logo

KTR: మీ ఆహ్వానం నచ్చింది.. అందుకే వచ్చా: కేటీఆర్‌

కొందరు చిన్నారులు తమ పాఠశాల వార్షికోత్సవానికి రావాలంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ను సామాజిక మాధ్యమం ఎక్స్‌ ద్వారా ఆహ్వానించారు. చిన్నారులు అప్‌లోడ్‌ చేసిన వీడియోను చూసిన కేటీఆర్‌ వారి ఆహ్వానానికి ముగ్దుడయ్యారు.

Updated : 04 Mar 2024 07:28 IST

చిన్నారులతో ముచ్చటిస్తున్న కేటీఆర్‌

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: కొందరు చిన్నారులు తమ పాఠశాల వార్షికోత్సవానికి రావాలంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ను సామాజిక మాధ్యమం ఎక్స్‌ ద్వారా ఆహ్వానించారు. చిన్నారులు అప్‌లోడ్‌ చేసిన వీడియోను చూసిన కేటీఆర్‌ వారి ఆహ్వానానికి ముగ్దుడయ్యారు. ముందే నిర్ణయమైన కార్యక్రమాలను సైతం పక్కనబెట్టి చిన్నారుల కోసం పాఠశాల వార్షికోత్సవానికి హాజరై వారిని ఆనందింపజేశారు. రాజేంద్రనగర్‌లోని హైదరాబాద్‌ మిలీనియం పాఠశాల వార్షికోత్సవం ఆదివారం జరిగింది. నాలుగు రోజుల క్రితం ఈ పాఠశాలకు చెందిన పలువురు చిన్నారులు కేటీఆర్‌ను తమ వార్షికోత్సవానికి హాజరుకావాలని కోరుతూ ఎక్స్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. దానికి స్పందించిన కేటీఆర్‌ అతిథిగా వచ్చారు. చిన్నారులు ఆహ్వానించిన తీరు నచ్చటంతో వచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా చిన్నారులతో ముచ్చటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని