Stock Market : నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి.

Published : 18 Aug 2023 09:35 IST

ముంబయి: అంతర్జాతీయ సూచీల ప్రతికూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీ(stock market)లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో నిఫ్టీ 19,300 దిగువన కదలాడగా.. సెన్సెక్స్‌ 200 పాయింట్లు పడిపోయింది. ఉదయం 9.20 గంటలకు సెన్సెక్స్‌(Sensex) 183 పాయింట్లు నష్టపోయి 64,967 వద్ద.. నిఫ్టీ(Nifty) 57 పాయింట్లు క్షీణించి 19,307 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 83.07 వద్ద కొనసాగుతోంది.

నిఫ్టీలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, అదానీ పోర్ట్స్‌, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. కోల్‌ ఇండియా, టీసీఎస్‌, విప్రో, అపోలో హాస్పిటల్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు నష్టపోతున్నాయి. ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు భయాలతో అమెరికా మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. అటు ఆసియా మార్కెట్లు నేడు ఒత్తిడికి గురవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని