Stock Market : నష్టాల్లో దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు..

శుక్రవారం స్టాక్‌మార్కెట్‌ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి.

Published : 11 Aug 2023 09:40 IST

ముంబయి : అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Stock Market) సూచీలు శుక్రవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.25 గంటలకు సెన్సెక్స్‌(Sensex) 195 పాయింట్లు నష్టపోయి 65,492 వద్ద.. నిఫ్టీ(Nifty) 62 పాయింట్లు క్షీణించి 19480 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 82.75 వద్ద ఉంది.

నిఫ్టీలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, పవర్‌ గ్రిడ్‌ కార్ప్‌, టెక్‌ మహీంద్రా, హీరో మోటో కార్ప్‌, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ షేర్లు లాభాల్లో ఉండగా.. ఎన్టీపీసీ, సిప్లా, సన్‌ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, బ్రిటానియా ఇండస్ట్రీస్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

నేటి బోర్డు సమావేశాలు: అపోలో హాస్పిటల్స్‌, ఓఎన్‌జీసీ, ఎన్‌ఎమ్‌డీసీ, జీవీకే పవర్‌, హెచ్‌బీఎల్‌ పవర్‌, ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌, పాల్‌రెడ్‌ టెక్నాలజీస్‌, పతంజలి ఫుడ్స్‌, స్పైస్‌జెట్‌, బీఈఎంఎల్‌, కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌, సిటీ యూనియన్‌ బ్యాంక్‌, డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌, గ్లెన్‌మార్క్‌, గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌, నాల్కో, ఎన్‌హెచ్‌పీసీ, నైకా, పీఎఫ్‌సీ, ఫైజర్‌, రేమండ్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, సన్‌టీవీ, టీవీ టుడే, వోల్టాస్‌, వాబాగ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని