కొలువుదీరనున్న నూతన ప్రభుత్వం.. కీలక విభాగాలకు త్వరలో కొత్త బాసులు!
తెలంగాణలో త్వరలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో గ్రేటర్ పరిపాలనలో కీలకమైన విభాగాల్లో మార్పులు చేర్పులు జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న అధికారులకు స్థానచలనం జరిగే అవకాశాలు ఉన్నాయి.
హెచ్ఎండీఏ, బల్డియా, జలమండలిలో మార్పులు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో త్వరలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో గ్రేటర్ పరిపాలనలో కీలకమైన విభాగాల్లో మార్పులు చేర్పులు జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న అధికారులకు స్థానచలనం జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వారంలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. నగరాభివృద్ధిలో జీహెచ్ఎంసీ, జలమండలి, హెచ్ఎండీఏలదే ప్రధాన పాత్ర. రూ.వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు ఆయా ప్రభుత్వ విభాగాల పరిధిలో జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పట్ల ఒక సానుకూలత రావాలంటే రాజధాని హైదరాబాద్లో మౌలిక వసతుల దగ్గర నుంచి పాలన వ్యవహారాల్లో పారదర్శకత చాలా అవసరం. ముఖ్యంగా నీటి సరఫరా, మురుగు నీటి, పారిశుద్ధ్య నిర్వహణ, ప్లానింగ్ లాంటి అంశాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చూసుకోవాల్సిందే.
హెచ్ఎండీఏకు పూర్తిస్థాయి కమిషనర్!
ప్లానింగ్లో కీలకమైన హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ)కు పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడంతో సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం మున్సిపల్శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్ హెచ్ఎండీఏ కమిషనర్గా వ్యవహరిస్తున్నారు. అక్కడా ఇక్కడా విధుల నిర్వహణలో సమన్వయం ఉండటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఏదైనా కీలకమైన సమీక్ష సమావేశం ఉంటే తప్పా...పూర్తిస్థాయిలో హెచ్ఎండీఏపై దృష్టి సారించక పోవడంతో కిందిస్థాయి అధికారులు, సిబ్బంది ఆడిందే ఆటగా సాగుతోంది. ముఖ్యంగా హెచ్ఎండీఏ పరిధిలో వేల కోట్ల విలువైన భూములు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని వేలం ద్వారా విక్రయించారు. మరికొన్ని వేలం వేసే క్రమంలో ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఏడు జిల్లాల పరిధిలో కొన్ని భూములు ఆక్రమణల పాలవుతున్నాయి. శంషాబాద్లో ఇటీవలి ఓ నేత 50 ఎకరాలు హెచ్ఎండీఏ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేసినా..ఆఖరి వరకు అధికారులు గుర్తించలేకపోయారు. పలు ఫిర్యాదుల నేపథ్యంలో చివరిలో అడ్డుకున్నారు. ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ప్రణాళిక విభాగంలో అధికారులు, సిబ్బంది పనితీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడంతో కొన్నాళ్లుగా హెచ్ఎండీఏలో పాలన గాడి తప్పిందనే విమర్శలు ఉన్నాయి. కొత్త ప్రభుత్వం రానున్న దృష్ట్యా హెచ్ఎండీఏకు నూతన కమిషనర్ను నియమించే అవకాశం ఉంది.
పోలిస్ శాఖలో..
జలమండలి ఎండీగా దానకిషోర్ బాధ్యతలు చేపట్టి ఆరేళ్లు దాటింది. అవుటర్ చుట్టూ ఉన్న గ్రామాలకు తాగునీరు అందించడం.. నగరంలో మురుగు నీటి శుద్ధి జరిగేలా కొత్తగా 31 మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణం...ఇతరత్రా అభివృద్ధి పనుల్లో తనదైన ముద్ర వేశారు. ఇక్కడి నుంచి ఆయన్ను బదిలీ చేసి కీలక విభాగాల్లో సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బల్దియా కమిషనర్గా రోనాల్డ్ రాస్ ఎన్నికల ముందే బాధ్యతలు చేపట్టడంతో ఆయన్నే కొనసాగిస్తారో లేదో కొద్దిరోజుల్లో స్పష్టత రానుంది. మూడు పోలీసు కమిషనరేట్లలో కూడా బదిలీలకు అవకాశం ఉంటుందని అంటున్నారు. ఎన్నికల సమయంలో సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆయన బదిలీ ఉంటుందని సమాచారం. నగర కమిషనర్ సందీప్శాండిల్య ఎన్నికల సమయంలో వచ్చారు. రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ కూడా ఏడాది కిందటే వచ్చారు. వీరిరువురిని కొనసాగిస్తారా? లేదా అనేది వేచి చూడాలి. నగర ట్రాఫిక్ విభాగం అదనపు కమిషనర్ సుధీర్బాబు ఏడాది కిందటే వచ్చారు. ఆయన్ను బదిలీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వంట ఆలస్యమైందని భార్య హత్య
[ 01-05-2024]
ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రం నుంచి నాలుగు రోజుల క్రితం నగరానికి వలసొచ్చిన ఆ కుటుంబం మనుగడ మూణ్నాళ్ల ముచ్చటైంది. వంట ఆలస్యంపై దంపతుల మధ్య తలెత్తిన వివాదంలో క్షణికావేశానికి లోనైన భర్త ఇటుకతో భార్య తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. -
దివ్యాంగుడిని చితకబాది.. వృద్ధురాలిపై దాడి
[ 01-05-2024]
తన సెల్ఫోన్ను ఓ వ్యక్తి తీసుకొని తిరిగివ్వడంలేదని ఫిర్యాదు చేయడమే ఆ దివ్యాంగుడు చేసిన పాపం. రెండు కాళ్లు పనిచేయని అతడిని కానిస్టేబుల్ దారుణంగా చితకబాదాడు. తన కుమారుడిని ఎందుకు కొట్టారని ప్రశ్నించిన అతని తల్లినీ వదల్లేదు. -
నా ఒక్క ఓటే కదా... అనుకుంటే ఎలా?
[ 01-05-2024]
‘నా ఒక్క ఓటే కదా.. వేయకపోతే ఏమవుతుంది’ చాలా మందిలో ఉన్న భావన ఇదే. ఓటు హక్కు ఉన్నప్పటికీ పోలింగ్ కేంద్రం వరకు వచ్చి ఓటు వేసేందుకు చాలామంది ఆసక్తి చూపించరు. ఇలా ప్రతి ఒక్కరు నా ఒక్క ఓటే కదానుకుంటే అనర్హులు అందలమెక్కే ప్రమాదం ఉందని భావించాలి. -
మొబైల్ కోసం వ్యక్తి దారుణ హత్య
[ 01-05-2024]
గుడిమల్కాపూర్లో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 65 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. -
వడదెబ్బ చికిత్సలకు.. హీట్స్ట్రోక్ క్లినిక్లు
[ 01-05-2024]
ఎండలు మండిపోతున్నాయి. నిత్యం 40-42 డిగ్రీలు నమోదవుతున్నాయి. రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. సోమవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బకు 11 మంది మృత్యువాత పడ్డారు. -
ప్రేయసితో లాడ్జికి.. ప్రియుడి అనుమానాస్పద మృతి
[ 01-05-2024]
ప్రియురాలితో కలిసి ఓయో లాడ్జీలో బస చేసిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన ఎస్సార్నగర్ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై శ్రావణ్కుమార్ వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన హేమంత్ (28) ఇటుకల వ్యాపారం చేస్తున్నాడు. -
మనోళ్లే పనోళ్లు.. బినామీ వసూళ్లు
[ 01-05-2024]
ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకోవాలని రాజకీయ నాయకులు.. ఎవరికి ఓటేయాలని ఓటర్లు ఆలోచిస్తున్నారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ విభాగాల్లోని కొందరు అధికారులు మాత్రం.. ఎన్నికల ఏర్పాట్ల పనుల్లో మరోసారి సొమ్ము చేసుకోవడంపై దృష్టి సారించారు. -
సుడిగాలిలా చుట్టి రావలె
[ 01-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచార గడువు మరో పదకొండు రోజుల్లో ముగియనుంది. మొన్నటి వరకు పూర్తిస్థాయిలో ప్రచారం చేయని అభ్యర్థులు ఇప్పుడు గడువు దగ్గరపడుతుండడంతో రాత్రిపగలూ ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. -
ఫలితాల్లో.. ‘పది’ పోయింది
[ 01-05-2024]
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో హైదరాబాద్ జిల్లా కిందకు దిగింది. 33 జిల్లాల్లో కింది నుంచి నాలుగో స్థానంలో నిలిచింది. ఇదే వరుసలో రంగారెడ్డి.. మేడ్చల్ జిల్లాలు నిలబడ్డాయి. -
కాలు కదలాలంటే.. డబ్బులు చేతిలో పడాల్సిందే!
[ 01-05-2024]
ప్రధాన పార్టీలు నిర్వహించే ర్యాలీలు, కూడళ్ల సమావేశాలకు జనం తరలింపు పెద్ద తలనొప్పిగా మారుతోంది. నగరంలో సభలు, సమావేశాలు, కూడళ్ల జాతరకు జనం స్వచ్ఛందంగా రావాలంటే కష్టమే. -
ఎర్లీబర్డ్లో రూ.820 కోట్ల పన్ను వసూలు
[ 01-05-2024]
ఆర్థిక సంవత్సరం(2024-25) మొదటి నెలలోనే జీహెచ్ఎంసీ రెవెన్యూ విభాగం దాదాపు 40శాతం ఆస్తిపన్నును వసూలు చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30 వరకు గ్రేటర్ పరిధిలో ఎర్లీబర్డ్ పథకం అమలైంది. -
డిటోనేటర్ పరిశ్రమలో భారీ పేలుడు: ఒకరి మృతి
[ 01-05-2024]
డిటోనేటర్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు పేలి ఓ కార్మికుడు సజీవ దహనమయ్యాడు. ఈ ప్రమాదం సోమవారం రాత్రి జరిగినా, పరిశ్రమ యాజమాన్యం గోప్యంగా ఉంచింది. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోకి వస్తుందని..మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పోలీసులకు తెలియకుండా జాగ్రత్తపడింది. -
కన్నడిగులపై కన్ను
[ 01-05-2024]
నగరంలోని కన్నడిగులను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ మొదలుపెట్టింది. అక్కడి నేతలను రంగంలోకి దించడానికి కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఇప్పుడూ ప్రచారం చేయాలని కర్ణాటక నేతలను టీపీసీసీ నాయకులు కోరుతున్నారు. -
రాజకీయక్షేత్రం సకుటుంబ రాజకీయ ప్రచారం
[ 01-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో పోటీలో ఉన్న అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులే కాదు..అభ్యర్థుల కుటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. అభ్యర్థి గెలుపే లక్ష్యంగా సొంత బాణీతో ఆకట్టుకుంటున్నారు. -
కొండంత న్యాయం నావైపే
[ 01-05-2024]
చేవెళ్ల లోక్సభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి సుడిగాలి పర్యటనలతో నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఉప్పర్పల్లిలోని రాజేంద్రనగర్ కోర్టుల సముదాయంలో న్యాయవాదులను కలిసి సహకారం అభ్యర్థించారు. -
భేషజాలు వద్దు.. సమన్వయంతో పనిచేయండి
[ 01-05-2024]
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భేషజాలకు పోకుండా ముఖ్యులు సమన్వయంతో పనిచేయాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్మున్షీ అన్నారు. మంగళవారం పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో మెదక్ అభ్యర్థి నీలం మధు కార్యాలయంలో పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. -
బాబూజీ మార్గదర్శకాలు.. ఉజ్వల భవిష్యత్తుకు నాంది
[ 01-05-2024]
బాబూజీ మహరాజ్ మార్గదర్శకాలు.. ప్రతి తరంలో ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతాయని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. -
నాగన్పల్లి పాఠశాలలో శతశాతం ఉత్తీర్ణత
[ 01-05-2024]
ఇబ్రహీంపట్నం మండలం నాగన్పల్లిలోని రామోజీ ఫౌండేషన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులు శత శాతం ఉతీర్ణులయ్యారు. 2018 వరకు ఈ గ్రామంలో శిథిలమైన ఇరుకైన 4గదుల్లో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల సాగేది. -
భారాస కథ ముగిసింది.. భవిష్యత్తు అంతా కాంగ్రెస్దే: వీర్లపల్లి
[ 01-05-2024]
తెలంగాణలో భారాస కథ ముగిసిందని, ఇక భవిష్యత్తు అంతా కాంగ్రెస్దే అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ నేతలు కాంగ్రెస్కు తరలివస్తున్నారని, పార్టీలోకి ఎవరు వచ్చినా ఘనంగా స్వాగతిస్తామన్నారు. -
భాజపాతోనే రైతు సంక్షేమం: విశ్వేశ్వర్రెడ్డి
[ 01-05-2024]
భాజపాతోనే దేశంలోని రైతులందరికీ సంక్షేమం దక్కుతుందని ఆ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. చేవెళ్లలో మంగళవారం నిర్వహించిన భాజపా కిసాన్మోర్చా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులను రాజు చేయాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు. -
కేంద్రంలోనూ అధికారంలోకి రావడం ఖాయం: కాంగ్రెస్
[ 01-05-2024]
ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పాలించిన భాజపా, భారాసలకు ఇవే చివరి ఎన్నికలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బొర్ర జ్ఞానేశ్వర్ముదిరాజ్ అన్నారు. -
మళ్లీ నిరాశే..
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో వికారాబాద్ జిల్లా మళ్లీ అట్టడుగున నిలిచింది. గతేడాదిలాగే ఈసారీ 33వ స్థానంతో నిరాశ పరిచింది. గతేడాది కంటే ఉత్తీర్ణత 6 శాతం పెరగడం మాత్రం ఊరట కలిగించే అంశం. 2022-23 విద్యాసంవత్సరంలో 59.46 శాతం పాస్ కాగా.. ఈసారి(2023-24)లో 65.10 శాతం నమోదైందని సర్ది చెబుతున్నారు. -
మాదిగలు ఏ పార్టీలో ఉన్నా భాజపాకే ఓటేయండి: మందకృష్ణ
[ 01-05-2024]
-
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తేనే రాష్ట్రం సుభిక్షం
[ 01-05-2024]
మతతత్వ పార్టీల మాటలు నమ్మరాదని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామని శాసన సభాపతి గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. మంగళవారం మోమిన్పేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. -
ఐపీఎల్ ఒరవడి.. అభిమాన సందడి
[ 01-05-2024]
కొండాపూర్లోని శరత్సిటీ క్యాపిటల్ మాల్లో మంగళవారం ఐపీఎల్ క్రికెటర్లు సందడి చేశారు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చెందిన హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీష్కుమార్రెడ్డి, ఉనద్కత్, నటరాజన్ విచ్చేసి అభిమానులతో ఉత్సాహంగా గడిపారు.
తాజా వార్తలు (Latest News)
-
12 స్కూళ్లకు ఒకేసారి బాంబు బెదిరింపులు.. దిల్లీలో కలకలం
-
ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లంటూ తాయిలం
-
తగ్గిన వంటగ్యాస్ వాణిజ్య సిలిండర్ ధర
-
వసూల్ రాజాలు.. ఎన్నికలొచ్చాయని వెనక్కి తగ్గారు!
-
సంచలనానికి 50 ఏళ్లు.. ‘అల్లూరి సీతారామరాజు’ తెర వెనక ఎన్ని విశేషాలో..!
-
భర్త పార్లమెంటుకు.. భార్య అసెంబ్లీకి పోటీ