సంక్షిప్త వార్తలు( 7)
ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సేవల సంస్థ అవేవా, హైదరాబాద్లో కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించింది. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇటువంటి కేంద్రాల్లో ఇది ఆరోది.
అవేవా ‘కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటర్’
ఈనాడు, హైదరాబాద్: ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సేవల సంస్థ అవేవా, హైదరాబాద్లో కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించింది. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇటువంటి కేంద్రాల్లో ఇది ఆరోది. ఇతర కేంద్రాల కంటే ఇది పెద్దదని, ఇక్కడ దాదాపు 1200 మంది ఐటీ నిపుణులు పనిచేసే అవకాశం ఉందని అవేవా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సూ క్వెన్స్ తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో లభించే నిపుణులైన మానవ వనరులు తమకు ఎంతో మేలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సెంటర్ను సందర్శించే తమ వినియోగదార్లకు తాము అందించే సేవలు, వాటి వల్ల కలిగే లాభాలపై పూర్తి అవగాహన వస్తుందని తెలిపారు.
బ్లూస్టార్ లాభంలో 29% క్షీణత
దిల్లీ: ఏసీలు, వాణిజ్య రిఫ్రిజిరేటర్ల సంస్థ బ్లూస్టార్ 2023-24 నాలుగో త్రైమాసికంలో రూ.159.71 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.225.29 కోట్లతో పోలిస్తే ఇది 29% తక్కువ. మొత్తం ఆదాయం రూ.2,830.48 కోట్ల నుంచి రూ.3,340.16 కోట్లకు పెరిగింది. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.9,685.36 కోట్ల ఆదాయంపై రూ.414.31 కోట్ల లాభాన్ని కంపెనీ ఆర్జించింది. 2022-23లో ఆదాయం రూ.7,977.32 కోట్లు, లాభం రూ.4,00.69 కోట్లుగా ఉన్నాయి.
స్వల్పంగా పెరిగిన ఫెడరల్ బ్యాంక్ లాభం
ముంబయి: ఫెడరల్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.906 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.903 కోట్లతో పోలిస్తే ఈసారి అతి స్వల్పంగా పెరిగింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 15% పెరిగి రూ.2,195 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 3.36% నుంచి 3.21 శాతానికి తగ్గింది. రుణ వృద్ధి 20 శాతంగా నమోదైంది. ప్రస్తుతం బ్యాంక్ ఎండీ, సీఈఓగా శ్యామ్ శ్రీనివాసన్ పదవీ కాలం సెప్టెంబరుతో ముగియనుండగా, కొత్త ఎండీ, సీఈఓ ఎంపికపై బ్యాంక్ కసరత్తు చేస్తోంది. 2024 మార్చి 31 నాటికి స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 2.13 శాతానికి చేరింది.
సౌత్ ఇండియన్ బ్యాంక్ డివిడెండ్ 30%
దిల్లీ: సౌత్ ఇండియన్ బ్యాంక్, మార్చి త్రైమాసికంలో రూ.287.56 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే త్రైమాసికంలో బ్యాంక్ లాభం రూ.333.89 కోట్లతో పోలిస్తే ఇది 13.88% తక్కువ. మొత్తం ఆదాయం మాత్రం రూ.2,318 కోట్ల నుంచి రూ.2,621 కోట్లకు వృద్ధి చెందింది. రూ.1 ముఖవిలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.0.30 (30%) డివిడెండ్ను బ్యాంక్ బోర్డు సిఫారసు చేసింది.
ఏప్రిల్లో రాణించిన తయారీ
దిల్లీ: ఏప్రిల్లో దేశీయంగా తయారీ రంగ కార్యకలాపాలు నెమ్మదించాయి. అయితే మూడున్నరేళ్లలోనే రెండో అధిక వృద్ధిని ఈ రంగం నమోదుచేసిందని ఓ సర్వే పేర్కొంది. హెచ్ఎస్బీసీ ఇండియా మ్యాన్ఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ (పీఎంఐ) సూచీ, ఈ ఏడాది మార్చిలో 59.1 పాయింట్లుగా నమోదు కాగా, ఏప్రిల్లో 58.8 పాయింట్లకు తగ్గింది. బలమైన గిరాకీ పరిస్థితుల నేపథ్యంలో, ఉత్పత్తి మరింతగా పెరిగిందని హెచ్ఎస్బీసీ భారత విభాగ ముఖ్య ఆర్థికవేత్త ప్రంజుల్ భండారీ తెలిపారు.
ఎన్ఎండీసీ అధికోత్పత్తి, అమ్మకాలు
ఈనాడు, హైదరాబాద్: ఎన్ఎండీసీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని (2024-25) ఆకర్షణీయ పనితీరుతో ప్రారంభించింది. ఏప్రిల్లో 34.8 లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేసి, 35.3 లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని విక్రయించింది. 2023 ఇదే నెల అమ్మకాలతో పోల్చితే ఈసారి 3% వృద్ధి నమోదైంది. కిరండేల్, దోనిమలై గనుల నుంచి ఉత్పత్తి 12% పెరిగినట్లు ఎన్ఎండీసీ వెల్లడించింది. బచేలి కాంప్లెక్స్ నుంచి అమ్మకాలు 12% పెరిగినట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో 45 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం ఉత్పత్తి చేయగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50 మిలియన్ టన్నులకు చేరుకుంటామని సంస్థ సీఎండీ అమితవ ముఖర్జీ వెల్లడించారు.
రూ.204 కోట్ల సైయెంట్ షేర్లు కొన్న హెచ్డీఎఫ్సీ ఎమ్ఎఫ్
దిల్లీ: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న టెక్ కంపెనీ సైయెంట్లో 1.02% వాటాకు సమానమైన 11.33 లక్షల షేర్లను హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ (ఎమ్ఎఫ్) గురువారం బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసింది. సగటున ఒక్కో షేరును రూ.1800 వద్ద కొనుగోలు చేయడంతో మొత్తం లావాదేవీ విలువ రూ.204.10 కోట్లకు చేరింది. తాజా కొనుగోలుతో సైయెంట్లో హెచ్డీఎఫ్సీ ఎమ్ఎఫ్ వాటా 1.08% నుంచి 2.1 శాతానికి చేరింది. షేర్ల విక్రేతల వివరాలు తెలియలేదు.
బీఎస్ఈలో గురువారం సైయెంట్ షేరు 0.67% నష్టపోయి రూ.1794.30 వద్ద స్థిరపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరల్డ్ ‘సూపర్-రిచ్’లో 15 మంది.. జాబితాలో అదానీ
Super Rich Club: 100 బిలియన్ డాలర్ల సంపద కలిగిన వ్యక్తులను సూపర్-రిచ్గా వ్యవహరిస్తుంటారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం ఈ జాబితాలో ఎప్పుడూ లేనంతగా 15 మంది చేరారు. -
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
India Economic Growth: ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేటు వినిమయం పుంజుకోవడం వల్ల భారత వృద్ధిరేటు 2024లో బలంగా నమోదవుతుందని ఐరాస అంచనా వేసింది. -
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,365
Stock Market Opening bell: ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 176 పాయింట్లు నష్టపోయి 73,487 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 38 పాయింట్లు కుంగి 22,365 దగ్గర కొనసాగుతోంది. -
మళ్లీ 22,400 పైకి నిఫ్టీ
ఆఖరి గంటన్నర ట్రేడింగ్లో మదుపర్ల కొనుగోళ్ల జోరుతో గురువారం సూచీలు లాభాల్లో ముగిశాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాల అండతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు మార్కెట్లను నడిపించాయి. -
4 లక్షల కోట్ల డాలర్ల భారత్!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లోనే మన దేశ ఆర్థిక వ్యవస్థ 4 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.332 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎమ్) సభ్యుడు సంజీవ్ సన్యాల్ అంచనా వేశారు. -
మహీంద్రా రూ.37,000 కోట్ల పెట్టుబడులు
మహీంద్రా గ్రూప్ తన వాహన విభాగంలో వచ్చే మూడేళ్లలో రూ.37,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. 2030 కల్లా మరో 23 కొత్త వాహనాలను విపణిలోకి తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. -
కిమ్స్ హాస్పిటల్స్కు రూ.71.6 కోట్ల లాభం
కిమ్స్ హాస్పిటల్స్ (కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఏకీకృత ఖాతాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.637.6 కోట్ల ఆదాయాన్ని, రూ.71.6 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
261% పెరిగిన గెయిల్ లాభం
ప్రభుత్వ రంగ గెయిల్ ఇండియా గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,176.97 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని నమోదు చేసింది. -
వస్తువుల ఎగుమతులు రూ.41.5 లక్షల కోట్లకు!
మన దేశ వస్తువుల ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో 60-70 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.98-5.81 లక్షల కోట్ల) మేర పెరిగి 500 బి.డాలర్ల (సుమారు రూ.41.5 లక్షల కోట్లు)ను అధిగమించే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సమాఖ్య ఫియో (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్) అంచనా వేసింది. -
రూ.7,675 కోట్లకు పెరిగిన వొడాఫోన్ ఐడియా నష్టం
వొడాఫోన్ ఐడియా, మార్చి త్రైమాసికంలో రూ.7,675 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.6,419 కోట్ల నష్టాన్ని చవిచూసింది. -
నరేశ్ గోయెల్ భార్య అనిత కన్నుమూత
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయెల్ భార్య అనిత గోయెల్(70) గురువారం దక్షిణ ముంబయిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు. -
వినీత్ నయ్యర్ కన్నుమూత
టెక్ మహీంద్రా మాజీ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి అయిన వినీత్ నయ్యర్ (85) గురువారం ఉదయం దిల్లీలో మృతి చెందారు. -
కేశోరామ్ ఛైర్పర్సన్ మంజుశ్రీ ఖైతాన్ మృతి
కేశోరామ్ ఛైర్పర్సన్ మంజుశ్రీ ఖైతాన్(65) కన్నుమూశారని బీకే బిర్లా గ్రూప్ గురువారం ప్రకటించింది. అనారోగ్య కారణంగా కోల్కతాలోని ఆమె స్వగృహంలో తుదిశ్వాస విడిచారని గ్రూప్ అధికారులు తెలిపారు. -
42 కోట్ల మంది గగన విహారం!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, దేశంలో విమాన ప్రయాణికుల రద్దీ 40.7-41.8 కోట్లకు చేరి రికార్డులు బద్దలు కొట్టొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. -
రికార్డు గరిష్ఠాలకు వెండి
బంగారం, వెండి ధరలు గత రెండు రోజుల్లో బాగా పెరిగాయి. వెండి అయితే కిలో ధర తొలిసారిగా రూ.88,000ను మించింది. గత రెండు రోజుల్లోనే కిలోకు రూ.1500కు పైగా పెరిగింది. -
62.48% పెరిగిన పిట్టీ ఇంజినీరింగ్ లాభం
ఎలక్ట్రికల్ స్టీల్ ల్యామినేషన్లు, మోటార్లు/ జనరేటర్లకు సబ్-అసెంబ్లీస్, డైకాస్ట్ రోటార్స్ ఉత్పత్తి చేసే సంస్థ పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. -
పోకర్ణ లాభం రూ.15.51 కోట్లు
పోకర్ణ లిమిటెడ్ మార్చి త్రైమాసికానికి రూ.164.38 కోట్ల ఆదాయాన్ని, రూ.15.51 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
ఎం అండ్ ఎం లాభం రూ.2,754 కోట్లు
మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం), గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,754 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
సంక్షిప్త వార్తలు(5)
ఐటీ, టెక్నాలజీ సొల్యూషన్లు అందించే ఏసర్ గ్రూప్, గృహోపకరణాల విపణిలోకి ప్రవేశించింది. ఇందుకోసం నాలుగేళ్ల క్రితం అంతర్జాతీయంగా ఏసర్ప్యూర్ బ్రాండ్ను ఆవిష్కరించిన సంస్థ, తాజాగా వివిధ ఉత్పత్తులను మన దేశంలో ఆవిష్కరించింది. -
స్టాక్ మార్కెట్... పెట్టుబడులు.. కాస్త అప్రమత్తంగా
ఎన్నికలు.. ఇతర కారణాలతో స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. ఒకవైపు అంతర్జాతీయ మదుపరులు మన మార్కెట్లపై నిరాశావాద దృక్పథంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన తరుణం అంటూ సానుకూల మాటలు.. -
జీవిత బీమా పన్ను ఆదాకు మించి
ఆదాయపు పన్ను మినహాయింపు గురించి ఆలోచించే వారు ముందుగా చూసేది బీమా పాలసీలనే. పన్ను ప్రణాళికలను ప్రారంభించాల్సిన సమయం కావడంతో బీమా సంస్థలూ ఇప్పుడు పలు కొత్త పాలసీలతో ముందుకు వస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
వరల్డ్ ‘సూపర్-రిచ్’లో 15 మంది.. జాబితాలో అదానీ
-
యూఏఈ నుంచి ఇక ‘బ్లూ రెసిడెన్సీ వీసా’.. ఎవరికంటే..?
-
టెండర్లలో 1.5 శాతం ఆయనకు ఇవ్వాల్సిందే: ఈడీ
-
షర్మిల పిటిషన్.. కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే
-
మోదీపై కేజ్రీవాల్ వ్యాఖ్యలు అర్థం లేనివి: రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1PM