2G Spectrum Case: అసలు 2G స్పెక్ట్రమ్ రగడ ఏంటి? ఆరోజు కాగ్ ఏం చెప్పింది?
2G Spectrum Case: 5జీ స్పెక్ట్రమ్ వేలం త్వరలో జరగనున్న నేపథ్యంలో 2జీ స్కాం కేసుకు సంబంధించిన పూర్వాపరాలేంటో చూద్దాం...
2G Spectrum Case: జులై 26న 5జీ స్పెక్ట్రానికి సంబంధించిన వేలం (5G Auction) జరగబోతోంది. స్పెక్ట్రమ్ అనగానే చాలా మందికి వెంటనే గుర్తొచ్చేది ‘2జీ కుంభకోణం (2G Spectrum Case)’. ఈ కేసులో నిందితులందరినీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించినప్పటికీ.. స్పెక్ట్రమ్ వేలం (Spectrum Auction) తెరపైకి వచ్చినప్పుడల్లా దీనిపై చర్చ జరుగుతుంటుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమికి అధికారాన్ని దూరం చేసిన కీలక ఉదంతంగా ప్రజలు దీన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న భాజపాకు అధికార పక్షంపై సంధించడానికి విమర్శనాస్త్రాల్ని అందించింది ఈ కేసే. ఎన్డీఏ కూటమికి అధికారానికి దగ్గర చేసిన అంశాల్లో ఈ 2జీ రగడ ప్రధానమైంది. తాజాగా 5జీ వేలం (5G Auction) నేపథ్యంలో మరోసారి ఈ ‘కుంభకోణం’పై చర్చ జరుగుతోంది. మరి ఆ కేసు పూర్వాపరాలేంటో ఓసారి గుర్తుచేసుకుందాం...
(ఇదీ చదవండి: EXPLAINED: 2G, 3G, 4G, 5G.. ఏమిటివి? స్పెక్ట్రమ్కి వేలం ఎందుకు?)
ఏమిటీ ‘కుంభకోణం’ కేసులో ఆరోపణలు..
2007లో దీనికి దారులు పడ్డాయి. నాడు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం.. 2జీ టెలికం స్పెక్ట్రమ్ (2G Spectrum)కు లైసెన్సులు మంజూరు చేయాలని నిర్ణయించింది. 2007 అక్టోబర్ 25ను గడువుగా టెలికం శాఖ నిర్దేశించింది. దర్యాప్తు సంస్థల ఆరోపణల ప్రకారం..
* 2008 జనవరి 10న టెలికం శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. వేలం ద్వారా కాకుండా ‘మొదట వచ్చినవారికి మొదట కేటాయింపు’ ప్రాతిపదికన 2జీ లైసెన్సులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.
* దరఖాస్తుల దాఖలుకు గడువును 2007 అక్టోబరు 1 నుంచి.. అదే ఏడాది సెప్టెంబరు 25కు కుదించింది. దీని వల్ల అనేక దరఖాస్తులు బుట్టదాఖలయ్యాయి.
* అంతేకాదు స్పెక్ట్రమ్ ధరను 2008 నాటి ధరల ఆధారంగా కాకుండా 2001 ధరల ప్రాతిపదికన టెలికం శాఖ కేటాయించింది. ఇలా 8 కంపెనీలకు 122 స్పెక్ట్రమ్ లైసెన్సులను జారీ చేసింది.
* లూప్ టెలికాం సంస్థలకు జరిగిన స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో అవతకవతకలు జరిగినట్లు దిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ‘టెలికాం వాచ్డాగ్’.. ‘సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (CVC)’ దృష్టికి తీసుకెళ్లింది.
కాగ్ ఏం చెప్పింది..
స్పెక్ట్రమ్ ‘కుంభకోణా’న్ని 2010 నవంబరు 16న ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (CAG)’ తన నివేదికలో వెలుగులోకి తెచ్చింది. 2జీ లైసెన్సులను కారుచౌకగా కట్టబెట్టినట్లు ఆరోపించింది. దీనివల్ల ప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. పైగా అర్హతలేని, వాస్తవాలు వక్రీకరించిన దరఖాస్తుదారులకు లైసెన్సులు మంజూరు చేసినట్లు తెలిపింది. చౌకగా లైసెన్సులు పొందిన వ్యక్తులు.. ఆ తర్వాత స్వల్ప సమయంలోనే తమ సంస్థల్లోని గణనీయమైన వాటాలను స్వదేశీ/విదేశీ కంపెనీలకు అత్యధిక ప్రీమియంతో విక్రయించి, భారీగా లబ్ధి పొందారని కాగ్ పేర్కొంది. కొత్తగా టెలికం రంగంలోకి వచ్చిన ఈ లైసెన్సుదారులు ఆర్జించిన ప్రీమియంను.. స్పెక్ట్రమ్ వాస్తవ ధరగా అంచనావేశారు. స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా వేలం ప్రక్రియను నిర్వహిస్తే.. రూ.1.76 లక్షల కోట్లు ప్రభుత్వానికే వచ్చేవని కాగ్ పేర్కొంది.
ఆరోపణలు ఎదుర్కొన్నదెవరు?
సీవీసీ ఆదేశాల మేరకు ఈ కేసు విచారణ బాధ్యతను సీబీఐ చేపట్టింది. డీఎంకే నేత, నాటి టెలికం మంత్రి రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి, టెలికం శాఖ మాజీ కార్యదర్శి ఆర్.కె.చందోలియా తదితరులపై తొలి కేసును నమోదు చేసింది. ఈ కేసులో స్వాన్ టెలికం, డీబీ గ్రూప్ ప్రమోటర్లు అయిన షాహిద్ ఉస్మాన్ బల్వా, వినోద్ గోయెంకా, యూనిటెక్ ఎండీ డి.సంజయ్ చంద్ర సహా మరికొందరు పేర్లను నిందితులుగా సీబీఐ ఛార్జిషీటులో పేర్కొంది.
నిందితులపై ఆరోపణలేంటి?
కొన్ని కంపెనీలకు ప్రయోజనం కలిగించేలా నిబంధనలను మార్చడానికి, నాటి టెలికం మంత్రి రాజా ప్రధాన కారకుడని కాగ్ పేర్కొంది. ట్రాయ్, న్యాయ, ఆర్థికశాఖ సలహాలకు విరుద్ధంగా ఆయన నడుచుకున్నారని వివరించింది. దీనిపై తీవ్ర దుమారం చెలరేగడంతో రాజా నవంబరు 2010లో రాజీనామా చేశారు. 2011 ఫిబ్రవరిలో ఆయనను తిహాడ్ జైలుకు తరలించారు. అదే ఏడాది మార్చిలో ఈ కేసు విచారణ కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసింది. 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులన్నింటినీ అత్యున్నత న్యాయస్థానం 2012లోనే రద్దు చేసింది.
ఏం ప్రతిఫలం పొందారు?
2011 ఏప్రిల్లో సీబీఐ తొలి అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. 2జీ ‘కుంభకోణం’ వల్ల రూ.30,984 కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. అర్హత లేకపోయినప్పటికీ.. యూనిటెక్ వైర్లెస్, స్వాన్ టెలికంలకు అనుచిత ప్రయోజనం కలిగినట్లు తెలిపింది. స్వాన్ టెలికం సంస్థకు లైసెన్సు మంజూరు చేయడానికి ప్రతిగా లంచం రూపంలో డీఎంకే టీవీ ఛానల్ కలైనర్ టీవీకి రూ.200 కోట్లు మళ్లించారని సీబీఐ ఆరోపించింది. స్వాన్ టెలికం ప్రమోటర్లు వినోద్ గోయెంకా, షాహిద్ బల్వాయి డీబీ గ్రూప్లో అగ్రశ్రేణి ఎగ్జిక్యూటివ్లుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సదరు రూ.200 కోట్ల లంచాన్ని.. డీబీ గ్రూప్నకు వాటాలున్న కుసేగావ్ ఫ్రూట్స్, సినీయుగ్ ఫిల్మ్స్ ద్వారా మళ్లించారు. రాజా ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలు దాచి, నాటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ను తప్పుదోవ పట్టించారని సీబీఐ మొదటి చార్జిషీటు పేర్కొంది.
కనిమొళి పాత్రేంటి?
2011 ఏప్రిల్లో సీబీఐ తన రెండో అభియోగ పత్రాన్ని దాఖలు చేసింది. ఇందులో నాటి డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె కనిమొళిని సహ కుట్రదారుగా పేర్కొంది. కలైనర్ టీవీలో 20 శాతం వాటా కలిగిన ఆమె సదరు 200 కోట్ల లంచాన్ని మళ్లించడంలో మధ్యవర్తిగా వ్యవహరించారని తెలిపింది. ఈ ఛానల్లో 60 శాతం వాటా కలిగిన కరుణానిధి రెండో భార్య దయాళు అమ్మాల్ పేరును ప్రస్తావించలేదు.
రెండో కేసు ఏం చెబుతోంది?
సీబీఐ దాఖలు చేసిన రెండో కేసులో ఎస్సార్ గ్రూప్ ప్రమోటర్ రవి రుయా, ఆయన మేనల్లుడు అన్షుమన్ రుయా, లూప్ టెలికం ప్రమోటర్ కిరణ్ ఖైతాన్, ఆమె భర్త ఐపీ ఖైతాన్, ఎస్సార్ గ్రూప్ డైరెక్టర్ వికాస్ సరాఫ్లు నిందితులుగా ఉన్నారు. లూప్ టెలికంకు 21 లైసెన్సులు మంజూరయ్యాయి. అర్హత లేకపోయినప్పటికీ ఎస్సార్ గ్రూప్.. లూప్ టెలికంను ముసుగు సంస్థగా ఉపయోగించుకొని లైసెన్సులను పొందిందని సీబీఐ ఆరోపించింది. అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందంటూ రాజా, కనిమొళి సహా నిందితులందరినీ నిర్దోషులుగా తేల్చుతూ డిసెంబరు 31, 2017న ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది.
కేసును ఎందుకు కొట్టివేశారంటే..
- అప్పటి టెలికం మంత్రి రాజా, శాఖలోని అధికారులతో కలిసి దరఖాస్తుల గడవును ముందకు మార్చారనడంలో, మొదటి వచ్చిన వారికి మొదటి కేటాయింపు పద్దతిలోనూ అవకతవకలు జరిగాయని సీబీఐ రుజువు చేయలేకపోయింది.
- టెలికం శాఖ కంటే ముందు యూపీఏ ప్రభుత్వంలో పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేసిన రాజ అప్పుడే 2జీ లబ్ధదారులతో సంబంధాలు ఏర్పర్చుకున్నారని నిరూపించేందుకు సీబీఐ ఎలాంటి ఆధారాలను చూపించలేకపోయింది.
- స్వాన్ టెలికం, యూనిటెక్ గ్రూప్ కంపెనీస్కు అర్హత లేకపోయినప్పటికీ.. వారికి స్పెక్ట్రమ్ కేటయించారని ఎలాంటి ఆధారాలు లభించలేదు.
- స్పెక్ట్రమ్ కేటాయంపులకు ప్రతిఫలంగానే కలైనర్ టీవీలోకి రూ.200 కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీబీఐ నిరూపించలేకపోయింది. పైగా రాజాకు దీనికి సంబంధం ఉన్నట్లు కూడా ఎలాంటి ఆధారాలు లేవు.
- వీటి కారణంగా కేసును కొట్టివేస్తూ, నిందుతులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. అయితే, దీనిపై సీబీఐ దిల్లీ హైకోర్టుకు అప్పీల్కు వెళ్లింది. ఇది ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా