిష్ సంగ్వాన్ నేతృత్వంలో ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. -
ఓటు... మరింత చేరువ!
[ 29-04-2024]
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో అనేక గ్రామాల్లో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం కుదిరేది కాదు. ఆయా గ్రామాల ప్రజలు ఓట్లు వేయాలంటే కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. -
పరిమితి మించితే చిక్కులే..
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణలో కీలక ఘట్టమైన నామపత్రాల స్వీకరణపర్వం పూర్తయింది. పెద్దపల్లి, ఆదిలాబాద్ లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇతర అభ్యర్థులు నామపత్రాలను దాఖలు చేశారు. -
16 శాతం రాకుంటే డిపాజిట్ గల్లంతే..
[ 29-04-2024]
ఎన్నికల్లో పోటీచేసిన పలువురు అభ్యర్థులు ఫలితాలు వెలువడిన తర్వాత డిపాజిట్లు కోల్పోయారనే మాటలు తరచూ వింటాం.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎన్నికల సంఘం నిర్ణయించిన రుసుమును సంబంధిత ఆర్వో వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. -
57 మంది అధ్యాపకులకు నోటీసులు
[ 29-04-2024]
ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడంపై ఇంటర్మీడియట్ విద్యాశాఖ దృష్టి సారించింది. జిల్లాలోని 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జనరల్, వొకేషనల్ విభాగంలో ప్రథమ సంవత్సరంలో 29.28 శాతం,
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు