Oppo A59 5G: ₹15వేల బడ్జెట్‌లో ఒప్పో కొత్త 5జీ ఫోన్‌.. విశేషాలివీ..

Oppo A59 5G: మొబైల్‌ తయారీ సంస్థ ఒప్పో ‘ఏ’ సిరీస్‌లో ఒప్పో ఏ59 5జీ పేరుతో కొత్త మొబైల్‌ని శుక్రవారం భారత్‌ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది.

Updated : 22 Dec 2023 18:10 IST

Oppo A59 5G | ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ఒప్పో (Oppo) తన ‘ఏ’ సిరీస్‌లో మరో ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఒప్పో ఏ59 5జీ (Oppo A59 5G) పేరుతో కొత్త మొబైల్‌ని భారత్‌ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. 5,000mAh బ్యాటరీ, డ్యూయల్‌ కెమెరాతో వస్తున్న ఈ ఫోన్‌ ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.

ఒప్పో కొత్త ఫోన్‌ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 4జీబీ+128జీబీ వేరియంట్‌ ధరను రూ.14,999గా కంపెనీ నిర్ణయించింది. 6జీబీ+128 జీబీ వేరియంట్‌ ధరను మాత్రం ఇంకా వెల్లడించలేదు. సిల్క్ గోల్డ్, స్టార్రి బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్‌ లభిస్తుంది. డిసెంబరు 25 నుంచి ఒప్పో స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ వెబ్‌సైట్లతో పాటు ఇతర రిటైల్‌ దుకాణాల ద్వారా కొనుగోలు చేయొచ్చని కంపెనీ ప్రకటించింది. ఎస్‌బీఐ కార్డ్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా క్రెడిట్‌ కార్డ్‌, ఏయూ ఫైనాన్స్‌ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేసినవారికి రూ.1,500 డిస్కౌంట్‌ అందించనుంది. ఆరు నెలల వరకు నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

ఎలక్ట్రిక్‌ టూవీలర్స్‌పై ఆఫర్స్‌.. కొనుగోలుకు ఇదే ఛాన్స్‌!

ఫీచర్ల విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 (Android 13)తో పనిచేస్తుంది. ఇందులో 6.56 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేటుతో వస్తోంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ (MediaTek Dimensity) 6020 ప్రాసెసర్‌ ఇచ్చారు. వెనకవైపు 13 ఎంపీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ కెమెరా ఇచ్చారు. వీడియో కాల్‌, సెల్ఫీల కోసం ముందుభాగంలో 8 ఎంపీ కెమెరా ఇచ్చారు. 5,000 mAh బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 30 నిమిషాల్లో 52శాతం ఛార్జ్‌ అవుతుందని ఒప్పో పేర్కొంది. 3.5 ఎంఎం ఆడియో జాక్‌, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని