వర్షాలు తీన్మార్..ఇంటిటా బీమార్
మూడు రోజుల కిందట సీనియర్ జర్నలిస్టు ఒకరికి ఒకేసారి డెంగీ, కరోనా నిర్ధారణయ్యాయి. ప్లేట్లెట్లు తగ్గడంతో కూకట్పల్లిలోని ఓ ఆస్పత్రిలో చేరగా, స్టెరాయిడ్స్ ఇచ్చారు. మధుమేహం లేకపోయినా ఇన్సులిన్ చేశారు. దీంతో ఆయన మరో వైద్యుణ్ని ఆశ్రయించాల్సి వచ్చింది.
జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్య నిపుణులు
జ్వరం, గొంతు, ఒంటి నొప్పులతో ఇబ్బంది
ఈనాడు- సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి; ఈనాడు- హైదరాబాద్
మూడు రోజుల కిందట సీనియర్ జర్నలిస్టు ఒకరికి ఒకేసారి డెంగీ, కరోనా నిర్ధారణయ్యాయి. ప్లేట్లెట్లు తగ్గడంతో కూకట్పల్లిలోని ఓ ఆస్పత్రిలో చేరగా, స్టెరాయిడ్స్ ఇచ్చారు. మధుమేహం లేకపోయినా ఇన్సులిన్ చేశారు. దీంతో ఆయన మరో వైద్యుణ్ని ఆశ్రయించాల్సి వచ్చింది. కొందరు రోగులు సొంత వైద్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
నగరంలో 20 మందికి పైగా సివిల్ సర్వీసెస్ అధికారులు వైరల్, డెంగీ, కరోనాలతో బాధపడుతున్నారు. అస్వస్థతకు గురైన ఇతర శాఖల్లోని పలువురు అధికారులు సెలవులు పెట్టి ఇంట్లోనే చిక్సిత పొందుతున్నారు.
నగరాన్ని వీడకుండా కురుస్తున్న వర్షాలు.. చిత్తడిచిత్తడి పరిసరాలు.. విజృంభిస్తున్న దోమల వల్ల రాజధాని వాసులను వైరల్, డెంగీ జ్వరాలు వణికిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నీ కిటికిటలాడుతున్నాయి. నగరంలోని ప్రతి ఇంటిలోనూ ఏదో రకం సీజనల్ వ్యాధితో బాధపడుతున్నవారు కన్పిస్తున్నారు. ఫీవర్, గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ తదితర ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగింది. సాధారణ రోజులతో పోలిస్తే ఓపీ 20-30 శాతం పెరిగింది. వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను గుర్తించి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇస్టానుసారం యాంటీబయోటిక్స్ వాడొద్దని హెచ్చరిస్తున్నారు.
గతంలో కొవిడ్ బారినపడిన కొందరిలో రోగ నిరోధక శక్తి తగ్గడాన్ని గమనిస్తున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. ఇటువంటివారు త్వరగా వైరల్ జ్వరాల బారినపడుతున్నారు. దోమలూ అధికంగా ఉండడంతో డెంగీ విజృంభిస్తోంది. ప్లేట్లెట్స్ 50 వేల లోపునకు పడిపోతుండడంతో ఆస్పత్రులకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఇదే అవకాశంగా ప్రైవేటు ఆస్పత్రులు రూ.లక్షల గుంజుతున్నాయి.
ఎలా గుర్తించాలి.. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి
* వైరల్ ఇన్ఫెక్షన్ సోకితే తీవ్రమైన జ్వరంతోపాటు కాళ్లు, చేతులు మంటగా ఉంటాయి. చికిత్స తీసుకుంటే రెండు మూడు రోజుల్లో తగ్గుతుంది. ఆ తర్వాతా తీవ్ర నీరసం ఉంటుంది. పిల్లలు నలతగా కన్పించకుండా, డీలా పడినట్లుంటారు. ముక్కు కారటం, జ్వరం, జలుబు, గొంతునొప్పి, టాన్సిల్స్ వాయటం, దగ్గు, ఆయాసం, విరేచనాలు లక్షణాలు కన్పిస్తాయి. కరోనా సోకినా ఇలాంటి సమస్యలే ఉండడం వల్ల ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకొనేందుకు పరీక్షలు చేయించుకోవాలి. ఇంట్లో ఒకరికొస్తే అందరికీ చుట్టబెడుతుంది. 3-4 రోజులు దాటినా జ్వరం తగ్గకపోతే డెంగీ లేదా మలేరియాగా అనుమానించి, పరీక్షలు చేయించుకోవాలి. చేతి శుభ్రత అవసరం. వేడివేడి ఆహారం తినాలి. కాచి వడబోసి చల్లార్చిన నీళ్లు తాగాలి.
* జ్వరం, తలనొప్పి, విరేచనాలు, ఆకలి లేకపోవడం, వాంతులు ఉంటే టైఫాయిడ్ పరీక్ష అవసరం.
* బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లలో జ్వరం క్రమేపీ పెరుగుతూ 3, 4 రోజులకు తారస్థాయికి చేరుతుంది. చాలా నలతగా, జబ్బు పడినట్లుగా కన్పిస్తారు. ముఖకవళికలు మారిపోతాయి.
* దోమల వల్ల డెంగీ, మలేరియా జ్వరాలొచ్చే ప్రమాదం ఉంటుంది. ఇంటిచుట్టూ, పూల కుండీల్లో నీళ్లు నిల్వకుండా చూసుకోవాలి. దోమ తెరలు, సంహరణ మందులు వాడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నంబర్లు భళా... కాసులు గలగల!
[ 23-05-2024]
అంకెలు కాసులు కురిపిస్తున్నాయి. ఏటా ఫ్యాన్సీ నంబర్లకు డిమాండ్ పెరుగుతుండడంతో రవాణాశాఖ పంటపండుతోంది. -
అమ్మకానికి ఆడపిల్ల
[ 23-05-2024]
అభంశుభం తెలియని చిన్నారి అమ్మ ప్రేమకు.. తండ్రి లాలనకు దూరమైంది. పుట్టి నెలరోజులు కూడా కాకముందే అంగడి సరకులా అమ్మకానికి వచ్చింది. -
ఆదాయం 2.. ఖర్చు 5
[ 23-05-2024]
నగరవాసుల సంపాదన ఎలా ఉంది? వచ్చిన ఆదాయంలో దేని కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు? తదితర విషయాలపై హోమ్ క్రెడిట్ ఇండియా దేశవ్యాప్తంగా 17 నగరాల్లో ‘ది గ్రేట్ ఇండియన్ వాలెట్’ పేరుతో అధ్యయనం చేసింది -
బడా హోటళ్లలోనూ.. గడబిడే!
[ 23-05-2024]
రాజధానిలో ఆహారకల్తీకి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. కొంత కాలంగా జీహెచ్ఎంసీ, రాష్ట్ర స్థాయి ఫుడ్ ఇన్స్పెక్టర్లు టాస్క్ఫోర్స్ బృందాలు చేపడుతోన్న తనిఖీలతో బడా హోటళ్లలోని డొల్లతనం వెలుగులోకొస్తోంది -
ఆశలు పెంచి.. నిరాశలో ముంచి..!
[ 23-05-2024]
భూ సమస్యల పరిష్కారానికి ఏర్పాటుచేసిన ‘ధరణి’తో పోర్టల్ వల్ల నేటికీ ఇక్కట్లు తప్పడంలేదు. జిల్లా వ్యాప్తంగా వేలాది సమస్యలు పేరుకుపోయాయి -
బ్రెయిన్డెడ్ అని చెప్పక రూ.లక్షలు కాజేశారు
[ 23-05-2024]
కేపీహెచ్బీ నాలుగో రోడ్డులోని ఓ న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందిన యువకుడు వైద్యుల నిర్లక్ష్యంతోనే చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. -
నందివాగు ప్రాజెక్టు..ఆక్రమణల పరం
[ 23-05-2024]
వ్యవసాయ భూముల ధరలకు రెక్కలు రావడంతో వ్యవసాయదారులు, స్థిరాస్తి వ్యాపారులు పొలాల పక్కనున్న ప్రభుత్వ భూములను ఇష్టానుసారంగా ఆక్రమించేస్తున్నారు. -
గ్రంథాలయాలకు సాంకేతిక దన్ను
[ 23-05-2024]
పరిశోధన సంస్థలు గ్రంథాలయాల నిర్వహణకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నాయి. సంప్రదాయ నిర్వహణ పద్ధతి స్థానంలో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్ఐడీ) లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ను అందిపుచ్చుకుంటున్నాయి -
వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల బాధ్యతల స్వీకరణ
[ 23-05-2024]
పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ, ఉస్మానియా, జేఎన్టీయూ వర్సిటీలకు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఇన్ఛార్జి వీసీలుగా బుధవారం బాధ్యతలు చేపట్టారు. -
ఏడాది వయసున్న కుమార్తె కళ్లెదుటే తల్లి ఆత్మహత్య
[ 23-05-2024]
ఏడాది వయసున్న కుమార్తె కళ్లెదుటే తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. అభం శుభం ఎరగని ఆ చిన్నారి.. తన తల్లికి ఏమైందో తెలియక పాల కోసం గుక్క పెట్టి ఏడుస్తుండటంతో ఇరుగుపొరుగువారు వచ్చి చూసేసరికి ఆ ఇల్లాలు ఫ్యాన్కు వేలాడుతూ కనిపించిన ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. -
మద్యం తరలిస్తున్న వాహనం బోల్తా
[ 23-05-2024]
మద్యం సీసాల లోడుతో వెళ్తున్న వ్యాను జాతీయ రహదారిపై బోల్తా పడటంతో కొందరు అందినకాడికి మందు సీసాలు ఎత్తుకెళ్లారు. -
బయటివారితో విద్యుత్తు పనులు
[ 23-05-2024]
విద్యుత్తు పంపిణీ సంస్థ తమ ఉద్యోగులతో చేయించాల్సిన పనులను శాఖకు సంబంధం లేని వ్యక్తులతో చేయించి.. వారి మరణాలకు కారణమవుతోంది. -
రైలు నుంచి దూకిన బాలిక..చికిత్స పొందుతూ మృతి
[ 23-05-2024]
కదులుతున్న రైలు నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలిక మృతి చెందింది. -
ఒంటరి వ్యక్తులే లక్ష్యంగా సెల్ఫోన్ల అపహరణ
[ 23-05-2024]
ఒంటరి వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని ఫోన్లను ఎత్తుకెళ్తున్న ముఠాలోని ఇద్దరు యువకులు, నలుగురు మైనర్లతో పాటు ఫోన్లను కొనుగోలు చేసిన ముగ్గురిని ఉత్తర మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. -
కిర్గిస్థాన్ నుంచి విద్యార్థులను సురక్షితంగా తీసుకురావాలి
[ 23-05-2024]
కిర్గిస్థాన్లోని తెలుగు విద్యార్థులను సురక్షితంగా భారత్కు తీసుకువచ్చేలా తక్షణం చర్యలు చేపట్టాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డిని జీవీకే ఎడ్యుటెక్ బృందం కోరింది. -
ఏపీ హైకోర్టు జస్టిస్ పేరుతో పోలీసులకు వేధింపులు.. అరెస్టు
[ 23-05-2024]
ఏపీ హైకోర్టు జస్టిస్ తనకు సోదరి అని చెప్పి ఓ మహిళకు వీసా ఇప్పిస్తానని నమ్మబలికాడు. మగ గొంతు ఆడ గొంతుగా మారే యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాడు. -
కిడ్నాప్ కథ అల్లి.. తల్లీబిడ్డలు మాయం
[ 23-05-2024]
వాహనాల రద్దీ నడుమ వెళ్తున్న ఓ ఆటోలో నుంచి ‘‘కిడ్నాప్ చేస్తున్నాడు బచావ్.. బచావ్’’ అంటూ ఓ మహిళ కేకలతో ఉలిక్కిపడిన వాహన చోదకులు సదరు ఆటో డ్రైవర్ను పట్టుకుని చితక బాదారు -
ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానం
[ 23-05-2024]
ఓ విమాన సర్వీస్ నలుగురు ప్రయాణికులను వదిలేసి వెళ్లిపోయిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం చోటుచేసుకుంది. -
మురుగు.. పరుగు!
[ 23-05-2024]
గ్రేటర్లో మురుగు పరుగు పెడుతోంది. గత నెల 19 నుంచి ఈ నెల 20 తేదీ వరకు మ్యాన్హోళ్ల ఓవర్ఫ్లోపై దాదాపు 43,280 ఫిర్యాదులు వచ్చాయి. -
ఊటుపల్లి వాగు.. కబ్జాలతో కనుమరుగు
[ 23-05-2024]
మహా నగరంలో ప్రాధాన్య ప్రాంతంగా మారిన శంషాబాద్ మున్సిపల్ కేంద్రం పరిధిలో జలవనరులు పరాధీనమవుతున్నాయి. నిరోధించాల్సిన అధికారుల ఉదాసీనతను ఆసరాగా తీసుకుంటున్న స్థిరాస్తి వ్యాపారులు ఏకంగా వరద కాలువలనే కబ్జా చేస్తున్నారు -
రూ.221 కోట్ల పనులు రద్దు
[ 23-05-2024]
అంతర్గత రహదారులు, నాలాలు, శ్మశానవాటికల్లో సౌకర్యాల కల్పన, ఇతరత్రా పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలంటూ గత ప్రభుత్వం ఆమోదించిన పనులను జీహెచ్ఎంసీ రద్దు చేసింది. -
పనులిలా.. ఏమనాలా?
[ 23-05-2024]
వరద నుంచి కాలనీలను రక్షించేందుకు జీహెచ్ఎంసీలో, శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చేపట్టిన ఎస్ఎన్డీపీ (వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం) పనులు.. ఉన్న నాలుకకు మందేస్తే కొండ నాలుక ఊడిందనే సామెతను తలపిస్తున్నాయి
తాజా వార్తలు (Latest News)
-
పోలీసుల నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం!
-
అండర్ 16... నో సోషల్ మీడియా!
-
ఎప్సెట్లో ర్యాంకు రాలేదా.. ఏం ఏం ఫర్వాలేదు..!
-
రెక్కలు ఎందుకు తెగుతున్నాయ్?.. ఉసురుతీస్తున్న హెలికాప్టర్ ప్రమాదాలు
-
ఎంజీఎం ఆసుపత్రిలో పవర్ కట్.. వరంగల్ ఘటనపై నివేదికకు మంత్రి ఆదేశం
-
ఇంటర్ విద్యార్థులతో ఈసారీ చెలగాటమే!.. మూడో వంతు కళాశాలలకే ‘అనుబంధ గుర్తింపు’