సంపాదన కాదు.. సమయం వెచ్చించండి
చిన్నారుల్లో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. తల్లిదండ్రులు, పిల్లల మధ్య మానసిక ఎడబాటు చోటు చేసుకుంటోంది. ఇలాంటి పరిస్థితులు ప్రారంభంలో ఫర్వాలేదనిపిస్తుండగా, కాలక్రమంలో కొందరిని వేధిస్తున్నాయి.
పెద్దల నుంచి పిల్లలకు కావాల్సిందదే అంటున్న నిపుణులు
బల్దియా ఆధ్వర్యంలో మానసిక ఆరోగ్య వారోత్సవాలు ప్రారంభం
ప్రచార పత్రాలను విడుదల చేస్తున్న మేయర్ విజయలక్ష్మి
ఈనాడు, హైదరాబాద్: చిన్నారుల్లో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. తల్లిదండ్రులు, పిల్లల మధ్య మానసిక ఎడబాటు చోటు చేసుకుంటోంది. ఇలాంటి పరిస్థితులు ప్రారంభంలో ఫర్వాలేదనిపిస్తుండగా, కాలక్రమంలో కొందరిని వేధిస్తున్నాయి. ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా ఈ అంశంపై హైదరాబాద్ మహానగరపాలక సంస్థ దృష్టిపెట్టింది. నగరంలోని మానసిక నిపుణులతో చర్చించి.. వారంపాటు ఉచిత మానసిక ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా పలువురు మానసిక నిపుణులు తమ గతానుభవాలను జీహెచ్ఎంసీతో పంచుకున్నారు. ఒత్తిడి అంటే అర్థం తెలియని వయసు వారు.. నేను డిప్రెషన్లో ఉన్నానంటూ తమను సంప్రదిస్తున్నారని, రాజధానిలో తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యే చిన్నారిలోకం విస్తృతమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
నిపుణులు ఏం చెప్పారంటే..
* పిల్లల మానసిక సమస్యలపై చదువుకున్న తల్లిదండ్రులకూ అవగాహన ఉండట్లేదు. తీరిక లేని జీవితం, సంపాదన, ఏం చేసినా పిల్లల కోసమేగా.. అనే ఆలోచనలతో.. చిన్న వయసు నుంచే పిల్లలను పని మనుషుల వద్దనో, డేకేర్ సెంటర్లలోనో చేర్చుతున్నారు. అలాంటి పిల్లల్లో మొండిపట్టు, తక్కువ మాట్లాడేవారు మానసిక సమస్యలకుగురవుతున్నారు.
* పిల్లలతో ఆడుకోవడం, సమయం కేటాయించడం వీలుపడక.. చాలా మంది చిన్నారుల చేతుల్లో స్మార్ట్ఫోన్లు పెడుతున్నారు. దానివల్ల నిద్ర పోవట్లేదు. కొన్ని రోజులకు చెప్పినమాట వినకపోవడం, చదవకపోవడం, ఇతర సమస్యలు తలెత్తుతున్నాయి.
* పక్కింటి పిల్లలతో, తోటి వయసు వారితో కలవనివ్వట్లేదు. అలాగని.. తల్లిదండ్రులు కూడా ఆడించరు. ఇలాంటి పరిస్థితులు పిల్లలకు ఆరోగ్యకరం కాదు. పిల్లలను స్వేచ్ఛగా, ఆహ్లాదకర వాతావరణంలో పెంచాలి.
* మానసిక సమస్యలు ఎదుర్కొనే బాలబాలికల్లో.. మరిన్ని వింతపోకడలు కనిపిస్తున్నాయి. వారికి ఆటలైనా, పాటలైనా ఫోన్లోనే. సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు తెరచి ఛాటింగ్ చేయడం, గుర్తుతెలియని వ్యక్తులతో స్నేహం చేయడం వంటివి చేస్తున్నారు. అతి కొద్ది మంది గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. డబ్బు, వాహనాలు, దుస్తులు, ఫోన్లు, ఇతర వస్తువుల కోసం తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేసేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది.
వారంపాటు అవగాహన కార్యక్రమాలు..
నగరవ్యాప్తంగా జీహెచ్ఎంసీ, సండోసి హెల్త్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సంస్థలు సంయుక్తంగా మంగళవారం నుంచి 10 తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. ఒత్తిడి, ఆందోళన, ఇతర మానసిక సమస్యలతో బాధపడుతోన్న అన్ని వయసుల వారికి భరోసా ఇచ్చే సూచనలతో సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు నిపుణులు ముందుకొచ్చారని, మరింత మందిని ఈ తరహా చైతన్య కార్యక్రమాలతో అనుసంధానం చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అందుకు సంబంధించి వారోత్సవాల ప్రచార పత్రాలను మంగళవారం మేయర్ విజయలక్ష్మి ఆమె కార్యాలయంలో ఆవిష్కరించారు. తెలంగాణ మానసిక నిపుణుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎం.ఎ.కరీం, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మానసిక సమస్యలపై అన్ని వయసుల వారు ఉచిత కన్సల్టేషన్ కోసం 94404 88571 నంబరులో సంప్రదించవచ్చని కరీం తెలిపారు.
నిపుణుల అంచనా ప్రకారం మానసిక సమస్యలున్న వారిలో..
* విపరీత ప్రవర్తన: 25శాతం
* అంతర్జాల వ్యసనం: 7.5శాతం
* కుంగుబాటు: 10.5
* మద్యం, మత్తుకు బానిసలు: 15శాతం
* వేర్వేరు ఆందోళనలు: 38శాతం
* ఇతరత్రా: 4 శాతం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సర్వం తానై.. సమరానికి సై
[ 07-05-2024]
రాజధాని పరిధిలో మూడు లోక్సభ స్థానాలను దక్కించుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. మహానగరంలో కీలకమైన కాంగ్రెస్ నేతలతో వారం రోజులుగా ఆయన మాట్లాడుతున్నారు. -
హైదరాబాద్లో ఆ ఏడు ప్రాంతాలు హీట్ ఐలాండ్లు
[ 07-05-2024]
చెట్ల నరికివేత, పట్టణీకరణతో నగరం కాంక్రీటు వనంలా మారి నిప్పు కుంపటిని తలపిస్తోందని హైదరాబాద్ అర్బన్ ల్యాబ్ సంస్థ తాజాగా విడుదల చేసిన పరిశోధన నివేదిక స్పష్టం చేస్తోంది. -
ఒక క్లిక్తో.. పోలింగ్ కేంద్రం ప్రత్యక్షం
[ 07-05-2024]
‘పోల్ క్యూ రూట్’ యాప్ను ఈసారి మరింత మెరుగ్గా అందుబాటులోకి తెస్తామని జీహెచ్ఎంసీ చెబుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ యాప్ను దాదాపు 1.5 లక్షల మంది ఉపయోగించారు. -
ప్రశాంత ఎన్నికలకు సత్వర చర్యలు
[ 07-05-2024]
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. -
నిరంత విద్యుత్తుకు.. కమాండ్ కంట్రల్ సెంటర్
[ 07-05-2024]
నగరంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది. అగ్నిమాపక కమాండ్ కంట్రోల్ సెంటర్ సైతం సిద్ధమవుతోంది. -
ఈవీఎంలు సిద్ధం.. స్ట్రాంగ్ రూముల్లో భద్రం
[ 07-05-2024]
ఎన్నికలకు ఈవీఎంలు సిద్ధమయ్యాయి. రెండ్రోజుల క్రితం చేపట్టిన కమిషనింగ్ ప్రక్రియ దాదాపు పూర్తయిందని, మంగళవారంతో అన్ని స్ట్రాంగ్ రూముల్లో ముగుస్తుందని ఇంజినీర్లు సోమవారం వెల్లడించారు. -
చేయి చేయి కలిపి.. చెయ్యెత్తి కదిలి
[ 07-05-2024]
అడుగడుగున హారతులు.. బతుకమ్మ ఆటలు.. లంబాడీ నృత్యాలు.. సీఎం రేవంత్రెడ్డి రోడ్షోలో ఎటుచూసినా జనసందోహమే. సోమవారం రాత్రి కంటోన్మెంట్, అంబర్పేట, ఉప్పల్ పరిధిలో ఆయన రోడ్షోలు, కార్నర్ మీటింగ్లు నిర్వహించారు. -
మలక్పేట శ్రేణులకు దక్కని లోక్సభ
[ 07-05-2024]
మలక్పేట వాసులకు లోక్సభ స్థానం నుంచి ఒక్కసారి కూడా విజయం దక్కలేదు. మలక్పేట నియోజకవర్గం 2009 వరకు నల్గొండ లోక్సభ పరిధిలో ఉండేది. అనంతరం హైదరాబాద్ లోక్సభలోకి మారింది. -
ఐసీఎస్ఈ ఫలితాల్లో రమాదేవి పబ్లిక్ స్కూల్ ప్రభంజనం
[ 07-05-2024]
ఐసీఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో రమాదేవి పబ్లిక్ స్కూల్ ప్రభంజనం సృష్టించింది. సోమవారం వెలువడిన ఫలితాల్లో పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. వరుసగా 17వ ఏటా శత శాతం ఉత్తీర్ణతతో రికార్డు నెలకొల్పింది. -
అసెంబ్లీకి ఓటేసి.. లోక్సభకు ముఖం చాటేసి
[ 07-05-2024]
పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నిక ఏదైనా.. అటు దేశం.. ఇటు రాష్ట్రం, నియోజకవర్గం బాగుపడాలంటే మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది. రెండు ఎన్నికలకున్న ప్రాధాన్యం ఒకటే. -
ప్రియుడితో భర్తను హత్య చేయించిన భార్య
[ 07-05-2024]
ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన సంఘటన కడ్తాల్ ఠాణా పరిధిలోని మక్తమాదారంలో చోటు చేసుకుంది. ఈ ఘాతుకానికి పాల్పడిన ముగ్గురినీ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. -
ఆ నాలుగు పార్టీలు నా గెలుపును అడ్డుకోలేవు
[ 07-05-2024]
‘పాతబస్తీలో నివసిస్తున్న ముస్లింలకు తామే రక్షకులమంటూ మజ్లిస్ పార్టీ చెప్పుకుంటోంది. వాస్తవానికి ఇక్కడ వెనుకబాటుతనానికి వారే కారణం. ముస్లింల పేర్లు చెప్పుకొని పాతబస్తీలో భూ కబ్జాలు చేస్తున్నారు. చివరికి శ్మశానాలూ వదల్లేదు. -
గాంధీభవన్లో కాంగ్రెస్ నేతల పరస్పర దాడులు
[ 07-05-2024]
గాంధీభవన్లో కార్వాన్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పరస్పరం దాడి చేసుకున్నారు. సోమవారం పార్టీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మహ్మద్ వలీవుల్లా సమీర్ను నియోజకవర్గంలో ప్రచారానికి ఆహ్వానించేందుకు కార్వాన్ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఉస్మాన్బిన్ అల్హాద్రీ, ఇతర నాయకులు గాంధీభవన్కు వచ్చారు. -
మల్కాజిగిరికి ప్రత్యేక మ్యానిఫెస్టో
[ 07-05-2024]
‘మల్కాజిగిరిలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుస్తుంది. మహిళా ఓటర్లు నా వెనకే ఉన్నారు. మల్కాజిగిరి మినీ భారత్.. అన్ని ప్రాంతాల వారుంటున్నారు. -
కాసానిని ఆశీర్వదించండి: కేటీఆర్
[ 07-05-2024]
చేవెళ్ల లోక్సభ నియోజకవర్గానికి గత 20 ఏళ్లలో ఏ పార్టీ బీసీ అభ్యర్థిని నిలపలేదని, అలాంటిది భారాస అధినేత కేసీఆర్ 93 బీసీ కులాలను ఏకం చేసిన కాసాని జ్ఞానేశ్వర్ను బరిలో ఉంచారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
పాలమూరు... ప్రచార హోరు
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ‘మహబూబ్నగర్ (పాలమూరు)’ బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారంహోరెత్తిస్తున్నారు. గెలుపు తమదేనంటూ ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
ఓటు సద్వినియోగానికి సౌకర్యాల కల్పన
[ 07-05-2024]
జిల్లాలోని దివ్యాంగులకు (మూగ, చెవిటి, అంధ) లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవడానికి అవసరమైన సౌకర్యాలను కల్పించామని జిల్లా స్వీప్ నోడల్ అధికారి మహ్మద్ అబ్దుల్ సత్తార్ తెలిపారు. -
కేంద్రాలు దూరం.. సాయం అవసరం
[ 07-05-2024]
పార్లమెంట్ ఎన్నికల తేదీ (ఈనెల 13) దగ్గరకొచ్చేస్తోంది.అయితే జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద సదుపాయాల కల్పన ఇంకా కొలిక్కి రాలేదు. అసలే ఎండలు మండుతున్నాయి. -
మూడోసారీ మోదీయే ప్రధాని: కొండా
[ 07-05-2024]
ప్రధాని మోదీతోనే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని, మూడోసారీ మోదీయే ప్రధాని అవుతారని చేవెళ్ల భాజపా ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగాలి
[ 07-05-2024]
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. -
అత్యధిక ఎంపీ స్థానాలు భాజపా కైవసం: గీతామూర్తి
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలను భాజపా కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యురాలు, మహిళా మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు గీతామూర్తి ధీమా వ్యక్తం చేశారు. -
మధ్యంతర దరఖాస్తులను పరిష్కరించకుండా తుదితీర్పు చెల్లదు: హైకోర్టు
[ 07-05-2024]
పైగా భూమి దస్తావేజుల రద్దుకు సంబంధించిన వివాదంలో ఇరుపక్షాలు సమర్పించిన ఆధారాలను, మధ్యంతర పిటిషన్లను పరిష్కరించకుండా కింది కోర్టు తుది తీర్పు వెలువరించడం చెల్లదంటూ హైకోర్టు పేర్కొంది. -
మహిళ మెడలోని గొలుసు లాక్కుని పరారీ
[ 07-05-2024]
మహిళ మెడలోని గొలుసును ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు లాక్కుని పరారయ్యారు. వీరిలో ఒకరు యువతి కావడం గమనార్హం. -
‘టెక్ మహీంద్ర’ సహకారంతో.. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ
[ 07-05-2024]
టెక్ మహీంద్ర ఫౌండేషన్ సహకారంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిరుద్యోగ యువతీ, యువకులకు 4 నెలల పాటు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నట్లు క్యాడర్ సంస్థ ప్రతినిధి నాగరాజు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
-
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్
-
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
-
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని
-
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
-
నెల క్రితం ప్రమోషన్.. ఇప్పుడు లేఆఫ్.. టెస్లాలో భారత టెకీ ఆవేదన!