logo

క్రీడా ప్రాంగణంలో భారాస ఎంపీ అభ్యర్థి ప్రచారం

ఆదిలాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు సోమవారం పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణాన్ని సందర్శించారు.

Published : 15 Apr 2024 11:08 IST

ఆదిలాబాద్ క్రీడావిభాగం: ఆదిలాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు సోమవారం పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణాన్ని సందర్శించారు. ఉదయపు నడక సాధకులతో ముచ్చటించారు. గాంధీ పార్కులోని ఓపెన్ జిమ్ లో, క్రీడా ప్రాధికారిక సంస్థ కార్యాలయంలోని ఇండోర్ స్టేడియంలో ఉన్న జిమ్ లో కసరత్తు చేశారు. ఈతకొలనులో  సాధకులతో మాట్లాడారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఆయన వెంట భారాస నాయకులు తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని