Electric Vehicles: చలిలో విద్యుత్ వాహనాల వాడకం.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
Electric Vehicles: శీతాకాలంలో విద్యుత్ వాహనాల పనితీరు కాస్త భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే పడిపోతే మాత్రం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
Electric Vehicles | ఇంటర్నెట్ డెస్క్: గతకొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. చలి విజృంభిస్తోంది. ఇలాంటి వాతావరణంలో విద్యుత్ వాహనాల (Electric Vehicles- EV) పనితీరు భిన్నంగా ఉంటుంది. లిథియం-అయాన్ బ్యాటరీల్లో ఛార్జింగ్ త్వరగా తగ్గిపోతుంది. అలా ఎందుకు జరుగుతుంది? శీతల వాతావరణంలో ఈవీలను ఎలా మెయింటైన్ చేయాలి? ఛార్జ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..!
ఎలాంటి ప్రభావం ఉంటుంది?
శీతాకాలంలో ఈవీల (Electric Vehicles) పనితీరు సాధారణం కంటే 20-30 శాతం తగ్గుతుందని వాహన నిపుణులు చెబుతున్నారు. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. బ్యాటరీ పనితీరు తగ్గడం ఒకటైతే.. శక్తి వినియోగం పెరగడం మరొకటి. EVల లిథియం-అయాన్ బ్యాటరీలు 15-25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో సరిగ్గా పనిచేస్తాయి. మరోవైపు చలికాలంలో వాహనాలకు అవసరమైన వేడి కోసం.. బ్యాటరీ నుంచే ఎక్కువ శక్తిని తీసుకోవాల్సి వస్తుంది. దీంతో సాధారణ సమయంలో కంటే శీతాకాలంలో బ్యాటరీ వినియోగం పెరుగుతుంది.
మరోవైపు చలిలో రీజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థ అంత ప్రభావవంతంగా పనిచేయదు. సాధారణ సమయంలో ఈ అత్యాధునిక బ్రేకింగ్ వ్యవస్థ వల్ల బ్యాటరీ కొంతమేర ఛార్జ్ అవుతుంది. శీతాకాలంలో మాత్రం కుదరదు. ఈ నేపథ్యంలో చల్లని వాతావరణంలో ఈవీలను (Electric Vehicles) డ్రైవ్ చేయడం కొంత భిన్నంగా అనిపించవచ్చు. పైగా మాన్యువల్ బ్రేకింగ్ను ఉపయోగించాల్సి రావచ్చు.
ఇలా ఎందుకు జరుగుతుంది?
చలిలో లిథియం అయాన్ బ్యాటరీల్లోని ఎలక్ట్రోలైట్ ద్రవం మందంగా మారుతుంది. దీంతో ఎలక్ట్రోకెమికల్ ప్రక్రియ నెమ్మదిస్తుంది. ఫలితంగా బ్యాటరీల అంతర్గత నిరోధం పెరుగుతుంది. దీంతో లిథియం అయాన్లు.. యానోడ్, క్యాథోడ్ మధ్య సులభంగా చలించలేవు. ఇలాంటి స్థితిలో బ్యాటరీ నుంచి ఒక్కసారిగా శక్తిని తీసుకోవడం ప్రారంభిస్తే వోల్టేజ్ గణనీయంగా పడిపోయి డిశ్ఛార్జ్కు దారితీస్తుంది.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
- వీలైనంత వరకు ఈవీలను (Electric Vehicles) బహిరంగ ప్రదేశాల్లో పార్క్ చేయొద్దు. ఇండోర్(Indoor)లో పార్క్ చేయడం వల్ల వాటిపై చలి ప్రభావం కొంతమేర తగ్గుతుంది. కుదరకపోతే కనీసం కవర్తోనైనా కప్పి ఉంచాలి.
- ఈవీల (Electric Vehicles) ఛార్జింగ్ 20 శాతం కంటే దిగువకు పడిపోకుండా చూసుకోవాలి. లేదంటే వాహనాన్ని స్టార్ట్ చేసినప్పుడు కొన్ని పరికరాలు వేడి కావడానికి బ్యాటరీ నుంచి శక్తిని తీసుకుంటాయి. దీంతో బ్యాటరీ మరింత తొందరగా డిశ్ఛార్జ్ అవుతుంది. ఒకవేళ చలికాలంలో దూర ప్రయాణాలను ప్లాన్ చేస్తే.. కనీసం 80 శాతానికి పైనే ఛార్జింగ్ ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
- ప్రయాణం ప్రారంభించడానికి ముందే ఎలక్ట్రిక్ కార్లను ప్రీ-కండిషన్ చేయాలి. ఇంటీరియర్ను వేడెక్కించడానికి బ్యాటరీ నుంచే శక్తిని తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఛార్జింగ్ పెట్టడానికి ఆస్కారం ఉన్న సమయంలోనే కారును ప్రయాణానికి సిద్ధం చేసుకుంటే.. తరిగిపోయిన బ్యాటరీని తిరిగి ఛార్జ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ముఖ్యంగా దూర ప్రయాణాలకు వెళ్లే ముందు ఈ జాగ్రత్త చాలా అవసరం.
- వాహనాల పనితీరుపై టైర్లలోని గాలి ఒత్తిడి ప్రభావం చూపుతుంది. ఉష్ణోగ్రతలకు అనుగుణంగా టైర్లలో గాలి ఒత్తిడి మారుతుంటుంది. ఇది ఈవీల రేంజ్పై ప్రభావం చూపుతుంది. అందుకే టైర్లలో సరిపడా గాలి ఉండేలా ఎప్పటికప్పుడు చూసుకోవాలి.
- చలికాలంలో బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. బ్యాటరీ చల్లగా ఉంటే మరింత సమయం కావాల్సిందే. అందుకే బ్యాటరీ వేడిగా ఉన్నప్పుడే ఛార్జింగ్ పెట్టడం మేలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km
electric scooter: భారత్ మార్కెట్లోకి మరో కొత్త విద్యుత్ స్కూటర్ వచ్చేసింది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన యాంపియర్ ఈ స్కూటర్ను లాంచ్ చేసింది. -
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
Mahindra XUV 3XO: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎక్స్యూవీ 3XOను లాంచ్ చేసింది. దీని ధర రూ.7.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ధరలు తగ్గించిన ఓలా.. ఎస్1X ఇక రూ.69,999 నుంచే!
ఓలా తన ఎస్1 ఎక్స్ స్కూటర్ల ధరలను తగ్గించింది. ఇకపై వీటి ధరలు రూ.69వేల నుంచే ప్రారంభం కానున్నాయి. -
2023-24లో 5.5% తగ్గిన వాహన ఎగుమతులు
Automobile exports: 2024 ఆర్థిక సంవత్సరంలో వాహన ఎగుమతులు 5.5శాతం తగ్గాయని తయారీదార్ల సమాఖ్య వెల్లడించింది. -
ఓలా నుంచి త్వరలో మరో స్కూటర్.. ఎస్1 ఎక్స్ సిరీస్లో ఈ ఫీచర్లతో!
Ola Electric: ఓలా మరో స్కూటర్ తీసుకురాబోతోంది. ఎస్1 ఎక్స్ సిరీస్లో అప్డేట్ చేసిన వెర్షన్ వస్తోంది. -
విపణిలోకి ఎంజీ హెక్టార్ బ్లాక్స్టార్మ్
ఎంజీ (మోరిస్ గ్యారేజెస్) మోటార్ సంస్థ, తమ హెక్టార్ మోడల్లో సరికొత్త బ్లాక్స్టార్మ్ ఎడిషన్ను తీసుకొచ్చింది. -
స్విఫ్ట్, విటారా ధరల్ని పెంచిన మారుతీ సుజుకీ
Maruti Suzuki: మారుతీ సుజుకీ ఇండియా తన విపణిలోని కొన్ని మోడల్ వాహనాల ధరల్ని పెంచినట్లు బుధవారం ప్రకటించింది. -
బజాజ్ నుంచి కొత్త పల్సర్ N250
Bajaj Pulsar N250: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో కొత్త N250ని లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ @ రూ.20.5 లక్షలు
Jeep Compass: జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ విడుదలైంది. దీన్ని పూర్తిగా బ్లాక్-గ్లాస్ ఫినిష్తో తీర్చిదిద్దింది. -
2023-24 వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి.. కార్లు, ట్రాక్టర్లలో రికార్డు!
Automobile retail sales: వాహనాల లభ్యత మెరుగవ్వడం, కొత్త మోడళ్ల విడుదల వంటి అంశాలు దోహదం చేయటంతో విక్రయాలు పుంజుకున్నట్లు ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. -
ఏథర్ నుంచి ఫ్యామిలీ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 160 km
ఏథర్ సంస్థ రిజ్తా పేరుతో ఫ్యామిలీ స్కూటర్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.1.10 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్
టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్లో మరిన్ని ప్రీమియం మోడళ్లను తీసుకురావాలని భావిస్తోందని కంపెనీ డిప్యూటీ ఎండీ తడషి అసజుమా పేర్కొన్నారు. -
బీఎండబ్ల్యూ.. టాటా టెక్ జాయింట్ వెంచర్
BMW-Tata Tech: జాయింట్ వెంచర్ నుంచి బీఎండబ్ల్యూ (BMW) గ్రూప్నకు చెందిన ప్రీమియం వాహనాలకు కావాల్సిన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ (SDV) సొల్యూషన్స్తో పాటు ఇతర ఐటీ సేవలను అందించనున్నారు. -
వాహన బీమా సంస్థల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో సాధారణ బీమా సంస్థలకు సంబంధించి.. వాహన బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి. -
ట్రాక్టర్ల వ్యాపారానికి ఫోర్స్ మోటార్స్ గుడ్బై
Force Motors: ఆటో మొబైల్ కంపెనీ ఫోర్స్ మోటార్స్ వ్యవసాయ ట్రాక్టర్ల వ్యాపారం నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
Xiaomi Car: షావోమి కారు ధర ఎంత ఉండొచ్చంటే.. సీఈఓ మాటల్లో!
Xiaomi Car: షావోమి కార్ల ఆర్డర్లు చైనాలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ కారు ధరపై సోమవారం ఆసక్తిక విషయం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM