Prakash Raj: అతడు మార్స్, జూపిటర్ వరకు వ్యాపారం విస్తరించాడు.. ప్రకాశ్రాజ్ మరో ట్వీట్
‘అతడు మార్స్, జూపిటర్ వరకు వ్యాపారాన్ని విస్తరించాడు’ అంటూ ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) కొన్ని రోజుల క్రితం చేసిన ఓ ట్వీట్ నెట్టింట చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ‘చంద్రయాన్-3’ (Chandrayaan 3) ప్రయోగం కీలక దశకు చేరిన సమయంలో... ‘విక్రమ్ ల్యాండర్ చంద్రుడి నుంచి పంపుతున్న మొదటి ఫొటో’ అంటూ ఒక వ్యక్తి టీ తయారు చేస్తున్న ఫొటోను జోడించడంతో దుమారం రేగింది. ఇది తమ నాయకుడిని ఉద్దేశించే పోస్టు చేశారని కొందరు, దేశ ప్రగతి, ప్రతిభను సహించలేకేనని మరికొందరు నెటిజన్లు ఆయన తీరును దుయ్యబట్టారు. ఈ ఫొటో కేరళకు చెందిన ప్రజలు అన్ని చోట్లా ఉంటారనే ఒక సరదా సందర్భానికి సంబంధించినదని ప్రకాశ్ రాజ్ అభిమానులు కొందరు పేర్కొన్నారు. తాజాగా అదే ఫొటోను షేర్ చేస్తూ ప్రకాశ్ రాజ్ కొత్త పోస్ట్ పెట్టారు.
చంద్రయాన్ సక్సెస్.. #రాకేశ్రోషన్ పేరిట నెట్టింట మీమ్స్
‘‘ఇప్పటికీ జోక్ అర్థంకాని వారికి, మా మలయాళీ చాయ్వాలాకు ఏమైందని అడిగేవారికి... అతడు మీలా కాదు చాలా తెలివైనవాడు. అతడు తన వ్యాపారాన్ని మార్స్ (అంగారక గ్రహం), జూపిటర్ (బృహస్పతి) వరకు విస్తరించాడు. త్వరలోనే ప్లూటో గ్రహంపైకీ వెళ్తాడు. అతడిని పట్టుకోగలిగితే పట్టుకోండి’ అంటూ నవ్వుల ఎమోజీలు జోడించారు. #justasking హ్యాష్ట్యాగ్ పెట్టారు. దీనినీ కొందరు వ్యతిరేకిస్తుంటే మరికొందరు సమర్థిస్తున్నారు.
‘చంద్రయాన్- 3’పై ప్రకాశ్ రాజ్ పెట్టిన ట్వీట్పై విమర్శలు వెల్లువెత్తడమే కాదు కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్లో కొందరు వ్యక్తులు ఆయనపై ఫిర్యాదు చేశారు. భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రయోగాన్ని అపహాస్యం చేశారని వారు ఆరోపించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక, ‘చంద్రయాన్-3’ ప్రయోగం విజయవంతంకావడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. సామాజిక మాధ్యమాల్లో కొన్ని మీమ్స్ భావోద్వేగానికి గురి చేస్తే, మరికొన్ని నవ్వులు పూయిస్తున్నాయి. ప్రకాశ్ రాజ్పైనా మీమ్స్ అధిక సంఖ్యలో వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
‘దేవర’ సినిమా విషయంలో తనకెదురైన ప్రశ్నపై అల్లరి నరేశ్ స్పందించారు. -
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
నెగెటివ్ కామెంట్స్ను తాను పట్టించుకోనన్నారు నటి వరలక్ష్మీ శరత్కుమార్. -
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
ఏప్రిల్ 28న విడుదలై, ఘన విజయం అందుకున్న టాలీవుడ్ చిత్రాలేంటో చూద్దామా.. -
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
Imdb top movies: ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ ఆసక్తికర మూవీల జాబితాను విడుదల చేసింది. -
మేకప్ రూమ్లో బంధించారు.. నిర్మాతపై నటి ఆరోపణలు
నిర్మాత వేధింపుల కారణంగా బాలీవుడ్ డ్రామా షో ‘శుభ్ షగున్’ నుంచి బయటకు వచ్చేసినట్లు నటి కృష్ణ ముఖర్జీ తెలిపారు. -
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
ప్రేమ స్వభావం ఎలా ఉన్నప్పటికీ దానిని వదులుకోవడం చాలా కష్టమన్నారు అగ్ర కథానాయకుడు కమల్ హాసన్. -
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
హాలీవుడ్కు వెళ్లిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తెలిపారు. -
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
బరువు పెరిగినప్పుడు బాధపడినట్లు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తెలిపారు. -
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
తన అభిమానులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది. -
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ చెప్పారు. -
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు.