logo

శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే శంకర్

జిల్లా కేంద్రంలోని  రాంనగర్ కాలనీలో   శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి శివాలయంలో సోమవారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రత్యేక పూజలు చేశారు.

Published : 15 Apr 2024 11:33 IST

ఆదిలాబాద్ సాంస్కృతికం: జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో  శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి శివాలయంలో సోమవారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన కార్యకర్తలతో కలిసి రాంనగర్ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.  రానున్న  లోక్ సభ ఎన్నికల్లో  కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ ను గెలిపించాలని  ఓటర్లను అభ్యర్థించారు. ఇంటింటికి భాజపా  కరపత్రాలు పంపిణీ చేశారు. ఆయన వెంట  భాజపా నాయకులు భీమ్సేన్ రెడ్డి,  లాలామున్న, మయూర్ తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని