Auto Sector: 2024లో ఈవీలదే జోరు.. పరిశ్రమ వర్గాల అంచనా
Auto Sector: వాహన పరిశ్రమలో 2023లో రికార్డు స్థాయి విక్రయాలు నమోదయ్యాయి. అయితే, 2024పై మాత్రం పరిశ్రమ వర్గాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి.
దిల్లీ: ఈ ఏడాది వాహన రంగంలో రికార్డు స్థాయి విక్రయాలు నమోదయ్యాయి. అయితే, కొత్త సంవత్సరంలో అమ్మకాలు తగ్గొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు విద్యుత్ వాహనాలు (Electric Vehicle) సహా ఇతర స్వచ్ఛ ఇంధన ఆధారిత వాహనాలను స్వీకరించడానికి వినియోగదారులు సిద్ధమవుతున్నారు.
ప్రయాణికుల వాహన విక్రయాలు ఈ ఏడాది ముగిసే నాటికి 40 లక్షల యూనిట్లు దాటేస్తాయని అంచనా. జనవరి నుంచి ధరలు పెరుగుతుండడం సహా సంవత్సరాంతపు ఆఫర్లతో డిసెంబర్ చివర్లో అమ్మకాలు గణనీయంగా పుంజుకునే అవకాశాలున్నాయి. అయితే, వచ్చే ఏడాది విక్రయాల వృద్ధి కాస్త మందగిస్తుందని మారుతీ సుజుకీ ఛైర్మన్ ఆర్సీ.భార్గవ అంచనా వేశారు. ఈ తరుణంలో వాహన పరిశ్రమలో వేగవంతమైన వృద్ధి కోసం చిన్న కార్ల విభాగాన్ని పునరుద్ధరించడం చాలా అవసరమన్నారు. ప్రయాణికుల వాహన విభాగంలో ఎంట్రీ లెవెల్ కార్ల వాటా 2018-19లో 14 శాతంగా ఉండేది. ఈ ఏడాది ఏప్రిల్- అక్టోబర్ నాటికి అది 4 శాతానికి తగ్గింది.
వచ్చే ఏడాది విద్యుత్ వాహన విక్రయాలు (Electric Vehicle Sales) పుంజుకుంటాయని భార్గవ అంచనా వేశారు. అయితే, తటస్థ కర్బన ఉద్గార లక్ష్యాన్ని సాధించే దిశగా ఇతర హరిత సాంకేతికతలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. దాదాపు అన్ని విభాగాల్లో ఈవీల వాటా పెరుగుతుందని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మేనన్ తెలిపారు. మొత్తంగా 2024లో వాహన విక్రయాల ఔట్లుక్ సానుకూలంగా ఉందని పేర్కొన్నారు. మరోవైపు ప్రస్తుతం అమల్లో ఉన్న ఫేమ్ స్కీమ్ (FAME Scheme) 2024 మార్చిలో ముగియనుండగా.. ప్రభుత్వం మరోకొత్త పథకంతో ముందుకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పుడే వినియోగదారులకు అందుబాటు ధరల్లో ఈవీలు లభిస్తాయన్నారు.
‘ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్’ అధ్యక్షుడు మనీష్ రాజ్ సింఘానియా మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఆటోమొబైల్ రంగం (Automobile Industry) స్థిరమైన వృద్ధికి సిద్ధంగా ఉందని అంచనా వేశారు. ప్రయాణికుల వాహన విభాగంలో తక్కువ వృద్ధి నమోదవుతుందన్నారు. ద్విచక్ర వాహనాల్లో అత్యధిక వృద్ధిని అంచనా వేశారు. మరోవైపు ఎస్యూవీలకు వచ్చే ఏడాది మరింత గిరాకీ ఉంటుందని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు. ప్రస్తుతం 49 శాతంగా ఉన్న వీటి వాటా వచ్చే ఏడాదికి 50 శాతం మించిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు వచ్చే ఏడాది మరిన్ని కొత్త వాహనాలను మార్కెట్లోకి తీసుకొస్తామని టాటా మోటార్స్ ప్యాసెంజర్ వెహికల్స్ ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు. అలాగే కొత్త ఏడాదిలో ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రధానంగా దృష్టి సారిస్తామని మహీంద్రా అండ్ మహీంద్రా వెల్లడించింది. విలాసవంతవైన కార్ల విభాగంలోనూ వచ్చే ఏడాది మంచి వృద్ధి నమోదవుతుందని పలు కంపెనీలు అంచనా వేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km
electric scooter: భారత్ మార్కెట్లోకి మరో కొత్త విద్యుత్ స్కూటర్ వచ్చేసింది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన యాంపియర్ ఈ స్కూటర్ను లాంచ్ చేసింది. -
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
Mahindra XUV 3XO: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎక్స్యూవీ 3XOను లాంచ్ చేసింది. దీని ధర రూ.7.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ధరలు తగ్గించిన ఓలా.. ఎస్1X ఇక రూ.69,999 నుంచే!
ఓలా తన ఎస్1 ఎక్స్ స్కూటర్ల ధరలను తగ్గించింది. ఇకపై వీటి ధరలు రూ.69వేల నుంచే ప్రారంభం కానున్నాయి. -
2023-24లో 5.5% తగ్గిన వాహన ఎగుమతులు
Automobile exports: 2024 ఆర్థిక సంవత్సరంలో వాహన ఎగుమతులు 5.5శాతం తగ్గాయని తయారీదార్ల సమాఖ్య వెల్లడించింది. -
ఓలా నుంచి త్వరలో మరో స్కూటర్.. ఎస్1 ఎక్స్ సిరీస్లో ఈ ఫీచర్లతో!
Ola Electric: ఓలా మరో స్కూటర్ తీసుకురాబోతోంది. ఎస్1 ఎక్స్ సిరీస్లో అప్డేట్ చేసిన వెర్షన్ వస్తోంది. -
విపణిలోకి ఎంజీ హెక్టార్ బ్లాక్స్టార్మ్
ఎంజీ (మోరిస్ గ్యారేజెస్) మోటార్ సంస్థ, తమ హెక్టార్ మోడల్లో సరికొత్త బ్లాక్స్టార్మ్ ఎడిషన్ను తీసుకొచ్చింది. -
స్విఫ్ట్, విటారా ధరల్ని పెంచిన మారుతీ సుజుకీ
Maruti Suzuki: మారుతీ సుజుకీ ఇండియా తన విపణిలోని కొన్ని మోడల్ వాహనాల ధరల్ని పెంచినట్లు బుధవారం ప్రకటించింది. -
బజాజ్ నుంచి కొత్త పల్సర్ N250
Bajaj Pulsar N250: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో కొత్త N250ని లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ @ రూ.20.5 లక్షలు
Jeep Compass: జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ విడుదలైంది. దీన్ని పూర్తిగా బ్లాక్-గ్లాస్ ఫినిష్తో తీర్చిదిద్దింది. -
2023-24 వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి.. కార్లు, ట్రాక్టర్లలో రికార్డు!
Automobile retail sales: వాహనాల లభ్యత మెరుగవ్వడం, కొత్త మోడళ్ల విడుదల వంటి అంశాలు దోహదం చేయటంతో విక్రయాలు పుంజుకున్నట్లు ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. -
ఏథర్ నుంచి ఫ్యామిలీ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 160 km
ఏథర్ సంస్థ రిజ్తా పేరుతో ఫ్యామిలీ స్కూటర్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.1.10 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్
టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్లో మరిన్ని ప్రీమియం మోడళ్లను తీసుకురావాలని భావిస్తోందని కంపెనీ డిప్యూటీ ఎండీ తడషి అసజుమా పేర్కొన్నారు. -
బీఎండబ్ల్యూ.. టాటా టెక్ జాయింట్ వెంచర్
BMW-Tata Tech: జాయింట్ వెంచర్ నుంచి బీఎండబ్ల్యూ (BMW) గ్రూప్నకు చెందిన ప్రీమియం వాహనాలకు కావాల్సిన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ (SDV) సొల్యూషన్స్తో పాటు ఇతర ఐటీ సేవలను అందించనున్నారు. -
వాహన బీమా సంస్థల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో సాధారణ బీమా సంస్థలకు సంబంధించి.. వాహన బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి. -
ట్రాక్టర్ల వ్యాపారానికి ఫోర్స్ మోటార్స్ గుడ్బై
Force Motors: ఆటో మొబైల్ కంపెనీ ఫోర్స్ మోటార్స్ వ్యవసాయ ట్రాక్టర్ల వ్యాపారం నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
Xiaomi Car: షావోమి కారు ధర ఎంత ఉండొచ్చంటే.. సీఈఓ మాటల్లో!
Xiaomi Car: షావోమి కార్ల ఆర్డర్లు చైనాలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ కారు ధరపై సోమవారం ఆసక్తిక విషయం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM