Xiaomi Car: షావోమి కారు వచ్చేస్తోంది.. ఎలా ఉందో చూశారా?
Xiaomi Car | షావోమి విద్యుత్ కారు ఫిబ్రవరిలో మార్కెట్లోకి రానుంది. చైనాలో విక్రయాల కోసం కంపెనీ దరఖాస్తు చేసుకుంది.
Xiaomi Car | బీజింగ్: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షావోమి తమ తొలి కారు (Xiaomi Car)ను త్వరలో తీసుకురాబోతోంది. షావోమి ఎస్యూ7 (Xiaomi SU7) పేరిట తీసుకొస్తున్న ఈ విద్యుత్ కారు విక్రయాల కోసం కంపెనీ చైనాలో లైసెన్స్కు దరఖాస్తు చేసుకుంది. దీన్ని కంపెనీ స్వయంగా తయారు చేయడం లేదు. ‘బీజింగ్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ హోల్డింగ్ కంపెనీ లిమిటెడ్ (BAIC)’కు కాంట్రాక్టుకు ఇచ్చింది. చైనా ఇండస్ట్రీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అనుమతి కోసం కంపెనీ ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది. ఈ శాఖ ప్రతినెలా కొత్త కార్ల వివరాలను వెల్లడిస్తుంది. ఈ క్రమంలోనే షావోమి కారు వివరాలను సైతం బహిర్గతం చేసింది.
షావోమి ఎస్యూ7 (Xiaomi SU7).. సెడాన్ విభాగంలో వస్తోంది. కారు వీల్బేస్ 3000 ఎంఎం. ఈ కారులో లైడర్ సెన్సర్ కూడా ఉంది. ‘బీ పిల్లర్’పై కెమెరా కూడా ఉన్నట్లు ఫొటోల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఫేస్ రికగ్నిషన్ అన్లాకింగ్’ ఫీచర్ ఉండే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. పవర్ట్రెయిన్లో రెండు ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి 220 కిలోవాట్ మోటార్తో కూడిన ‘రియర్ వీల్ డ్రైవ్ (RWD)’.. మరొకటి 495 కిలోవాట్ మ్యాగ్జిమమ్ పవర్ (220 kW + 275 kW)తో కూడిన ‘ఆల్ వీల్ డ్రైవ్ (AWD)’.
షావోమి ఎస్యూ7, ఎస్యూ7 ప్రో, ఎస్యూ7 మ్యాక్స్ అనే మూడు వేరియంట్లలో ఈ కారు రాబోతోంది. టోల్ చెల్లింపులు జరిగే సమయంలో వాహనం ఆపాల్సిన అవసరం లేకుండా ఈటీసీ ఫంక్షన్ వ్యవస్థను కూడా పొందుపర్చారు. స్మార్ట్ఫోన్ సహా కార్లలోనూ ఉపయోగించేలా హైపర్ ఆపరేటింగ్ సిస్టమ్ను దీనికోసం ప్రత్యేకంగా రూపొందించారు. 5 సీట్లతో వస్తున్న ఈ కారు వాణిజ్య తయారీని 2023 డిసెంబర్లో ప్రారంభించనుంది. 2024 ఫిబ్రవరి నుంచి కస్టమర్లకు సరఫరా మొదలుపెట్టనున్నారు. BAICలో ఇప్పటికే ప్రయోగాత్మక తయారీ ప్రారంభమైంది. ఈ కంపెనీ ఇప్పటికే చైనా మార్కెట్ కోసం మెర్సిడెస్ బెంజ్ను కూడా ఉత్పత్తి చేస్తోంది. ఈవీ తయారీలోకి అడుగుపెడుతున్నట్లు షావోమి 2021లోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకోసం 10 బిలియన్ డాలర్లు వెచ్చిస్తున్నట్లు తెలిపింది. 2023 ఆగస్టులో షావోమిఈవీ.కామ్ పేరిట ప్రత్యేక డొమైన్ను రిజిస్టర్ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km
electric scooter: భారత్ మార్కెట్లోకి మరో కొత్త విద్యుత్ స్కూటర్ వచ్చేసింది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన యాంపియర్ ఈ స్కూటర్ను లాంచ్ చేసింది. -
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
Mahindra XUV 3XO: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎక్స్యూవీ 3XOను లాంచ్ చేసింది. దీని ధర రూ.7.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ధరలు తగ్గించిన ఓలా.. ఎస్1X ఇక రూ.69,999 నుంచే!
ఓలా తన ఎస్1 ఎక్స్ స్కూటర్ల ధరలను తగ్గించింది. ఇకపై వీటి ధరలు రూ.69వేల నుంచే ప్రారంభం కానున్నాయి. -
2023-24లో 5.5% తగ్గిన వాహన ఎగుమతులు
Automobile exports: 2024 ఆర్థిక సంవత్సరంలో వాహన ఎగుమతులు 5.5శాతం తగ్గాయని తయారీదార్ల సమాఖ్య వెల్లడించింది. -
ఓలా నుంచి త్వరలో మరో స్కూటర్.. ఎస్1 ఎక్స్ సిరీస్లో ఈ ఫీచర్లతో!
Ola Electric: ఓలా మరో స్కూటర్ తీసుకురాబోతోంది. ఎస్1 ఎక్స్ సిరీస్లో అప్డేట్ చేసిన వెర్షన్ వస్తోంది. -
విపణిలోకి ఎంజీ హెక్టార్ బ్లాక్స్టార్మ్
ఎంజీ (మోరిస్ గ్యారేజెస్) మోటార్ సంస్థ, తమ హెక్టార్ మోడల్లో సరికొత్త బ్లాక్స్టార్మ్ ఎడిషన్ను తీసుకొచ్చింది. -
స్విఫ్ట్, విటారా ధరల్ని పెంచిన మారుతీ సుజుకీ
Maruti Suzuki: మారుతీ సుజుకీ ఇండియా తన విపణిలోని కొన్ని మోడల్ వాహనాల ధరల్ని పెంచినట్లు బుధవారం ప్రకటించింది. -
బజాజ్ నుంచి కొత్త పల్సర్ N250
Bajaj Pulsar N250: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో కొత్త N250ని లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ @ రూ.20.5 లక్షలు
Jeep Compass: జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ విడుదలైంది. దీన్ని పూర్తిగా బ్లాక్-గ్లాస్ ఫినిష్తో తీర్చిదిద్దింది. -
2023-24 వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి.. కార్లు, ట్రాక్టర్లలో రికార్డు!
Automobile retail sales: వాహనాల లభ్యత మెరుగవ్వడం, కొత్త మోడళ్ల విడుదల వంటి అంశాలు దోహదం చేయటంతో విక్రయాలు పుంజుకున్నట్లు ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. -
ఏథర్ నుంచి ఫ్యామిలీ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 160 km
ఏథర్ సంస్థ రిజ్తా పేరుతో ఫ్యామిలీ స్కూటర్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.1.10 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్
టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్లో మరిన్ని ప్రీమియం మోడళ్లను తీసుకురావాలని భావిస్తోందని కంపెనీ డిప్యూటీ ఎండీ తడషి అసజుమా పేర్కొన్నారు. -
బీఎండబ్ల్యూ.. టాటా టెక్ జాయింట్ వెంచర్
BMW-Tata Tech: జాయింట్ వెంచర్ నుంచి బీఎండబ్ల్యూ (BMW) గ్రూప్నకు చెందిన ప్రీమియం వాహనాలకు కావాల్సిన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ (SDV) సొల్యూషన్స్తో పాటు ఇతర ఐటీ సేవలను అందించనున్నారు. -
వాహన బీమా సంస్థల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో సాధారణ బీమా సంస్థలకు సంబంధించి.. వాహన బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి. -
ట్రాక్టర్ల వ్యాపారానికి ఫోర్స్ మోటార్స్ గుడ్బై
Force Motors: ఆటో మొబైల్ కంపెనీ ఫోర్స్ మోటార్స్ వ్యవసాయ ట్రాక్టర్ల వ్యాపారం నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
Xiaomi Car: షావోమి కారు ధర ఎంత ఉండొచ్చంటే.. సీఈఓ మాటల్లో!
Xiaomi Car: షావోమి కార్ల ఆర్డర్లు చైనాలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ కారు ధరపై సోమవారం ఆసక్తిక విషయం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి