రెక్కలు తెగిన పక్షుల్లా విమానాలు
అమిత్ ఒక అత్యవసరమైన పనిమీద దుబాయ్ వెళ్లాల్సి వచ్చింది. ఒక పేరున్న విమానయాన సంస్థలో టికెట్ కొనుక్కొని బయలుదేరాడు. కానీ ఆ విమానంలో అన్నీ సమస్యలే.
విడిభాగాలు లేక నేలచూపులు
నిర్వహణ, మరమ్మతులు సైతం సమస్యే
రద్దీకి తగినట్లుగా సర్వీసులు పెంచలేకపోతున్నారు
పరిశ్రమకు అనూహ్య ఇబ్బందులు
ఈనాడు - హైదరాబాద్
అమిత్ ఒక అత్యవసరమైన పనిమీద దుబాయ్ వెళ్లాల్సి వచ్చింది. ఒక పేరున్న విమానయాన సంస్థలో టికెట్ కొనుక్కొని బయలుదేరాడు. కానీ ఆ విమానంలో అన్నీ సమస్యలే. వాష్రూంకు వెళ్తే నీటి పంపునకు సెన్సర్ లేదు. చేత్తో పంపు తిప్పుకోవాల్సి వచ్చింది. సరే అని, సర్దుకొని వచ్చి సీట్లో కూర్చొని కాసేపు పాటలు విందామని, ఇయర్ఫోన్ చెవిలో పెట్టుకొని ఎదురుగా ఉన్న స్క్రీన్ని ఆన్ చేశాడు. అది పనిచేయలేదు. ఎయిర్హోస్టెస్ని పిలిచి అడిగాడు, ఏంటండీ ఇదంతా అని.. ‘విడిభాగాలు దొరకటం లేదు సర్, అందువల్ల మెయింటెనెన్స్ విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి... క్షమించాలి’.. అని బతిమలాడుతున్నట్లుగా చెప్పింది. ఇది ఒక ఉదంతం మాత్రమే.
మన దేశంలోనే కాదు.. ఇతర దేశాల్లో వివిధ విమానయాన సంస్థలు కూడా విడిభాగాల సమస్యతో సతమతం అవుతున్నాయి. చిన్న చిన్నవి, నాన్-క్రిటికల్ విడిభాగాలు సైతం సకాలంలో లభ్యం కాని పరిస్థితులను విమానయాన సంస్థలు ఎదుర్కొంటున్నాయి. దీంతో విమానాల నిర్వహణ మీద ప్రభావం పడుతోంది. తగిన సమయంలో విమానాల మెయింటెనెన్స్ పూర్తి చేయలేక వాటిని నిలిపివేయాల్సి వస్తోంది. ఆకాశంలో ఎగరాల్సిన విమానాలు.. ఎయిర్పోర్ట్ హ్యాంగర్లలో ఎక్కువ కాలం ఉంటున్నాయి.
కొవిడ్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో సమస్య
కొవిడ్ ముప్పు సమయంలో విమానాల రాకపోకలు సాధ్యం కాలేదు. దీంతో విమానాల తయారీ, నిర్వహణ, విడిభాగాల ఉత్పత్తి సంస్థలు, విమానయాన సంస్థలు పెద్దఎత్తున తమ ఉద్యోగులను తొలగించాయి. దీంతో విడిభాగాల సరఫరా, విమానాల నిర్వహణపై ప్రభావం పడింది. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా ‘బూమ్’ వచ్చింది. దీనికి తోడు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విమాన పరిశ్రమ అనూహ్యంగా విస్తరిస్తోంది. దీంతో విమానాల ఉత్పత్తి నుంచి నిర్వహణ, విడిభాగాల సరఫరా వరకు భారీ గిరాకీ ఏర్పడింది. ఈ తరుణంలో రష్యా- ఉక్రెయిన్ యుద్ధంతో మళ్లీ సమస్య మొదటికి వచ్చింది. విమానాల నిర్వహణ, విడిభాగాల సరఫరా సమస్యాత్మకంగా మారడంతో.. విమానాలను ఖాళీగా ఉంచాల్సి వస్తున్నట్లు పరిశ్రమ వర్గాల కథనం.
ప్రాట్ అండ్ విట్నీ ఉదంతం
ప్రాట్ అండ్ విట్నీ సరఫరా చేసిన ఇంజిన్లతో కూడిన విమానాల్లో తీవ్రమైన నిర్వహణ సమస్యలు ఎదురుకావటంతో దేశీయ విమానయాన సంస్థ అయిన గో ఎయిర్ కష్టాల్లో చిక్కుకుంది. సకాలంలో ఈ ఇంజిన్లను సరిచేయలేక పోవడంతో సమస్య మరింత తీవ్రమయ్యింది. ఈ ఇంజిన్లను ఎయిర్బస్ ఏ320 నియో, ఇతర విమానాల్లో వినియోగిస్తున్నారు. ‘పౌడర్ మెటల్’ సమస్య వల్ల ప్రాట్ అండ్ విట్నీ ఇంజిన్లలో పగుళ్లు కనిపించాయి. దీంతో వివిధ విమానాల్లో వినియోగంలో ఉన్న ఇంజిన్లను తనిఖీ చేయటానికి 600-700 మంది ఇంజినీర్లను పురమాయించాల్సి వచ్చింది. మొదట్లో ఈ పని రెండు నెలల్లో పూర్తవుతుందనుకున్నారు. కానీ ఇంజినీర్ల లభ్యత లేకపోవడంతో పాటు ఇతర సమస్యల వల్ల ఏడాది కాలం పడుతుందని భావిస్తున్నారు. ఈ వ్యవహారం ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులకు సైతం ఇబ్బందికరంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా 40కి పైగా విమానయాన సంస్థలు ప్రాట్ అండ్ విట్నీ ఇంజిన్ల సమస్యతో సతమతం అవుతున్నట్లు తెలుస్తోంది.
‘లోకలైజేషన్’తోనే పరిష్కారం
విడిభాగాలను స్థానికంగా సేకరించడం; విమానాల నిర్వహణ, మరమ్మతులను సైతం స్థానికంగానే చేపట్టడమే తగిన పరిష్కారమని పరిశ్రమ వర్గాలు వివరిస్తున్నాయి. అయితే అది అంత సులువు కాదు. ఎంపిక చేసిన/గుర్తించిన సంస్థల నుంచి మాత్రమే విడిభాగాలను సేకరించి వినియోగించాలని విమానాల తయారీ సంస్థలు నిర్దేశిస్తాయి. విమానాల్లో వినియోగించే టాయ్లెట్ పేపర్, సీట్ కవర్లు, నాప్కిన్లు, ట్రేలు... తదితర అన్ని రకాలైన వస్తువులకు కూడా ఇదే నిబంధనలు వర్తిస్తాయి. తత్ఫలితంగా విడిభాగాలను స్థానికంగా ఉత్పత్తి చేసే సంస్థలు ఉన్నప్పటికీ, వాటి నుంచి ఆయా ఉత్పత్తులను సేకరించలేని పరిస్థితిలో విమానయాన సంస్థలు ఉన్నాయి. మనదేశంలో తగినంతగా ఎంఆర్ఓ (మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాలింగ్) సదుపాయాలూ లేకపోవటం గమనార్హం. డీజీసీఏ(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) నుంచి అనుమతి లేకుండా విడిభాగాలు సేకరించటం సాధ్యం కాదు. మరమ్మతులు, నిర్వహణ విషయంలోనూ అంతే. ఈ పరిస్థితి మారాలంటే, స్థానికంగా లభ్యమయ్యే విడిభాగాలు, వస్తువులు వినియోగించటానికి అనుమతి ఇవ్వటం, ఎంఆర్ఓ సదుపాయాలను విస్తరించడమే మార్గంగా కనిపిస్తోంది. అప్పటి వరకూ ఇతర దేశాల్లో మాదిరిగా మన దేశంలోనూ విమానయాన సంస్థలకు ఇబ్బందులు తప్పవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
-
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి