రైతులకు నెల నెలా ₹3వేల పింఛన్.. అర్హత ఏంటి? ఎంత చెల్లించాలి?
PM Kisan Mandhan Yojana: వృద్దాప్యంలోని చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికంగా చేయూతనందిచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకమే ప్రధాన మంత్రి కిసాన్ మాన్ధన్ యోజన (PM Kisan Mandhan Yojana).
ఇంటర్నెట్ డెస్క్: రైతుకు ఆసరా కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలు ప్రవేశపెట్టింది. రైతుల రుణాల కోసం కిసాన్ క్రెడిట్ కార్డులను ఇస్తోంది. పెట్టుబడి సాయం కోసం పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తోంది. అలాగే, వయసు పైబడిన రైతులకు ఆర్థికంగా తోడుగా నిలవాలనే ఉద్దేశంతోనే అమలు చేస్తున్న మరో పథకమే ప్రధాన మంత్రి కిసాన్ మాన్ధన్ యోజన (PM Kisan Mandhan Yojana). ఈ పథకం కింద 60 ఏళ్లు నిండిన రైతులు నెలకు కనీసం రూ.3 వేల చొప్పున పెన్షన్ పొందచ్చు. ఈ పథకం అర్హత, నమోదు వివరాలు ఇవీ..
అర్హత..
దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సంబంధిత భూ రికార్డుల్లో పేర్లు ఉండాలి. అందులో 2 హెక్టార్ల వరకు సాగు చేయదగిన భూమి కలిగి ఉండాలి. 18-40 మధ్య వయసున్నవారై ఉండాలి. వయసు 60 దాటాక ఈ పథకం కింద నెలకు కనీస పింఛను రూ.3 వేలు అందుతుంది. ఒక వేల అర్హుడైన వ్యక్తి మరణిస్తే అతడి జీవిత భాగస్వామికి 50 శాతం పెన్షన్ వస్తుంది. కేవలం భాగస్వామికి మాత్రమే ఇలా పెన్షన్ లభించే వెసులు బాటు ఉంటుంది. అతడి పిల్లలకు వర్తించదు.
ఎంత కట్టాలంటే?
అర్హుడైన రైతు తనకు 60 ఏళ్లు వచ్చేంత వరకు నెలకు రూ.55 నుంచి రూ.220 వరకు చెల్లించాలి. రైతుకు 60 ఏళ్లు నిండగానే పెన్షన్ కోసం క్లెయిమ్ చేసుకోవాలి. అనంతరం ప్రతి నెలా రైతు బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం ఆ పెన్షన్ను అందిస్తుంది.
వీరు అనర్హులు..
నేషనల్ పెన్షన్ స్కీం (NPS), ఈఎస్ఐ, ఈపీఎఫ్వో పథకం తో పాటు ఏ ఇతర చట్టబద్ధమైన సామాజిక భద్రతా పథకాల నుంచి లబ్ది పొందుతున్న వారు.. జాతీయ పెన్షన్ పథకాన్ని ఎంచుకున్న రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులు.
ఇవీ కావాల్సినవి..
ఈ పథకంలో చేరాలంటే దరఖాస్తుదారుడు ఆధార్కార్డు, బ్యాంకు పాస్బుక్, పేరు, పుట్టిన తేదీ, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, జీవిత భాగస్వామి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. అర్హత గల రైతులు తమ ప్రాంతంలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్/ మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న రైతులు 60 ఏళ్లు వచ్చే వరకు నెలవారీ చందాగా రూ.55 నుంచి రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు నిండాక పింఛన్ అందుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా రోజువారీ ఖర్చులను అందించేలా...
వైద్య ఖర్చులు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. అదే సమయంలో ఆరోగ్య బీమా రంగంలోనూ ఎన్నో మార్పులు వస్తున్నాయి. -
కేవైసీ అప్డేట్ చేశారా?
బ్యాంకులో ఖాతా ఉందా? మ్యూచువల్ ఫండ్లో మదుపు చేస్తున్నారా? జీవిత, ఆరోగ్య బీమా పాలసీలున్నాయా? మరి, మీ కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) వివరాలు తెలియజేయడం తప్పనిసరి. -
IRCTC refund: ఐఆర్సీటీసీ రిఫండ్స్ ఇక వేగవంతం.. గంటలోనే నగదు వెనక్కి?
IRCTC refund process: రైలు టికెట్ బుక్ చేసినప్పుడు డబ్బులు డెబిట్ అయ్యాయా? ఇకపై ఆ సొమ్ము కోసం రోజులతరబడి ఎదురు చూడాల్సిన పనిలేదు. ఈ ప్రక్రియ వేగవంతం కానుంది. -
Paytm పేమెంట్స్ బ్యాంక్లో ఈ సేవలకు.. మరికొన్ని రోజులే గడువు
Paytm payments bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో కొన్ని సేవలకు గడువు మార్చి 15తో ముగియనుంది. ఆ తర్వాత వాటిని కొనసాగించలేరు. -
Aadhaar Update: ఆధార్ ఉచిత అప్డేట్కు మరోసారి గడువు పొడిగింపు
ఆధార్లో వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు విధించిన గడువు తేదీని మరోసారి పొడిగిస్తున్నట్లు ఉడాయ్ తెలిపింది. -
ఆదాయపు పన్ను ఈ పొరపాట్లు చేయొద్దు
ఆదాయపు పన్ను భారం తగ్గించుకునేందుకు వివిధ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు చట్టం అవకాశం కల్పించింది. కేవలం ఇలా మదుపు చేయడంతోనే పన్ను ప్రణాళిక పూర్తయినట్లు చాలామంది భావిస్తారు. ఆర్థిక ప్రణాళికలో పన్ను ఆదా పథకాలూ ఎంతో కీలకం. -
EPFO: పీఎఫ్ ఖాతాలో వివరాలు మార్చుకోవాలా? ఆన్లైన్లో సులువుగా..
EPFO: ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారులా? మీ పీఎఫ్ ఖాతాలో వ్యక్తిగత వివరాలను మార్చుకోవాలనుకుంటున్నారా? ఈ ఆన్లైన్ ఫారమ్తో సులువుగా మార్చుకోవచ్చు. -
Indian Railways: ట్రైన్ టికెట్ చిరిగిపోయిందా? అయితే ఇలా చేయండి!
train ticket lost: ట్రైన్ టికెట్ పోయిందా? ప్రయాణం ఎలా అని కంగారు పడుతున్నారా? అయితే రైల్వే అందిస్తున్న ఈ సదుపాయం గురించి తెలుసుకోవాల్సిందే.. -
Solar rooftop: ‘సూర్యఘర్’కు దరఖాస్తు ఎలా? ₹78 వేల రాయితీ ఎలా పొందాలి?
PM Surya Ghar Muft Bijli Yojana: ఇంటిపై సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే సబ్సిడీ ఇచ్చే పథకానికి కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? సబ్సిడీ ఎలా పొందాలి? -
ఆరోగ్య బీమా క్లెయిం తిరస్కరిస్తే
చిన్న అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తేనే వేల రూపాయలు ఖర్చవుతున్నాయి. దీన్ని తట్టుకోవాలంటే.. ఆరోగ్య బీమా ఇప్పుడు ఒక తప్పనిసరి అవసరంగా మారింది. చాలామంది ఈ పాలసీని తీసుకుంటున్నప్పటికీ.. దీన్ని పూర్తిగా అర్థం చేసు కోవడంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. -
FasTag: పేటీఎం ఫాస్టాగ్ వాడుతున్నారా? ప్రత్యామ్నాయాలు ఇవే..!
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్లు త్వరలో చెల్లుబాటుకాకుండా పోనున్నాయి. దీంతో కొత్తవి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయాలు ఇవీ.. -
PM Kisan: రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు ఎప్పుడంటే?
PM Kisan 16th installment: పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్న్యూస్. ఫిబ్రవరి 28వ తేదీన ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. -
పేటీఎం ఫాస్టాగ్లు ఏం చేయాలి? సౌండ్ బాక్స్ల మాటేంటి? RBI సమాధానాలివే..!
RBI releases Paytm FAQs: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు సంబంధించి వినియోగదారుల నుంచి తరచూ ఎదురవుతున్న ప్రశ్నలకు ఆర్బీఐ సమాధానాలు ఇచ్చింది. -
8 ఏళ్లలో రూ.45లక్షలు..
నాకు నెలకు రూ.55వేల వేతనం వస్తోంది. వయసు 38. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలు లేవు. నేను ఎంత మొత్తానికి పాలసీ తీసుకోవాలి? -
IPO: ఐపీఓకి దరఖాస్తు చేస్తుంటే
IPO: స్టాక్ మార్కెట్లో ఇప్పుడు ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్)లు జోరు నడుస్తోంది. అనేక సంస్థలు ప్రజల నుంచి మూలధన నిధులను సమీకరించేందుకు ముందుకు వస్తున్నాయి -
PM Surya Ghar: ఉచిత విద్యుత్ పథకం.. ‘రూఫ్టాప్ సోలార్’ కోసం దరఖాస్తు ఇలా..
PM Surya Ghar- Muft Bijli Yojana: కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్ అందించేందుకు కేంద్రం ‘పీఎం సూర్య ఘర్’ పథకం ప్రారంభించింది. దీని కింద ‘రూఫ్టాప్ సోలార్’ కోసం దరఖాస్తు చేసుకోండిలా..! -
Blue Aadhaar: బ్లూ ఆధార్ కార్డు ఎవరికిస్తారు? దరఖాస్తు ఎలా?
Blue Aadhaar Card: యూఐడీఏఐ పిల్లల కోసం ప్రత్యేకంగా నీలం రంగులో ఆధార్ కార్డుల (Blue Aadhaar card)ను జారీ చేస్తోంది. దీన్ని బాల ఆధార్ (Baal Aadhaar) కార్డుగా వ్యవహరిస్తారు. -
Fastag KYC: ఫాస్టాగ్ కేవైసీ గడువు పొడిగించిన ఎన్హెచ్ఏఐ
ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ గడువును పొడిగిస్తున్నట్లు ఎన్హెచ్ఏఐ ప్రకటించింది. ఫిబ్రవరి 29 వరకు వెసులుబాటు కల్పించింది. -
Cashless: ఇక అన్ని ఆస్పత్రుల్లో క్యాష్లెస్.. నేటి నుంచే అమల్లోకి
Cashless facility at all hospitals: దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో క్యాష్లెస్ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ‘ది జనరల్ ఇన్సూరెన్స్’ కౌన్సిల్ వెల్లడించింది. -
FASTags: ఫాస్టాగ్కు కేవైసీ.. జనవరి 31 డెడ్లైన్!
కేవైసీ (KYC) పూర్తిచేయని ఫాస్టాగ్లు జనవరి 31, 2024 తర్వాత డీయాక్టివేట్ లేదా బ్లాక్ అవుతాయని ఎన్హెచ్ఏఐ ప్రకటించింది. -
ఆ అకౌంట్లపై మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలొద్దు.. బ్యాంకులకు RBI ఆదేశం
RBI on minimum balance charges: రెండేళ్లకు పైగా వాడుకలో లేని ఖాతాలపై మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించలేదన్న కారణంతో ఛార్జీలు విధించొద్దని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ నూతన గవర్నర్గా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్
-
Nitin Gadkari: అమితాబ్ సినిమా మూడుసార్లు చూశా: గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
IMD: తెలంగాణలో రెండ్రోజులపాటు వర్షాలు
-
Realme Narzo 70 Pro: ఎయిర్ గెశ్చర్స్ ఫీచర్తో రియల్మీ నార్జో 70 ప్రో
-
IPL: హామీ ఇస్తున్నా.. అప్పటిలోపు కేకేఆర్ను బెటర్ పొజిషన్లో ఉంచుతా: గంభీర్
-
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ప్రీక్లైమాక్స్లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!