అలాంటి వలలో పడొద్దు.. ‘పిగ్ బుచరింగ్ స్కామ్స్’పై నితిన్ కామత్ టిప్స్..!
Nithin Kamath tips: పిగ్ బుచరింగ్ స్కామ్స్ దేశంలో పెరిగిపోయాయని జిరోదా సీఈఓ నితిన్ కామత్ అన్నారు. ఈ స్కామ్స్ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Nithin Kamath | ఇంటర్నెట్ డెస్క్: డిజిటల్ యుగంలో ఆన్లైన్ మోసాలకు కొదవే లేదు. ఎప్పుడు ఏ రూపంలో ఎవరు వల వేస్తారో గుర్తించడం కష్టం. ఒక్కసారి అలాంటి వలకు చిక్కితే ఇక అంతే.. జీవితం తలకిందులైపోతుంది. సాధారణంగా ఉద్యోగాలు, పెట్టుబడికి అధిక ప్రతిఫలం వంటివి ఎక్కువ ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తాయి. సరిగ్గా ఈ ఆశే నేరగాళ్లకు వరమవుతోంది. వీటినే ఆశ చూపి చనువుగా వ్యవహరించి మోసాలకు పాల్పడుతుంటారు. ఈ తరహా మోసాలనే పిగ్ బుచరింగ్ అంటారు. ఈ మోసాలు జరుగుతున్న తీరు.. వాటి బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిపై జిరోదా వ్యవస్థాపకుడు, సీఈఓ నితిన్ కామత్ కొన్ని ఆలోచనలను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.
భారత్లో ‘పిగ్ బుచరింగ్’ మోసాలు పదుల కోట్ల స్థాయికి చేరిందని నితిన్ కామత్ పేర్కొన్నారు. ఫేక్ జాబ్ ఆఫర్లు, అధిక మొత్తంలో ప్రతిఫలం, క్రిప్టోలో పెట్టుబడుల రూపంలో ఈ మోసాలు జరుగుతున్నాయన్నారు. ఈ తరహా మోసాలకు పాల్పడే వారు ముందుగా అవతలి వారి నమ్మకాన్ని గెలుచుకోవడడానికి ప్రయత్నిస్తారని చెప్పారు. ఇందుకోసం ఫేక్ ప్రొఫైళ్లతో ప్రేమ, స్నేహం వంటివి నటిస్తారని చెప్పారు. ఆ తర్వాత ఉద్యోగాలు, అధిక ప్రతిఫలం ఆశజూపి మోసగిస్తుంటారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఈ తరహా మోసాలే జరుగుతున్నాయని చెప్పారు.
2 దశాబ్దాల తర్వాత టాటాల నుంచి ఐపీఓ.. తేదీ, ఇతర వివరాలు ఇవే!
ఇలా మోసాలకు పాల్పడే వ్యక్తులు ఇంతకుముందు ఇదే తరహా మోసాలకు బాధితులేనంటూ ఓ ఉదంతాన్ని నితిన్ కామత్ ఉదహరించారు. ఉద్యోగాల కోసం వెళ్లిన వారు విదేశాల్లో మోసపోయి తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో భారత్కు చెందిన వారినే సోషల్మీడియా ద్వారా ఫేక్ ప్రొఫైల్స్తో మోసగిస్తుంటారని చెప్పారు. క్విక్ మనీ, విదేశాల్లో ఉద్యోగం వంటివి సహజంగానే భారతీయులను ఆకర్షిస్తుంటాయని, ఇవే మోసగాళ్లకు వరంలా మారుతున్నాయని చెప్పారు. కాబట్టి ఈ తరహా మోసాల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలని సూచించారు.
ఇవి చేయొద్దు
- వాట్సప్ గానీ, ఇతర ఏ సామాజిక మాధ్యమం అయినా సరే తెలీని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలకు రిప్లయ్ ఇవ్వొద్దు.
- ఎవరైనా కొత్త యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని గానీ, లింక్ ఓపెన్ చేయమని గానీ చెప్తే ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు.
- మోసాలకు పాల్పడేవారు నమ్మకం, భయం, కల, అత్యాశ వంటి భావోద్వేగాలతో ఆడుకుంటారు. కాబట్టి దేనికీ అంతవేగంగా లొంగిపోవద్దు.
- ఆలోచించకుండా ఏ నిర్ణయమూ తీసుకోవద్దు. తొందరపడి నిర్ణయాలు తీసుకునేవారే ఇలాంటి మోసాల బారిన పడే అవకాశం ఉంటుంది.
- మీకేదైనా అనుమానం ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లండి. లేదంటే ఎవరైనా లాయర్ను సంప్రదించండి.
- ఎవరైనా జాబ్ అని గానీ, అధిక ప్రతిఫలం ఆశ చూపితే అనుమానపడాల్సిందే.
- కొత్త వ్యక్తులెవరితోనూ ఆధార్, పాస్పోర్ట్, బ్యాంక్, పెట్టుబడులకు సంబంధించి వివరాలు పంచుకోవద్దు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Appleలో ఉద్యోగం కావాలా? ఈ నైపుణ్యాలు ఉండాలంటున్న సీఈఓ టిమ్ కుక్!
Apple: తమ కంపెనీలో పనిచేయాలనుకునే ఉద్యోగులకు ఉండాల్సిన నైపుణ్యాల గురించి యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇటీవల ఓ పాడ్కాస్ట్లో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తనకు నచ్చిన కొన్ని పుస్తకాలనూ వెల్లడించారు. -
వ్యక్తిగత రుణపాశాలు
ఇటీవలి కాలంలో భారత్లో వ్యక్తిగత రుణాలు కట్టుతప్పుతున్నాయి. వాటి చెల్లింపుల్లోనూ జాప్యం నెలకొంటోంది. దేశార్థికానికి ఇది ఏమాత్రం మంచిది కాదని గుర్తించిన రిజర్వు బ్యాంకు కొద్దిరోజుల క్రితం కీలక నిర్ణయం తీసుకుంది. -
ChatGPT CEO: లాభాపేక్షనా? ఆధిపత్య పోరా? ఆల్టమన్ తొలగింపు కారణమేంటి?
Sam altman: చాట్జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ సీఈఓగా ఆల్టమన్ తొలగింపు టెక్ వర్గాల్లో సంచలనానికి కారణమైంది. బోర్డు చెప్తున్న కారణం ఒకటైతే.. ఆల్టమన్ వైఖరి పట్ల కొందరికి భిన్నాభిప్రాయాలే దీనికి ముఖ్య కారణమని టెక్ వర్గాలు కోడైకూస్తున్నాయి. -
Coffee Badging: కాఫీ బ్యాడ్జింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో కొత్త ట్రెండ్!
Coffee Badging: క్వైట్ క్విట్టింగ్, రేజ్ అప్లయింగ్, గ్రేట్ రెసిగ్నేషన్ తరహాలో తాజాగా మరో కొత్త ట్రెండ్ వెలుగులోకి వచ్చింది. అదే కాఫీ బ్యాడ్జింగ్. అదేంటో చూద్దాం..! -
TV on mobile: సెల్ఫోన్లోనే టీవీ.. ఈ సంస్థలెందుకు వ్యతిరేకిస్తున్నాయ్?
Live TV on mobile: మొబైల్లోనే టీవీ ప్రసారాలు అందించేందుకు ఉద్దేశించిన టెక్నాలజీపై పరిశ్రమ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇందుకు ఆయా కంపెనీలు వివిధ కారణాలు చూపుతున్నాయి. -
Remote work: రిమోట్ వర్క్తో కెరీర్కు నష్టమే..!
Remote work culture: రిమోట్ వర్క్ వల్ల కెరీర్లో ఎంతో కోల్పోతారని, అలాంటి వారు ఎప్పటికీ సీఈఓ స్థాయికి చేరుకోలేరని న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పేర్కొన్నారు. -
9AM నుంచి 9PM.. వారానికి 100 గంటలు.. పని గంటలపై బాస్ల మాట!
CEOs on Working hours: వారానికి 70 గంటల చొప్పున యువత పనిచేయాలంటూ నారాయణమూర్తి వ్యక్తంచేసిన అభిప్రాయంపై చర్చ ప్రారంభమైంది. దీంతో గతంలో పని గంటల గురించి పలువురు బాస్లు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.. -
Online Scams: ఆన్లైన్లో ఎన్ని స్కాములో..! మరి వీటిని గుర్తించేదెలా?
ప్రస్తుత కాలంలో టెక్నాలజీతో పాటు ఆన్లైన్ మోసాలు బాగా పెరిగాయి. ఈ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కినట్లే. -
Tech Shame: జనరేషన్ జడ్పై ‘టెక్’ ఎఫెక్ట్.. ఇంతకీ ఏమిటీ టెక్ షేమ్?
Tech Shame: టెక్ షేమింగ్ అనే పదం ఈ మధ్య వాడుకలోకి వచ్చింది. జనరేషన్ జడ్ యువత ఉద్యోగ జీవితంలో టెక్నాలజీ వినియోగంలో ఇబ్బంది పడడాన్ని టెక్ షేమింగ్గా పేర్కొంటున్నారు. -
చమురు ధరలు భగ్గుమంటాయా?
ఇజ్రాయెల్తో భారత్కు బలమైన దౌత్య సంబంధాలున్నాయి. మరోవైపు, అరబ్ దేశాలకూ భారత్ చేరువవుతోంది. ప్రస్తుతం ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయా దేశాలతో స్నేహం దెబ్బతినకుండా భారత్ ఆచితూచి వ్యవహరించాలి. -
జీవ ఇంధనమే భవిష్యత్తు!
ప్రపంచవ్యాప్తంగా జీవ ఇంధనంవైపు మొగ్గు పెరుగుతోంది. ఈ రంగంలో అంతర్జాతీయ వాణిజ్యాన్నిపెంపొందించడానికి పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. దీనివల్ల ఆయా దేశాలకు ముడిచమురు దిగుమతి వ్యయాలు తగ్గుతాయి. ఇతర ప్రయోజనాలూ సిద్ధిస్తాయి. -
ఆరోగ్య బీమా... దక్కని ధీమా!
అత్యవసరంగా చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితుల్లో ఆరోగ్య బీమా ఆసరాగా నిలుస్తుంది. భరించలేని ఆస్పత్రి బిల్లులతో కుటుంబాలు రోడ్డుమీద పడకుండా నిరోధిస్తుంది. -
విప్లవాత్మక మార్పులకు 6జీ ఆలంబన
దేశంలో 5జీ టెలికాం సాంకేతికత వినియోగం ఊపందుకుంటోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 700 జిల్లాల్లో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఈ క్రమంలో మరింత అధునాతనమైన 6జీ సాంకేతికత వైపు సన్నాహాలు మొదలయ్యాయి. -
తలసరి ఆదాయంలో మనమెక్కడ?
ప్రపంచ ప్రజల సగటు తలసరి ఆదాయం 13,800 డాలర్లు. ఇది చైనా తలసరి ఆదాయానికి దాదాపు సమానం. భారత్లో తలసరి ఆదాయం 2,600 డాలర్లే! పైగా డ్రాగన్ దేశ జనాభాను ఇండియా మించిపోయింది. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నభారత్- అందుకు ఎంతగానో కృషి చేయాల్సి ఉంది. -
ఆదాయాల తెగ్గోత... పొదుపులో క్షీణత
భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఇటీవలి నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరం భారతదేశ కుటుంబాల నికర ఆర్థిక పొదుపు-దేశ మొత్తం జీడీపీలో 5.1శాతం. ఇది గత దశాబ్ద కాలంలోనే అతి తక్కువ. ద్రవ్యోల్బణం, నిరుద్యోగమే దీనికి ప్రధాన కారణాలు. -
అంతరిక్ష రంగంలోకి విదేశీ పెట్టుబడులు
చంద్రయాన్-3 విజయం అంతరిక్ష రంగంలో భారత్ సత్తాను మరోసారి ప్రపంచానికి తెలియజెప్పింది. ఈ రంగంపై సంపూర్ణ ఆధిపత్యం సాధించడానికి ఇండియా ఇంకా చాలాదూరం ప్రయాణించాల్సి ఉంది. ప్రధాన అడ్డంకిగా మారిన నిధుల లేమిని అధిగమించేందుకు ప్రైవేటు పెట్టుబడులను భారత్ ప్రోత్సహిస్తోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకూ సిద్ధమవుతోంది. -
పెద్దనోట్ల రద్దుతో ప్రయోజనమెంత?
దేశం నుంచి నల్లధనాన్ని ఏరివేసేందుకు కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసింది. ఈ ‘క్లీన్ నోట్’ విధానంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) తాజాగా రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంది. దీనికి సంబంధించిన గడువు ముగిసినప్పటికీ, మిగిలిపోయిన నోట్లను తమ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకోవచ్చని ఆర్బీఐ వెల్లడించింది. -
నిషేధం నుంచి నియంత్రణ వైపు... క్రిప్టో
క్రిప్టో కరెన్సీల నియంత్రణ కోసం ఒక అంతర్జాతీయ నిబంధనావళి రూపకల్పనకు కృషి చేయాలని దిల్లీ వేదికగా జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు నిర్ణయించింది. ఇది కీలక పరిణామం. అయితే, ఈ విషయంలో ఎన్నో సందేహాలు, సందిగ్ధతలు నెలకొన్నాయి. -
కలవరపెడుతున్న ముడిచమురు ధరలు
పారిశ్రామిక, ఆర్థిక కార్యకలాపాలు, ప్రజా జీవనం సాఫీగా సాగడానికి ఇంధనమే చోదకశక్తి. కొన్ని నెలలపాటు నిలకడగా ఉన్న ముడి చమురు ధరలు ఇటీవల మళ్ళీ ఎగబాకాయి. దాంతో చమురును దిగుమతి చేసుకునే దేశాల్లో కలవరం మొదలైంది. -
అభివృద్ధి ముసుగులో చైనా అప్పుల వల!
సిల్క్రూట్... రెండు వేల ఏళ్ల క్రితం ప్రసిద్ధ వాణిజ్య మార్గం. ప్రాచీన మార్గానికి సరికొత్త రూపంగా చైనా 2013లో ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ)’ ప్రాజెక్టును చేపట్టింది.