logo

తాంసిలో జొన్న కొనుగోలు ప్రారంభం

ఆదిలాబాద్ జిల్లా తాంసి వ్యవసాయ ఉప మార్కెట్ యార్డులో  మార్క్ ఫెడ్, తాంసి సహకార సంఘం ఆధ్వర్యంలో సోమవారం జొన్న కొనుగోలు ప్రారంభించారు.

Published : 15 Apr 2024 11:49 IST

తాంసి : ఆదిలాబాద్ జిల్లా తాంసి వ్యవసాయ ఉప మార్కెట్ యార్డులో  మార్క్ ఫెడ్, తాంసి సహకార సంఘం ఆధ్వర్యంలో సోమవారం జొన్న కొనుగోలు ప్రారంభించారు. జొన్న  మద్దతు ధర  క్వింటాకు రూ.3180 చొప్పున  రైతులు  ప్రభుత్వ రంగ సంస్థలకు విక్రయించాలని సీఈవో కేశవ్ కోరారు. తేమ, తుక్కు లేకుండా పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ సుప్రియ, మార్కెట్ శాఖ అధికారి అజీమ్, కార్యదర్శి గణేష్, సిద్ధూ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని