Stock Market: ఒక్కసారిగా అమ్మేశారు
మదుపర్ల అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1% నష్టపోయాయి. విదేశీ అమ్మకాలు కొనసాగడం, ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలు నష్టాలకు కారణమయ్యాయి. రిలయన్స్, ఇన్ఫోసిస్, ఐటీసీ వంటి పెద్ద షేర్లు కుదేలవడం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది.
రూ.2.95 లక్షల కోట్ల సంపద ఆవిరి
మదుపర్ల అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1% నష్టపోయాయి. విదేశీ అమ్మకాలు కొనసాగడం, ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలు నష్టాలకు కారణమయ్యాయి. రిలయన్స్, ఇన్ఫోసిస్, ఐటీసీ వంటి పెద్ద షేర్లు కుదేలవడం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. డాలర్తో పోలిస్తే రూపాయి 3 పైసలు పెరిగి 83.19 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 0.38% పెరిగి 96.18 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో షాంఘై లాభపడగా, టోక్యో, హాంకాంగ్ నష్టపోయాయి. ఐరోపా సూచీలు నీరసంగా కదలాడాయి.
- సూచీల నష్టాల నేపథ్యంలో బీఎస్ఈలో మదుపర్ల సంపదగా పరిగణించే నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ గురువారం ఒక్కరోజే రూ.2.95 లక్షల కోట్లు తగ్గి రూ.316.65 లక్షల కోట్లకు చేరింది.
- సెన్సెక్స్ ఉదయం 66,406.01 పాయింట్ల వద్ద లాభాల్లోనే ప్రారంభమైంది. అమ్మకాలు స్థిరంగా కొనసాగడంతో నష్టాల్లోకి జారుకున్న సూచీ.. ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఇంట్రాడేలో 65,423.39 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకి, చివరకు 610.37 పాయింట్ల నష్టంతో 65,508.32 వద్ద ముగిసింది. నిఫ్టీ 192.90 పాయింట్లు కోల్పోయి 19,523.55 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 19,492.10-19,766.65 పాయింట్ల మధ్య కదలాడింది.
- సెన్సెక్స్ 30 షేర్లలో 25 కుదేలయ్యాయి. టెక్ మహీంద్రా 4.59%, ఏషియన్ పెయింట్స్ 3.97%, విప్రో 2.36%, ఎం అండ్ ఎం 2.10%, ఇన్ఫోసిస్ 1.91%, ఐటీసీ 1.87%, కోటక్ బ్యాంక్ 1.86%, బజాజ్ ఫిన్సర్వ్ 1.72%, టైటన్ 1.66%, హెచ్యూఎల్ 1.64% చొప్పున నష్టపోయాయి. ఎల్ అండ్ టీ 1.69%, పవర్గ్రిడ్ 0.73%, యాక్సిస్ బ్యాంక్ 0.60% లాభపడ్డాయి. బీఎస్ఈలో 2158 షేర్లు నష్టాల్లో ముగియగా, 1504 స్క్రిప్లు లాభపడ్డాయి. 128 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
- నిరాశపరిచిన యాత్రా ఆన్లైన్: యాత్రా ఆన్లైన్ షేర్ల అరంగేట్రం నిరుత్సాహకరంగా సాగింది. ఇష్యూ ధర రూ.142తో పోలిస్తే బీఎస్ఈలో షేరు 8.45% నష్టంతో రూ.130 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో ఒక దశలో 10.28% తగ్గి రూ.127.40 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 4.26% కోల్పోయి రూ.135.95 దగ్గర స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.2,133.28 కోట్లుగా నమోదైంది.
- అదానీ గ్రూపునకు చెందిన రెండు కంపెనీల్లో తన వాటానంతా విక్రయించాలని నిర్ణయించినట్లు అబుదాబికి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (ఐహెచ్సీ) వెల్లడించింది. ‘అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్లో తన వాటాలను ఒక కొనుగోలుదారుకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామ’ని ఐహెచ్సీ తెలిపింది. ఆ కొనుగోలుదారు పేరు మాత్రం వెల్లడించలేదు.
ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ నుంచి కొత్తగా రెండు సిమెంటు బ్రాండ్లు
ఈనాడు, హైదరాబాద్: ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ కొత్తగా విశిష్ఠ, స్టీల్క్రేట్ అనే రెండు సిమెంటు బ్రాండ్లను ఆవిష్కరించింది. నాగార్జున సిమెంట్ విశిష్ఠ అనేది పీపీసీ (పోర్ట్ల్యాండ్ పొజొలోనా సిమెంట్) కాగా, స్టీల్క్రేట్ బ్రాండ్ను పర్యావరణానికి మేలు చేసే గ్రీన్ సిమెంట్గా కంపెనీ అభివర్ణించింది. ఈ 2 బ్రాండ్లతో అత్యంత నాణ్యమైన సిమెంటును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొంది. కాగా, ప్రస్తుతం నెలకు 3 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉండగా.. దీన్ని 30% పెంచడానికి విశిష్ఠ బ్రాండ్ ముందుండి నడిపించగలదని కంపెనీ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
Mahindra XUV 3XO: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎక్స్యూవీ 3XOను లాంచ్ చేసింది. దీని ధర రూ.7.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
ఓలా క్యాబ్స్ సీఈఓ పదవికి హేమంత్ భక్షి రాజీనామా చేశారు. సీఈఓ పదవి చేపట్టిన 4 నెలలకే బాధ్యతల నుంచి వైదొలిగారు. -
సౌత్ ఇండియన్ బ్యాంకుతో జట్టు కట్టిన టాటా మోటార్స్
వాణిజ్య వాహనాల ఫైనాన్స్ కోసం టాటా మోటార్స్.. సౌత్ ఇండియన్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. -
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
దేశంలో డిజిటల్ లావాదేవీలతో పాటు నగదు వినియోగమూ అదే స్థాయిలో పెరుగుతోంది. సీఎంఎస్ సంస్థ వెలువరించిన తాజా నివేదిక ఈ పరిస్థితిని తెలియజేస్తోంది. -
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 941 పాయింట్లు, నిఫ్టీ 223 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
Credit Card: ఇప్పటి వరకు అద్దె చెల్లింపులపై మాత్రమే అదనపు రుసుము వసూలు చేసిన క్రెడిట్ కార్డు జారీ సంస్థలు ఇకపై ఇతర యుటిలిటీ బిల్లులకు కూడా దాన్ని విస్తరించేందుకు క్రమంగా సిద్ధమవుతున్నాయి. -
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
Nothing phone 2a: నథింగ్ ఫోన్ 2ఏ ప్రత్యేక ఎడిషన్ భారత్లో విడుదలైంది. నేవీ బ్లూ రంగులో దీన్ని తీసుకొచ్చారు. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 329 పాయింట్ల లాభంతో 74,059 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 22,505 దగ్గర కొనసాగుతోంది. -
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు