Gold bonds: గోల్డ్ బాండ్లలో 8 ఏళ్ల క్రితం పెట్టుబడి.. వారికి బంపర్ రిటర్న్స్!
Sovereign gold bonds: తొలిసారి జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టిన వారికి బంపర్ రిటర్న్స్ రానున్నాయి. ఈ నెలాఖరున ధరను ఆర్బీఐ నిర్ణయించనుంది.
Gold bonds | ఇంటర్నెట్ డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకొచ్చిన సావరిన్ గోల్డ్ బాండ్లలో (Sovereign gold bonds) తొలి విడతలోనే ఇన్వెస్ట్ చేసిన వారికి అదిరిపోయే రిటర్న్స్ రానున్నాయి. దేశంలో భౌతిక బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని 2015 నవంబర్లో ఆర్బీఐ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 8 ఏళ్ల కాలపరిమితితో వస్తున్న ఈ బాండ్ల గడువు ఈ ఏడాది నవంబర్ 30తో ముగియనుంది. ప్రస్తుతానికి బాండ్ల మెచ్యూరిటీపై ధరను నిర్ణయించనప్పటికీ.. ప్రస్తుత బంగారం ధర వద్ద లెక్కిస్తే మంచి ప్రతిఫలం లభించే అవకాశం ఉంది.
ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ ఈ గోల్డ్ బాండ్లను జారీ చేస్తుంటుంది. ఇందుకోసం సబ్స్క్రిప్షన్ తేదీలను ప్రకటిస్తుంది. గ్రాము ధర నిర్ణయించేందుకు సబ్స్క్రిప్షన్ ముందు వారం చివరి మూడు పనిదినాల్లో 999 స్వచ్ఛత కలిగిన బంగారానికి ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ నిర్ణయించిన సగటు ధరను పరిగణనలోకి తీసుకుంటుంది. ఇప్పుడు మెచ్యూరిటీ విషయంలోనూ సూత్రం వర్తించనుంది.
IRCTC: మెరుగైన సౌకర్యాలతో రైల్వే స్టేషన్లోనే రూమ్.. ఎలా బుక్ చేసుకోవాలంటే..?
2015 నవంబర్లో తొలి విడత గోల్డ్ బాండ్లను జారీ చేసినప్పుడు గ్రాము ధరను రూ.2684గా నిర్ణయించారు. ఈ ఏడాది సెప్టెంబర్లో విడుదల చేసిన బాండ్ల ఇష్యూ ధరను రూ.5,923గా నిర్ణయించారు. ప్రస్తుతం అంతర్జాతీయ ధరలు అధికంగా ఉన్నాయి. దీపావళి సాధారణంగానే దేశీయంగా బంగారం ధరలు అధికంగా ఉంటాయి. ఆ లెక్కన 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన బంగారం ధర గ్రాము రూ.6వేలు పైనే ఉండనుంది. నవంబర్ 30న మెచ్యూర్ అయ్యే బాండ్లకు గాను ఆర్బీఐ నెలాఖరును ధర నిర్ణయింనుంది. ఆ లెక్కన దాదాపు డబుల్ కంటే ఎక్కువే రిటర్న్స్ రానున్నాయి.
ప్రతిఫలం ఎంత?
సావరిన్ గోల్డ్ బాండ్లలో 8 ఏళ్ల క్రితం ఓ లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ప్రస్తుత అంచనా ప్రకారం రూ.2.20 లక్షలపైనే ప్రతిఫలాన్ని అంచనా వేయొచ్చు. అంటే దాదాపు 120 శాతం ప్రతిఫలం లభిస్తుంది. ఏడాదికి వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు (సీఏజీఆర్) 10 శాతానికి పైనే గిట్టుబాటు అవుతుంది. దీనికి గోల్డ్ బాండ్లపై ఇచ్చే వడ్డీ అదనం. ఏటా 2.50 శాతం నామమాత్రం వడ్డీని బాండ్ల కొనుగోలుపై ఆర్బీఐ చెల్లిస్తుంది. అంటే సగటున 12-13 శాతం వృద్ధితో ప్రతిఫలం పొందొచ్చు. ఒకవేళ గోల్డ్ బాండ్లలో ఇన్వెస్ట్ చేయాలంటే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, పోస్టాఫీలు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్చేంజీల (NSE, BSE) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన తేదీలను ఆర్బీఐ ఎప్పటికప్పుడు ప్రకటిస్తుంది.
నోట్: ఈ వార్త/ కథనం సమాచారం కోసం మాత్రమే. గోల్డ్ బాండ్లలో పెట్టుబడులను ఈనాడు.నెట్ ప్రోత్సహించడం లేదు. రిటర్న్స్ అనేవి అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. ఆర్థిక నిపుణుల సలహా మేరకు పెట్టుబడి నిర్ణయాలు తీసుకోండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చివరి అరగంటలో అమ్మేశారు.. సూచీలకు నష్టాలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టపోయాయి. సెన్సెక్స్ 188 పాయింట్లు, నిఫ్టీ 38 పాయింట్ల చొప్పున నష్టపోయాయి. -
ధరలు పెరిగినా.. బంగారం గిరాకీ తగ్గలే!
Gold: మార్చిలో బంగారం ధరలు గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. అయినప్పటికీ జనవరి-మార్చి త్రైమాసికంలో గిరాకీ ఎనిమిది శాతం పుంజుకుంది. -
విప్రో కొత్త సీఈఓ వేతనం ఎంతో తెలుసా?
విప్రో కొత్త సీఈఓగా ఇటీవల నియమితులైన శ్రీనివాస్ పల్లియా వేతనం వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. -
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
Wearable AC: మెడపై ధరించి ఎక్కడికైనా వెంట తీసుకెళ్లగలిగేలా సోనీ ఓ కొత్త ఏసీ డివైజ్ను తీసుకొచ్చింది. -
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
Section 54F: వారసత్వంగా వచ్చిన ఆభరణాలను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని ఇల్లు కొనుగోలుకు వినియోగిస్తే.. మూలధన లాభాల పన్ను వర్తించదని ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 54ఎఫ్ చెబుతోంది. -
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
Elon Musk: టెస్లా షేర్ల ర్యాలీతో బిలియనీర్ ఎలాన్ మస్క్ సంపద ఇటీవల గణనీయంగా పెరిగింది. సోమవారం ఒక్కరోజే ఆయన షేర్ల విలువ 18.5 బిలియన్ డాలర్లు ఎగసింది. -
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,668
Stock Market Opening bell: ఉదయం 9:18 గంటల సమయంలో సెన్సెక్స్ 114 పాయింట్ల లాభంతో 74,785 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 24 పాయింట్లు పెరిగి 22,668 దగ్గర కొనసాగుతోంది. -
పతంజలి దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్స్ రద్దు
Patanjali: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో పతంజలిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. పది ఉత్పత్తుల తయారీ లైసెన్స్ను రద్దు చేసింది. -
ఐవీఎంఏ అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణ ఎల్ల
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల, ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐవీఎంఏ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
యూపీఐ వినియోగిస్తున్నా.. నగదు ఉపసంహరణలూ పెరిగాయ్
దేశంలో యూపీఐ ఆధారిత చెల్లింపులు పెరిగినా, గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు 5.51% పెరిగాయి. -
వడ్డీ విధింపులో పారదర్శకత పాటించాలి
రుణాలపై వడ్డీ వసూలు విషయంలో అన్యాయమైన పద్ధతులను అనుసరిస్తున్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. -
కనీసం 10,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటాం
జనరేటివ్ ఏఐ(కృత్రిమ మేధ)లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ కంపెనీ సిద్ధమైందని హెచ్సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ విజయ్ కుమార్ తెలిపారు. -
మదుపర్ల సంపద రూ.406.52 లక్షల కోట్లు
బ్యాంకింగ్ షేర్ల జోరుతో సోమవారం దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికాలో బాండ్ రాబడులు తగ్గడం, అక్కడి టెక్ కంపెనీలు త్రైమాసిక ఫలితాల్లో రాణిస్తాయన్న అంచనాలు అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా మారాయి. -
మాపై ఆరోపణలన్నీ అవాస్తవాలే
18 నెలల కంటే తక్కువ వయసున్న చిన్నారుల ఆహార ఫార్ములేషన్ను అంతర్జాతీయ పద్ధతిలో నిర్ణయిస్తామని నెస్లే ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) సురేశ్ నారాయణ్ పేర్కొన్నారు. -
రుసుముల రూపేణా బీఎస్ఈపై రూ.165 కోట్ల భారం
ఆప్షన్ల కాంట్రాక్టులపై, ప్రీమియం విలువ మీద కాకుండా.. నోషనల్ వ్యాల్యూ మీద రుసుము చెల్లించాల్సిందిగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీని (బీఎస్ఈ) సెబీ ఆదేశించింది. -
అల్ట్రాటెక్ సిమెంట్ డివిడెండ్ 700%
ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్, జనవరి- మార్చి త్రైమాసిక నికర లాభం ఏకీకృత పద్ధతిలో 35.24% పెరిగి రూ.2,258.58 కోట్లకు చేరింది. -
హైసియా నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల
హైసియా (హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్) నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల ఎన్నియ్యారు. -
ఓలా మొబిలిటీ సీఈఓ రాజీనామా
ఓలా మొబిలిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) హేమంత్ బక్షి రాజీనామా చేశారని తెలుస్తోంది. -
ఈఎస్జీ రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థకు అనుమతి
పర్యావరణ, సామాజిక, పరిపాలన (ఈఎస్జీ) రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థ ప్రగతి డెవలప్మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్ లిమిటెడ్కు (పీడీసీఎస్ఎల్) సెబీ అనుమతి ఇచ్చింది. -
విపణిలోకి మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ
కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో సరికొత్త ఎక్స్యూవీ 3ఎక్స్ఓను మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేసింది. -
అంకురాల కోసం రూ.50 కోట్లు
అంకురాలకు పెట్టుబడులను అందించేందుకు ది యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ (వైఈఏ) రూ.50 కోట్ల నిధులను అందుబాటులోకి తెచ్చింది.