Apple Devices: యాపిల్ యూజర్లకు కేంద్రం భద్రతాపరమైన అలర్ట్
యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్లలో సెక్యూరిటీ లోపాలున్నట్లు భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ.. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: యాపిల్ యూజర్లకు కేంద్రం భద్రతాపరమైన అలర్ట్లను జారీ చేసింది. ఐఫోన్ (iPhone), ఐపాడ్ (iPad), యాపిల్ వాచ్ (Apple Watch), మ్యాక్బుక్ (MacBook)ల ఆపరేటింగ్ సిస్టమ్స్ (OS)తో పాటు సఫారీ బ్రౌజర్లో సెక్యూరిటీ లోపం ఉన్నట్లు గుర్తించామని భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ.. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (CERT-In) వెల్లడించింది. దీని వల్ల హ్యాకర్లు యాపిల్ ఉత్పత్తుల్లోని భద్రతా పరిమితులను అధిగమించి యూజర్ల సమాచారం సేకరించే అవకాశం ఉందని హెచ్చరించింది.
యాపిల్ డివైజ్లలోని సెక్యూరిటీ, వెబ్కిట్ కాంపోనెంట్లలో లోపాలు ఉన్నాయి. వీటి ద్వారా సైబర్ నేరగాళ్లు యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉంది. యూజర్లకు మాల్వేర్ లింక్స్, మెసేజ్లను పంపి డేటా తస్కరించే ప్రమాదం ఉంది
- ప్రకటనలో సెర్ట్-ఇన్
ఐఫోన్ 15 కొనబోతున్న ఎలాన్ మస్క్.. ఏం నచ్చిందో చెప్పిన బిలియనీర్!
మ్యాక్ ఓఎస్ వెర్షన్ - 12.7, 13.6, వాచ్ ఓఎస్ - 9.6.3, 10.0.1, ఐఓఎస్ వెర్షన్ - 17.0.1, ఐపాడ్ ఓఎస్ వెర్షన్ - 17.0.1 ఓఎస్లలో లోపాలు ఉన్నట్లు సెర్ట్-ఇన్ పేర్కొంది. వాటితోపాటు సఫారీ 16.6.1 వెర్షన్లో కూడా లోపం ఉంది. యూజర్లు తమ డేటాను సురక్షితంగా ఉంచేందుకు డివైజ్లలో లేటెస్ట్ వెర్షన్ ఓఎస్లను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. అయితే, ఐఫోన్ లేటెస్ట్ వెర్షన్ ఓఎస్గా ఐఓఎస్ 17.0.1 అందుబాటులో ఉంది. కానీ, సెర్ట్-ఇన్ పేర్కొన్న జాబితాలో ఇది కూడా ఉండటంతో, యాపిల్ కొత్త ఓఎస్ అప్డేట్ను త్వరలో విడుదల చేస్తుందని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
YouTube: యూట్యూబ్లో ఇక కామెంట్లను పాజ్ చేయొచ్చు!
YouTube: కంటెంట్ క్రియేటర్లకు వారి కామెంట్ సెక్షన్పై మరింత నియంత్రణ కల్పించేందుకు యూట్యూబ్ కొత్త ఫీచర్ని అందుబాటులోకి తెచ్చింది. -
boAt smartwatch: జియో e-సిమ్తో బోట్ తొలి స్మార్ట్వాచ్
boAt Lunar Pro LTE: ఇ-సిమ్ సపోర్ట్తో బోట్ తొలి స్మార్ట్వాచ్ తీసుకొస్తోంది. అంటే కాల్స్, మెసేజులు వంటి వాటికి ఇక స్మార్ట్ఫోన్ అక్కర్లేదు. -
వాట్సప్లో ఇకపై వాయిస్ మెసేజ్లకు ‘వ్యూ వన్స్’.. త్వరలో ఈ ఫీచర్ కూడా..
WhatsApp: వ్యక్తిగత చాట్ల భద్రతలో భాగంగా ఇప్పటివరకు ఎన్నో ఫీచర్లను అందుబాటులోకి తెచ్చిన వాట్సప్ ఇప్పుడు మరో ఫీచర్ని తీసుకొచ్చింది. -
Infinix Smart 8 HD: ‘మ్యాజిక్ రింగ్’తో ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 8 హెచ్డీ ఫోన్.. ధర, ఫీచర్లివే!
Infinix Smart 8 HD: స్మార్ట్ 7 హెచ్డీకి కొనసాగింపుగా స్మార్ట్ 8 హెచ్డీ ఫోన్ను ఇన్ఫీనిక్స్ శుక్రవారం భారత్లో విడుదల చేసింది. ఈ ఫోన్ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం! -
Google Gemini: గూగుల్ జెమిని వచ్చేసింది.. ప్రత్యేకతలివే
ఏఐ మోడల్ అడ్వాన్స్డ్ వెర్షన్ను గూగుల్ ప్రపంచానికి పరిచయం చేసింది. గూగుల్ జెమిని పేరుతో మూడు వేరియంట్లలో దీనిని తీసుకొచ్చింది. -
Jio Prepaid Plan: జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్.. ఓటీటీ సదుపాయంతో
Jio Prepaid Plan: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్ యూజర్ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇందులో ఓటీటీ సబ్స్క్రిప్షన్ కూడా జతచేసింది. -
YouTube: యూట్యూబ్లో ఇక గేమ్స్.. వీరికి మాత్రమే!
YouTube: ప్రీమియం సబ్స్క్రైబర్లను సంఖ్యను పెంచుకోవటంలో భాగంగా యూట్యూబ్ కొత్త ఫీచర్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. -
Apple: యూఎస్బీ-సి టైప్ నుంచి మినహాయింపు కోరిన యాపిల్
యూఎస్బీ-సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని యాపిల్ సంస్థ కేంద్రాన్ని కోరింది. -
విండోస్ 10 వాడుతున్నారా? సెక్యూరిటీ అప్డేట్స్ కావాలంటే చెల్లించాల్సిందే!
Windows 10 update: విండోస్ 10 వాడుతున్న వారు విండోస్ 11కు అప్గ్రేడ్ అవ్వాలి. లేదంటే భవిష్యత్లో సెక్యూరిటీ అప్డేట్స్కు డబ్బులు చెల్లించాలి. -
Redmi: ₹10 వేలకే రెడ్మీ 5జీ ఫోన్.. రెడ్మీ 13సీ ఫీచర్లు ఇవే..!
Redmi: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ రెడ్మీ తన సి సిరీస్లో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను భారత్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లను మూడు వేరియంట్లలో తీసుకొచ్చినట్లు పేర్కొంది. -
New sim card Rule: జనవరి 1 నుంచి సిమ్ కార్డుల జారీకి కొత్త రూల్
New Sim card rule: సిమ్ కార్డుల జారీకి కొత్త రూల్ జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఇకపై పేపర్ విధానం కనుమరుగు కానుంది. -
Instagram: త్వరలో ఫేస్బుక్, ఇన్స్టాలో క్రాస్ చాటింగ్ బంద్!
Instagram: ఫేస్బుక్, ఇన్స్టా మధ్య అనుసంధానానికి వీలు కల్పించిన క్రాస్ చాటింగ్ ఫీచర్ను తొలగించనున్నట్లు మెటా వెల్లడించింది. -
OnePlus 12: స్నాప్డ్రాగన్ లేటెస్ట్ ప్రాసెసర్తో వన్ప్లస్ 12.. ఇండియాలో ఎప్పుడంటే?
OnePlus 12: వన్ప్లస్ 12 ప్రస్తుతానికి చైనా మార్కెట్లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా జనవరిలో విడుదల కానుంది. -
Tecno Spark Go: ₹6,699కే టెక్నో కొత్త మొబైల్.. 5,000mAh బ్యాటరీ, 13ఎంపీ కెమెరా
Tecno Spark Go 2024: చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ టెక్నో.. స్పార్క్ గో 2024 పేరుతో కొత్త మొబైల్ని భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. -
Jio AirFiber: జియో ఎయిర్ఫైబర్లోనూ డేటా బూస్టర్ ప్లాన్.. ధర ఎంతంటే?
Jio AirFiber: జియో ఎయిర్ఫైబర్ బ్రాడ్బ్యాండ్ సేవల్లోనూ కంపెనీ డేటా బూస్టర్ ప్లాన్ను తీసుకొచ్చింది. దీంతో అదనంగా 1 టీబీ డేటా లభిస్తుంది. -
Airtel: డిస్నీ+ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్తో ఎయిర్టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్
Disney+ Hotstar Prepaid Plan: ఎయిర్టెల్ సంస్థ డిస్నీ+ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్తో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. -
Whatsapp: వాట్సప్లో యూజర్ నేమ్.. చాట్స్కు సీక్రెట్ కోడ్!
Whatsapp new features: వాట్సప్లో త్వరలో యూజర్ నేమ్ సదుపాయం రాబోతోంది. అలాగే ఎంపిక చేసిన చాట్స్ను లాక్ చేసిన వాటికి సీక్రెట్ కోడ్ పెట్టుకునే సదుపాయాన్ని వాట్సప్ తీసుకొస్తోంది. -
Tech tip: గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్.. స్పీడ్ చలాన్లకు ఇక చెక్
Google: గూగుల్ మ్యాప్స్లో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా స్పీడ్ చలాన్లకు చెక్ పెట్టొచ్చు. ఇంతకీ ఈ ఫీచర్ ఎలా ఉపయోగపడుతుంది? ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? -
Boat earbuds: 50 గంటల బ్యాటరీ లైఫ్తో బోట్ గేమింగ్ ఇయర్బడ్స్
Boat earbuds: సింగిల్ ఛార్జ్తో 50 గంటల ప్లేబ్యాక్ టైమ్తో బోట్ ఇయర్బడ్స్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2,299గా కంపెనీ నిర్ణయించింది. -
Smart watches: SOS సదుపాయంతో నాయిస్ రెండు కొత్త వాచ్లు
Noise Smart watches: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ నాయిస్ SOS కనెక్టివిటీతో రెండు సరికొత్త స్మార్ట్వాచ్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి... -
OnePlus: వన్ప్లస్ నార్డ్ సీఈ 3 ధర తగ్గింపు.. ఇప్పుడెంతంటే?
OnePlus Nord CE 3 Price Cut: జులైలో విడుదలైన వన్ప్లస్ నార్డ్ సీఈ 3 స్మార్ట్ఫోన్ ధరను కంపెనీ రూ.2,000 వరకు తగ్గించింది.


తాజా వార్తలు (Latest News)
-
Allu Aravind: మీ సందేహాలు ఇంకొన్నాళ్లు అలాగే ఉంచండి: అల్లు అరవింద్
-
TS News: ఆరు గ్యారంటీల్లో 2 పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్
-
IND vs SA: సఫారీలతో టీ20 సిరీస్.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?
-
Swiggy - Zomato: స్విగ్గీ, జొమాటోతోనే మాకు పోటీ: ఎడిల్విస్ సీఈఓ
-
BRS: ఎమ్మెల్సీలుగా పల్లా, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా
-
వారి అంకితభావానికి ఆశ్చర్యపోయా.. టాలీవుడ్ ప్రముఖులపై నెట్ఫ్లిక్స్ కో-సీఈవో పోస్టు