EPFO: ఈపీఎఫ్/ఈపీఎస్ కోసం ఈ- నామినేషన్ దాఖలు చేశారా?
ఆన్లైన్ ద్వారా ఈ-నామినేషన్ ఫైల్ చేసే చందాదారులు తమ యూఏఎన్ నంబరును ఈపీఎఫ్ పోర్టల్లో యాక్టివేట్ చేసుకుని ఉండాలి.
ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తమ చందాదారులకు ప్రావిడెండ్ ఫండ్ (PF), పెన్షన్ (EPS), బీమా (EDLI) వంటి ప్రయోజనాలను అందిస్తుంది. ఒకవేళ ఈపీఎఫ్ ఖాతాదారుడు మరణిస్తే, ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్, ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సురెన్స్ స్కీమ్ ప్రయోజనాలు నామినీ లేదా ఆధారిత కుటుంబ సభ్యుల (జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు)కు త్వరగా అందేలా ఈ-నామినేషన్ సహాయపడుతుంది. ఈ-నామినేషన్ కోసం ఈపీఎఫ్ఓ ఎలాంటి గడువూ విధించ లేదు. అలాగే అడ్వాన్స్ క్లెయిమ్ ఫైలింగ్ కోసం కూడా ఈ-నామినేషన్ దాఖలు చేయనవసరం లేదు. నామినేషన్ సబ్మిట్ చేసేందుకు చందాదారులు ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని సందర్శించాల్సిన పనిలేదు. ఆన్లైన్ ద్వారా సులభంగా సమర్పించవచ్చు. అయితే ఇందుకోసం ఉద్యోగులు తమ యూఏఎన్ నంబర్ను ఈపీఎఫ్ పోర్టల్లో యాక్టివేట్ చేసుకుని ఉండాలి.
ఈ-నామినేషన్ దాఖలు చేయడం వల్ల ప్రయోజనాలు..
చందాదారుల కుటుంబ సభ్యుల భద్రత కోసం ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ డిపాజిట్ లింక్డ్ ఇన్సురెన్స్ స్కీమ్ (EDLI) ను రూ. 7 లక్షల ప్రయోజనంతో అందిస్తుంది. ఈ ప్రయోజనం కుటుంబ సభ్యులకు చేరేందుకు చందాదారులు ఈ-నామినేషన్ తప్పనిసరిగా సమర్పించాలి. ఈ-నామినేషన్ సబ్మిట్ చేయడం వల్ల చందాదారుల మరణానంతరం పీఎఫ్, పెన్షన్పండ్, బీమా ప్రయోజనాలు.. ఆన్లైన్ క్లెయిమ్ సెటిల్మెంట్ ద్వారా సులభంగా, కాగితరహితంగా, త్వరగా లబ్ధిదారులకు చేరతాయి. ఈపీఎఫ్ నామినేషన్ ఫైల్ చేసిన తర్వాత అప్డేట్ కూడా ఆన్లైన్ ద్వారా సులభంగా చేసుకోవచ్చు.
ఆన్లైన్లో ఈపీఎఫ్ ఈ-నామినేషన్ ఫైల్ చేసే విధానం..
ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ఆధార్తో ధ్రువీకరించిన యూఏఎన్ ఉన్న సభ్యులు మాత్రమే ఎలక్ట్రానిక్ పద్ధతిలో నామినేషన్ ఇవ్వగలరు. ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి కాబట్టి యూఏఎన్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు సభ్యుని పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు సరైనవే అని నిర్ధారించుకోవాలి. అప్పుడే ఆధార్తో సరిపోలతాయి. దీంతో పాటు తండ్రి పేరు, వైవాహిక స్థితి, ఉద్యోగంలో చేరిన తేదీ, చిరునామా వంటి సమాచారాన్ని అందించాలి. అలాగే చందాదారులు తమ ఫోటోని సూచించిన విధంగా అప్లోడ్ చేయాలి. ఇది తప్పనిసరి. ఈ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం మాత్రమే ఈ-నామినేషన్ ఫైలింగ్ సాధ్యపడుతుంది.
- ముందుగా epfindia.gov.in కి పేజీకి వెళ్లి మీ యూఏఎన్, పాస్వర్డ్తో ఈపీఎఫ్ ఖాతాకు లాగిన్ అవ్వాలి.
- ఆ తర్వాత ‘మ్యానేజ్’ సెక్షన్లో ‘ఈ-నామినేషన్’ ఆప్షన్ను ఎంచుకోవాలి.
- ఫ్యామిలీ ఉందా (Having Family) అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ‘యస్’ పై క్లిక్ చేసి మీ కుటుంబ సభ్యుల వివరాలు.. ఆధార్, పేరు, పుట్టిన తేదీ, లింగం, నామినీకి మీతో ఉన్న సంబంధం (రిలేషన్), చిరునామా, బ్యాంకు ఖాతా వివరాలు ఎంటర్ చేయాలి. ఇక్కడ గార్డియన్ ఆప్షన్ ఉంటుంది. ఇది పూర్తిగా ఆప్షనల్. ఫోటో (100kb కంటే తక్కువ ఉండాలి) అప్లోడ్ చేయాలి.
- ఇక్కడ ఒకరి కంటే ఎక్కువ సభ్యుల వివరాలను కూడా ఎంటర్ చేయవచ్చు. ఇందుకోసం ‘యాడ్’ పై క్లిక్ చేయాలి. ఎక్కువ మంది సభ్యులను నామినేట్ చేసినప్పుడు ఎవరికి ఎంత వాటా ఇవ్వాలో కూడా ఇక్కడే తెలపాలి. ఒకసారి వివరాల్నింటినీ సరి చూసుకుని ‘సేవ్ ఈపీఎఫ్ నామినేషన్’పై క్లిక్ చేస్తే తర్వాతి పేజీకి రీడైరెక్ట్ అవుతుంది.
- ఇక్కడ నామినేషన్ ఎంటర్ చేసిన సమయం, వ్యూ, ఎడిట్, ఈ-సైన్, డిలీట్ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో ‘ఈ-సైన్’ ఆప్షన్పై క్లిక్ చేస్తే, వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) జనరేట్ అవుతుంది. మీ ఆధార్కు అనుసందానమైన ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి ఈ-నామినేషన్ పూర్తి చేయవచ్చు.
ఈపీఎఫ్ఓ ప్రకారం.. ఈ-నామినేషన్ సమయంలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు..
- చందాదారులు.. ఒకరి కంటే ఎక్కువ కుటుంబ సభ్యులను నామినేట్ చేయవచ్చు. ఒకవేళ సభ్యుడికి వివాహం అయితే.. భార్య, పిల్లలను నామినీలుగా తప్పనిసరిగా చేర్చాలి. ఎందుకంటే పెన్షన్ ఫండ్ కోసం కుటుంబ సభ్యులుగా భార్య, పిల్లలనే నిర్వచించడం జరిగింది.
- ఫైలింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందే కుటుంబ సభ్యుల ఆధార్, ఫోటోలను సిద్ధం చేసి ఉంచుకోవాలి.
- వివాహం కానీ, ఇతర కుటుంబ సభ్యులు లేని వారు మాత్రమే రిలేషన్తో సంబంధం లేకుండా ఎవరినైనా నామినేట్ చేయవచ్చు. పెన్షన్ నామినేషన్ లింక్ ఒక సభ్యుని నామినేట్ చేసేందుకు మాత్రమే అనుమతిస్తుంది. ఒకవేళ భవిష్యత్తులో వివాహం జరిగి కుటుంబ సభ్యులు వస్తే ఈ-నామినీ చెల్లదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా.. ఏ వయసులోనైతే మేలు..?
ఒక వ్యక్తి యుక్త వయసులోనే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియం తగ్గింపు సహా అనేక ప్రయోజనాలుంటాయి. అవేంటో తెలుసుకోండి.. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
Mutual Funds: స్మాల్ క్యాప్ ఫండ్లపై రాబడులివే
స్మాల్ క్యాప్ ఫండ్లలో రిస్క్ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు. -
సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు ప్రయోజనమేనా?
నాన్ లగ్జరీ కారు కొనుగోలు కంటే కొద్దిగా ఎక్కువ ఖర్చు చేస్తే అధునాతన ఫీచర్లు గల సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి కార్ల కొనుగోలుతో ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. -
జీవిత బీమాలో క్లెయిం సెటిల్మెంట్ ఎలా?
జీవిత బీమా క్లెయిమ్స్ సెటిల్మెంట్ అనేది బీమా సంస్థకు సంబంధించిన ముఖ్యమైన సేవల్లో కీలకమైనది. క్లెయిం సెటిల్మెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. -
ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు -
సరైన బీమా హామీ మొత్తాన్ని ఎలా ఎంచుకోవాలి?
ప్రస్తుత కాలంలో సంపాదించే ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా తనపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు తగిన జీవిత బీమా మొత్తం ఉండడం ఎంతో అవసరం. ఎంత బీమా ఉంటే కుటుంబ సభ్యులకు సరిపోవచ్చో ఇక్కడ చూడండి. -
ఆరోగ్య బీమా రూల్స్లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం
IRDAI : ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల విషయంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ద్వారా బీమా కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది. -
మిడ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఎంతెంత?
దేశీయంగా పెట్టుబడులకు వివిధ మ్యూచువల్ ఫండ్ల పథకాలు ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్ని మిడ్ క్యాప్ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు. -
కొత్త ఏడాదిలో పన్ను విధానం ఎంచుకుంటున్నారా? ఇవి తెలుసుకున్నాకే..!
Income tax: కొత్త ఆర్థిక సంవత్సరంలో వేతన జీవులు పన్ను విధానం యాజమాన్యానికి తెలియజేయాలి. టీడీఎస్ కోసం మీకు నప్పే పన్ను విధానం ఎంచుకోవడం మంచిది. -
పదవీ విరమణ తర్వాత రూ.1 కోటి నిధి సరిపోతుందా?
చాలా మంది పదవీ విరమణ నిధికి రూ.1 కోటి సరిపోతుందని అనుకుంటారు. ఎలాంటి విషయాలు పదవీ విరమణ నిధిని, రాబడిని ప్రభావితం చేస్తాయి. రూ.1 కోటి నిధి సరిపోతుందా? లేదా? ఇక్కడ తెలుసుకోండి.. -
జీవిత బీమా.. అనుబంధ పాలసీలు తీసుకున్నారా?
ఊహించని పరిస్థితుల నుంచి మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు రక్షణ కల్పించేది జీవిత బీమా. సంపాదించే ప్రతి ఒక్కరూ తన ఆర్థిక ప్రణాళికల్లో దీనికి తగిన స్థానం ఇవ్వాల్సిందే. ఆయుర్దాయం పెరుగుతోంది. అదే సమయంలో జీవన శైలీ మారుతోంది. -
లక్ష్య సాధనకు సిప్ మార్గం
స్టాక్ మార్కెట్లో చిన్న మొత్తాలతోనూ మదుపు చేసేందుకు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) తోడ్పడుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు సిప్ ద్వారా మదుపు చేసే వారు పెరిగారు. యాంఫీ గణాంకాల ప్రకారం చూస్తే.. గత నెలలో దాదాపు 42.87 లక్షల కొత్త సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. -
విహార యాత్రలో ధీమాగా
వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ కాలంలో చల్లని ప్రాంతాలకు వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో చాలామంది విదేశాలకు వెళ్లేవారూ ఉంటారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణాల్లో అనుకోని అవాంతరాలు, అనారోగ్యం వచ్చినప్పుడు తోడుండేలా బీమా తీసుకోవడం మంచిది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్