Elon Musk: త్వరలో ఎలాన్ మస్క్ బయోపిక్
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ జీవితం సినిమా రూపంలో రానుంది. ఆయన ఆత్మకథ ఆధారంగా బయోపిక్ను నిర్మించనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తుల జీవిత విశేషాలతో బయోపిక్లు వస్తున్నాయి. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు, రాజకీయ నేతల జీవితాలు వెండితెరపై ఆవిష్కృతమయ్యాయి. తాజాగా టెస్లా (Tesla) అధినేత ఎలాన్ మస్క్ జీవితం త్వరలో సినిమాగా రాబోతుంది. రెండు నెలల క్రితం ఆయన జీవిత కథ పుస్తకం రూపంలో ‘ఎలాన్ మస్క్ (Elon Musk)’ పేరుతో మార్కెట్లోకి విడుదలైంది. వాల్టర్ ఐజాక్సన్ (Walter Isaacson) అనే అమెరికన్ రచయిత దీన్ని రచించాడు. దక్షిణాఫ్రికాలో సాధారణ కుటుంబంలో జన్మించిన మస్క్ ప్రపంచ కుబేరుడిగా ఎలా ఎదిగారు? జీవితంలో గొప్ప విజయాలు ఎలా సాధించారు? వంటి అంశాల గురించి ఈ పుస్తకంలో వివరించారు.
ప్రస్తుతం ఈ పుస్తకం ఆధారంగానే మస్క్ బయోపిక్ తీస్తున్నారు. ఈ మేరకు ఏ24 అనే చిత్ర నిర్మాణ సంస్థ మస్క్ బయోపిక్ తీసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం పుస్తక రచయిత నుంచి నిర్మాణ సంస్థ హక్కులను సొంతం చేసుకుంది. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ డారెన్ ఆర్న్ఫోస్కీ (Darren Aronofsky) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. గతంలో ఈయన బ్లాక్ స్వాన్, పై, ది వేల్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ బయోపిక్లో మస్క్ వృత్తి జీవితంతోపాటు, వ్యక్తిగత జీవిత విశేషాలను కూడా చూపించనున్నారు. అయితే, మస్క్ పాత్రలో ఎవరు నటిస్తారనే వివరాలను వెల్లడించలేదు.
విడిపోతున్న బిలియనీర్ గౌతమ్ సింఘానియా దంపతులు
ఎలాన్ మస్క్.. అంతరిక్ష ప్రయోగాల కోసం 2002లో స్పేస్ఎక్స్ను, 2003లో ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాను స్థాపించాడు. ఆ తర్వాత ది బోరింగ్, న్యూరాలింక్, సోలార్ సిటి వంటి సంస్థలను నెలకొల్పారు. ఈ క్రమంలోనే గతేడాది సోషల్ మీడియా సంస్థ ట్విటర్ను సైతం కొనుగోలు చేసి, దాని పేరును ఎక్స్గా మార్చారు. త్వరలో దాన్ని సూపర్ యాప్గా మార్చనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ప్రపంచ కుబేరుల జాబితాలో మస్క్ మొదటి స్థానంలో నిలిచాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐవీఎంఏ అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణ ఎల్ల
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల, ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐవీఎంఏ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
యూపీఐ వినియోగిస్తున్నా.. నగదు ఉపసంహరణలూ పెరిగాయ్
దేశంలో యూపీఐ ఆధారిత చెల్లింపులు పెరిగినా, గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు 5.51% పెరిగాయి. -
వడ్డీ విధింపులో పారదర్శకత పాటించాలి
రుణాలపై వడ్డీ వసూలు విషయంలో అన్యాయమైన పద్ధతులను అనుసరిస్తున్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. -
కనీసం 10,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటాం
జనరేటివ్ ఏఐ(కృత్రిమ మేధ)లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ కంపెనీ సిద్ధమైందని హెచ్సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ విజయ్ కుమార్ తెలిపారు. -
మదుపర్ల సంపద రూ.406.52 లక్షల కోట్లు
బ్యాంకింగ్ షేర్ల జోరుతో సోమవారం దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికాలో బాండ్ రాబడులు తగ్గడం, అక్కడి టెక్ కంపెనీలు త్రైమాసిక ఫలితాల్లో రాణిస్తాయన్న అంచనాలు అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా మారాయి. -
మాపై ఆరోపణలన్నీ అవాస్తవాలే
18 నెలల కంటే తక్కువ వయసున్న చిన్నారుల ఆహార ఫార్ములేషన్ను అంతర్జాతీయ పద్ధతిలో నిర్ణయిస్తామని నెస్లే ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) సురేశ్ నారాయణ్ పేర్కొన్నారు. -
రుసుముల రూపేణా బీఎస్ఈపై రూ.165 కోట్ల భారం
ఆప్షన్ల కాంట్రాక్టులపై, ప్రీమియం విలువ మీద కాకుండా.. నోషనల్ వ్యాల్యూ మీద రుసుము చెల్లించాల్సిందిగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీని (బీఎస్ఈ) సెబీ ఆదేశించింది. -
అల్ట్రాటెక్ సిమెంట్ డివిడెండ్ 700%
ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్, జనవరి- మార్చి త్రైమాసిక నికర లాభం ఏకీకృత పద్ధతిలో 35.24% పెరిగి రూ.2,258.58 కోట్లకు చేరింది. -
హైసియా నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల
హైసియా (హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్) నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల ఎన్నియ్యారు. -
ఓలా మొబిలిటీ సీఈఓ రాజీనామా
ఓలా మొబిలిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) హేమంత్ బక్షి రాజీనామా చేశారని తెలుస్తోంది. -
ఈఎస్జీ రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థకు అనుమతి
పర్యావరణ, సామాజిక, పరిపాలన (ఈఎస్జీ) రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థ ప్రగతి డెవలప్మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్ లిమిటెడ్కు (పీడీసీఎస్ఎల్) సెబీ అనుమతి ఇచ్చింది. -
విపణిలోకి మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ
కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో సరికొత్త ఎక్స్యూవీ 3ఎక్స్ఓను మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేసింది. -
అంకురాల కోసం రూ.50 కోట్లు
అంకురాలకు పెట్టుబడులను అందించేందుకు ది యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ (వైఈఏ) రూ.50 కోట్ల నిధులను అందుబాటులోకి తెచ్చింది. -
సంక్షిప్త వార్తలు
అగ్రశ్రేణి ఎరువుల కంపెనీ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, కాకినాడలో ఫాస్పారిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంట్లు నిర్మించనుంది. ఈ ప్లాంట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
-
65 ఏళ్లు నిండిన అంగన్వాడీ సిబ్బందికి విశ్రాంతి
-
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
-
మార్కుల విషయమై తల్లీ కుమార్తెల ఘర్షణ.. పరస్పరం కత్తిపోట్లు
-
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
-
బ్యాంకాక్ ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి మూడు టైటిల్స్ కైవసం