IMF: సంస్కరణలే భారత ఆర్థిక విజయానికి సోపానాలు: ఐఎంఎఫ్
IMF: భారత ఆర్థిక వ్యవస్థ ప్రకాశిస్తోందని.. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టలినా విశ్వాసం వ్యక్తం చేశారు.
వాషింగ్టన్: భారత దేశ ఆర్థిక విజయం గతకొన్ని సంవత్సరాల సంస్కరణల్లో దాగి ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా గురువారం అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలనే లక్ష్యాన్ని భారత్ సాధించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో 2024 భారత వృద్ధిరేటు అంచనాలను ఐఎంఎఫ్ మెరుగుపర్చడం విశేషం. గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ (Union Budget 2024) ప్రవేశపెట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే క్రిస్టలినా ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ప్రకాశిస్తోంది. అది అలాగే కొనసాగుతుంది కూడా. 2024 భారత వృద్ధి అంచనాలను 6.5 శాతానికి పెంచుతున్నాం. దేశ ఆర్థిక వ్యవస్థ 2023లో చాలా బలమైన పనితీరు కనబర్చిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని ఆమె వివరించారు. డిజిటలీకరణ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయాలు చాలా ప్రయోజనాన్ని చేకూర్చాయని తెలిపారు. ఇదే ఇప్పుడు దేశానికి బలమైన శక్తిగా మారిందని పేర్కొన్నారు. చిరు వ్యాపారులు సైతం మార్కెట్లోకి ప్రవేశించేందుకు డిజిటల్ వసతులు దోహదం చేశాయన్నారు.
భారత శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం ఇప్పటికీ తక్కువగా ఉందని ఆమె తెలిపారు. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టి సారించడం సరైన నిర్ణయమని కితాబిచ్చారు. భవిష్యత్తు పోటీని నూతన ఆవిష్కరణలే నిర్దేశిస్తాయని ఆ దేశం గుర్తించిందని తెలిపారు. అందుకోసం పరిశోధన-అభివృద్ధి రంగంలో సమర్థంగా పెట్టుబడులు పెడుతోందన్నారు. చంద్రుడిపై ల్యాండర్ను విజయవంతంగా దింపడమే అందుకు నిదర్శనమని తెలిపారు. ఇలాంటి చర్యలే భవిష్యత్తు వృద్ధికి రంగాన్ని సిద్ధం చేస్తాయని అభిప్రాయపడ్డారు.
2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించకపోవడానికి తమకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని క్రిస్టలినా వ్యాఖ్యానించారు. అయితే, ప్రస్తుతం ఉన్న సంస్కరణలను అలాగే కొనసాగించాలని సూచించారు. ప్రైవేటు పెట్టుబడులకు ఉన్న అడ్డంకులను తొలగించాలని హితవు పలికారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆది గోద్రేజ్ కుటుంబం విడిపోయింది
సబ్బుల నుంచి స్థిరాస్తి దాకా వ్యాపారాలను నిర్వహిస్తున్న, 127 ఏళ్ల చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ విడిపోయింది. వారసులు దీనిని పంచుకోవడానికి ఒక ఒప్పందానికి వచ్చారు. -
పసిడి ధరహాసంలోనూ గిరాకీ
పసిడి ధర జీవనకాల గరిష్ఠాలకు చేరినా.. దేశీయంగా గిరాకీ తగ్గలేదు. ఈ ఏడాది జనవరి-మార్చిలో 136.6 టన్నుల బంగారానికి గిరాకీ ఏర్పడింది. -
‘న్యుబెవాక్స్ 14’ టీకాపై క్లినికల్ పరీక్షల్లో సానుకూల ఫలితాలు
చిన్న పిల్లల్లో న్యుమోకాకల్ అనే వ్యాధిని నివారించేందుకు నిర్దేశించిన టీకాను ఆవిష్కరించడంలో హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఇ.లిమిటెడ్ (బీఇ) కీలక మైలురాయిని చేరుకుంది. -
ఆఖర్లో అమ్మకాలు
ఆఖరి గంటన్నర ట్రేడింగ్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో, మంగళవారం దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
రిటైల్ మదుపర్ల కోసం కార్పొరేట్ బాండ్ల ముఖ విలువ తగ్గింపు!
కార్పొరేట్ బాండ్ మార్కెట్లో రిటైల్ మదుపర్లు మరింతగా పాల్గొనడం కోసం ఆయా డెట్ సెక్యూరిటీల ముఖ విలువను ప్రస్తుత రూ.లక్ష నుంచి రూ.10,000కు తగ్గించాలన్న ప్రతిపాదనకు మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ ఆమోదించింది. -
అర్బన్వర్క్ నుంచి కొత్త ఫ్లెక్సీ కేంద్రం
కంపెనీలకు ఫ్లెక్సీ కార్యాలయ స్థలాన్ని అందించే అర్బన్వర్క్, హైదరాబాద్ రహేజా మైండ్స్పేస్లో కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. -
ఓటర్ల కోసం ప్రత్యేక రాయితీ: అభిబస్
ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ప్రాంతాలకు వెళ్లే వారికి బస్సు టిక్కెట్ల బుకింగ్లో ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లు బస్ టికెట్ బుకింగ్ అగ్రిగేటర్, ఇగ్జిగో గ్రూపులో భాగమైన అభిబస్ వెల్లడించింది. -
గూగుల్లో ఉద్యోగ కోతలు
టెక్ దిగ్గజం గూగుల్ తన ఫ్లటర్, డార్ట్, పైథాన్ బృందాల్లో లేఆఫ్లు ప్రకటించింది. ఉద్యోగ కోతలు కంపెనీ వ్యాప్తంగా జరగలేదని.. కేవలం ఆయా బృందాలకు మాత్రమే పరిమితమయ్యాయని గూగుల్ స్పష్టం చేసింది. -
2024-25లోనే ప్రభుత్వ వాటాను 75 శాతానికి తగ్గించుకుంటాం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే (2024-25) యూకో బ్యాంక్లో ప్రభుత్వ వాటాను 75 శాతానికి తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు.. బ్యాంకు మేనేజింగ్ డైరెక్టరు (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) అశ్వని కుమార్ తెలిపారు. -
ఎక్సైడ్ ఇండస్ట్రీస్ లాభంలో 37% వృద్ధి
బ్యాటరీల సంస్థ ఎక్సైడ్ ఇండస్ట్రీస్, మార్చి త్రైమాసికంలో రూ.284 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.208 కోట్లతో పోలిస్తే ఇది 37% అధికం. -
సగానికి తగ్గిన ఐఓసీ లాభం
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) జనవరి- మార్చి త్రైమాసిక నికర లాభం సగానికి పైగా తగ్గి రూ.4,837.69 కోట్లకు పరిమితమైంది. -
సంక్షిప్తవార్తలు (8)
సనోఫి ఇండియా మనదేశంలో మధుమేహ వ్యాధికి సొలిక్వా అనే మందును విడుదల చేసింది. ఈ మందుకు ఈ ఏడాది ప్రారంభంలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) నుంచి అనుమతి తీసుకుంది. -
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
Flipkart Big Saving Days Sale: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మే 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్లో ఫోన్లపై పెద్దఎత్తున డిస్కౌంట్ ఉండనుంది. -
జెఫ్ బెజోస్ నుంచి విలువైన పాఠం నేర్చుకున్నా: నెట్ఫ్లిక్స్ ఛైర్మన్
నెట్ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హేస్టింగ్స్ రిస్క్ తీసుకోవడంలో ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. జెఫ్ బెజోస్ నుంచి నేర్చుకున్న విలువైన పాఠం గురించి తాజాగా ఓ పాడ్కాస్ట్లో పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కొలిక్కి రాని కుక్కర్ కూపన్ల కథ.. ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి కోసం గాలింపు
-
ఏసీబీ, విజిలెన్స్ అధికారుల విస్తృత తనిఖీలు.. స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు!
-
వడదెబ్బ చికిత్సలకు.. హీట్స్ట్రోక్ క్లినిక్లు
-
ఆది గోద్రేజ్ కుటుంబం విడిపోయింది
-
ప్రేయసితో లాడ్జికి.. ప్రియుడి అనుమానాస్పద మృతి
-
సింహాచలం కొండపై.. ‘భూ’చోళ్లు