ఫండ్లలో మదుపు... క్రమం తప్పని ఆదాయం కోసం...
భవిష్యత్ అవసరాల కోసం క్రమం తప్పని ఆదాయం వచ్చేలా మదుపరులు తమ పెట్టుబడి పథకాలు ఉండాలని కోరుకుంటారు.
భవిష్యత్ అవసరాల కోసం క్రమం తప్పని ఆదాయం వచ్చేలా మదుపరులు తమ పెట్టుబడి పథకాలు ఉండాలని కోరుకుంటారు. షేర్ల నుంచి డివిడెండ్లు, బాండ్ల నుంచి వడ్డీ చెల్లింపులు, స్థిరాస్తుల నుంచి అద్దె ఆదాయం, వ్యాపారాల నుంచి లాభాలు ఇలా ఎన్నో రూపాల్లో ఇది ఉండొచ్చు. మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేసినప్పుడూ ఈ ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉంది. డివిడెండ్ ఆప్షన్ (ఐడీసీడబ్ల్యూ) ద్వారా ఆదాయం వచ్చేలా చూసుకోవచ్చు. మరోవైపు క్రమానుగతంగా కొంత పెట్టుబడిని ఉపసంహరించుకునే (ఎస్డబ్యూపీ) పద్ధతినీ పరిశీలించవచ్చు. మరి ఈ రెండింటిలో ఏది మేలు.. చూద్దాం.
దీర్ఘకాలంలో సంపద సృష్టికి మ్యూచువల్ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానం తోడ్పడుతుంది. ఇలా ఏర్పాటైన నిధిని ఒకేసారి వెనక్కి తీసుకోకుండా క్రమం తప్పని ఆదాయ మార్గంగా మార్చుకోవచ్చు. దీనికోసం అందుబాటులో ఉన్న మార్గాలే సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ), ఇన్కం డిస్ట్రిబ్యూషన్ కమ్ విత్డ్రాయల్ (ఐడీసీడబ్ల్యూ). ఈ రెండు విధానాలూ మదుపరులకు తన పెట్టుబడి నుంచి క్రమం తప్పకుండా ఆదాయాన్ని అందించే మార్గాలు.
సమకూరిన పెట్టుబడి నుంచి నిర్ణీత మొత్తాన్ని నెలనెలా వెనక్కి తీసుకునేలా ఎస్డబ్ల్యూపీ తోడ్పడుతుంది. ఇప్పటికే పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఉన్న వారికి ఇది అనుకూలమని చెప్పొచ్చు. కావాల్సిన మొత్తాన్ని ముందే నిర్ణయించుకోవచ్చు. ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు అప్పటి మార్కెట్ ప్రకారం యూనిట్లను విక్రయించి, మదుపరుల ఖాతాలో సొమ్ము జమ చేస్తారు. గ్రోత్ ఆప్షన్ను ఎంచుకొని, ఈ పద్ధతిలో డబ్బును వెనక్కి తీసుకునేందుకు వీలుంటుంది.
డివిడెండ్ ఆప్షన్ (ఐడీసీడబ్ల్యూ) ఎంచుకున్నప్పుడు పెట్టుబడి వృద్ధితో పాటు, డివిడెండ్ను అందిస్తాయి. ఫండ్ సంస్థలు నిర్ణీత కాలానికి ఒకసారి డివిండెండ్ను ప్రకటిస్తుంటాయి. దీన్ని చెల్లించిన తర్వాత ఆ మేరకు ఫండ్ ఎన్ఏవీ తగ్గుతుంది. ఇందులో యూనిట్లను విక్రయించకుండానే డబ్బు అందుతుంది.
* ఎస్డబ్ల్యూపీ ఎంచుకున్నప్పుడు ఎంత మొత్తం కావాలి? వ్యవధి ఏమిటి? అనేది నిర్ణయించుకునే వెసులుబాటు మదుపరులకు ఉంటుంది. దాన్ని బట్టి, అవసరమైన మేరకు యూనిట్లను విక్రయించి, ఫండ్ సంస్థ డబ్బును సర్దుబాటు చేస్తుంది. కాబట్టి, క్రమం తప్పని ఆదాయం సాధ్యం అవుతుంది.
డివిడెండ్ను ఎంచుకున్నప్పుడు ఫండ్ సంస్థ వ్యవధిని నిర్ణయిస్తుంది. పోర్ట్ఫోలియోపై వచ్చే లాభాల ఆధారంగా డివిడెండ్లను చెల్లించేందుకు ప్రయత్నిస్తుంది. కొన్నిసార్లు డివిడెండ్ను ప్రకటించకపోవచ్చు. ఇలాంటప్పుడు ఆదాయం అందదు.
*పెట్టుబడిదారుడి అవసరం మేరకు ఎంత మొత్తం కావాలన్నది నిర్ణయించుకునే వెసులుబాటు ఎస్డబ్యూపీలో ఉంటుంది. వ్యవధితోపాటు, కావాల్సిన మొత్తాన్ని తగ్గించుకోవచ్చు. పెంచుకోవచ్చు. ఈ మార్పులన్నీ పెట్టుబడిదారుడి నియంత్రణలోనే ఉంటాయి.
డివిడెండ్ ప్లాన్ ఎంచుకున్నప్పుడు పై అంశాలేవీ పెట్టుబడిదారుడికి సంబంధం ఉండవు.
* పనితీరుతో అవసరం లేకుండా పెట్టుబడి నుంచి కాలానుగుణంగా నిర్ణీత మొత్తాన్ని వెనక్కి తీసుకునేందుకు
ఎస్డబ్ల్యూపీ తోడ్పడుతుంది.
ఫండ్ సంస్థలు లాభాలను పంచే అంచనా ఆధారంగా డివిడెండ్ ఆప్షన్ పనిచేస్తుంది.
* మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా క్రమానుగత పెట్టుబడి విత్డ్రాయల్ ద్వారా డబ్బు చేతికి అందుతుంది. ఫండ్ పనితీరు సరిగా లేనప్పుడు డివిడెండ్ లభించడం కష్టం కావచ్చు.
* డివిడెండ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని మొత్తం ఆదాయంగా పరిగణిస్తారు. అప్పుడు వర్తించే శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఎస్డబ్ల్యూపీలో గ్రోత్ ఆప్షన్ ఎంచుకుంటారు. కాబట్టి, మూలధన రాబడిపై పన్ను లెక్కిస్తారు. విక్రయించిన యూనిట్లు, కొనసాగిన కాలాన్ని బట్టి పన్నును గణిస్తారు. అధిక పన్ను శ్లాబు రేటులో ఉన్నప్పుడు డివిడెండ్ ఆదాయం వల్ల పన్ను భారం ఎక్కువగా ఉంటుంది.
రోజువారీ ఆదాయ అవసరాలు, జీవన శైలి ఖర్చులు తదితరాలను లెక్కించుకొని ఏ విధానంలో పెట్టుబడిని ఉపసంహరించుకోవాలన్నది నిర్ణయించుకోవాలి. కచ్చితంగా డబ్బు కావాలనుకుంటేనే ఎస్డబ్ల్యూపీ విధానాన్ని ఎంచుకోవాలి. పెట్టుబడి ద్వారా వచ్చే మొత్తంతో అవసరాలు పరిమితంగానే ఉంటే డివిడెండ్ ఆప్షన్ను పరిశీలించవచ్చు. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
Akshaya Tritiya 2024: అక్షయ తృతీయకు బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే హాల్మార్కింగ్ను ఎలా చెక్ చేయాలో తెలుసా? -
ఆరోగ్య బీమాలో నెట్వర్క్ ఆసుపత్రుల ప్రాధాన్యత ఏమిటి?
ప్రతి ఆరోగ్య బీమా సంస్థ తన పాలసీదారులకు నగదు రహిత చికిత్సనందించడానికి కొన్ని ఆసుపత్రులతో భాగస్వామ్యాన్ని (టై-అప్) కలిగి ఉంటుంది. దీని వల్ల పాలసీదారులకు ప్రయోజనమేంటో ఇక్కడ తెలుసుకుందాం.. -
తీవ్ర వ్యాధుల చికిత్సకు ఆర్థిక భరోసా
అనారోగ్యం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ఓవైపు పెరుగుతున్న వైద్య చికిత్స ఖర్చులతో కేవలం ఆరోగ్య బీమా పాలసీ ఒక్కటే ఉంటే సరిపోని రోజులివి. -
వేతనంలోఎంత పొదుపు చేయాలంటే
వచ్చిన ఆదాయాన్నంతా ఖర్చు చేస్తే.. భవిష్యత్ లక్ష్యాలను సాధించడం కష్టమవుతుంది. కాబట్టి, పొదుపు, పెట్టుబడులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. -
ఫిక్స్డ్ డిపాజిట్.. ఈ పత్రాలు ఇచ్చారా?
బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయా? వీటిపై వచ్చే వడ్డీపై మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్) విధించకుండా ఫారం 15జీ / ఫారం15హెచ్ సమర్పించేందుకు సమయం ఇదే. -
ప్రభుత్వ సంస్థల్లో
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఒక ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్) పథకాన్ని తీసుకొచ్చింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ నిఫ్టీ పీఎస్ఈ ఈటీఎఫ్ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ ఈ నెల 16. కనీస పెట్టుబడి రూ.500. నిఫ్టీ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (పీఎస్) ఇండెక్స్ ఆధారంగా రూపొందించిన ఓపెన్ ఎండెడ్ పథకం ఇది. -
క్రెడిట్ కార్డుల ద్వారా క్యాష్బ్యాక్ ఎలా సంపాదించాలి?
క్యాష్బ్యాక్ క్రెడిట్ కార్డులు మీరు వస్తువులను కొనుగోలు చేయడానికి మీ కార్డు స్వైప్ చేసినప్పుడు కొంత డబ్బును తిరిగి పొందేందుకు ఉపయోగపడతాయి. -
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా? ఈ ప్రయోజనాలు తెలుసా?
Credit cards: సులభంగా క్రెడిట్ కార్డులు జారీ చేస్తుండటంతో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డుల్ని ఉపయోగిస్తున్నారు. వాటిని ఎలా సమర్థంగా వినియోగించాలో తెలుసుకోండిలా.. -
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
Section 54F: వారసత్వంగా వచ్చిన ఆభరణాలను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని ఇల్లు కొనుగోలుకు వినియోగిస్తే.. మూలధన లాభాల పన్ను వర్తించదని ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 54ఎఫ్ చెబుతోంది. -
ఆరోగ్య బీమా.. ఏ వయసులోనైతే మేలు..?
ఒక వ్యక్తి యుక్త వయసులోనే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియం తగ్గింపు సహా అనేక ప్రయోజనాలుంటాయి. అవేంటో తెలుసుకోండి.. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
Mutual Funds: స్మాల్ క్యాప్ ఫండ్లపై రాబడులివే
స్మాల్ క్యాప్ ఫండ్లలో రిస్క్ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు. -
సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు ప్రయోజనమేనా?
నాన్ లగ్జరీ కారు కొనుగోలు కంటే కొద్దిగా ఎక్కువ ఖర్చు చేస్తే అధునాతన ఫీచర్లు గల సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి కార్ల కొనుగోలుతో ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. -
జీవిత బీమాలో క్లెయిం సెటిల్మెంట్ ఎలా?
జీవిత బీమా క్లెయిమ్స్ సెటిల్మెంట్ అనేది బీమా సంస్థకు సంబంధించిన ముఖ్యమైన సేవల్లో కీలకమైనది. క్లెయిం సెటిల్మెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. -
ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
-
సంక్షోభం వేళ చౌతాలాకు షాక్.. భాజపా గూటికి పార్టీ ఎమ్మెల్యేలు..!
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
-
ఆ విషయంలో మా నిబద్ధత మారదు: మాల్దీవుల మంత్రితో జైశంకర్
-
ప్రయాణికుల రద్దీ.. 22 రైళ్లకు అదనపు కోచ్లు
-
చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం ప్రదానం