Comet EV: ఎంజీ కమెట్ వచ్చేసింది.. సింగిల్ ఛార్జ్తో 230km
Comet EV details: ఎంజీ మోటార్ ఇండియా కమెట్ వాహనాన్ని విడుదల చేసింది. దీని ధర రూ.7.98 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ మోరిస్ గ్యారేజెస్ అనుబంధ ఎంజీ మోటార్ ఇండియా (MG) తన కమెట్ విద్యుత్ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. వారం క్రితం దీని ప్రివ్యూ విడుదల చేసిన ఆ సంస్థ.. తాజాగా ధర, బుకింగ్ వివరాలను వెల్లడించింది. ఈ కారు ధర రూ.7.98 లక్షల నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. తక్కువ ఖర్చుతో పర్యావరణహితమైన వాహనాల కోసం చూస్తున్న అన్ని వయసుల వారిని లక్ష్యంగా చేసుకుని ఈ వాహనాన్ని ఎంజీ తీసుకొచ్చింది. మే 15 నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. గతంలో ఇదే కంపెనీ ZS EVని లాంచ్ చేసింది. ఆ కంపెనీ నుంచి వస్తున్న రెండో కారు ఇది.
ఎంజీ తీసుకొచ్చిన కమెట్ విద్యుత్ కారు వివిధ వేరియంట్లలో లభ్యమవుతుంది. కానీ, వాటి ధరల వివరాలను మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఇక స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే.. ఇందులో 17.3 kWh బ్యాటరీని అమర్చారు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 230 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. 3.3 kW ఛార్జర్తో 0-100 బ్యాటరీని 7 గంటల్లో పూర్తి చేయొచ్చని కంపెనీ పేర్కొంది. 10-80 శాతం ఛార్జింగ్కు 5 గంటలు పడుతుందని తెలిపింది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తున్న ఈ కారులో ముందు వైపు రెండు ఎయిర్బ్యాగ్స్ ఇస్తున్నారు. రెండు డోర్లు మాత్రమే ఉండే ఈ కారులో నాలుగు సీట్లు ఉంటాయి. రివర్స్ పార్కింగ్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సర్, ఎల్ఈడీ రియర్ ఫాగ్ ల్యాంప్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, సీట్ బెల్ట్ రిమైండర్ వంటి సదుపాయాలు ఉన్నాయి.
అర్బన్ కస్టమర్లే టార్గెట్..
నగరాలు, పట్టణాల్లో నివసించే కస్టమర్లను ఉద్దేశించి ఈ కారును ఎంజీ తీసుకొచ్చింది. రోజుకు 100 కంటే తక్కువ కిలోమీటర్లు ప్రయాణించే కస్టమర్లకోసం కమెట్ను తీసుకొస్తున్నట్లు ఎంజీ మోటార్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్లో విద్యుత్ వాహనాల సంఖ్య 2 శాతంగా ఉందని, ఈ సంఖ్య 10 శాతానికి చేరుకుంటుందని అంచనా వేశారు. రూ.10 లక్షల్లోపు విద్యుత్ వాహనం కోసం చూసే వారికి కమెట్ ఈవీ మంచి ఎంపిక అవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న టాటా టియాగో ఈవీ, సిట్రోయెన్ EC3 విద్యుత్ కార్లకు కమెట్ పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ధరలు తగ్గించిన ఓలా.. ఎస్1X ఇక రూ.69,999 నుంచే!
ఓలా తన ఎస్1 ఎక్స్ స్కూటర్ల ధరలను తగ్గించింది. ఇకపై వీటి ధరలు రూ.69వేల నుంచే ప్రారంభం కానున్నాయి. -
2023-24లో 5.5% తగ్గిన వాహన ఎగుమతులు
Automobile exports: 2024 ఆర్థిక సంవత్సరంలో వాహన ఎగుమతులు 5.5శాతం తగ్గాయని తయారీదార్ల సమాఖ్య వెల్లడించింది. -
ఓలా నుంచి త్వరలో మరో స్కూటర్.. ఎస్1 ఎక్స్ సిరీస్లో ఈ ఫీచర్లతో!
Ola Electric: ఓలా మరో స్కూటర్ తీసుకురాబోతోంది. ఎస్1 ఎక్స్ సిరీస్లో అప్డేట్ చేసిన వెర్షన్ వస్తోంది. -
విపణిలోకి ఎంజీ హెక్టార్ బ్లాక్స్టార్మ్
ఎంజీ (మోరిస్ గ్యారేజెస్) మోటార్ సంస్థ, తమ హెక్టార్ మోడల్లో సరికొత్త బ్లాక్స్టార్మ్ ఎడిషన్ను తీసుకొచ్చింది. -
స్విఫ్ట్, విటారా ధరల్ని పెంచిన మారుతీ సుజుకీ
Maruti Suzuki: మారుతీ సుజుకీ ఇండియా తన విపణిలోని కొన్ని మోడల్ వాహనాల ధరల్ని పెంచినట్లు బుధవారం ప్రకటించింది. -
బజాజ్ నుంచి కొత్త పల్సర్ N250
Bajaj Pulsar N250: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో కొత్త N250ని లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ @ రూ.20.5 లక్షలు
Jeep Compass: జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ విడుదలైంది. దీన్ని పూర్తిగా బ్లాక్-గ్లాస్ ఫినిష్తో తీర్చిదిద్దింది. -
2023-24 వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి.. కార్లు, ట్రాక్టర్లలో రికార్డు!
Automobile retail sales: వాహనాల లభ్యత మెరుగవ్వడం, కొత్త మోడళ్ల విడుదల వంటి అంశాలు దోహదం చేయటంతో విక్రయాలు పుంజుకున్నట్లు ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. -
ఏథర్ నుంచి ఫ్యామిలీ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 160 km
ఏథర్ సంస్థ రిజ్తా పేరుతో ఫ్యామిలీ స్కూటర్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.1.10 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్
టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్లో మరిన్ని ప్రీమియం మోడళ్లను తీసుకురావాలని భావిస్తోందని కంపెనీ డిప్యూటీ ఎండీ తడషి అసజుమా పేర్కొన్నారు. -
బీఎండబ్ల్యూ.. టాటా టెక్ జాయింట్ వెంచర్
BMW-Tata Tech: జాయింట్ వెంచర్ నుంచి బీఎండబ్ల్యూ (BMW) గ్రూప్నకు చెందిన ప్రీమియం వాహనాలకు కావాల్సిన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ (SDV) సొల్యూషన్స్తో పాటు ఇతర ఐటీ సేవలను అందించనున్నారు. -
వాహన బీమా సంస్థల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో సాధారణ బీమా సంస్థలకు సంబంధించి.. వాహన బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి. -
ట్రాక్టర్ల వ్యాపారానికి ఫోర్స్ మోటార్స్ గుడ్బై
Force Motors: ఆటో మొబైల్ కంపెనీ ఫోర్స్ మోటార్స్ వ్యవసాయ ట్రాక్టర్ల వ్యాపారం నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
Xiaomi Car: షావోమి కారు ధర ఎంత ఉండొచ్చంటే.. సీఈఓ మాటల్లో!
Xiaomi Car: షావోమి కార్ల ఆర్డర్లు చైనాలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ కారు ధరపై సోమవారం ఆసక్తిక విషయం వెల్లడించారు. -
Kia India: ఏప్రిల్ నుంచి కియా వాహనాల ధరల పెంపు
Kia India: కియా ఇండియా వాహన ధరల్ని పెంచనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. -
Summer: కార్లలో వీటిని ఉంచొద్దు.. ప్రమాదకరం..!
వేసవిలో కార్లకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాటిని ఎండలో ఉంచేటప్పుడు అందులో కొన్ని రకాల వస్తువులు ఉంటే ప్రమాదకరం. -
Xiaomi: షావోమీ విద్యుత్తు కార్ల విక్రయాలు మొదలు..!
చైనాలో మరో టెక్ దిగ్గజం విద్యుత్తు కార్ల మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ నెలలోనే డెలివరీలను ప్రారంభిస్తామని ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం