అడిగేదెవరు.. అడ్డంగా తవ్వేద్దాం..!
ఇసుక తవ్వాలంటే అనుమతి ఉండాలి.. అది కూడా నిబంధనల మేరకే తవ్వకాలు చేపట్టాలి. అక్రమార్కులకు అవేమీ పట్టవు.
పట్టా భూముల్లో ఇసుక అక్రమ తవ్వకాలు
ఎన్నికల కోడ్ ఉన్నా లెక్కచేయని మాఫియా
న్యూస్టుడే, తోట్లవల్లూరు
రొయ్యూరు క్వారీలో లోడింగ్ చేస్తున్న జేసీబీ
ఇసుక తవ్వాలంటే అనుమతి ఉండాలి.. అది కూడా నిబంధనల మేరకే తవ్వకాలు చేపట్టాలి. అక్రమార్కులకు అవేమీ పట్టవు. అంగబలం, అర్ధబలంతో రెచ్చిపోతున్నారు. నదిలో రోడ్డేసి... నిబంధనలు తుంగలో తొక్కి కనిపించినంత దూరం ఇష్టమొచ్చినంతలోతులో ఇసుక తవ్వేస్తున్నారు. ఇంత అరాచకం కొనసాగుతున్నా జిల్లా యంత్రాగానికి ఏ మాత్రం కానరావడం లేదు. ఆదివారం తెల్లవారుజామున రొయ్యూరు క్వారీలో ఇసుక అక్రమ తవ్వకాలు చేస్తుండగా బందెల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామస్థులు అడ్డుకున్నారు. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో రొయ్యూరు క్వారీలో అర్ధరాత్రుళ్లు అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయని, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం పట్టించుకోవడం లేదని కోటేశ్వరరావు ఆరోపించారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో రొయ్యూరు క్వారీ పరిధిలోని పట్టా భూముల్లో ఒక పొక్లెయిన్, మూడు లారీలు ఇసుక లోడింగ్ చేస్తుంటే స్థానికులతో కలిసి అడ్డుకున్నామని తెలిపారు. అక్కడికి వెళ్లేసరికే స్థానిక వీఆర్వో, పోలీసులు ఉన్నారని తెలిపారు. అక్రమంగా ఇసుక తవ్వకుపోతున్నారని అడ్డుకోగా వీఆర్వో, పోలీసులు లారీలను తహసీల్దార్ కార్యాలాయనికి తరలిస్తామని మమ్మల్ని నమ్మించి లారీలను వదిలి పెట్టారని ఆరోపించారు. అక్రమ తవ్వకాల్ని అడ్డుకోవాల్సిన అధికారులే ఇలా చేస్తే ఈ దందాను ఎవరు అరికడతారని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాలపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తామన్నారు.
వైకాపా నాయకుల మట్టి దందా
గుడివాడ గ్రామీణం, న్యూస్టుడే: అధికారం ఉండగానే ఆర్జించాలనే లక్ష్యంతో వైకాపా నాయకులు హడావుడిగా అర్ధరాత్రి గ్రామాల్లో అక్రమంగా మట్టి తవ్వి అమ్మేసుకుంటున్నారు. కరిమెర్ల, మోటూరు గ్రామాల్లోని వైకాపా నాయకులు దగ్గర్లోని గ్రామాల్లో మట్టిని అనుమతులు లేకుండా తవ్వకాలు చేసి ట్రాక్టర్లు, టిప్పర్లతో తరలించేస్తూ ప్రైవేటు స్థలాల మెరకలకు, ఇతర వ్యాపారాలకు మట్టిని అమ్మేస్తున్నారు. కరిమెర్లలో మట్టిని తవ్వి చౌటపల్లి గ్రామానికి తరలించేస్తున్నారు. రోజూ అర్ధరాత్రి నుంచి తెల్లవారేలోగా ఈ దందా ముగించేస్తున్నారు. 10 రోజులుగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి.
మోటూరులో కూడా వారం రోజులుగా ఇద్దరు వైకాపా నాయకులు అక్రమంగా మట్టిని తవ్వి అర్ధరాత్రి పూట టిప్పర్ల ద్వారా తరలించేస్తున్నారు. అధికారులు సైతం చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. గ్రామస్థాయి నాయకుడు ఒకరు, మండల స్థాయి యువనాయకుడు ఒకరు యథేచ్ఛగా మట్టిని తవ్వి తరిలించేస్తున్నారు. దీనిపై గుడివాడ తహసీల్దారు ఏవీ రామాంజనేయులు మట్లాడుతూ మట్టి తవ్వకాలకు అనుమతులు ఇవ్వలేదన్నారు. అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకుంటామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సచివాలయానికి వెళ్లలేని వారు.. బ్యాంకుకు ఎలా వెళ్తారు?: వర్ల
[ 29-04-2024]
వెయ్యి మంది ఏపీ పోలీసులు మహారాష్ట్రలో ఎన్నికల విధులకు వెళ్లారని, వారికి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య కోరారు. -
తెదేపాను గెలిపించాలని ఘంటసాలలో ఎన్నారైల ఎన్నికల ప్రచారం
[ 29-04-2024]
అవనిగడ్డ నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్, మచిలీపట్నం ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరీలను గెలిపించాలని కోరుతూ ఘంటసాలకు చెందిన ప్రవాస భారతీయులు గొర్రెపాటి రంగనాథ బాబు, మూల్పూరి వెంకట్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఏపీ ఎన్నికలు.. రేపే తెదేపా-భాజపా-జనసేన కూటమి మ్యానిఫెస్టో
[ 29-04-2024]
ఏపీ ఎన్నికల (Andhra Pradesh Assembly Elections)కు తెదేపా-భాజపా-జనసేన కూటమి మ్యానిఫెస్టోను మంగళవారం విడుదల చేయనుంది. -
నందిగామలో ఉమ్మడి అభ్యర్థి ఎన్నికల ప్రచారం
[ 29-04-2024]
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం నందిగామ మండలంలోని రుద్రవరం, సోమవరం గ్రామాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తెదేపా, భాజపా, జనసేన పార్టీల నాయకులతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
తండ్రి హయాం నుంచి డబ్బు రుచి మరిగిన వ్యక్తి జగన్: బొండా ఉమా
[ 29-04-2024]
రాష్ట్ర సంపదను దోచుకోవడమే వైకాపా పనిగా పెట్టుకుందని తెదేపా నేత బొండా ఉమా విమర్శించారు. -
అధికారం నీడలో.. అరాచక లాఠీ!
[ 29-04-2024]
ప్రజాస్వామ్యమంటే గౌరవం లేదు. ప్రజలు కట్టిన పన్నుల నుంచే జీతభత్యాలు పొందుతున్నామన్న ధ్యాస లేదు. చట్టాన్ని త్రికరణశుద్ధిగా అమలు చేస్తామని, బాధితులకు బాసటగా నిలుస్తామని చేసిన ప్రమాణాలనే తూచ్ అనేశామన్న బాధే లేదు. -
పట్టాల పేరుతో కోట్లు కొట్టేశారు!
[ 29-04-2024]
జగన్ జమానాలో అవినీతి, అక్రమాల ఆక్టోపస్లు దశదిశలా వేళ్లూనుకుపోయాయి. నేతలు.. కొంతమంది అధికారులు కుమ్మక్కై ప్రజాధనాన్ని నిలువునా దోచేశారు. సెంటు పట్టా పేరుతో భారీ కుంభకోణానికి తెర తీసి రూ. కోట్లు వెనకేసుకున్నారు. -
బ్యాంకు ఖాతాలకే పింఛను సొమ్ము జమ
[ 29-04-2024]
ఏప్రిల్ నెలకు సంబంధించిన సామాజిక పింఛన్ల నగదు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకే జమ చేయనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. -
6న అవనిగడ్డకు పవన్ కల్యాణ్
[ 29-04-2024]
ఎంపీ వల్లభనేని బాలశౌరి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్తో కలిసి ఆదివారం వేకనూరు వంతెన కూడలిలోని అభయాంజనేయస్వామిని దర్శించుకొని పూజలు చేశారు. -
భారీగా బంగారం.. వెండి పట్టివేత
[ 29-04-2024]
సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీగా బంగారం, వెండి దొరికిన సంఘటన కంచికచర్ల మండలం పేరకలపాడు సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. -
బుద్ధవిహార్కు వైకాపా గ్రహణం
[ 29-04-2024]
ప్రాచీన చరిత్ర కలిగిన ఘంటసాలలో ఏపీ పర్యాటక శాఖ ద్వారా 2017లో బుద్ధ విహార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పటి కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొదటి విడతగా రూ.1.5 కోట్లు మంజూరు చేయగా రెండంగస్తుల భవన నిర్మాణం చేపట్టారు. -
కూడూరులో కాగితకు మద్దతు
[ 29-04-2024]
వైకాపా అభ్యర్థి ఉప్పాల రమేష్(రాము) సొంత పంచాయతీ కూడూరులో తెదేపా అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. -
అభివృద్ధే ఆకాంక్ష..ఆశీర్వదించండి: కొల్లు
[ 29-04-2024]
బందరు అభివృద్ధే తమ ఆకాంక్ష అని..నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు. నగరంలోని 4, 5 డివిజన్లతో పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. -
ఏకోపాధ్యాయులతో ఎదిగేదెట్టా?
[ 29-04-2024]
ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చేస్తానని, ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులుండేలా చర్యలు తీసుకుంటానని జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సంకల్పయాత్రలో హామీ ఇచ్చారు. -
కదిలితే కేసు.. మెదిలితే నోటీసు
[ 29-04-2024]
ఇలా పదే పదే గొప్పలు చెప్పిన వారి మాటలు సత్యదూరాలే అన్న విషయం కళ్లెదుటే కన్పిస్తోంది. వైకాపా ప్రభుత్వం వచ్చాక గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను అక్రమ కేసులతో అణిచివేసే విష సంస్కృతికి తెరతీశారన్న ఆరోపణలకు ఎన్నో ఉదాహరణలున్నాయి. -
వీరి గోడు పట్టించుకునేదెవరు..?
[ 29-04-2024]
నగరంలోని ఏ డివిజన్కు వెళ్లినా సమస్యలే కనిపిస్తున్నాయి. బందరుకోట ప్రధాన డ్రెయిన్ గుర్రపుడెక్కతో మేట వేసుకుపోవడంతో స్థానికులతో పాటు వివిధ డివిజన్లకు చెందిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
‘జగన్ వస్తే అవస్థలు తప్పవు..’
[ 29-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అవస్థలు తప్పవని, ప్రజలంతా కూటమిని గెలిపించాలని నిర్ణయం తీసేసుకున్నారని పెడన తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. -
తెదేపాలో చేరిన వైకాపా నాయకులు
[ 29-04-2024]
పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని తెదేపా మండల అధ్యక్షుడు పోతన లక్ష్మీనరసింహస్వామి అన్నారు. మండల పరిధిలోని పోసినవారిపాలెం గ్రామానికి చెందిన వైకాపా నాయకులు పలువురు ఆదివారం తెదేపాలో చేరారు. -
అమ్మకు కష్టం.. అందని వైద్యం
[ 29-04-2024]
వైద్యరంగాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి పర్చామని, గ్రామీణులకు కార్పొరేట్ వైద్యం అందేలా చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయని వైకాపా ప్రభుత్వం చేస్తోన్న ప్రచారానికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన కన్పించడం లేదు. -
అడుగేస్తే నిర్భంధం.. ప్రశ్నిస్తే కేసులు
[ 29-04-2024]
గుడివాడ, అవనిగడ్డ నియోజకవర్గాల్లో అయిదేళ్లుగా అధికార పార్టీ ఆగడాలకు అంతులేకుండా పోయింది. కళ్లముందే జరిగిన అన్యాయాన్ని ఎదిరించాలన్నా, ప్రశ్నించాలన్నా తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందోనని ప్రజలు భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. -
కార్మికుల కడుపుకొట్టి.. గుత్తేదార్లకు దోచిపెట్టి
[ 29-04-2024]
కార్మికులకు అండగా ఉంటానంటూ ఆశలు రేకెత్తించి గద్దె నెక్కిన జగన్ నదుల్లోని ఇసుకను యంత్రాలతో ఎగుమతికి ప్రోత్సహించి మూడున్నరేళ్లుగా వేలాది మంది కార్మికుల పొట్టగొట్టి గుత్తేదారులకు రూ.కోట్లు దోచిపెట్టారని లంకపల్లి, శ్రీకాకుళం, తోట్లవల్లూరు, శ్రీకాకుళం తదితర ఇసుక రేవుల్లో పనిచేసే కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వైకాపా మాటలు నమ్మి మోసపోవద్దు : వర్ల
[ 29-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆయన మాటలు నమ్మి మరోసారి ఎవరూ మోసపోవద్దని తెదేపా కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
అభివృద్ధికి బాటలు వేద్దాం రండి
[ 29-04-2024]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని కాలనీలను అభివృద్ధి పరిచేందుకు బాటలు వేద్దామని, అందరూ కలిసి రావాలని కూటమి విజయవాడ ఎంపీ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థులు కేశినేని శివనాథ్, సుజనా చౌదరిలు ప్రజలకు పిలుపునిచ్చారు. -
నాణ్యమైన విద్యకు భరోసా ఏది జగన్?
[ 29-04-2024]
సంస్కరణల్లో భాగంగా ఏకోపాధ్యాయ పాఠశాలలంటూ చిన్నారుల జీవితాలతో జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు