New Rules: NPS విత్డ్రాలో మార్పులు.. పాలసీలకు కేవైసీ.. రేపటి నుంచే!
New Rules From Jan 1st: కొత్త ఏడాదిలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. లాకర్లకు కొత్త నిబంధనలు, క్రెడిట్ కార్డు రివార్డుల్లో మార్పులు వంటివి అందులో ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: పాత ఏడాదికి గుడ్బై చెప్పి కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం. ఇప్పటికే చాలా మంది కొత్త ఏడాదిలో ఏమేం చేయాలో నిర్ణయించుకుని ఉంటారు. ఆర్థిక విషయాల గురించీ ప్రణాళికలు రూపొందించుకుని ఉంటారు. అలాగే కొత్త ఏడాదిలో వచ్చే మార్పులు కూడా పనిలో పనిగా తెలుసుకోండి. బీమా పాలసీల కొనుగోలుకు కేవైసీ, ఎన్పీఎస్ పాక్షిక విత్డ్రా, క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్స్ సహా మరికొన్ని మార్పులు రాబోతున్నాయి. అవేంటో చూసేయండి..
అన్ని పాలసీలకూ కేవైసీ
2023 జనవరి 1 నుంచి కొనుగోలు, పునరుద్ధరణ చేసే అన్ని రకాల పాలసీల (జీవిత, ఆరోగ్య, మోటారు, ప్రయాణం, గృహ బీమా)కు ఐఆర్డీఏఐ కేవైసీ తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ఆరోగ్య బీమాలో రూ.1 లక్ష, అంతకంటే ఎక్కువ క్లెయిం విలువ ఉన్న వినియోగదారులు మాత్రమే కేవైసీ పత్రాలు ఇస్తున్నారు. ఇప్పటివరకు జీవితేతర లేదా సాధారణ బీమా పాలసీలను తీసుకోవడానికి కేవైసీ పత్రాలు తప్పనిసరి కాదు. అయితే, ఇప్పుడు అన్ని రకాల పాలసీలకు కేవైసీ ఇవ్వాల్సి ఉంటుంది.
ఎన్పీఎస్ పాక్షిక విత్డ్రా రూల్స్లో మార్పు
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రేపటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. పాక్షిక విత్డ్రాల కోసం నోడల్ ఆఫీస్ ద్వారా రిక్వెస్ట్ పంపించాల్సి ఉంటుంది. సపోర్టింగ్ డాక్యుమెంట్లు కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు పాక్షిక విత్డ్రాలకు సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోయేది.
లాకర్లకు కొత్త రూల్స్..
బ్యాంకు లాకర్లకు సంబంధించి 2022 ఆరంభంలోనే ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వాటిని ఆగస్టు నెలలో సమీక్షించి కొన్ని మార్పులు చేసింది. అవే కొత్త సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే లాకర్ సదుపాయం తీసుకున్న కస్టమర్లంతా తమ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాలని బ్యాంకులు సూచించాయి. లాకర్ ఒప్పందంలో ఎలాంటి అనైతిక షరతులను చేర్చడానికి వీల్లేదని కొత్త నిబంధనల్లో ఆర్బీఐ పేర్కొంది. పూర్తి నిబంధనల కోసం క్లిక్ చేయండి..
క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్స్లో కోత
కొత్త సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చేలా కొన్ని బ్యాంకులు తమ రివార్డు ప్రోగ్రాములో మార్పులు చేశాయి. అమెజాన్లో కొన్ని క్రెడిట్కార్డులతో కొనుగోళ్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో ఇచ్చిన రివార్డు పాయింట్లలో కోత పెట్టింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సైతం రివార్డు పాయింట్ల రిడీమ్ విషయంలో పరిమితులు విధించింది.
కార్ల ధరలు జూమ్
టాటా మోటార్స్, మారుతీ సుజుకీ సహా ఆడి, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్ల తయారీ సంస్థలు సైతం కొత్త ఏడాదిలో ధరలు పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ఉత్పత్తి వ్యయం పెరగడం, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ఉద్గార నిబంధనల నేపథ్యంలో ధరలు సవరిస్తున్నట్లు తెలిపాయి. దీంతో పాటు గ్యాస్ సిలిండర్ ధరల్లోనూ జనవరి 1న మార్పులు ఉండొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా తన బ్యాగేజీ పాలసీని మార్చింది. కొత్త రూల్స్ మే 2 నుంచి అమల్లోకి వచ్చాయి. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
e-pan: కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు రోజులతరబడి ఎదురుచూడాల్సిన పని లేకుండా తక్షణమే ఈ-పాన్ పొందే సదుపాయం ఉంది. అదెలాగంటే..? -
ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది. -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..
మొబైల్లో వచ్చిన మెసేజ్ను హెడ్డర్ సాయంతో ఎవరు పంపారో ఇట్టే కనిపెట్టేయొచ్చు. అదెలాగంటే..? -
కౌంటర్కు వెళ్లకుండానే ట్రైన్ టికెట్.. UTS యాప్తో బుకింగ్ ఎలా..?
UTS app: టికెట్ కొనుగోలును సులభతరం చేసేందుకు రైల్వే శాఖ యూటీఎస్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. అందులో టికెట్ బుకింగ్ ఎలానో ఇప్పుడు చూద్దాం.. -
ఆధార్ కార్డ్లో పుట్టిన తేదీ మార్చుకోవాలా? ఏమేం కావాలి?
Aadhaar Card: ఆధార్ కార్డులో పుట్టిన తేదీలో తప్పుందా? మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఎలా అప్డేట్ చేసుకోవాలో చూడండి.. -
పెట్టుబడి ప్రభుత్వ బాండ్లలో
చిన్న మదుపరులు ప్రభుత్వ బాండ్లలో మదుపు చేసేందుకు 2021లో ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ పోర్టల్ను తీసుకొచ్చింది. దీన్ని మరింత సులభతరం చేసేందుకు వీలుగా ప్రత్యేక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ఈ బాండ్ల గురించి తెలుసుకుందాం. -
టెక్నాలజీ కంపెనీల్లో
బంధన్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా బంధన్ ఇన్నోవేషన్ ఫండ్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ప్రధానంగా టెక్నాలజీ, ఫార్మా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సత్వర వృద్ధి సాధించటానికి ప్రయత్నించే కంపెనీలపై పెట్టుబడి పెట్టి అధిక లాభాలు ఆర్జించటం ఈ పథకం ప్రధాన లక్ష్యం. -
ఆధార్ ఏటీఎం.. ఇంటి నుంచే క్యాష్ విత్డ్రా ఎలా చేసుకోవాలి?
Aadhaar ATM: ఇంటి నుంచే డబ్బు విత్డ్రా చేసుకొనే సదుపాయాన్ని పోస్టల్ శాఖ అందిస్తోంది. దీన్ని ఎలా వినియోగించాలో ఇప్పుడు చూద్దాం.. -
వేసవిలో ఊటీ అందాలు చూసొస్తారా? ₹13 వేల నుంచే ప్యాకేజీ ధరలు
IRCTC tour package: వేసవిలో ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్యాకేజీ మీ కోసమే. ప్రయాణ టికెట్లు, వసతి ఏర్పాట్లతో ఐఆర్సీటీసీ అందుబాటులోకి తెచ్చిన ఈ ప్యాకేజీ వివరాలను ఓసారి పరిశీలించండి. -
టర్మ్ ఇన్సూరెన్స్ కుటుంబానికి భరోసానిచ్చేలా
బీమా పాలసీలు ఎన్నో రకాలుగా ఉంటాయి. కొన్ని పొదుపు చేసేందుకు ఉపయోగపడతాయి. మరికొన్ని పెట్టుబడులకు తోడ్పడతాయి. వీటికి భిన్నంగా పూర్తి రక్షణకే పరిమితమయ్యేవి టర్మ్ పాలసీలు. వీటిని ఆన్లైన్లోనూ తీసుకోవచ్చు. లేదా బీమా సలహాదారును సంప్రదించీ కొనుగోలు చేయొచ్చు. -
కేరళ ప్రకృతి అందాలు చూస్తారా? ₹14 వేల నుంచే IRCTC ప్యాకేజీ
IRCTC tour package: వేసవిలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న కేరళ టూర్ ప్యాకేజీ వివరాల్ని పరిశీలించండి.. -
తిరుమల ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? దర్శనం, ప్రయాణ టికెట్లతో ఐఆర్సీటీసీ ప్యాకేజీలు ఇవే..
Irctc Tirupati: తిరుమల దర్శనం కోసం ప్లాన్ చేస్తున్నారా? రెండు రాష్ట్రాల ప్రజలు గోవిందుడిని దర్శించుకొనేందుకు ఐఆర్సీటీసీ అనేక ప్యాకేజీలు అందిస్తోంది. వాటిని ఓసారి పరిశీలించండి.. -
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
E- insurance: కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి బీమా పాలసీల డిజిటలైజేషన్ను తప్పనిసరి చేస్తున్నట్లు ఐఆర్డీఏఐ ప్రకటించింది. -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
March 31 deadline: మ్యూచువల్ ఫండ్లలో మదుపు ప్రారంభించినప్పుడు విద్యుత్, గ్యాస్ బిల్లులు, బ్యాంకు ఖాతాలు సమర్పించి కేవైసీ నిబంధనలు పూర్తి చేసిన వారు.. మరోసారి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. -
డిజీ లాకర్తో ఆధార్, పాన్ వంటి పత్రాలు ఎప్పుడూ మీ వెంటే.. ఎలా దాచుకోవాలి?
DigiLocker: ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా అన్నీ ఒకేచోట డిజిటల్గా అందుబాటులో ఉంచేందుకు డిజీలాకర్ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంతకీ ఇదెలా ఉపయోగపడుతుందో తెలుసా? -
కేవైసీ అప్డేట్ చేశారా?
బ్యాంకులో ఖాతా ఉందా? మ్యూచువల్ ఫండ్లో మదుపు చేస్తున్నారా? జీవిత, ఆరోగ్య బీమా పాలసీలున్నాయా? మరి, మీ కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) వివరాలు తెలియజేయడం తప్పనిసరి.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యకుమార్ యాదవ్ శతకం.. హైదరాబాద్పై ముంబయి విజయం
-
‘నేనూ ఎంజాయ్ చేశా’.. తనపై వచ్చిన వీడియోను రీట్వీట్ చేసిన మోదీ
-
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
-
ప్రైవేట్ పార్ట్కు బాల్ తగలడంతో బాలుడి మృతి
-
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
-
‘అమ్ముడుపోయే’ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులు : హిమాచల్ సీఎం