ISB: ఐఎస్బీ విద్యార్థులకు రూ.34.21 లక్షల సగటు వేతనం
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో 2023 బ్యాచ్ పీజీపీ (పీజీ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్) విద్యార్థులకు ప్రాంగణ ఎంపికల ద్వారా అత్యంత ఆకర్షణీయ ఉద్యోగాలు, వేతనాలు లభించాయి.
2023 పీజీపీ బ్యాచ్కి 1578 ఉద్యోగ ఆఫర్లు
ప్రాంగణ ఎంపికలో పాల్గొన్న 222 కంపెనీలు
ఈనాడు, హైదరాబాద్: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో 2023 బ్యాచ్ పీజీపీ (పీజీ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్) విద్యార్థులకు ప్రాంగణ ఎంపికల ద్వారా అత్యంత ఆకర్షణీయ ఉద్యోగాలు, వేతనాలు లభించాయి. సగటున ఒక్కో విద్యార్ధికి రూ.34.21 లక్షల వార్షిక వేతనం ఇచ్చేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. ఐఎస్బీ పీజీపీలో చేరకముందు వారికి లభించిన సగటు వార్షిక వేతనం రూ.13.39 లక్షలు. దీంతో పోల్చితే ప్రస్తుత సగటు వేతనం 2.5 రెట్లు ఎక్కువైందని ఐఎస్బీ పేర్కొంది.
ఈ రంగాల నుంచి గిరాకీ: ప్రాంగణ ఎంపికల్లో 222 కంపెనీలు పాల్గొని 1578 ఉద్యోగ ఆఫర్లు ఇచ్చాయి. కన్సల్టింగ్, ఐటీ/ఐటీఈఎస్, ఇంజినీరింగ్ టెక్నాలజీ, బీఎఫ్ఎస్ఐ, ఎఫ్ఎంసీజీ/ రిటైల్ రంగాల కంపెనీలు అధికంగా వచ్చాయి. ఈ సారి 30 కొత్త కంపెనీలు ప్లేస్మెంట్ ప్రక్రియలో పాల్గొన్నాయి. 36 అంతర్జాతీయ కంపెనీలు కూడా పాల్గొని, ఉద్యోగ ఆఫర్లు ఇచ్చాయి. లీడర్షిప్/ జనరల్ మేనేజ్మెంట్ ఉద్యోగాలను ఇవి ఆఫర్ చేశాయి.
* 2023 బ్యాచ్ పీజీపీలో 36% విద్యార్థినులు ఉండటం ప్రత్యేకత. మొత్తం ఉద్యోగ ఆఫర్లలో 40 శాతం వారికే లభించాయి.
అవసరాలకు అనుగుణమైన బోధన వల్లే: ఎంతో వేగంగా మారుతున్న వ్యాపార రంగ స్థితిగతులకు అనుగుణంగా పీజీపీ పాఠ్యప్రణాళికను మార్చడం, బోధనా పద్ధతుల్లో వినూత్న విధానాలు అనుసరించడం ద్వారా విద్యార్థులను సమర్థంగా తీర్చిదిద్దుతున్నట్లు ఐఎస్బీ డిప్యూటీ డీన్ ప్రొఫెసర్ రామభద్రన్ తిరుమలై అన్నారు. అందువల్లే తమ విద్యార్థులకు ఎక్కువ కంపెనీల నుంచి ఉద్యోగ ఆఫర్లు లభించాయని, అధిక జీతభత్యాలు పొందగలుగుతున్నారని తెలిపారు. ప్రస్తుత ప్లేస్మెంట్ ప్రక్రియే దీనికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఐఎస్బీకి హైదరాబాద్, మొహాలీలో ప్రాంగణాలున్నాయి. గత మూడేళ్లుగా ఈ రెండు ప్రాంగణాల విద్యార్థులకు ఉమ్మడిగా ప్లేస్మెంట్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు.
మిత్సుబిషి కోసం ఆజాద్ ఇంజినీరింగ్ ప్రత్యేక యూనిట్
రూ.165 కోట్లతో తునికిబొల్లారం వద్ద
ఈనాడు, హైదరాబాద్: మిత్సుబిషి హెవీ ఇంజినీరింగ్కు గ్యాస్, స్టీమ్ టర్బైన్లలో వినియోగించే విడిభాగాలు ఉత్పత్తి చేసి అందించేందుకు ఆజాద్ ఇంజినీరింగ్ ప్రత్యేకంగా ఒక యూనిట్ ఏర్పాటు చేయనుంది. మేడ్చల్ సమీపంలోని తునికిబొల్లారం వద్ద 11,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ యూనిట్ నిర్మాణానికి 20 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.165 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ఆజాద్ ఇంజినీరింగ్ ఎండీ రాకేష్ ఛోప్దార్ తెలిపారు. ఏడాదిన్నరలో నిర్మాణం పూర్తిచేసి ఉత్పత్తి చేపడతామని, దీనివల్ల కొత్తగా 300 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. ్టదీర్ఘకాల అనుబంధం ఫలితంగా మిత్సుబిషీకి ఓఈఎం (ఒరిజినల్ ఎక్విప్మెంట్ మానుఫ్యాక్చరర్) భాగస్వామిగా ఎదిగినట్లు వివరించారు. ఆజాద్ ఇంజినీరింగ్ నైపుణ్యం, సమర్థత వల్లే తమ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకుంటున్నట్లు మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ సీఈఓ కె.తనక తెలిపారు. ఆజాద్ ఇంజినీరింగ్ ప్రస్తుతం జీఈ, సీమెన్స్, తొషిబా, మ్యాన్, దూసాన్ స్కోడా, జీఈ ఏవియేషన్, బోయింగ్, హనీవెల్, ఈటన్, రాఫెల్ తదితర అంతర్జాతీయ సంస్థలకు పలు రకాల విడిభాగాలు అందిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా (Harsh Goenka) నెట్టింట మరో ఫన్నీ పోస్టు పెట్టారు. అలాగే ఆయన షేర్ చేసిన చిత్రం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. -
ఐఫోన్లు తయారు చేయడం స్టీవ్జాబ్స్కు ఇష్టంలేదట!
Steve Jobs: ఐఫోన్ల తయారు చేయాలన్న ఆలోచనను మొదట్లో స్టీవ్ జాబ్స్ ఒక వృధా పనిగా భావించారట. ఈ విషయాన్ని బ్రియాన్ మర్చంట్ రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. -
టాటా మోటార్స్ రయ్రయ్.. లాభం మూడింతలు
Tata Motors Q4 results: టాటా మోటార్స్ నాలుగో త్రైమాసిక ఫలితాల్లో మూడింతల లాభాన్ని నమోదుచేసింది. -
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
Reliance Jio: జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ యూజర్ల కోసం జియో కొత్త ప్లాన్ను తీసుకొచ్చింది. రూ.888 ప్లాన్తో 15 ఓటీటీలు కూడా లభిస్తాయి. -
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం
సైబర్ నేరాలతో ముడిపడి ఉన్న 28 వేల మొబైల్స్ను బ్లాక్ చేయాలని టెలికాం కంపెనీలకు డాట్ ఆదేశాలు జారీ చేసింది. -
‘ఈ లేఆఫ్లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్ సమాధానమిదే..!
గూగుల్లో లేఆఫ్లపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై నేరుగా సీఈఓ సుందర్ పిచాయ్నే ప్రశ్నించారు. -
గూగుల్, యాపిల్కు పోటీగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టోర్
Microsoft app store: గూగుల్, యాపిల్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు మైక్రోసాఫ్ట్ కంపెనీ సిద్ధమవుతోంది. త్వరలో గేమ్స్ స్టోర్ను తీసుకురానుంది. -
వరుస నష్టాలకు బ్రేక్.. 260 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 260 పాయింట్లు, నిఫ్టీ 97 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
గో డిజిట్ ఐపీఓ.. ధరల శ్రేణి, లాట్ సైజ్ వివరాలు ఇవే..
Go Digit: ఆన్లైన్ వేదికగా ఇన్సూరెన్స్ సేవలందించే స్టార్టప్ సంస్థ గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ ధరల శ్రేణి ప్రకటించింది. ఐపీఓ ఈనెల 15న ప్రారంభమై 17న ముగియనుంది. -
రిఫండ్లు చకచకా.. 6 గంటల్లోనే క్యాన్సిల్ టికెట్ల సొమ్ము!
Train Ticket: రైల్వే టికెట్లకు సంబంధించిన రిఫండ్ల సొమ్ము ఇప్పుడ వేగంగా జమ అవుతోంది.ఒక రోజులోనే ఆయా ఖాతాల్లో పడుతున్నాయి. -
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. -
పసిడి.. ప్రతిఫలానికి ఎదురేదీ?
ఇటీవల ధరలు ఒక్కసారిగా పెరిగినా, బంగారం కొనుగోళ్లకు మంచి ముహూర్తంగా భావించే అక్షయ తృతీయ (ఈనెల 10) సందర్భంగా అమ్మకాలు పెరుగుతాయనే ఆభరణాల విక్రేతలు ఆశిస్తున్నారు. -
ఎస్బీఐ రికార్డు లాభాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరంలో, నాలుగో త్రైమాసికంలోనూ రికార్డు లాభాలు నమోదు చేసింది. వడ్డీయేతర ఆదాయం కలిసిరావడంతో జనవరి-మార్చిలో ఏకీకృత ప్రాతిపదిన నికర లాభం 18% వృద్ధితో రూ.21,384.15 కోట్లుగా నమోదైంది. -
సరికొత్త మారుతీ సుజుకీ స్విఫ్ట్
దేశీయంగా అధిక ఆదరణ పొందిన హ్యాచ్బ్యాక్ కార్లలో మారుతీ స్విఫ్ట్ ఒకటి. దీని 2024 అప్డేటెడ్ వెర్షన్ గురువారం విడుదలైంది. -
ఈక్విటీ ఫండ్ల్లోకి పెట్టుబడులు 16% తగ్గాయ్
ఈ ఏడాది ఏప్రిల్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) పథకాల్లోకి రూ.18,917 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మార్చిలో నమోదైన రూ.22,633 కోట్లతో పోలిస్తే ఇవి 16% తక్కువ. -
రూ.7.34 లక్షల కోట్ల సంపద పోయె
సార్వత్రిక ఎన్నికల్లో ఏపార్టీ అధికారంలోకి వస్తుందనే విషయమై, భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, గురువారం దేశీయ సూచీలు కుప్పకూలాయి. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె విరమణ
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది తమ సమ్మెను విరమించాలని నిర్ణయించారు. వారు లేవనెత్తిన అన్ని సమస్యలనూ పరిశీలిస్తామని కంపెనీ హామీ ఇవ్వడంతో తిరిగి విధుల్లో చేరుతున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
హెచ్పీసీఎల్ 2 షేర్లకు 1 షేరు బోనస్
హెచ్పీసీఎల్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,709.31 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,608.32 కోట్లతో పోలిస్తే ఇది 25% తక్కువ. -
బీపీసీఎల్ బోనస్ షేరు
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) బోనస్ షేర్లను ప్రకటించింది. ఒక్కో షేరుకు అదనంగా మరొక షేరు (1:1 నిష్పత్తిలో) ఇవ్వడానికి కంపెనీ బోర్డు ఆమోద ముద్ర వేసింది. -
ఏషియన్ పెయింట్స్ తుది డివిడెండ్ 2815%
ఏషియన్ పెయింట్స్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,275.3 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
పీఎన్బీ లాభం మూడింతలు
ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), మార్చి త్రైమాసికంలో రూ.3,010 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.1,159 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు మూడింతలు ఎక్కువ.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
కేజ్రీవాల్కు తల్లిదండ్రుల స్వాగతం.. వారిని చూసి సీఎం భావోద్వేగం
-
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!
-
ఐఫోన్లు తయారు చేయడం స్టీవ్జాబ్స్కు ఇష్టంలేదట!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!