మన ఎలక్ట్రానిక్స్లో చైనా, హాంకాంగ్ నుంచే 56%
గత ఆర్థిక సంవత్సరంలో మన ఎలక్ట్రానిక్స్, టెలికాం, ఎలక్ట్రికల్ ఉత్పత్తుల దిగుమతులు 89.8 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.7.45 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి.
ఇది ఆర్థిక భద్రతకు సవాలు: జీటీఆర్ఐ
దిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో మన ఎలక్ట్రానిక్స్, టెలికాం, ఎలక్ట్రికల్ ఉత్పత్తుల దిగుమతులు 89.8 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.7.45 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. ఇందులో సగానికి పైగా (56%) చైనా, హాంకాంగ్ దేశాల నుంచే దిగుమతి అయ్యాయని ఆర్థిక మేధో సంస్థ జీటీఆర్ఐ తన నివేదికలో పేర్కొంది. చైనా నుంచే 43.9% ఎలక్ట్రానిక్స్, టెలికాం, విద్యుత్తు ఉత్పత్తులు వచ్చాయని వివరించింది. ఈ ఉత్పత్తుల కోసం ఈ రెండు దేశాలపై ఎన్నో ఏళ్లుగా భారత్ ఆధారపడి ఉందని తెలిపింది. ఈ దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటేనే ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు, భారత డిజిటల్, సాంకేతిక సార్వభౌమత్వాన్ని రక్షించుకోగలమని ఆ నివేదిక అభిప్రాయపడింది. ఈ వస్తువుల కోసం చైనాపై ఆధారపడటం కొనసాగితే, అది దేశ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి, ఆర్థిక భద్రతకు సవాళ్లను విసరగలదని హెచ్చరించింది. దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు, వివిధ వస్తువుల కోసం వ్యూహాత్మకంగా ఇతర దేశాల వైపు మళ్లాలని సూచించింది.
- ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ల దిగుమతి 2007-10 మధ్య 166.1 మి. డాలర్లు (సుమారు రూ.1380 కోట్లు)గా ఉండగా.. 2020-2022 కల్లా 4.2 బి. డాలర్ల (సుమారు రూ.35,000 కోట్ల)కు పెరిగింది. కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లలో వీటి వాడకం ఎక్కువ.
- ఫోన్లు, ఇతర వైర్లెస్ పరికరాల వంటి కమ్యూనికేషన్ డివైజెస్ల దిగుమతులు 3.691 బిలియన్ డాలర్ల (సుమారు రూ.30,700 కోట్ల)కు పెరిగాయి. ఈ మార్కెట్లో సగం వాటా చైనాదే.
- డయోడ్లు, ట్రాన్సిస్టర్లు, ఇదే తరహా సెమీకండక్టర్ డివైజెస్ల దిగుమతులు కూడా 113.3 మి. డాలర్ల (సుమారు రూ.940 కోట్ల) నుంచి 2334.8 మి. డాలర్ల (సుమారు రూ.19,400 కోట్ల)కు దూసుకెళ్లాయి. ఇందులో చైనా వాటా 67.5%.
- బ్యాటరీలు, ఇతరత్రా ఎలక్ట్రిక్ అక్యుములేటర్ల దిగుమతులు 254.2 మి. డాలర్ల (సుమారు రూ.2110 కోట్ల) నుంచి 1.4 బి. డాలర్ల (సుమారు రూ.11,600 కోట్ల)కు చేరగా.. ఇందులోనూ చైనాదే అధిక వాటా.
ఈ నేపథ్యంలో చైనాపై ఆధారపడడం తగ్గించుకోవాలని.. ఇది అత్యంత ప్రాధాన్యత, వ్యూహాత్మక అంశంగా గుర్తించాలని ఆ నివేదిక వివరించింది. దేశీయంగా సెమీకండక్టర్ తయారీని అభివృద్ధి చేసుకోవాలని తెలిపింది. డయోడ్లు, ట్రాన్సిస్టర్లు, ఎలక్ట్రిక్ అక్యుములేటర్ల స్థానిక తయారీ వేగవంతం చేయాలని.. ఇందు కోసం అంతర్జాతీయ టెక్ కంపెనీలతో సాంకేతిక బదిలీ/సంయుక్త సంస్థల స్థాపన దిశగా ఆలోచించాలని సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ పుస్తకం ప్రతీ విద్యార్థి చదవాలి: ఇన్ఫీ నారాయణమూర్తి
Narayana Murthy: భారత్లో ప్రతీ విద్యార్థి చదవాల్సిన పుస్తకాన్ని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి పంచుకున్నారు. అలాగే కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు పోతాయనే అపోహలపైనా స్పందించారు. -
స్టాక్ మార్కెట్లలో కొనసాగిన లాభాలు
Stock Market Closing bell: శుక్రవారం నాటి ట్రేడింగ్లో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 250 పాయింట్లు పైగా లాభపడగా.. నిఫ్టీ 22,450 మార్క్ పైన స్థిరపడింది. -
చైనాకు తగ్గి.. భారత్కు పెరిగిన విదేశీ పెట్టుబడులు : ఐరాస
అనేక పాశ్చాత్య దేశాల సంస్థలు తమ పెట్టుబడులను పెట్టేందుకు భారత్ ప్రత్యామ్నాయ గమ్యస్థానంగా మారిందని ఐక్యరాజ్య సమితికి చెందిన నిపుణుడు పేర్కొన్నారు. -
వరల్డ్ ‘సూపర్-రిచ్’లో 15 మంది.. జాబితాలో అదానీ
Super Rich Club: 100 బిలియన్ డాలర్ల సంపద కలిగిన వ్యక్తులను సూపర్-రిచ్గా వ్యవహరిస్తుంటారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం ఈ జాబితాలో ఎప్పుడూ లేనంతగా 15 మంది చేరారు. -
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
India Economic Growth: ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేటు వినిమయం పుంజుకోవడం వల్ల భారత వృద్ధిరేటు 2024లో బలంగా నమోదవుతుందని ఐరాస అంచనా వేసింది. -
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,365
Stock Market Opening bell: ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 176 పాయింట్లు నష్టపోయి 73,487 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 38 పాయింట్లు కుంగి 22,365 దగ్గర కొనసాగుతోంది. -
మళ్లీ 22,400 పైకి నిఫ్టీ
ఆఖరి గంటన్నర ట్రేడింగ్లో మదుపర్ల కొనుగోళ్ల జోరుతో గురువారం సూచీలు లాభాల్లో ముగిశాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాల అండతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు మార్కెట్లను నడిపించాయి. -
4 లక్షల కోట్ల డాలర్ల భారత్!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లోనే మన దేశ ఆర్థిక వ్యవస్థ 4 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.332 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎమ్) సభ్యుడు సంజీవ్ సన్యాల్ అంచనా వేశారు. -
మహీంద్రా రూ.37,000 కోట్ల పెట్టుబడులు
మహీంద్రా గ్రూప్ తన వాహన విభాగంలో వచ్చే మూడేళ్లలో రూ.37,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. 2030 కల్లా మరో 23 కొత్త వాహనాలను విపణిలోకి తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. -
కిమ్స్ హాస్పిటల్స్కు రూ.71.6 కోట్ల లాభం
కిమ్స్ హాస్పిటల్స్ (కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఏకీకృత ఖాతాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.637.6 కోట్ల ఆదాయాన్ని, రూ.71.6 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
261% పెరిగిన గెయిల్ లాభం
ప్రభుత్వ రంగ గెయిల్ ఇండియా గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,176.97 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని నమోదు చేసింది. -
వస్తువుల ఎగుమతులు రూ.41.5 లక్షల కోట్లకు!
మన దేశ వస్తువుల ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో 60-70 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.98-5.81 లక్షల కోట్ల) మేర పెరిగి 500 బి.డాలర్ల (సుమారు రూ.41.5 లక్షల కోట్లు)ను అధిగమించే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సమాఖ్య ఫియో (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్) అంచనా వేసింది. -
రూ.7,675 కోట్లకు పెరిగిన వొడాఫోన్ ఐడియా నష్టం
వొడాఫోన్ ఐడియా, మార్చి త్రైమాసికంలో రూ.7,675 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.6,419 కోట్ల నష్టాన్ని చవిచూసింది. -
నరేశ్ గోయెల్ భార్య అనిత కన్నుమూత
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయెల్ భార్య అనిత గోయెల్(70) గురువారం దక్షిణ ముంబయిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు. -
వినీత్ నయ్యర్ కన్నుమూత
టెక్ మహీంద్రా మాజీ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి అయిన వినీత్ నయ్యర్ (85) గురువారం ఉదయం దిల్లీలో మృతి చెందారు. -
కేశోరామ్ ఛైర్పర్సన్ మంజుశ్రీ ఖైతాన్ మృతి
కేశోరామ్ ఛైర్పర్సన్ మంజుశ్రీ ఖైతాన్(65) కన్నుమూశారని బీకే బిర్లా గ్రూప్ గురువారం ప్రకటించింది. అనారోగ్య కారణంగా కోల్కతాలోని ఆమె స్వగృహంలో తుదిశ్వాస విడిచారని గ్రూప్ అధికారులు తెలిపారు. -
42 కోట్ల మంది గగన విహారం!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, దేశంలో విమాన ప్రయాణికుల రద్దీ 40.7-41.8 కోట్లకు చేరి రికార్డులు బద్దలు కొట్టొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. -
రికార్డు గరిష్ఠాలకు వెండి
బంగారం, వెండి ధరలు గత రెండు రోజుల్లో బాగా పెరిగాయి. వెండి అయితే కిలో ధర తొలిసారిగా రూ.88,000ను మించింది. గత రెండు రోజుల్లోనే కిలోకు రూ.1500కు పైగా పెరిగింది. -
62.48% పెరిగిన పిట్టీ ఇంజినీరింగ్ లాభం
ఎలక్ట్రికల్ స్టీల్ ల్యామినేషన్లు, మోటార్లు/ జనరేటర్లకు సబ్-అసెంబ్లీస్, డైకాస్ట్ రోటార్స్ ఉత్పత్తి చేసే సంస్థ పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. -
పోకర్ణ లాభం రూ.15.51 కోట్లు
పోకర్ణ లిమిటెడ్ మార్చి త్రైమాసికానికి రూ.164.38 కోట్ల ఆదాయాన్ని, రూ.15.51 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
ఎం అండ్ ఎం లాభం రూ.2,754 కోట్లు
మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం), గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,754 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ ఇంటి నుంచి వీడియో వెలుగులోకి.. ‘హిట్మ్యాన్’ అంటూ స్వాతీమాలీవాల్ పోస్టు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీంకోర్టులో ఊరట
-
వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు: దేవినేని ఉమా
-
ప్రపంచంలో ‘3F’ల సంక్షోభం.. కేంద్ర మంత్రి జైశంకర్
-
ఈ పుస్తకం ప్రతీ విద్యార్థి చదవాలి: ఇన్ఫీ నారాయణమూర్తి