IRCTC tour package: రెండు రాష్ట్రాల్లో ఆలయాల దర్శనం.. IRCTC ప్యాకేజీ వివరాలివే..
IRCTC tour package: కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ఆలయాలను ఒకే ట్రిప్లో వీక్షిచాలనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఐఆర్సీటీసీ కొత్త ప్యాకేజీ తీసుకొచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: కేరళ, తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను ఒకే ట్రిప్లో కవర్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ ప్యాకేజీ మీ కోసమే. పనిలో పనిగా కేరళ ప్రకృతి అందాలనూ వీక్షించొచ్చు. ఇందు కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ‘సౌత్ ఇండియన్ టెంపుల్ రన్’ పేరుతో ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఆరు రాత్రులు, ఏడు పగళ్లు కొనసాగే ఈ టూర్కు నవంబర్ 1న ప్రయాణానికి విమాన టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రయాణం ఇలా..
- హైదరాబాద్లో ఉదయం 5:10 గంటలకు (6E 5367) విమానం బయల్దేరుతుంది. ఉదయం 6:50 గంటలకు తిరువనంతపురం ఎయిర్పోర్ట్కు చేరుతారు. అక్కడ ముందుగానే బుక్ చేసిన హోటల్లో బస ఉంటుంది. అల్పాహారం స్వీకరించాక నేపియర్ మ్యూజియానికి తీసుకెళ్తారు. మధ్యాహ్నం పూవర్ ఐల్యాండ్ చూడవచ్చు. ఇక సాయంత్రం అజిమాలా శివాలయానికి తీసుకెళ్తారు. ఆ తర్వాత తిరువనంతపురంలోనే ఆ రాత్రి బస ఉంటుంది.
- రెండో రోజు ఉదయం అనంత పద్మనాభస్వామి ఆలయానికి తీసుకెళ్తారు. అక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. తర్వాత టిఫిన్ చేశాక కన్యాకుమారికి పయనమవుతారు. కన్యాకుమారిలో సూర్యాస్తమయాన్ని వీక్షిస్తారు. రాత్రి కన్యాకుమారిలోనే బస ఉంటుంది.
- మూడో రోజు బ్రేక్ఫాస్ట్ ముగించాక నీటి మధ్యలో ఎంతో అందంగా నిర్మించిన రాక్ మెమోరియల్ను చూడటానికి వెళ్తారు. అనంతరం అక్కడ నుంచి ఐదారు గంటలు ప్రయాణించి రామేశ్వరం చేరుకుంటారు. ఆ రోజు రాత్రి అక్కడే బస ఉంటుంది.
- నాలుగో రోజు ఉదయం రామేశ్వరం, ధనుష్కోటిలో ఉన్న ప్రసిద్ధ ఆలయాలను దర్శించుకోవచ్చు. అయితే రామేశ్వరంలోనికి బస్సుల అనుమతి ఉండదు. ఇతర ఆలయాలను సందర్శించటానికి ఐఆర్సీటీసీ ఎలాంటి ఏర్పాట్లు చేయదు. ఇతర రవాణా ఏర్పాట్లను ప్రయాణికులే సమకూర్చుకోవాలి. దానికయ్యే ఖర్చులూ యాత్రికులే భరించాల్సి ఉంటుంది. రామేశ్వరంలోనే రాత్రి బస ఉంటుంది.
- ఐదో రోజు ఉదయం అల్పాహారం స్వీకరించాక అక్కడ నుంచి నాలుగు గంటలు ప్రయాణించి తంజావూర్ చేరుకుంటారు. అబ్దుల్ కలాం మెమోరియల్ చూసి బృహదీశ్వరాలయాన్ని దర్శించుకొని తిరుచిరాపల్లికి చేరుకుంటారు. అక్కడ హోటల్లో ఆ రాత్రి ఉంటారు.
- ఆరో రోజు టిఫిన్ చేసి శ్రీరంగనాథ స్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం మధురై చేరుకుంటారు. అక్కడే హోటల్లో ఉంటారు.
- ఏడో రోజు ఉదయం అల్పాహారం అనంతరం మధుర మీనాక్షి అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడ నుంచి బస్సులో మధురై విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2:15 గంటలకు (6E 6782) విమానంలో హైదరాబాద్కు పయనమవుతారు. 3:15 గంటలకు హైదరాబాద్ చేరుకోవటంతో మీ ప్రయాణం ముగుస్తుంది.
ప్యాకేజీలో ఉండేవి ఇవీ..
- హైదరాబాద్- తిరువనంతపురం/ మధురై- హైదరాబాద్ విమాన టికెట్లు.
- ఏడు రోజుల పాటు అల్పాహారం, ఆరు రోజుల పాటు రాత్రి భోజనం.
- పర్యాటక ప్రదేశాల వీక్షణానికి ఏసీ బస్సును ఐఆర్సీటీసీనే ఏర్పాటు చేస్తుంది.
- ట్రావెల్ ఇన్సూరెన్స్ సదుపాయం ఉంటుంది.
- ఐఆర్సీటీసీ టూర్ ఎస్కార్ట్ అందుబాటులో ఉంటారు.
వీటిని యాత్రికులే చూసుకోవాలి
- టూర్ సమయంలో మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు ప్రయాణికులే చూసుకోవాలి.
- హైదరాబాద్ ఎయిర్పోర్టుకు, ఎయిర్పోర్టు నుంచి వారి గమ్యస్థానాన్ని చేరుకోవటానికి యాత్రికులే ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలి.
- విమానంలో ఆహారానికి యాత్రికులే చెల్లించాలి.
- చూడదగిన ప్రదేశాల్లో టికెట్ల ఖర్చు ప్రయాణికులే భరించాలి.
- టూర్ గైడ్ అందుబాటులో ఉండరు.
- 75 ఏళ్లు పైబడిన వారు ప్రయాణించాలంటే కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఎస్కార్ట్గా నియమించుకోవాలి.
ప్యాకేజీ వివరాలు ఇవీ.. (ఒక్కొక్కరికీ)
- రూమ్లో సింగిల్ ఆక్యుపెన్సీ అయితే ఒకరికి రూ.50,350
- డబుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.37,650
- ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.35,950
- 5- 11 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు విత్ బెడ్ అయితే రూ.31,500; వితౌట్ అయితే రూ.27,750
- 2- 4 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు రూ.20,350
- ఏదైనా కారణంగా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఐఆర్సీటీసీ క్యాన్సిలేషన్ పాలసీ ప్రకారం ఛార్జీలు ఉంటాయి. ప్రయాణానికి 21 రోజుల ముందు టికెట్ను క్యాన్సిల్ చేసుకుంటే టికెట్ మొత్తం ధరలో 30 శాతం మినహాయిస్తారు. అదే 21 నుంచి 15 రోజుల్లో అయితే 55 శాతం, 14 నుంచి 8 రోజుల్లో అయితే 80 శాతం డబ్బును మీ టికెట్ ధర నుంచి మినహాయిస్తారు. ప్రయాణానికి ఎనిమిది రోజుల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే ఎలాంటి తిరిగి చెల్లింపులూ ఉండవు.
ప్రయాణ టికెట్ బుకింగ్, ప్యాకేజీకి సంబంధించిన ఇతర వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
e-pan: కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు రోజులతరబడి ఎదురుచూడాల్సిన పని లేకుండా తక్షణమే ఈ-పాన్ పొందే సదుపాయం ఉంది. అదెలాగంటే..? -
ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది. -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..
మొబైల్లో వచ్చిన మెసేజ్ను హెడ్డర్ సాయంతో ఎవరు పంపారో ఇట్టే కనిపెట్టేయొచ్చు. అదెలాగంటే..? -
కౌంటర్కు వెళ్లకుండానే ట్రైన్ టికెట్.. UTS యాప్తో బుకింగ్ ఎలా..?
UTS app: టికెట్ కొనుగోలును సులభతరం చేసేందుకు రైల్వే శాఖ యూటీఎస్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. అందులో టికెట్ బుకింగ్ ఎలానో ఇప్పుడు చూద్దాం.. -
ఆధార్ కార్డ్లో పుట్టిన తేదీ మార్చుకోవాలా? ఏమేం కావాలి?
Aadhaar Card: ఆధార్ కార్డులో పుట్టిన తేదీలో తప్పుందా? మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఎలా అప్డేట్ చేసుకోవాలో చూడండి.. -
పెట్టుబడి ప్రభుత్వ బాండ్లలో
చిన్న మదుపరులు ప్రభుత్వ బాండ్లలో మదుపు చేసేందుకు 2021లో ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ పోర్టల్ను తీసుకొచ్చింది. దీన్ని మరింత సులభతరం చేసేందుకు వీలుగా ప్రత్యేక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ఈ బాండ్ల గురించి తెలుసుకుందాం. -
టెక్నాలజీ కంపెనీల్లో
బంధన్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా బంధన్ ఇన్నోవేషన్ ఫండ్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ప్రధానంగా టెక్నాలజీ, ఫార్మా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సత్వర వృద్ధి సాధించటానికి ప్రయత్నించే కంపెనీలపై పెట్టుబడి పెట్టి అధిక లాభాలు ఆర్జించటం ఈ పథకం ప్రధాన లక్ష్యం. -
ఆధార్ ఏటీఎం.. ఇంటి నుంచే క్యాష్ విత్డ్రా ఎలా చేసుకోవాలి?
Aadhaar ATM: ఇంటి నుంచే డబ్బు విత్డ్రా చేసుకొనే సదుపాయాన్ని పోస్టల్ శాఖ అందిస్తోంది. దీన్ని ఎలా వినియోగించాలో ఇప్పుడు చూద్దాం.. -
వేసవిలో ఊటీ అందాలు చూసొస్తారా? ₹13 వేల నుంచే ప్యాకేజీ ధరలు
IRCTC tour package: వేసవిలో ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్యాకేజీ మీ కోసమే. ప్రయాణ టికెట్లు, వసతి ఏర్పాట్లతో ఐఆర్సీటీసీ అందుబాటులోకి తెచ్చిన ఈ ప్యాకేజీ వివరాలను ఓసారి పరిశీలించండి. -
టర్మ్ ఇన్సూరెన్స్ కుటుంబానికి భరోసానిచ్చేలా
బీమా పాలసీలు ఎన్నో రకాలుగా ఉంటాయి. కొన్ని పొదుపు చేసేందుకు ఉపయోగపడతాయి. మరికొన్ని పెట్టుబడులకు తోడ్పడతాయి. వీటికి భిన్నంగా పూర్తి రక్షణకే పరిమితమయ్యేవి టర్మ్ పాలసీలు. వీటిని ఆన్లైన్లోనూ తీసుకోవచ్చు. లేదా బీమా సలహాదారును సంప్రదించీ కొనుగోలు చేయొచ్చు. -
కేరళ ప్రకృతి అందాలు చూస్తారా? ₹14 వేల నుంచే IRCTC ప్యాకేజీ
IRCTC tour package: వేసవిలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న కేరళ టూర్ ప్యాకేజీ వివరాల్ని పరిశీలించండి.. -
తిరుమల ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? దర్శనం, ప్రయాణ టికెట్లతో ఐఆర్సీటీసీ ప్యాకేజీలు ఇవే..
Irctc Tirupati: తిరుమల దర్శనం కోసం ప్లాన్ చేస్తున్నారా? రెండు రాష్ట్రాల ప్రజలు గోవిందుడిని దర్శించుకొనేందుకు ఐఆర్సీటీసీ అనేక ప్యాకేజీలు అందిస్తోంది. వాటిని ఓసారి పరిశీలించండి.. -
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
E- insurance: కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి బీమా పాలసీల డిజిటలైజేషన్ను తప్పనిసరి చేస్తున్నట్లు ఐఆర్డీఏఐ ప్రకటించింది. -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
March 31 deadline: మ్యూచువల్ ఫండ్లలో మదుపు ప్రారంభించినప్పుడు విద్యుత్, గ్యాస్ బిల్లులు, బ్యాంకు ఖాతాలు సమర్పించి కేవైసీ నిబంధనలు పూర్తి చేసిన వారు.. మరోసారి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. -
డిజీ లాకర్తో ఆధార్, పాన్ వంటి పత్రాలు ఎప్పుడూ మీ వెంటే.. ఎలా దాచుకోవాలి?
DigiLocker: ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా అన్నీ ఒకేచోట డిజిటల్గా అందుబాటులో ఉంచేందుకు డిజీలాకర్ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంతకీ ఇదెలా ఉపయోగపడుతుందో తెలుసా? -
కేవైసీ అప్డేట్ చేశారా?
బ్యాంకులో ఖాతా ఉందా? మ్యూచువల్ ఫండ్లో మదుపు చేస్తున్నారా? జీవిత, ఆరోగ్య బీమా పాలసీలున్నాయా? మరి, మీ కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) వివరాలు తెలియజేయడం తప్పనిసరి. -
IRCTC refund: ఐఆర్సీటీసీ రిఫండ్స్ ఇక వేగవంతం.. గంటలోనే నగదు వెనక్కి?
IRCTC refund process: రైలు టికెట్ బుక్ చేసినప్పుడు డబ్బులు డెబిట్ అయ్యాయా? ఇకపై ఆ సొమ్ము కోసం రోజులతరబడి ఎదురు చూడాల్సిన పనిలేదు. ఈ ప్రక్రియ వేగవంతం కానుంది.