Elon Musk: ఒకే రోజు మస్క్ సంపదలో రూ.1.30 లక్షల కోట్లు ఆవిరి
Elon Musk: జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో టెస్లా బలహీన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. దీంతో గురువారం కంపెనీ షేర్లు భారీగా నష్టపోయాయి. ఈ సంస్థలో అత్యధిక వాటాలున్న మస్క్ సంపదలో భారీ పతనం నమోదైంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) సంపద గురువారం భారీగా కుంగింది. టెస్లా షేర్ల (Tesla Shares) పతనమే అందుకు కారణం. జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో టెస్లా (Tesla) ఫలితాలు మదుపర్లను నిరాశపర్చాయి. దీంతో గురువారం కంపెనీ షేర్ల (Tesla Shares)లో అమ్మకాలు వెల్లువెత్తాయి.
టెస్లా షేర్ల (Tesla Shares) పతనంతో మస్క్ (Elon Musk) సంపదలో 16.1 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.30 లక్షల కోట్లు) ఆవిరయ్యాయి. అయినప్పటికీ.. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. 210 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది మస్క్ (Elon Musk) సంపద ఇప్పటి వరకు 70 బిలియన్ డాలర్లు పెరిగింది. టెస్లా షేర్లు (Tesla Shares) గురువారం ఏకంగా 9.3 శాతం నష్టపోయి 220.11 డాలర్ల వద్ద స్థిరపడింది. మస్క్కు ఈ కంపెనీలో 13 శాతం వాటాలు ఉన్నాయి. ఆయన సంపదలో అత్యధిక భాగం టెస్లా షేర్లదే.
ఇతర కంపెనీల నుంచి వస్తున్న పోటీని తట్టుకొని నిలబడేందుకు టెస్లా (Tesla) గత కొన్ని నెలల్లో కార్ల ధరలను భారీగా తగ్గించింది. దీంతో జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభంలో ఏకంగా 44 శాతం క్షీణత నమోదైంది. ఆదాయం కూడా విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో టెస్లా షేర్ల (Tesla Shares)లో పతనం నమోదైంది. టెస్లా ఆర్థిక ఒడుదొడుకుల ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కోగలదంటూ ఇప్పటి వరకు చెప్పిన మస్క్ (Elon Musk).. బుధవారం ఫలితాల ప్రకటన సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వడ్డీరేట్ల పెంపు వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చాలా తీవ్రంగా ఉందని వ్యాఖ్యానించారు. దీని వల్లే గిరాకీ నెమ్మదించిందని తెలిపారు. ఎలాంటి సవాళ్లు ఎదురైనప్పటికీ.. కస్టమర్లకు అందించాల్సిన 1.8 మిలియన్ల కార్లను డెలివరీ చేసి తీరతామని టెస్లా తెలిపింది. మరోవైపు నవంబరులో టెస్లా తమ సైబర్ట్రక్ను విడుదల చేసే యోచనలో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐవీఎంఏ అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణ ఎల్ల
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల, ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐవీఎంఏ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
యూపీఐ వినియోగిస్తున్నా.. నగదు ఉపసంహరణలూ పెరిగాయ్
దేశంలో యూపీఐ ఆధారిత చెల్లింపులు పెరిగినా, గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు 5.51% పెరిగాయి. -
వడ్డీ విధింపులో పారదర్శకత పాటించాలి
రుణాలపై వడ్డీ వసూలు విషయంలో అన్యాయమైన పద్ధతులను అనుసరిస్తున్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. -
కనీసం 10,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటాం
జనరేటివ్ ఏఐ(కృత్రిమ మేధ)లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ కంపెనీ సిద్ధమైందని హెచ్సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ విజయ్ కుమార్ తెలిపారు. -
మదుపర్ల సంపద రూ.406.52 లక్షల కోట్లు
బ్యాంకింగ్ షేర్ల జోరుతో సోమవారం దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికాలో బాండ్ రాబడులు తగ్గడం, అక్కడి టెక్ కంపెనీలు త్రైమాసిక ఫలితాల్లో రాణిస్తాయన్న అంచనాలు అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా మారాయి. -
మాపై ఆరోపణలన్నీ అవాస్తవాలే
18 నెలల కంటే తక్కువ వయసున్న చిన్నారుల ఆహార ఫార్ములేషన్ను అంతర్జాతీయ పద్ధతిలో నిర్ణయిస్తామని నెస్లే ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) సురేశ్ నారాయణ్ పేర్కొన్నారు. -
రుసుముల రూపేణా బీఎస్ఈపై రూ.165 కోట్ల భారం
ఆప్షన్ల కాంట్రాక్టులపై, ప్రీమియం విలువ మీద కాకుండా.. నోషనల్ వ్యాల్యూ మీద రుసుము చెల్లించాల్సిందిగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీని (బీఎస్ఈ) సెబీ ఆదేశించింది. -
అల్ట్రాటెక్ సిమెంట్ డివిడెండ్ 700%
ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్, జనవరి- మార్చి త్రైమాసిక నికర లాభం ఏకీకృత పద్ధతిలో 35.24% పెరిగి రూ.2,258.58 కోట్లకు చేరింది. -
హైసియా నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల
హైసియా (హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్) నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల ఎన్నియ్యారు. -
ఓలా మొబిలిటీ సీఈఓ రాజీనామా
ఓలా మొబిలిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) హేమంత్ బక్షి రాజీనామా చేశారని తెలుస్తోంది. -
ఈఎస్జీ రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థకు అనుమతి
పర్యావరణ, సామాజిక, పరిపాలన (ఈఎస్జీ) రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థ ప్రగతి డెవలప్మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్ లిమిటెడ్కు (పీడీసీఎస్ఎల్) సెబీ అనుమతి ఇచ్చింది. -
విపణిలోకి మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ
కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో సరికొత్త ఎక్స్యూవీ 3ఎక్స్ఓను మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేసింది. -
అంకురాల కోసం రూ.50 కోట్లు
అంకురాలకు పెట్టుబడులను అందించేందుకు ది యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ (వైఈఏ) రూ.50 కోట్ల నిధులను అందుబాటులోకి తెచ్చింది. -
సంక్షిప్త వార్తలు
అగ్రశ్రేణి ఎరువుల కంపెనీ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, కాకినాడలో ఫాస్పారిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంట్లు నిర్మించనుంది. ఈ ప్లాంట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.