జులై 28 నుంచి ola s1 air బుకింగ్స్.. వీళ్లకు రూ.10వేలు తక్కువకే..
Ola S1 Air: విద్యుత్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ కొత్త ఓలా s1 air బుకింగ్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా పాత కస్టమర్లకు ఓలా ఆఫర్ కూడా ప్రకటించింది.
ఇంటర్నెట్డెస్క్: విద్యుత్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తన s1 air ద్విచక్ర వాహనాన్ని భారత మార్కెట్లోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమైంది. MoveOS-3 ఫీచర్తో తీసుకొచ్చిన ఈ స్కూటర్ బుకింగ్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కంపెనీ సీఈఓ భవీశ్ అగర్వాల్ (Bhavish Aggarwal) తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. అయితే, ఓలా పాత కస్టమర్లు, ఇంతకుముందే ఓలా s1 air కోసం రిజర్వ్ చేసుకున్న వారు మాత్రమే జులై 28 నుంచి 30 వరకు జరగనున్న ప్రీ బుకింగ్ ఆర్డర్లలో స్కూటర్ కోసం బుక్ చేసుకోవచ్చు. వీరికి ధరలో కొంత తగ్గింపు కూడా ప్రకటించారు.
దీని ధర రూ.1,19,999 (ఎక్స్ షోరూం)గా కంపెనీ నిర్ణయించింది. అయితే ప్రీ బుకింగ్ నిర్వహించనున్న మూడు రోజుల్లో బుక్ చేసుకున్న వారికి రూ.10వేల తగ్గింపుతో రూ.1,09,999 కే ఓలా s1 air లభిస్తుంది. ఆ తర్వాత జులై 31 నుంచి ఇతర వినియోగదారులు ఈ స్కూటర్ కోసం బుక్ చేసుకోవచ్చు. అయితే వీరికి ధర రూ.1,19,999గా ఉంటుంది. ఆగస్టు నుంచి స్కూటర్ల డెలివరీని ప్రారంభించనున్నట్లు భవీశ్ తెలిపారు.
ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఓలా s1 air MoveOS-3 ఫీచర్తో రానుంది. 2.5 kWh బ్యాటరీ ప్యాక్తో పాటు హబ్ మౌంటెడ్ మోటర్ను కలిగి ఉంటుంది. ఈ విద్యుత్ స్కూటర్ను ఒకసారి ఛార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. 9.8 సెకన్లలో 60 kmph వేగాన్ని అందుకుంటుంది. గంటకు 90 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో వెళ్లొచ్చని కంపెనీ తెలిపింది. కేవలం 4:50 గంటల్లో బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు.
Ola S1 ఎయిర్ ముందు భాగంలో స్టాండెడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ , వెనుకవైపు షాక్ అబ్జార్బర్లతో ఉంటుంది. సీటు కింద 34 లీటర్ల బూట్స్పేస్ అందిస్తున్నారు. తక్కువ బరువు ఉండేలా ఈ స్కూటర్ను డిజైన్ చేశారు. ఇందులో 7 అంగుళాల టచ్స్క్రీన్ అందిస్తున్నారు. వీటితో పాటు ఎకో, నార్మల్, స్పోర్ట్స్ మోడ్స్ ఇస్తున్నారు. పాసిలెన్ వైట్, లిక్విడ్ సిల్వర్, మిడ్నైట్ బ్లూ, కోరల్ గ్లామ్ రంగుల్లో లభిస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ యాప్/వెబ్సైట్ ద్వారా గానీ రూ.999 కట్టి స్కూటర్ను బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km
electric scooter: భారత్ మార్కెట్లోకి మరో కొత్త విద్యుత్ స్కూటర్ వచ్చేసింది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన యాంపియర్ ఈ స్కూటర్ను లాంచ్ చేసింది. -
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
Mahindra XUV 3XO: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎక్స్యూవీ 3XOను లాంచ్ చేసింది. దీని ధర రూ.7.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ధరలు తగ్గించిన ఓలా.. ఎస్1X ఇక రూ.69,999 నుంచే!
ఓలా తన ఎస్1 ఎక్స్ స్కూటర్ల ధరలను తగ్గించింది. ఇకపై వీటి ధరలు రూ.69వేల నుంచే ప్రారంభం కానున్నాయి. -
2023-24లో 5.5% తగ్గిన వాహన ఎగుమతులు
Automobile exports: 2024 ఆర్థిక సంవత్సరంలో వాహన ఎగుమతులు 5.5శాతం తగ్గాయని తయారీదార్ల సమాఖ్య వెల్లడించింది. -
ఓలా నుంచి త్వరలో మరో స్కూటర్.. ఎస్1 ఎక్స్ సిరీస్లో ఈ ఫీచర్లతో!
Ola Electric: ఓలా మరో స్కూటర్ తీసుకురాబోతోంది. ఎస్1 ఎక్స్ సిరీస్లో అప్డేట్ చేసిన వెర్షన్ వస్తోంది. -
విపణిలోకి ఎంజీ హెక్టార్ బ్లాక్స్టార్మ్
ఎంజీ (మోరిస్ గ్యారేజెస్) మోటార్ సంస్థ, తమ హెక్టార్ మోడల్లో సరికొత్త బ్లాక్స్టార్మ్ ఎడిషన్ను తీసుకొచ్చింది. -
స్విఫ్ట్, విటారా ధరల్ని పెంచిన మారుతీ సుజుకీ
Maruti Suzuki: మారుతీ సుజుకీ ఇండియా తన విపణిలోని కొన్ని మోడల్ వాహనాల ధరల్ని పెంచినట్లు బుధవారం ప్రకటించింది. -
బజాజ్ నుంచి కొత్త పల్సర్ N250
Bajaj Pulsar N250: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో కొత్త N250ని లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ @ రూ.20.5 లక్షలు
Jeep Compass: జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ విడుదలైంది. దీన్ని పూర్తిగా బ్లాక్-గ్లాస్ ఫినిష్తో తీర్చిదిద్దింది. -
2023-24 వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి.. కార్లు, ట్రాక్టర్లలో రికార్డు!
Automobile retail sales: వాహనాల లభ్యత మెరుగవ్వడం, కొత్త మోడళ్ల విడుదల వంటి అంశాలు దోహదం చేయటంతో విక్రయాలు పుంజుకున్నట్లు ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. -
ఏథర్ నుంచి ఫ్యామిలీ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 160 km
ఏథర్ సంస్థ రిజ్తా పేరుతో ఫ్యామిలీ స్కూటర్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.1.10 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్
టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్లో మరిన్ని ప్రీమియం మోడళ్లను తీసుకురావాలని భావిస్తోందని కంపెనీ డిప్యూటీ ఎండీ తడషి అసజుమా పేర్కొన్నారు. -
బీఎండబ్ల్యూ.. టాటా టెక్ జాయింట్ వెంచర్
BMW-Tata Tech: జాయింట్ వెంచర్ నుంచి బీఎండబ్ల్యూ (BMW) గ్రూప్నకు చెందిన ప్రీమియం వాహనాలకు కావాల్సిన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ (SDV) సొల్యూషన్స్తో పాటు ఇతర ఐటీ సేవలను అందించనున్నారు. -
వాహన బీమా సంస్థల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో సాధారణ బీమా సంస్థలకు సంబంధించి.. వాహన బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి. -
ట్రాక్టర్ల వ్యాపారానికి ఫోర్స్ మోటార్స్ గుడ్బై
Force Motors: ఆటో మొబైల్ కంపెనీ ఫోర్స్ మోటార్స్ వ్యవసాయ ట్రాక్టర్ల వ్యాపారం నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
Xiaomi Car: షావోమి కారు ధర ఎంత ఉండొచ్చంటే.. సీఈఓ మాటల్లో!
Xiaomi Car: షావోమి కార్ల ఆర్డర్లు చైనాలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ కారు ధరపై సోమవారం ఆసక్తిక విషయం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్