ఆరోగ్య బీమా.. అపరిమితంగా!
కరోనా మహమ్మారి తర్వాత ఆరోగ్య బీమా అవసరం పెరిగింది. మారుతున్న ఈ కొత్త అవసరాలను దృష్టిలో పెట్టుకొని, ఒకేసారి మూడు కొత్త పాలసీలను గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చింది.
కరోనా మహమ్మారి తర్వాత ఆరోగ్య బీమా అవసరం పెరిగింది. మారుతున్న ఈ కొత్త అవసరాలను దృష్టిలో పెట్టుకొని, ఒకేసారి మూడు కొత్త పాలసీలను గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చింది. డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల కింద వీటిని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో డిజిట్ డబుల్ వ్యాలెట్ ప్లాన్, డిజిట్ ఇన్ఫినిటీ వ్యాలెట్ ప్లాన్, డిజిట్ వరల్డ్వైడ్ ట్రీట్మెంట్ ప్లాన్లు ఉన్నాయి. ఈ మూడు పాలసీల్లోనూ గది అద్దె, ఐసీయూలాంటి వాటిపై ఎలాంటి ఉప పరిమితులూ ఉండవని సంస్థ పేర్కొంది.
ఇన్ఫినిటీ వ్యాలెట్ ప్లాన్లో ఎన్ని సార్లయినా పాలసీని వినియోగించుకోవచ్చు. ఒకసారి పాలసీ పరిమితి పూర్తికాగానే తిరిగి భర్తీ అవుతుంది. ఇలా ఎన్నిసార్లయినా పాలసీని వినియోగించుకోవచ్చు. డబుల్ వ్యాలెట్లో ఒకసారి పాలసీ మొత్తం పూర్తయిన తర్వాత రెండోసారి మళ్లీ పాలసీ విలువ మేరకు రక్షణ లభిస్తుంది. వరల్డ్ వైడ్ ట్రీట్మెంట్ పాలసీ తీసుకున్న వారికి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా సరే చికిత్స పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ పాలసీలన్నీ నెలకు రూ.628 కనీస ప్రీమియంతో ప్రారంభం అవుతాయి. ముందస్తు వ్యాధుల కవరేజీకి వేచి ఉండే సమయం తగ్గించుకోవడంలాంటి రైడర్లు అందుబాటులో ఉన్నాయి. పునరుద్ధరణ సమయంలో ఆరోగ్య పరీక్షలు, వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలు తదితర ప్రయోజనాలూ ఉన్నాయి.
సూచీ ఫండ్లలో...
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ నుంచి ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఆఫ్ ఫండ్ పథకం అందుబాటులోకి వచ్చింది. ‘యాక్సిస్ ఎస్అండ్పీ 500 ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్’ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ వచ్చే నెల 5. ఇది ఎఫ్ఓఎస్ ఓవర్సీస్ తరగతికి చెందిన ఓపెన్ ఎండెడ్ ఫండ్. ఎన్ఎఫ్ఓ ద్వారా కనీసం రూ.500 మదుపు చేయొచ్చు. ‘ఎస్అండ్పీ 500 టీఆర్ఐ’ సూచీని ఈ పథకం పనితీరుకు కొలమానంగా తీసుకుంటారు. ఈ సూచీలోని షేర్లపై పెట్టుబడి పెట్టే ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ల (ఈటీఎఫ్)లో ప్రధానంగా ‘యాక్సిస్ ఎస్అండ్పీ 500 ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్’ ఈ పథకం పెట్టుబడులు పెడుతుంది. విదేశీ మార్కెట్లలో ప్రధానంగా యూఎస్లో ఈటీఎఫ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా తమ పోర్ట్ఫోలియోలో వైవిధ్యం ఉంటుందని భావించే మదుపరులకు ఇది అనువైనదిగా ఉంటుంది. అదే సమయంలో నష్టభయమూ అధికంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఆకర్షణీయమైన రాబడినిచ్చేలా
క్వాంట్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఒక డైనమిక్ అసెట్ అలకేషన్ ఫండ్ను ఆవిష్కరించింది. ‘క్వాంట్ డైనమిక్ అసెట్ అలకేషన్ ఫండ్’ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ (న్యూ ఫండ్ ఆఫర్) చివరి తేదీ వచ్చే నెల 6. ఇది డైెనమిక్ అసెట్ అలకేషన్-బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ తరగతికి చెందిన ఓపెన్ ఎండెడ్ పథకం. ఎన్ఎఫ్ఓ సమయంలో కనీసం రూ.5,000 పెట్టుబడి పెట్టాలి. ఎస్ఐపీ (క్రమానుగత పెట్టుబడి విధానం)లో నెలకు రూ.1,000 చొప్పున కనీసం 12 నెలలు మదుపు చేయాల్సి ఉంటుంది. ఈ పథకం పనితీరుకు ‘క్రిసిల్ హైబ్రిడ్ 50+ 50 మోడరేట్ ఇండెక్స్’ను కొలమానంగా తీసుకుంటారు. డైనమిక్ అసెట్ అలకేషన్ ఫండ్ కింద పెట్టుబడులను దాదాపు 65 శాతం ఈక్విటీ విభాగానికి, మిగిలిన సొమ్మును రుణ పత్రాల్లో పెట్టుబడికి కేటాయిస్తారు. ఈక్విటీ, రుణ మార్కెట్లో అవకాశాల ప్రకారం పెట్టుబడులను అటూఇటూ మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా అధిక ప్రతిఫలాన్ని రాబట్టేందుకు ప్రయత్నించవచ్చు. ఆదాయపు పన్ను విషయానికి వస్తే, ఈ పథకాలపై వచ్చిన లాభాలకు ఈక్విటీ పెట్టుబడులకు వర్తించే మూలధన పన్ను నిబంధనలు వర్తించటం ఒక సానుకూలత. గత రెండేళ్ల కాలంలో డైనమిక్ అసెట్ అలకేషన్-బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లు మదుపరులకు ఆకర్షణీయమైన రాబడులనే అందించాయి.
స్థిరాదాయం వచ్చేలా..
యూనియన్ మ్యూచువల్ ఫండ్ నూతన ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్ (ఎఫ్ఎంపీ)ని ఆవిష్కరించింది. ఈ పథకం కింద సమీకరించిన పెట్టుబడులను ప్రధానంగా రుణ పత్రాలు, మనీ మార్కెట్ పత్రాల్లో పెడతారు. పేరులోనే ఉన్నట్లుగా ఇది 1114 రోజుల కాల వ్యవధి డెట్-ఎఫ్ఎంపీ తరగతికి చెందిన క్లోజ్ ఎండెడ్ పథకం. అంటే ఒకసారి పెట్టుబడి పెట్టిన తర్వాత కాల పరిమితి తీరిపోయే వరకూ పెట్టుబడిని వెనక్కి తీసుకోవడం కష్టం. ఈ పథకం ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ ఈ నెల 28. కనీస పెట్టుబడి రూ.5,000. ఈ పథకం పనితీరుకు ‘క్రిసిల్ మీడియం డ్యూరేషన్ ఫండ్ బిల్ ఇండెక్స్’ను కొలమానంగా తీసుకుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా.. ఏ వయసులోనైతే మేలు..?
ఒక వ్యక్తి యుక్త వయసులోనే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియం తగ్గింపు సహా అనేక ప్రయోజనాలుంటాయి. అవేంటో తెలుసుకోండి.. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
Mutual Funds: స్మాల్ క్యాప్ ఫండ్లపై రాబడులివే
స్మాల్ క్యాప్ ఫండ్లలో రిస్క్ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు. -
సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు ప్రయోజనమేనా?
నాన్ లగ్జరీ కారు కొనుగోలు కంటే కొద్దిగా ఎక్కువ ఖర్చు చేస్తే అధునాతన ఫీచర్లు గల సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి కార్ల కొనుగోలుతో ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. -
జీవిత బీమాలో క్లెయిం సెటిల్మెంట్ ఎలా?
జీవిత బీమా క్లెయిమ్స్ సెటిల్మెంట్ అనేది బీమా సంస్థకు సంబంధించిన ముఖ్యమైన సేవల్లో కీలకమైనది. క్లెయిం సెటిల్మెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. -
ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు -
సరైన బీమా హామీ మొత్తాన్ని ఎలా ఎంచుకోవాలి?
ప్రస్తుత కాలంలో సంపాదించే ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా తనపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు తగిన జీవిత బీమా మొత్తం ఉండడం ఎంతో అవసరం. ఎంత బీమా ఉంటే కుటుంబ సభ్యులకు సరిపోవచ్చో ఇక్కడ చూడండి. -
ఆరోగ్య బీమా రూల్స్లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం
IRDAI : ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల విషయంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ద్వారా బీమా కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది. -
మిడ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఎంతెంత?
దేశీయంగా పెట్టుబడులకు వివిధ మ్యూచువల్ ఫండ్ల పథకాలు ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్ని మిడ్ క్యాప్ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు. -
కొత్త ఏడాదిలో పన్ను విధానం ఎంచుకుంటున్నారా? ఇవి తెలుసుకున్నాకే..!
Income tax: కొత్త ఆర్థిక సంవత్సరంలో వేతన జీవులు పన్ను విధానం యాజమాన్యానికి తెలియజేయాలి. టీడీఎస్ కోసం మీకు నప్పే పన్ను విధానం ఎంచుకోవడం మంచిది. -
పదవీ విరమణ తర్వాత రూ.1 కోటి నిధి సరిపోతుందా?
చాలా మంది పదవీ విరమణ నిధికి రూ.1 కోటి సరిపోతుందని అనుకుంటారు. ఎలాంటి విషయాలు పదవీ విరమణ నిధిని, రాబడిని ప్రభావితం చేస్తాయి. రూ.1 కోటి నిధి సరిపోతుందా? లేదా? ఇక్కడ తెలుసుకోండి.. -
జీవిత బీమా.. అనుబంధ పాలసీలు తీసుకున్నారా?
ఊహించని పరిస్థితుల నుంచి మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు రక్షణ కల్పించేది జీవిత బీమా. సంపాదించే ప్రతి ఒక్కరూ తన ఆర్థిక ప్రణాళికల్లో దీనికి తగిన స్థానం ఇవ్వాల్సిందే. ఆయుర్దాయం పెరుగుతోంది. అదే సమయంలో జీవన శైలీ మారుతోంది. -
లక్ష్య సాధనకు సిప్ మార్గం
స్టాక్ మార్కెట్లో చిన్న మొత్తాలతోనూ మదుపు చేసేందుకు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) తోడ్పడుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు సిప్ ద్వారా మదుపు చేసే వారు పెరిగారు. యాంఫీ గణాంకాల ప్రకారం చూస్తే.. గత నెలలో దాదాపు 42.87 లక్షల కొత్త సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. -
విహార యాత్రలో ధీమాగా
వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ కాలంలో చల్లని ప్రాంతాలకు వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో చాలామంది విదేశాలకు వెళ్లేవారూ ఉంటారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణాల్లో అనుకోని అవాంతరాలు, అనారోగ్యం వచ్చినప్పుడు తోడుండేలా బీమా తీసుకోవడం మంచిది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్