ఎదగనిద్దాం.. ఎగరనిద్దాం
ఇదీ బాలికల విషయంలో తరచూ అందరూ చెప్పే మాటలు. మరి నిజంగానే వారికి స్వేచ్ఛగా ఎగిరే వాతావరణం ఉందా? అంటే మిశ్రమ సమాధానమే వస్తోంది. ఎందుకంటే సవాళ్లను ఎదుర్కొంటూ దూసుకెళ్లే వారు కొందరైతే, ప్రతికూల పరిస్థితికి వెనకడుగు వేసేవారు మరికొందరు ఉన్నారు. అలా లక్ష్యాన్ని చేరుకుంటున్న వారు చరిత్రలో స్థానం సంపాదించుకొంటున్నారు. ఈ సంఖ్య మన దగ్గర పరిమితంగా ఉండటానికి సామాజిక రుగ్మతలే కారణమన్నది ఎవరూ కాదనలేని సత్యం. వీటిని పారదోలి బాలికల్లో స్ఫూర్తి నింపాలన్న ఉద్దేశంతో ఏటా జనవరి 24న ‘జాతీయ బాలికా దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. ప్రధానిగా ఇందిరాగాంధీ ప్రమాణ స్వీకారం చేసిన రోజును ఇందుకు మూలంగా తీసుకున్నారు.
నేడు జాతీయ బాలికా దినోత్సవం ●
‘ఆకాశమే వారికి హద్ధు. ఆ దిశగా ఎగరనిద్దాం’
న్యూస్టుడే, ఇందూర్ ఫీచర్స్
ఇదీ బాలికల విషయంలో తరచూ అందరూ చెప్పే మాటలు. మరి నిజంగానే వారికి స్వేచ్ఛగా ఎగిరే వాతావరణం ఉందా? అంటే మిశ్రమ సమాధానమే వస్తోంది. ఎందుకంటే సవాళ్లను ఎదుర్కొంటూ దూసుకెళ్లే వారు కొందరైతే, ప్రతికూల పరిస్థితికి వెనకడుగు వేసేవారు మరికొందరు ఉన్నారు. అలా లక్ష్యాన్ని చేరుకుంటున్న వారు చరిత్రలో స్థానం సంపాదించుకొంటున్నారు. ఈ సంఖ్య మన దగ్గర పరిమితంగా ఉండటానికి సామాజిక రుగ్మతలే కారణమన్నది ఎవరూ కాదనలేని సత్యం. వీటిని పారదోలి బాలికల్లో స్ఫూర్తి నింపాలన్న ఉద్దేశంతో ఏటా జనవరి 24న ‘జాతీయ బాలికా దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. ప్రధానిగా ఇందిరాగాంధీ ప్రమాణ స్వీకారం చేసిన రోజును ఇందుకు మూలంగా తీసుకున్నారు. బాలికల సాధికారత కోసం అనువైన మార్గాలు ఏర్పాటు చేయడం అందరి బాధ్యత. ఈ నేపథ్యంలో అమ్మాయిలు ఆకాశాన్ని అందుకోవడానికి నిచ్చెనలాంటి నాలుగు విభాగాల్లో అవకాశాలను కల్పిద్దాం.
ఆవిష్కర్తలుగా మార్చాలి
అమ్మాయిలకు చదువులెందుకనే ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చింది. ఫలితంగా వారు బయటికిరాగలుగుతున్నారు. ఆవిష్కర్తలుగా మార్చగల వనరులను ప్రభుత్వాలు కల్పించాయి. వినియోగంపైనే కొంత వెనుకబాటు ఉంది. లింగ వివక్ష వంటి సామాజిక రుగ్మతలు అందుకు కారణమవుతున్నాయి. ప్రభుత్వ బడుల్లో బాలికలు, ప్రైవేటులో బాలుర సంఖ్య ఎక్కువగా ఉంటుంది. గ్రామీణ విద్యార్థినులు ఉన్నత చదువుల్లో రాణించలేకపోతున్నారు. ఈ విధానం మారి వారిని ప్రోత్సహిస్తే అవకాశాలు అందిపుచ్చుకొంటారు. అబ్బాయిలకు దీటుగా నిలుస్తారనేందుకు ఏటా విడుదలయ్యే వార్షిక ఫలితాలే నిదర్శనం.
అన్ని రకాల విద్యాలయాల్లో చదువుతున్న బాలికలు (6- 10 వరకు) : 46,735
నేరరహిత సమాజం ఇవ్వాలి
అమ్మాయిలకు రక్షణ లేదనే అపవాదు నెలకొనడానికి నిత్యం చోటు చేసుకుంటున్న అఘాయిత్యాలే కారణాలుగా కనిపిస్తున్నాయి. పిల్లలను నిరంతరం కనిపెట్టుకోవాల్సి వస్తుందనే భావన తల్లిదండ్రుల్లో నెలకొంది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాల్సి ఉంది. వారు నిరంతరం భద్రమైన వలయంలో ఉన్నామనే భరోసా కల్పించాలి. షీ టీం ఏర్పాటు, పోక్సో చట్టాలు అమలు చేస్తున్నా.. అవి నేరం జరిగిన తర్వాత విధించే శిక్షలకేనని గుర్తించాలి. అసలు నేరం జరగకుండా నిలువరించే సమాజాన్ని ఆవిష్కరిద్దాం.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివరాలు
15-19 ఏళ్లలోనే తల్లులైన వారి శాతం: 1.1
బాలల్లో స్త్రీ, పురుష నిష్పత్తి: 870 (1000 మందికి)
15-19 ఏళ్లలో రక్తహీనత శాతం: 65.5
మహిళలపై అత్యాచారాలు
2020 : 22
2021 : 25
పోక్సో కేసులు : 8
ఈవ్టీజింగ్ : 12
ఆర్థిక తోడ్పాటు అవసరం
బతుకుదెరువు కోసం ఏదో జీవనోపాధితో సరిపెట్టకుండా.. స్వయంసమృద్ధిగా ఎదిగేలా చూడాలి. ఇతరులకూ ఉపాధి చూపేలా ఆర్థిక స్వావలంబన కల్పించాలి. ఆర్థిక స్వేచ్ఛ, అవకాశాలు, ఆలోచనలకు విలువ దక్కినప్పుడే ఆవిష్కర్తలుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి వీలుంటుంది. అందుకు అనువైన మార్గాల్లో ప్రోత్సహించాలి.
ఆరోగ్యం ముఖ్యం
ఇప్పటికే బాల భారతం పోషకలేమితో కుదేలవుతోందని చాటుతున్న సర్వేల్లో బాలికల పరిస్థితే దయనీయంగా ఉందని చెబుతోంది. దాదాపుగా 50-60 శాతం మంది రక్తహీనతతోనే బాధపడుతున్నారు. ఈ సమస్య వారి శారీరక, మానసిక ఎదుగుదలకు నిరోధకంగా మారుతుంటే... చదువుల్లోనూ వెనకబడిపోయి పోటీని ఎదుర్కోవడంలో తడబడుతున్నారు. ఈ పరిస్థితి తొలగాలంటే పోషకాహారం అందించాలి.
వీరు కాదా ఆదర్శం..
మలావత్ పూర్ణ: గురుకుల పాఠశాలలో చదువుకునే సమయంలో యాజమాన్యం ఆమెను పర్వతారోహణకు ఎంపిక చేసింది. చిన్నవయసులోనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన ఘనత సొంతం చేసుకున్నారు.
యెండల సౌందర్య: హాకీపై ఆమెకు ఉన్న ఆసక్తిని గుర్తించి తల్లిదండ్రులు, గురువులు తర్ఫీదునివ్వడంతో అంతర్జాతీయ స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం పొందారు.
నిఖత్ జరీన్: అంతర్జాతీయ వేదికలపై పంచులు కురిపిస్తూ ప్రత్యర్థులను చిత్తు చేస్తున్న ఆమె ప్రతిభను తల్లిదండ్రులు, గురువులు బాల్యంలోనే గుర్తించారు. ఏ స్థాయి పోటీలకు ఎలా తలపడాలో శిక్షణ ఇప్పించారు.
సౌమ్య: ఫుట్బాల్లో సత్తాచాటడంతో అందరిని ఆకర్షించారు. తాజాగా అంతర్జాతీయ పోటీల్లో బాలికల జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
సుప్రియ: హైదరాబాద్లో మెట్రో రైలును నడుపుతున్నారు. ఇంజినీరింగ్ విద్యనభ్యసించి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజాస్వామ్యంలో ఓటే కీలకం
[ 08-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే కీలకమని వివిధ పక్షాల ప్రతినిధులు వెల్లడించారు. -
బజరంగ్దల్ ఆందోళన
[ 08-05-2024]
తెలంగాణ ప్రాంత విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ పిలుపు మేరకు ఇందూరు దేవి రోడ్డు చౌరస్తాలో ధర్నా రాస్తారోకో చేసి తదనంతరం జిల్లా ఎన్నికల అధికారికి సీఎం రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్ మీద ఫిర్యాదు చేశారు. -
ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం
[ 08-05-2024]
హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో, బుధవారం సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. -
పసుపుబోర్డు పేరు చెప్పి ఎన్నాళ్లీ మోసం?: సీఎం రేవంత్రెడ్డి
[ 08-05-2024]
పంజాబ్, హరియాణా రైతులు మోదీ మెడలు వంచి నల్లచట్టాలు రద్దు చేయించారని, నిజామాబాద్ ఆర్మూర్ రైతులు అదేబాటలో నడవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి
[ 08-05-2024]
కాంగ్రెస్ పార్టీ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. -
ఓటరు చైతన్య కరపత్రాల ఆవిష్కరణ
[ 08-05-2024]
లోక్ సభ ఎన్నికల సందర్భంగా "ఆగండి కొంచెం ఆలోచించండి " అని ఓటర్లను చైతన్యం చేసే విధంగా కరపత్రాన్ని కామారెడ్డి సిటిజన్స్ అసోసియేషన్, మహిళా వేదిక, జలసాధన సమితి, అధ్యయన వేదిక సంయుక్తంగా బుధవారం విడుదల చేశారు. -
ఘనంగా ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం
[ 08-05-2024]
నాగిరెడ్డిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు స్థానిక ఎస్సై రాజు చేతులమీదుగా కేక్ కట్ చేసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. -
గ్రామాల్లో భాజపా ఎన్నికల ప్రచారం
[ 08-05-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్కు మద్దతుగా నాగిరెడ్డి మండలంలోని బొల్లారం, మెలకుంట తండా, ఆత్మకూరు, గ్రామలలో భాజాపా నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
అవినీతి రహిత పాలన భాజపాతోనే సాధ్యం
[ 08-05-2024]
దేశంలో అవినీతి రహిత పాలన భాజపాతోనే సాధ్యమని భాజపా రాష్ట్ర నాయకుడు పైడి ఎల్లారెడ్డి అన్నారు. -
కొనసాగుతున్న భాజపా ఎన్నికల ప్రచారం
[ 08-05-2024]
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భాజపా అభ్యర్థి బీబీ పాటిల్కు మద్దతుగా మండల పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి
[ 08-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని, దాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఐఎస్ఆర్డీ స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి అమృత రాజేందర్ అన్నారు. -
భాజపా ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 08-05-2024]
జహీరాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ను భారీ మెజారిటీతో గెలిపించాలని భాజపా మండల అధ్యక్షుడు ఈశ్వర్ అన్నారు. -
భాజపా మాయమాటలు నమ్మి మోసపోకండి
[ 08-05-2024]
దేవుడు పేరిట ఓట్లు అడిగేందుకు వస్తున్న భాజపా నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దంటూ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి అన్నారు. -
మండల కేంద్రంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం
[ 08-05-2024]
ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
పదిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థికి అభినందనలు
[ 08-05-2024]
పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని గోపాల్పేట్ గ్రామ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో అభినందనలు తెలిపారు. -
ఆడపిల్ల పుడితే రూ.2వేల డిపాజిట్.. యువ జంట వినూత్న నిర్ణయం
[ 08-05-2024]
మండలంలోని ఎండ్రియల్ గ్రామానికి చెందిన ఓ యువ జంట తమ 10వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. -
ఉద్యమ ఊపిరి.. కామారెడ్డి
[ 08-05-2024]
తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ కామారెడ్డి అని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. -
పోలింగ్ కేంద్రం ఎక్కడుందో..
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికలు ఈ నెల 13న జరగనున్నాయి. ఇక ఏ పోలింగ్ కేంద్రం ఎక్కడుందో గూగుల్ మ్యాప్(ఉపగ్రహ పటాలు)తో తెలుసుకోవచ్చు. -
తరలొస్తూ.. తర్ఫీదు పొందుతూ
[ 08-05-2024]
కొందరు వేసవి సెలవులను ఇంట్లోనే ఉంటూ చరవాణుల్లో వీడియోగేమ్లు ఆడుకుంటుంటే.. ఈ చిన్నారులు మాత్రం సృజనాత్మకతకు పదునెడుతున్నారు. -
ఎన్నికల ప్రక్రియలో వీరే కీలకం
[ 08-05-2024]
ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ కీలకమైన అంశం. ఓటుహక్కుతో ప్రజలు తమకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకునే ప్రక్రియ ఇది. -
బరువు పేరిట వడ్లు కాజేత
[ 08-05-2024]
కరవు పరిస్థితులను అధిగమించి ఎలాగోలా వరి పంటను బతికించుకొని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతులకు చివరికి నిరాశే మిగులుతోంది. -
ఇంటర్లో అధికంగా విద్యార్థుల అనుత్తీర్ణత
[ 08-05-2024]
ఇటీవల విడుదలైన పది, ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. గతేడాది కన్నా తక్కువ ఉత్తీర్ణతశాతం నమోదైంది. వచ్చే నెలలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. -
ప్రైవేటు బడులు.. నిబంధనలకు నీళ్లు
[ 08-05-2024]
అధికారులంతా ఎన్నికల విధుల్లో తలమునకలయ్యారు. సాధారణ బడుల నుంచి కార్పొరేట్ పాఠశాలల వరకు యాజమాన్యాలు ఇదే అదనుగా రెచ్చిపోతున్నాయి. -
కలుస్తూ.. కలియతిరుగుతూ..
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం మూడు రోజుల్లో ముగియనుంది. ప్రధాన పార్టీలు బహిరంగ సభలు, రోడ్ షోలతో హోరెత్తిస్తున్నాయి. అభ్యర్థులు ఊళ్లను చుట్టేస్తున్నారు. -
‘చివరి ఎన్నిక.. ఆశీర్వదించండి’
[ 08-05-2024]
‘వయసు మీరింది. మళ్లీ ఓట్లు చూస్తానో.. చూడనో.. ఎన్నికల్లో పోటీకి ఇదే చివరి అవకాశం. ఆపదలో ఉన్నా ఓటుతో ఆశీర్వదించి ఎంపీగా గెలిపించండి’ అని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి ప్రజలను కోరారు. -
‘రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విమానాశ్రయం ఆలస్యం’
[ 08-05-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జక్రాన్పల్లిలో విమానాశ్రయం ఏర్పాటు ఆలస్యమైందని, ప్రతిపాదిత భూమి అప్పగిస్తే ఏడాదిలో ఏర్పాటు చేయిస్తానని భాజపా ఎంపీ అభ్యర్థి అర్వింద్ పేర్కొన్నారు. జక్రాన్పల్లిలో మంగళవారం ఎన్నికల ప్రచారం చేశారు. -
‘భాజపా అభ్యర్థికి తెదేపా మద్దతు’
[ 08-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు భాజపా అభ్యర్థి బీబీపాటిల్కు మద్దతు ప్రకటిస్తున్నట్లు జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పైడి గోపాల్రెడ్డి ప్రకటించారు. -
వేలికి సిరా.. తప్పిదాలకు తెర
[ 08-05-2024]
మే 13న లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో అక్రమాలను నిరోధించేందుకు, దొంగ ఓట్ల నమోదును తగ్గించేందుకు ఎన్నికల సంఘం సిరాను వినియోగిస్తుంది -
‘కాంగ్రెస్కు చేనేత కార్మికుల కష్టాలు పట్టవు’
[ 08-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వానికి చేనేత కార్మికుల కష్టాలు ఏ మాత్రం పట్టవని నిజామాబాద్ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
సౌకర్యాలు లేకుంటే దోస్త్లో చేర్చం
[ 08-05-2024]
తెవివి పరిధిలోని డిగ్రీ కళాశాలలకు (2024-25 విద్యా సంవత్సరానికి) ‘వర్సిటీ అనుబంధ గుర్తింపు’ ఇచ్చేందుకు తనిఖీలు సాగుతుండగానే దోస్త్ ప్రక్రియ ప్రారంభమైంది.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
చెలరేగిన హెడ్, అభిషేక్.. హైదరాబాద్ అద్భుత విజయం
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM