logo

బైక్‌ను ఢీకొట్టిన కంటైనర్‌.. వ్యక్తి దుర్మరణం

ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని మావల బైపాస్ చౌరస్తా వద్ద ద్విచక్రవాహనాన్ని  కంటైనర్ ఢీకొట్టింది.

Published : 15 Apr 2024 12:14 IST

ఎదులాపురం : ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని మావల బైపాస్ చౌరస్తా వద్ద ద్విచక్రవాహనాన్ని  కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో  ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందాడు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  పట్టణానికి చెందిన లచ్చన్న(40) అనే  వ్యక్తి ద్విచక్ర వాహనంపై  ఆదిలాబాద్‌కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో పట్టణ సమీపంలోని  మావల బైపాస్ చౌరస్తా వద్ద ద్విచక్రవాహనం మలుపు తిరుగుతుండగా కంటైనర్ ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న లచ్చన్న  అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా ద్విచక్ర వాహనం కంటైనర్‌కు ఇరుక్కుంది.  సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని