IRCTC tour package: రెండు రాష్ట్రాల్లో ఆలయాల దర్శనం.. IRCTC ప్యాకేజీ వివరాలివే..

IRCTC tour package: కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ఆలయాలను ఒకే ట్రిప్‌లో వీక్షిచాలనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఐఆర్‌సీటీసీ కొత్త ప్యాకేజీ తీసుకొచ్చింది.

Updated : 11 Aug 2023 10:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేరళ, తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను ఒకే ట్రిప్‌లో కవర్‌ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ ప్యాకేజీ మీ కోసమే.  పనిలో పనిగా కేరళ ప్రకృతి అందాలనూ వీక్షించొచ్చు. ఇందు కోసం ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ‘సౌత్ ఇండియన్ టెంపుల్ రన్‌’ పేరుతో ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఆరు రాత్రులు, ఏడు పగళ్లు కొనసాగే ఈ టూర్‌కు నవంబర్‌ 1న ప్రయాణానికి విమాన టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

ప్రయాణం ఇలా..

  • హైదరాబాద్‌లో ఉదయం 5:10 గంటలకు (6E 5367) విమానం బయల్దేరుతుంది.  ఉదయం 6:50 గంటలకు తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌కు చేరుతారు. అక్కడ ముందుగానే బుక్‌ చేసిన హోటల్‌లో బస ఉంటుంది. అల్పాహారం స్వీకరించాక నేపియర్‌ మ్యూజియానికి తీసుకెళ్తారు. మధ్యాహ్నం పూవర్‌ ఐల్యాండ్‌ చూడవచ్చు. ఇక సాయంత్రం అజిమాలా శివాలయానికి తీసుకెళ్తారు. ఆ తర్వాత తిరువనంతపురంలోనే ఆ రాత్రి బస ఉంటుంది.
  •  రెండో రోజు ఉదయం అనంత పద్మనాభస్వామి ఆలయానికి తీసుకెళ్తారు. అక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. తర్వాత టిఫిన్‌ చేశాక కన్యాకుమారికి పయనమవుతారు. కన్యాకుమారిలో సూర్యాస్తమయాన్ని వీక్షిస్తారు. రాత్రి కన్యాకుమారిలోనే బస ఉంటుంది.
  • మూడో రోజు బ్రేక్‌ఫాస్ట్ ముగించాక నీటి మధ్యలో ఎంతో అందంగా నిర్మించిన రాక్ మెమోరియల్‌ను చూడటానికి వెళ్తారు. అనంతరం అక్కడ నుంచి ఐదారు గంటలు ప్రయాణించి రామేశ్వరం చేరుకుంటారు. ఆ రోజు రాత్రి అక్కడే బస ఉంటుంది.
  • నాలుగో రోజు ఉదయం రామేశ్వరం, ధనుష్కోటిలో ఉన్న ప్రసిద్ధ ఆలయాలను దర్శించుకోవచ్చు. అయితే రామేశ్వరంలోనికి బస్సుల అనుమతి ఉండదు. ఇతర ఆలయాలను సందర్శించటానికి ఐఆర్‌సీటీసీ ఎలాంటి ఏర్పాట్లు చేయదు. ఇతర రవాణా ఏర్పాట్లను ప్రయాణికులే సమకూర్చుకోవాలి. దానికయ్యే ఖర్చులూ యాత్రికులే భరించాల్సి ఉంటుంది. రామేశ్వరంలోనే రాత్రి బస ఉంటుంది.
  • ఐదో రోజు ఉదయం అల్పాహారం స్వీకరించాక అక్కడ నుంచి నాలుగు గంటలు ప్రయాణించి తంజావూర్‌ చేరుకుంటారు. అబ్దుల్‌ కలాం మెమోరియల్‌ చూసి బృహదీశ్వరాలయాన్ని దర్శించుకొని తిరుచిరాపల్లికి చేరుకుంటారు. అక్కడ హోటల్‌లో ఆ రాత్రి ఉంటారు.
  • ఆరో రోజు టిఫిన్‌ చేసి శ్రీరంగనాథ స్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం మధురై చేరుకుంటారు. అక్కడే హోటల్‌లో ఉంటారు.
  • ఏడో రోజు ఉదయం అల్పాహారం అనంతరం మధుర మీనాక్షి అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడ నుంచి బస్సులో మధురై విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2:15 గంటలకు (6E 6782) విమానంలో హైదరాబాద్‌కు పయనమవుతారు. 3:15 గంటలకు హైదరాబాద్‌ చేరుకోవటంతో మీ ప్రయాణం ముగుస్తుంది.

ప్యాకేజీలో ఉండేవి ఇవీ..

  • హైదరాబాద్‌- తిరువనంతపురం/ మధురై- హైదరాబాద్‌ విమాన టికెట్లు.
  • ఏడు రోజుల పాటు అల్పాహారం, ఆరు రోజుల పాటు రాత్రి భోజనం.
  • పర్యాటక ప్రదేశాల వీక్షణానికి ఏసీ బస్సును ఐఆర్‌సీటీసీనే ఏర్పాటు చేస్తుంది.
  • ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ సదుపాయం ఉంటుంది.
  • ఐఆర్‌సీటీసీ టూర్‌ ఎస్కార్ట్‌ అందుబాటులో ఉంటారు.

వీటిని యాత్రికులే చూసుకోవాలి

  • టూర్‌ సమయంలో మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు ప్రయాణికులే చూసుకోవాలి.
  • హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టుకు, ఎయిర్‌పోర్టు నుంచి వారి గమ్యస్థానాన్ని చేరుకోవటానికి యాత్రికులే ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలి.
  • విమానంలో ఆహారానికి యాత్రికులే చెల్లించాలి. 
  • చూడదగిన ప్రదేశాల్లో టికెట్ల ఖర్చు ప్రయాణికులే భరించాలి.
  • టూర్ గైడ్ అందుబాటులో ఉండరు.
  • 75 ఏళ్లు పైబడిన వారు ప్రయాణించాలంటే కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఎస్కార్ట్‌గా నియమించుకోవాలి.

ప్యాకేజీ వివరాలు ఇవీ.. (ఒక్కొక్కరికీ)

  • రూమ్‌లో సింగిల్‌ ఆక్యుపెన్సీ అయితే ఒకరికి రూ.50,350
  • డబుల్ ఆక్యుపెన్సీ  అయితే రూ.37,650
  • ట్రిపుల్‌ ఆక్యుపెన్సీ అయితే రూ.35,950
  • 5- 11 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు విత్‌ బెడ్‌ అయితే రూ.31,500; వితౌట్‌ అయితే రూ.27,750
  • 2- 4 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు రూ.20,350
  • ఏదైనా కారణంగా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఐఆర్‌సీటీసీ క్యాన్సిలేషన్‌ పాలసీ ప్రకారం ఛార్జీలు ఉంటాయి. ప్రయాణానికి 21 రోజుల ముందు టికెట్‌ను క్యాన్సిల్‌ చేసుకుంటే టికెట్‌ మొత్తం ధరలో 30 శాతం మినహాయిస్తారు. అదే 21 నుంచి 15 రోజుల్లో అయితే 55 శాతం, 14 నుంచి 8 రోజుల్లో అయితే 80 శాతం డబ్బును మీ టికెట్‌ ధర నుంచి మినహాయిస్తారు. ప్రయాణానికి ఎనిమిది రోజుల ముందు టికెట్‌ క్యాన్సిల్‌ చేస్తే ఎలాంటి తిరిగి చెల్లింపులూ ఉండవు.

ప్రయాణ టికెట్‌ బుకింగ్‌, ప్యాకేజీకి సంబంధించిన ఇతర వివరాల కోసం ఈ లింక్‌ క్లిక్‌ చేయండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని